CJI: మట్టి వాసన మర్చిపోవద్దు
తెలుగువారు వృత్తి-ప్రవృత్తుల రీత్యా ప్రపంచంలో ఏ దేశానికి వెళ్లినా మూలాలను, మట్టి వాసనను, మాతృ భాషను, సంస్కృతి-సంప్రదాయాలను విడనాడవద్దని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ ఎన్.వి.రమణ కోరారు.
ప్రతి ఇంటిలో పెద్దబాలశిక్ష పుస్తకం ఉండాలి
దిల్లీలో నా బంగ్లాపై తెలుగులో నామఫలకం తగదన్నారు
అయినా నేను దానిని తొలగించలేదు
వాషింగ్టన్లో సీజేఐ జస్టిస్ ఎన్.వి.రమణ వెల్లడి
ఈనాడు, దిల్లీ: తెలుగువారు వృత్తి-ప్రవృత్తుల రీత్యా ప్రపంచంలో ఏ దేశానికి వెళ్లినా మూలాలను, మట్టి వాసనను, మాతృ భాషను, సంస్కృతి-సంప్రదాయాలను విడనాడవద్దని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ ఎన్.వి.రమణ కోరారు. ‘గ్రామీణ ప్రాంతాల నుంచి అనేక కష్టనష్టాలు ఎదుర్కొని మీరు ఇక్కడకు వచ్చారు. ఆస్తులు అమ్మి మిమ్మల్ని చదివించిన తల్లిదండ్రులను గుర్తుకు తెచ్చుకోండి. మట్టి వాసన మర్చిపోకండి. మీ బంధుమిత్రులు, చదువు నేర్పిన గురువులను తప్పనిసరిగా ఏడాదికి ఒకసారో, రెండుసార్లో కలిసి మాట్లాడండి. ఫోన్లో మాట్లాడడం కంటే స్వయంగా వెళ్లి పలకరిస్తే వచ్చే అనుభూతి వేరు’ అని ఆయన చెప్పారు. అమెరికా పర్యటనలో ఉన్న ఆయన వాషింగ్టన్ డీసీలో ప్రవాస భారతీయులు ఏర్పాటు చేసిన ‘‘మీట్ అండ్ గ్రీట్’’లో పాల్గొని మాట్లాడారు.
వారు వద్దన్నా నేను వినలేదు
తెలుగు వాళ్లంతా పరస్పరం తెలుగులోనే మాట్లాడుకోవాలి. బిడ్డలకు మాతృభాష ప్రథమ భాషగా విద్యాబోధన సాగాలి. తెలుగులో ఉత్తరాలు రాసే సంప్రదాయాన్ని కొనసాగించండి. తెలుగులో మాట్లాడడానికి సిగ్గుపడకండి. నేను తెలుగు వాడిని, ఆంధ్రవాడిని, నా మాతృభాష తెలుగు అని సగర్వంగా చెప్పే పరిస్థితి తెచ్చుకోవాలి. అది అసాధ్యమైన విషయం కాదు. నేనో ఉదాహరణ చెబుతా. సుప్రీంకోర్టుకు న్యాయమూర్తులుగా మాకు బంగ్లాలు ఇస్తారు. ఇంటి ముందు నామ ఫలకాలు హిందీలో పెడతారు. అడిగితే ఇంగ్లిషులో పెడతారు. నేను తెలుగులో పెట్టమని అడిగా. అవి లేవన్నారు. ఓ కాంగ్రెస్ మంత్రికి విషయం తెలిసి తెలుగులో ఓ బోర్డు రాయించి పంపించారు. నూతలపాటి వెంకటరమణ, సుప్రీంకోర్టు న్యాయమూర్తి అని తెలుగులో ఉంది. సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయమూర్తి ఒకరు ఒకరోజు మా ఇంటికి వచ్చారు. రాజధానిలో తెలుగులో నామ ఫలకం ఉండడం మంచిది కాదు, తీసివేయమని చెప్పారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కావాలంటే ఇలా చేయడం మంచిది కాదు, ఓ పెద్దవాడిగా సలహా ఇస్తున్నా అని అన్నారు. మాతృభాషలో పేరు పెట్టుకున్నంత మాత్రాన నాకు చీఫ్ జస్టిస్ పదవి రాదంటే దానికి నేను సిద్ధపడే ఉన్నాను. ఆ విషయంలో నేను ఏమాత్రం రాజీపడను. తెలుగు భాషలోనే నా పేరు ఉండాలని చెప్పాను. సీజేఐ అయ్యాక కూడా నా నివాసం గేట్ల ముందు ఇంగ్లిషుతో పాటు తెలుగులో నా పేరు ఉంటుంది. మన సంస్కృతిని, మన భాషను మర్చిపోతే మన జాతి అంతరించిపోతుంది. ఆ పరిస్థితి ఉండకూడదు.
ఐక్యత, శాంతితోనే అభివృద్ధి..
ఈ పాఠశాల ప్రాంగణంలోకి ప్రవేశించగానే ఇది ప్రభుత్వ పాఠశాలా.. ప్రైవేటు పాఠశాలా అని అడిగాను. ప్రభుత్వ పాఠశాల అన్నారు. చాలా సంతోషించాను. నేను చదుకునే రోజుల్లోని పాఠశాలలు గుర్తుకు వచ్చాయి. ఇంత చక్కని వాతావరణం ఇక్కడ పాఠశాలల్లో ఉంది. మన దేశంలోని ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ఇంత చక్కని వాతావరణం ఉంటే ఎంత బాగుంటుందనే ఆలోచన వచ్చింది. అమెరికా బాగా అభివృద్ధి చెందడానికి కారణం ఈ సమాజం ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని తరగతులు, అన్ని దేశాలు, వర్గాల ప్రజలను రెండు చేతులు చాచి హృదయానికి హత్తుకోవడమే. ఇతర భాషా సంస్కృతులను గౌరవించాలి. మనం వేమన, సుమతీ శతకాలను మర్చిపోయాం. ఆ శతక సాహిత్యాన్ని ముద్రించి లేదా ఆన్లైన్లో డౌన్లోడ్ చేయించి పిల్లలతో చదివించండి. ప్రతి ఇంట్లో పెద్ద బాలశిక్ష ఉండాలి. అందులో భాష, సంస్కృతికి సంబంధించిన విషయాలు ఎన్నో ఉంటాయి. పిల్లలకు ఇంగ్లిషు కథలతో పాటు తెలుగు కథలు చెప్పడం మంచిది. పిల్లలకు మాతృమూర్తి మీద ఎలా గౌరవం ఉంటుందో మనకు మాతృభాషపై అలాంటి గౌరవం ఉండాలి. బిడ్డకు తల్లి ఏరకమైన ప్రేమ అందిస్తుందో అలానే మనం భాష, సంస్కృతికి గౌరవం ఇవ్వాలి. మన ఇంట్లో, ప్రత్యేకించి అమెరికాలో పిల్లలు తెలుగులో మాట్లాడేటప్పుడు అనేక తప్పులు చేస్తున్నారు. వాళ్లను హేళన చేస్తే ఏనాడూ ఆ భాష మాట్లాడరు. తప్పును సరిదిద్దాలి తప్ప ఎగతాళి చేయకూడదు’’ అని జస్టిస్ రమణ చెప్పారు.
‘తేనెసోకనో తియ్యని గుడి
పచ్చదనం చూడ కళ్లలో వెలుగు దివ్యకాంతి
త్యాగరాజ కీర్తన చెవులకింపైన రీతి
సంపెంగలు చూడ నాసిక పొందే
మధురానుభూతి
ఇది మన మాతృభాష తెలుగు ఖ్యాతి’ అంటూ తన ప్రసంగాన్ని సీజేఐ ముగించారు.
స్వేచ్ఛ, స్వాతంత్య్రాలను పరిరక్షించుకోవాలి
ఫిలడెల్ఫియాలోని చారిత్రక ‘ఇండిపెండెన్స్ హాల్’ను సందర్శించిన తర్వాత సీజేఐ జస్టిస్ రమణ మాట్లాడుతూ- స్వేచ్ఛ, స్వాతంత్య్రం, ప్రజాస్వామ్యాలను కాపాడుకునేందుకు ప్రపంచవ్యాప్తంగా ప్రజలంతా అవిశ్రాంతంగా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ పవిత్ర స్థలం నుంచి ఉద్భవించిన విలువలు ప్రజాస్వామ్య దేశాలన్నింటికీ స్ఫూర్తిని ఇచ్చాయని చెప్పారు. అవి ఈ నాటికీ ప్రపంచవ్యాప్తంగా ప్రతిధ్వనిస్తున్నాయన్నారు.
తెలుగుకు విదేశాల్లో గుర్తింపు సంతోషకరం
‘‘తెలుగు జాతి గొప్పదనాన్ని, తెలుగు ఘనతను ప్రపంచానికి చాటిచెప్పిన ఎన్టీఆర్ వాక్చాతుర్యానికి, ఘంటశాల గాత్రానికి, వారి ఉచ్చారణకు ముగ్ధులమైన మా తరంవాళ్లం తెలుగు భాషపై పట్టు సంపాదించుకోగలిగాం. పున్నమి వెన్నెల, తియ్యని తేనె, కోయిల కిలకిలారావాలు, మంచిగంధపు పొడి, మల్లెపూల పరిమళం, గులాబీ రేకుల మార్దవం, వేసవి సాయంకాలపు వానజల్లు, చల్లని గాలి, కృష్ణశాస్త్రి కవిత్వం ఇలా సృష్టిలో హాయిగొలిపే అన్నింటిని రంగరించిందే తెలుగు భాష అని ఒక కవి అన్నారు. అలాంటి తెలుగు బలపడే విధంగా, గొప్ప అంతర్జాతీయ భాషగా గుర్తింపు తెచ్చేలా మనం కృషి చేయాల్సి ఉంది. తెలుగు బిడ్డలుగా పుట్టడం అదృష్టంగా భావించాలి. తెలుగు భాషకు వేరే దేశాల్లో ఎక్కువ గుర్తింపు రావడం సంతోషకరం. మీ పిల్లలకు ఎలా తెలుగు భాష, సంస్కృతులు నేర్పుతున్నారో మీరు పుట్టిన ప్రాంతాల్లో తెలుగు పాఠశాలల బాగుకు ఒక సంస్థలా ఏర్పడి కృషి చేయాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అల్బనీలో ఉగాది వేడుకలు.. ఆర్పీ పట్నాయక్, అలీ, కౌశల్ సందడి
న్యూయార్క్ రాజధాని అల్బనీ పరిధిలో నివసిస్తున్న తెలుగు ప్రజల కోసం ఏర్పాటైన అల్బనీ తెలుగు అసోసియేషన్ (ATA) ఆధ్వర్యంలో ఉగాది ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. -
వెస్ట్ లండన్ బాలాజీ ఆలయంలో ఘనంగా రాములోరి కల్యాణోత్సవం
లండన్లోని శ్రీ వేంకటేశ్వర (బాలాజీ) స్వామి టెంపుల్ అండ్ కల్చరల్ సెంటర్(SVBTCC)లో సీతారాముల కల్యాణోత్సవం ఘనంగా జరిగింది. -
కాలిఫోర్నియాలో ఘనంగా చంద్రబాబు జన్మదిన వేడుకలు
తెదేపా అధినేత చంద్రబాబు జన్మదిన వేడుకలు కాలిఫోర్నియాలో ఘనంగా జరిగాయి. ట్రై వ్యాలీ ఎన్నారై తెదేపా ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించారు. -
66,000 మంది భారతీయులకు అమెరికా పౌరసత్వం
American Citizenship: అమెరికాలో నేచురలైజేషన్ కింద పెద్ద ఎత్తున అక్కడి పౌరులుగా మారారు. 2022లో దాదాపు 66 వేల మందికి ఆ హోదా లభించింది. మెక్సికన్లు అత్యధిక మంది సహజీకృత పౌరసత్వం పొందారు. తర్వాత స్థానంలో భారత్ నిలిచింది. -
‘తాకా’ ఆధ్వర్యంలో ఘనంగా శ్రీరామ నవమి వేడుకలు
‘తెలుగు అలయన్స్ ఆఫ్ కెనడా’ (తాకా) ఆధ్వర్యంలో టొరంటోలోని శ్రీశృంగేరి విద్యాపీఠం దేవస్థానం ఆడిటోరియంలో శ్రీరామ నవమి వేడుకలను శనివారం (ఏప్రిల్ 20న) ఘనంగా నిర్వహించారు. -
బర్మింగ్హామ్లో కన్నుల పండువగా శ్రీరామనవమి వేడుకలు
ఇంగ్లాండ్లోని బర్మింగ్హామ్ నగరం శ్రీరామనవమి వేళ భద్రాద్రి వాతావరణాన్ని తలపించింది. అక్కడి తెలుగువారు ఈ వేడుకల్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. -
కాన్సాస్లో ఆట పాటలతో సందడిగా ఉగాది వేడుకలు
అమెరికాలోని కాన్సాస్ నగరంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. -
ట్రెక్కింగ్ చేస్తూ జారిపడి.. స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి
స్కాట్లాండ్లోని ఓ పర్యటక ప్రాంతంలో ట్రెక్కింగ్కు వెళ్లిన ఇద్దరు తెలుగు విద్యార్థులు నీటిలోపడి మృతిచెందారు. -
అమెరికాలో వైభవంగా ‘మాటా’ తొలి కన్వెన్షన్
అమెరికాలో ‘మన అమెరికన్ తెలుగు అసోసియేషన్’ (MATA) తొలి కన్వెన్షన్ వేడుకలు అట్టహాసంగా ముగిశాయి . -
వైభవంగా ‘టాగో’ ఉగాది వేడుకలు
ఫ్లోరిడాలోని తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ ఓర్లాండో (టాగో) ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు వైభవంగా జరిగాయి. -
‘తాకా’ ఆధ్వర్యంలో ఘనంగా ‘క్రోధి’ ఉగాది వేడుకలు
‘తెలుగు అలయన్స్ ఆఫ్ కెనడా’ (తాకా) ఆధ్వర్యంలో టొరంటోలోని పెవిలియన్ ఆడిటోరియంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. -
టొరంటోలో వైభవంగా ‘టీసీఏ’ ఉగాది వేడుకలు
తెలంగాణ కెనడా సంఘం (TCA) ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు వైభవంగా జరిగాయి. -
11 దేశాల కవులతో అంతర్జాతీయ వేదికపై ఉగాది కవి సమ్మేళనం
వంశీ అంతర్జాతీయ సాహితీ పీఠం, శ్రీ సాంస్కృతిక కళాసారథి- సింగపూర్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం ‘ఉగాది కవి సమ్మేళనం’ ఘనంగా జరిగింది. -
‘షికాగో తెలుగు అసోసియేషన్’ ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది, శ్రీరామనవమి వేడుకలు
అమెరికా ఇల్లినాయిస్లోని షికాగోలో ‘చికాగో తెలుగు అసోసియేషన్’ ఆధ్వర్యంలో ఉగాది, శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. -
ఘనంగా ‘సింగపూర్ తెలుగు సమాజం’ ఉగాది వేడుకలు
సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో క్రోధి నామ సంవత్సర ఉగాది వేడుకలు వైభవంగా నిర్వహించారు. -
‘‘ఏపీ హితం కోసం ఎన్డీయేకే మా మద్దతు’’
దుబాయిలో వందలమంది తెలుగు వారు కలసి ఉగాది వేడుకలను ఉత్సాహంగా నిర్వహించారు. -
అంతరిక్షంలోకి వెళ్లనున్న తొలి తెలుగువాడు.. గోపీచంద్ తోటకూర
Gopichand Thotakura: అంతరిక్షంలోకి వెళ్లే తొలి తెలుగు వ్యక్తిగా గోపీచంద్ తోటకూర రికార్డు సృష్టించనున్నారు. విజయవాడలో జన్మించిన ఆయనను బ్లూ ఆరిజిన్ సంస్థ ఎన్ఎస్-25 మిషన్లో టూరిస్ట్గా రోదసీలోకి తీసుకెళ్లనుంది. -
యూకే కుటుంబ వీసా కఠినతరం.. వేతన పరిమితి 55% పెంపు
UK Family Visa: యూకే కుటుంబ వీసా నిబంధనలను కఠినతరం చేశారు. దీని కోసం వార్షిక వేతన పరిమితిని ఏకంగా 55శాతం పెంచారు. -
అమెరికాలో అదృశ్యమైన హైదరాబాద్ విద్యార్థి అనుమానాస్పద మృతి
మరో భారత విద్యార్థి అమెరికాలో మృతిచెందాడు. హైదరాబాద్కు చెందిన అబ్దుల్ చనిపోయినట్లు దౌత్యకార్యాలయం ప్రకటించింది. ఈ ఏడాది 11 మంది భారత విద్యార్థులు అమెరికాలో చనిపోయారు. -
ఈ ఎన్నికలు ఏపీకి ఎంతో కీలకం.. మీ సహకారం కావాలి.. ఎన్నారైలతో నారా లోకేష్
-
భద్రాచలం తరహాలో అమెరికాలో రామాలయం
భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానం తరహాలో అమెరికాలోని అట్లాంటా సమీపంలోని కమింగ్ వద్ద రామాలయ నిర్మాణం చేపట్టినట్లు అక్కడ ముఖ్య అర్చకుడిగా వ్యవహరిస్తున్న పద్మనాభాచార్యులు వెల్లడించారు.
తాజా వార్తలు (Latest News)
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)