ఔరా... అనేల
తెలంగాణలో పట్టణీకరణ వేగంగా జరుగుతున్న నేపథ్యంలో వ్యవసాయ భూముల క్రయవిక్రయాలకు రెక్కలొచ్చాయి. హైదరాబాద్ సహా చుట్టుపక్కల జిల్లాల్లో పెద్ద సంఖ్యలో అమ్మకాలు జరుగుతున్నాయి. ఆరేళ్ల క్రితంతో పోలిస్తే
రాష్ట్రంలో వ్యవసాయ భూముల క్రయవిక్రయాల్లో జోరు
2021-22లో ఆరు లక్షలకుపైగా లావాదేవీలు
ఈనాడు, హైదరాబాద్: తెలంగాణలో పట్టణీకరణ వేగంగా జరుగుతున్న నేపథ్యంలో వ్యవసాయ భూముల క్రయవిక్రయాలకు రెక్కలొచ్చాయి. హైదరాబాద్ సహా చుట్టుపక్కల జిల్లాల్లో పెద్ద సంఖ్యలో అమ్మకాలు జరుగుతున్నాయి. ఆరేళ్ల క్రితంతో పోలిస్తే అమ్మకాల్లో రెండున్నర రెట్ల వృద్ధి నమోదవగా, 2021-22 ఆర్థిక సంవత్సరంలోనే రికార్డు స్థాయిలో ఆరు లక్షలకుపైగా రిజిస్ట్రేషన్లు జరిగాయి. భూమి నమ్మకమైన పెట్టుబడిగా మారడం, రాబడులు ఆశాజనకంగా ఉండటమే దీనికి కారణమని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
స్థిరాస్తి రంగంలో జోరు కొనసాగుతుండటంతో రాష్ట్రవ్యాప్తంగా భూముల ధరలు గణనీయంగా పెరిగాయి. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ భూముల కనీస ధర ఎకరం రూ.10 లక్షల దాకా ఉండగా, హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాల్లో రూ. కోట్లలోనే పలుకుతున్నాయి. హైదరాబాద్తో ముడిపడిన రంగారెడ్డి జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో ఎకరా రూ.20 కోట్ల నుంచి రూ.50 కోట్లదాకా పలుకుతోంది. అయినా కొనేందుకు కొనుగోలుదారులు ముందుకొస్తుండటం, మంచి ధర లభిస్తుండటంతో అమ్మేందుకూ రైతులు సిద్ధమవుతున్నారు. కరోనా ప్రభావం నేపథ్యంలో 2020-21 ఆర్థిక సంవత్సరంలో విక్రయాలు మందగించినప్పటికీ, ఆ తర్వాత ఆర్థిక సంవత్సరంలో ఏకంగా సుమారు మూడు రెట్లు పెరగడం గమనార్హం.
ఫాం లాండ్స్ సంస్కృతితో
ఇటీవల కాలంలో ఖాళీ స్థలాలతోపాటు, ఫాంలాండ్స్ (వ్యవసాయ భూములు), ఫాంహౌస్ల సంస్కృతి పెరిగింది. ధనవంతులు, ఉన్నతోద్యోగులు, సాఫ్ట్వేర్ ఇంజినీర్లు వంటి వారు ఆర్థిక స్తోమతను బట్టి నగర శివార్లలో ఎకరా, అర ఎకరా చొప్పున కొనుగోలుచేసి ఫాంహౌస్లు నిర్మించుకుంటున్నారు. భూముల అమ్మకాల్లో జోరుకు ఇది కూడా కారణమని నిపుణులు పేర్కొంటున్నారు. ‘‘ముఖ్యంగా హైదరాబాద్ పరిసరాల్లోని రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, మహబూబ్నగర్, యాదాద్రి-భువనగిరి జిల్లాల్లో ఈ తరహా క్రయవిక్రయాలు జరుగుతున్నాయి. హైదరాబాద్కు 70 కిలోమీటర్ల దూరంలోని సదాశివపేట, 130 కిలోమీటర్లు దూరంలో కర్ణాటక సరిహద్దుల్లోని నారాయణ్ఖేడ్ వంటి ప్రాంతాల్లో ఫాంలాండ్స్ పేరిట వ్యవసాయ భూముల్ని పావు ఎకరం, అర ఎకరం చొప్పున విక్రయిస్తున్నారని’ ఉదహరిస్తున్నారు.
రాబడికి భరోసా..
మారిన పరిస్థితుల దృష్ట్యా మధ్య తరగతి, ఎగువ మధ్య తరగతి పెట్టుబడిగా భూములను ఎంచుకోవడం కూడా అమ్మకాలు పెరగడానికి కారణమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ‘‘బ్యాంకుల్లో డిపాజిట్ల రూపంలో దాచుకోవడం, బంగారం కొనుగోలు, వడ్డీ వ్యాపారాల కంటే భూములపై రాబడి అధికంగా ఉంటోంది. దీంతో వేలమంది దీన్ని నమ్మకమైన పెట్టుబడిగా భావిస్తూ ఇళ్ల స్థలాలు, భూముల కొనుగోలుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. మరోవైపు రాష్ట్రంలో దాదాపు అన్ని జిల్లాల్లో సాగునీటి లభ్యత పెరగడంతో కాస్త స్తోమత ఉన్న రైతులు వ్యవసాయ భూముల కొనుగోళ్లకు మొగ్గుచూపుతున్నారు. బయటి ప్రాంతాల రైతులూ ఇక్కడ సాగుభూముల కొనుగోళ్లు జరుపుతున్నారు. క్రయవిక్రయాల్లో వృద్ధి కొనసాగడానికి ఇవన్నీ దోహదం చేస్తున్నాయి’అని నిపుణులు పేర్కొంటున్నారు.
భూముల విక్రయాల్లో రంగారెడ్డి టాప్... తర్వాత సంగారెడ్డి
గత ఏడాది వ్యవసాయ భూముల అమ్మకాలను విశ్లేషిస్తే అత్యధికం రంగారెడ్డి జిల్లాలోనే ఉన్నాయి. తర్వాత స్థానంలో సంగారెడ్డి, వికారాబాద్, సిద్దిపేట, నల్గొండ, మెదక్ జిల్లాలు ఉన్నాయి. హెచ్ఎండీఏకు అనుబంధంగా ఉన్న భువనగిరి, మహబూబ్నగర్ జిల్లాలతోపాటు నాగర్కర్నూల్, కామారెడ్డి లాంటి కీలక జిల్లాల్లో ఎక్కువగా ఉంటున్నాయి.
హైదరాబాద్కు వంద కిలోమీటర్ల పరిధిలో..
హైదరాబాద్ చుట్టుపక్కల వంద కిలోమీటర్ల పరిధిలో స్థిరపడేందుకు ఔత్సాహికులు ఆసక్తి చూపుతుండటంతో.. స్థిరాస్తి వ్యాపారులు ఆయా ప్రాంతాల్లో భూముల కొనుగోలుకు ఆసక్తిచూపుతున్నారు. కొందరు ప్రస్తుత అవసరాలకోసం కొనుగోళ్లు జరుపుతుండగా, కొందరు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కొంటున్నారు. ప్రధానంగా హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారిలో షాద్నగర్, జడ్చర్ల వరకూ, ముంబయి జాతీయ రహదారిలో సంగారెడ్డి, సదాశివపేట వరకు, వరంగల్ జాతీయ రహదారిలో భువనగిరి, యాదగిరిగుట్ట వరకు, చేవెళ్ల రోడ్డులో వికారాబాద్ వరకు, రాజీవ్ రహదారిలో సిద్దిపేట వరకు కొనుగోళ్లు ఊపందుకున్నాయి. అవుటర్ రింగ్రోడ్డుతోపాటు.. రీజినల్ రింగ్ రోడ్డు అందుబాటులోకి రానుండటంతో ఆ పరిసరాల్లోనూ క్రయవిక్రయాలు జోరందుకున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పతి దేవుడికి గుడి కట్టింది!
కరోనా మహమ్మారి ఆమె జీవితంలో అంతులేని విషాదాన్ని నింపింది. కళ్లల్లో పెట్టుకుని చూసుకునే భర్తను తన నుంచి దూరం చేసింది. మూడేళ్ల క్రితం భర్త కొవిడ్తో మృతి చెందడంతో ఆమె ఒంటరిగా మారారు. -
కొత్తవారొచ్చారు
ఆంధ్రప్రదేశ్ నిఘా విభాగాధిపతిగా సీనియర్ ఐపీఎస్ అధికారి కుమార్ విశ్వజిత్ను, విజయవాడ నగర పోలీసు కమిషనర్గా పీహెచ్డీ రామకృష్ణను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. -
జేఈఈ మెయిన్స్లో తెలుగోళ్ల సత్తా
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. దేశవ్యాప్తంగా 56 మందికి 100 పర్సంటైల్ రాగా.. ఇందులో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందినవారే 22 మంది ఉన్నారు. జేఈఈ మెయిన్స్ తుది ఫలితాలను జాతీయ పరీక్షల విభాగం (ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసింది. -
కాళేశ్వరంపై కమిషన్ విచారణ షురూ
కాళేశ్వరం ఎత్తిపోతల్లోని బ్యారేజీలపై న్యాయ విచారణకు ఏర్పాటు చేసిన కమిషన్ కార్యాచరణ మొదలుపెట్టింది. బుధవారం కమిషన్ ఛైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ ఆయన సతీమణి దేబ్జానీ ఘోష్తో కలిసి హైదరాబాద్కు చేరుకున్నారు. -
ఫస్టియర్లో 60.01%.. సెకండియర్లో 64.19%
ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో 60.01 శాతం, రెండో సంవత్సరంలో 64.19 శాతం మంది విద్యార్థులు (ఒకేషనల్ కోర్సులతో కలిపి) ఉత్తీర్ణత సాధించారు. -
కవిత బెయిల్పై మే 6న తీర్పు
ఈడీ కేసులో బెయిల్ కోసం భారాస ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్పై తీర్పును ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు మే 6కి వాయిదా వేసింది. -
చదువుల ‘సిరి’.. రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని పట్టుదల
వారానికి రెండుసార్లు డయాలసిస్.. ఒంట్లో సత్తువ లేక కళాశాలకూ వెళ్లలేని పరిస్థితి.. అయినా మొక్కవోని పట్టుదలతో చదివిన పేదింటి బిడ్డ ప్రతిభ చాటింది. -
విజన్-2026కు డోర్నకల్ ఉపాధ్యాయుల శ్రీకారం
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు విజన్-2026 పేరిట ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. -
ఇంటర్ ఫలితాల్లో కవలల ప్రతిభ
సూర్యాపేట జిల్లా ఆత్మకూర్(ఎస్) మండల కేంద్రానికి చెందిన డేగల వీరభద్రయ్య, మంజుల దంపతుల కవల పిల్లలు డేగల రామ్, లక్ష్మణ్ ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో ప్రతిభ చూపారు. -
రాష్ట్రంలో వంతెనల పరిశీలన..!
రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న చిన్నా, పెద్ద వంతెనలను పరిశీలించేందుకు అధికారులు ఆయత్తం అవుతున్నారు. జిల్లాల వారీగా నిర్మాణ స్థితిగతులపై జాబితాలను రూపొందించే పనిలో ఉన్నారు. -
యాదాద్రి విద్యుత్కేంద్రానికి పర్యావరణ అనుమతి
యాదాద్రి థర్మల్ విద్యుత్కేంద్రానికి పర్యావరణ అనుమతి (ఈసీ) ఇవ్వడానికి కేంద్ర పర్యావరణ శాఖ ఆమోదం తెలిపింది. -
మెట్రో రైలు శబ్దకాలుష్యంపై వివరణివ్వండి
మెట్రో రైల్వే లైను వంపుల్లో రైలు వెళ్లినపుడు పరిమితికి మించి వస్తున్న శబ్దకాలుష్యంపై వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వానికి, మెట్రో రైల్వే ఎండీకి బుధవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
ఆర్జేసీ, మోడల్, కేజీబీవీ విద్యార్థుల ప్రతిభ
టీఎస్ఆర్జేసీ నేరెళ్ల గురుకుల విద్యార్థిని ఎంపీసీలో 991 మార్కులు, బైపీసీలో తాటిపల్లి విద్యార్థిని 990 మార్కులు సాధించినట్లు యాజమాన్యం తెలిపింది. -
ఫోన్ ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావుకు మధ్యంతర బెయిలు నిరాకరణ
ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టయిన టాస్క్ఫోర్స్ మాజీ ఓఎస్డీ రాధాకిషన్రావుకు ఎల్ఎల్ఎం పరీక్షలు రాసేందుకు వీలుగా మధ్యంతర బెయిలు ఇచ్చేందుకు నాంపల్లి కోర్టు నిరాకరించింది. -
పోలింగ్ రోజు వేతనంతో కూడిన సెలవు
లోక్సభ ఎన్నికల పోలింగ్ జరిగే రోజును వేతనంతో కూడిన సెలవుగా ప్రకటించారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్రాజ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
జస్టిస్ రామలింగేశ్వరరావుకు హైకోర్టు ఘన నివాళి
గుండెపోటుతో ఇటీవల మృతి చెందిన ఉమ్మడి హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎ.రామలింగేశ్వరరావుకు బుధవారం హైకోర్టు ఘన నివాళి అర్పించింది. -
శనగ విత్తనోత్పత్తి రైతుల ఆందోళన
‘పంట విక్రయించి నెల రోజులవుతోంది. డబ్బులు ఎప్పుడు ఇస్తారో.. క్వింటాకు ఎంత కట్టిస్తారో ఇప్పటికీ తెలియదు. -
విచారణ నుంచి తప్పుకొన్న జస్టిస్ శేషసాయి ధర్మాసనం
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసుపై మాట్లాడొద్దంటూ కడప జిల్లా కోర్టు(పీడీజే) ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ వివేకా కుమార్తె నర్రెడ్డి సునీత, పులివెందుల తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.రవీంద్రనాథ్రెడ్డి అలియాస్ బీటెక్ రవి దాఖలు చేసిన వ్యాజ్యాల విచారణ నుంచి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏవీ శేషసాయి నేతృత్వంలోని ధర్మాసనం తప్పుకొంది. -
ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఇంటర్ ప్రవేశాలు
రాష్ట్రంలోని ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో ప్రవేశాల పేరిట డొనేషన్లు, అధిక రుసుముల వసూళ్లు, ఇతరత్రా అక్రమాలను నిరోధించేందుకు వీలుగా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఆన్లైన్ ప్రవేశాల విధానాన్ని ప్రవేశపెట్టాలని యోచిస్తున్నామని విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. -
మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ
ష్ట్రంలో మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. షెడ్యూలును విద్యాశాఖ బుధవారం విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు (4)
రాష్ట్రంలో వచ్చే నెల 6వ తేదీన జరగనున్న తెలంగాణ రాష్ట్ర ఇంజినీరింగు కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (టీఎస్ఈసెట్)ను మే చివరి వారానికి వాయిదా వేయాలని పలువురు అభ్యర్థులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని కోరారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
-
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?
-
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు