Telangana Inter Results: పదిలో 90 శాతం ఉత్తీర్ణత
కరోనాతో రెండేళ్లు చదువు ఆగమాగమైనా పదో తరగతి ఫలితాల్లో మాత్రం 90 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. గత రెండేళ్ల ఉత్తీర్ణత శాతాన్ని పక్కనపెడితే 2019లో అత్యధికంగా 92.43 శాతం మంది పాసయ్యారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత రికార్డు స్థాయి
బాలికలు: 92.45% - బాలురు: 87.61%
97.85 శాతంతో అగ్రస్థానంలో సిద్దిపేట జిల్లా
ఆగస్టు 1 నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు
ఈనాడు, హైదరాబాద్: కరోనాతో రెండేళ్లు చదువు ఆగమాగమైనా పదో తరగతి ఫలితాల్లో మాత్రం 90 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. గత రెండేళ్ల ఉత్తీర్ణత శాతాన్ని పక్కనపెడితే 2019లో అత్యధికంగా 92.43 శాతం మంది పాసయ్యారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత రికార్డు స్థాయి ఉత్తీర్ణత అదేకాగా... ఈసారి సాధించిన ఫలితాలు రెండో అత్యధికం. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గురువారం ఫలితాలను విడుదల చేశారు. రాష్ట్రంలోని 11,402 పాఠశాలల నుంచి విద్యార్థులు పరీక్షలు రాయగా...అందులో 3,007 బడుల్లో అందరూ పాసయ్యారని, 15 విద్యా సంస్థల్లో ఒక్కరూ ఉత్తీర్ణులు కాలేదని మంత్రి తెలిపారు. గురుకుల పాఠశాలలు 99.32 శాతంతో అత్యధిక ఉత్తీర్ణత శాతాన్ని పొందాయన్నారు. విజేతలను అభినందించిన మంత్రి... తప్పిన వారు ఆగస్టు 1వ తేదీ నుంచి మొదలయ్యే అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు సన్నద్ధమై విజయం సాధించాలని సూచించారు. టీచర్లు వారానికి ఒకటీ రెండు గంటలు ఆ విద్యార్థులకు ప్రత్యేక తరగతులు తీసుకునేలా చూడాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఉపాధ్యాయ సంఘాలు కూడా అందుకు చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ జిల్లా టెన్త్ ఫలితాల్లో ఏటా చివరి స్థానంలో ఎందుకు ఉంటుందో పోస్టుమార్టమ్ చేస్తామని తెలిపారు. ఇంటర్ లేదా పదో తరగతిలో కొన్ని సబ్జెక్టుల్లో సున్నా మార్కులు ఎందుకు వస్తున్నాయో పరిశీలిస్తున్నామన్నారు. కార్యక్రమంలో విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, పాఠశాల విద్యాశాఖ సంచాలకురాలు శ్రీదేవసేన, ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు కృష్ణారావు పాల్గొన్నారు.
23 జిల్లాల్లో 90 శాతం దాటిన ఉత్తీర్ణత
ఈసారి రికార్డు స్థాయిలో 90 శాతం, ఆపైన ఉత్తీర్ణత సాధించిన జిల్లాలే 23 ఉండటం విశేషం. అందులో 95 శాతానికిపైగా ఉత్తీర్ణులు ఉన్న జిల్లాలు తొమ్మిది ఉన్నాయి. సిద్దిపేట జిల్లాలో ఏకంగా 97.85 శాతం మంది పాసయ్యారు. 2017, 2018, 2019 సంవత్సరాలలో జగిత్యాల జిల్లా మొదటి స్థానంలో నిలిచి హ్యాట్రిక్ కొట్టింది. ఆ తర్వాత రెండేళ్లు కరోనా కారణంగా అందరూ పాసయ్యారు. ఈసారి ఆ జిల్లా 21వ స్థానానికి పడిపోయింది.
పరీక్ష రుసుం జులై 20లోపు చెల్లించాలి
తప్పిన విద్యార్థులకు ఆగస్టు 1 నుంచి 10వ తేదీ వరకు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. విద్యార్థులు జులై 20లోపు పరీక్ష ఫీజును ఆయా పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులకు చెల్లించాలి. రూ.50 ఆలస్య రుసుంతో సబ్జెక్టు పరీక్ష జరిగే ముందు రెండు రోజుల వరకు చెల్లించవచ్చు. మార్కుల పునఃలెక్కింపు కోసం ఒక్కో సబ్జెక్టుకు రూ.500 జులై 15లోపు ఎస్బీఐ బ్యాంకు చలానా ద్వారా చెల్లించాలి. పునఃపరిశీలన, జవాబు పత్రాల నకలు కోసం ఒక్కో సబ్జెక్టుకు రూ.1,000 చెల్లించాలి. పూర్తిచేసిన దరఖాస్తులను ప్రధానోపాధ్యాయులతో ధ్రువీకరణ చేయించి ఆయా జిల్లాల డీఈవో కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన కౌంటర్లలో సమర్పించాలి. గ్రేడ్ మారితేనే సవరించిన ధ్రువపత్రాలను జారీ చేస్తారు.
10 జీపీఏ... లక్షల నుంచి వేలల్లోకి...
ఈనాడు, హైదరాబాద్: పదో తరగతి పరీక్షల్లో 10కి 10 గ్రేడ్ పాయింట్లు దక్కించుకున్న వారి సంఖ్య గత రెండు సంవత్సరాలు భారీగా ఉండగా... ఈసారి మళ్లీ పూర్వ స్థితికి వచ్చింది. అన్ని సబ్జెక్టుల్లో ‘ఏ1’ మార్కులు(90 శాతం, ఆపైన) పొందిన వారికే 10 జీపీఏ వస్తుంది. కరోనా కారణంగా 2020, 2021లలో పరీక్షలు జరగలేదు. దాంతో ఫార్మేటివ్, సమ్మెటివ్ అసెస్మెంట్-1 ఆధారంగా గ్రేడ్లు ఇచ్చారు. ఫలితంగా 2020లో 1.41 లక్షల మంది, 2021లో 2.10 లక్షల మందికి 10 క్యుములేటివ్ గ్రేడ్ పాయింట్ యావరేజ్(సీజీపీఏ) దక్కింది. ఈసారి పరీక్షలు జరగడంతో ఆ సంఖ్య 2019 నాటి కంటే పెరిగినా 11,343తో ఆగిపోయింది. తాజాగా పాసైన విద్యార్థులు 8వ తరగతి పరీక్షలు రాయలేదు. 9వ తరగతిలో నెలన్నర మాత్రమే తరగతులు జరిగాయి. పదో తరగతిలో కూడా సెప్టెంబరు నుంచి ప్రత్యక్ష తరగతులు ప్రారంభమయ్యాయి.
83.60 శాతం ప్రైవేట్లోనే
ఈసారి ప్రైవేట్ పాఠశాలల్లో చదివిన 9,484 మందికి 10కి 10 గ్రేడ్ వచ్చింది. అంటే 83.60 శాతంతో సమానం. ఇక మిగిలిన 16 శాతాన్ని ఎయిడెడ్, ప్రభుత్వ, జిల్లా పరిషత్తు, సంక్షేమ పాఠశాలలు తదితర 11 రకాల విద్యాసంస్థలు పంచుకున్నాయి.
ఎస్సీ గురుకులాల్లో 98.14శాతం ఉత్తీర్ణత
ఈనాడు, హైదరాబాద్: పదో తరగతి ఫలితాల్లో గురుకులాల విద్యార్థులు ప్రతిభ చాటారు. అన్ని గురుకుల సొసైటీల విద్యార్థులు రాష్ట్ర సగటు కంటే ఎక్కువ శాతం ఉత్తీర్ణత నమోదు చేశారు. మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్ విద్యార్థుల్ని అభినందించారు.
* సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల విద్యార్థులు 98.14శాతం మంది పాసయ్యారు. 18,545 మందికి 18,200 మంది ఉత్తీర్ణులయ్యారు. సొసైటీ చరిత్రలో తొలిసారిగా 126 పాఠశాలలు 100శాతం ఫలితాలు సాధించాయి. 287 మంది 10జీపీఏ పొందారు.
* మహాత్మ జ్యోతిబాఫులె తెలంగాణ వెనకబడిన తరగతుల సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థులు 97.53 శాతం ఉత్తీర్ణత సాధించారు. రాష్ట్రవ్యాప్తంగా 142 గురుకుల పాఠశాలల్లో 77 పాఠశాలలు వందశాతం ఫలితాలు సాధించాయి. మొత్తం 10,645 మందికి గాను 10,381 మంది పాసయ్యారు. 467 మంది 10 జీపీఏ సాధించారు.
* గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలల్లో 96శాతం ఉత్తీర్ణత నమోదైంది. 6,287 మందికి 6,557 మంది పాసయ్యారు. 20 పాఠశాలలు వందశాతం ఫలితాలు సాధించాయి. 44 మంది 10 జీపీఏ సాధించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పతి దేవుడికి గుడి కట్టింది!
కరోనా మహమ్మారి ఆమె జీవితంలో అంతులేని విషాదాన్ని నింపింది. కళ్లల్లో పెట్టుకుని చూసుకునే భర్తను తన నుంచి దూరం చేసింది. మూడేళ్ల క్రితం భర్త కొవిడ్తో మృతి చెందడంతో ఆమె ఒంటరిగా మారారు. -
కొత్తవారొచ్చారు
ఆంధ్రప్రదేశ్ నిఘా విభాగాధిపతిగా సీనియర్ ఐపీఎస్ అధికారి కుమార్ విశ్వజిత్ను, విజయవాడ నగర పోలీసు కమిషనర్గా పీహెచ్డీ రామకృష్ణను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. -
జేఈఈ మెయిన్స్లో తెలుగోళ్ల సత్తా
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. దేశవ్యాప్తంగా 56 మందికి 100 పర్సంటైల్ రాగా.. ఇందులో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందినవారే 22 మంది ఉన్నారు. జేఈఈ మెయిన్స్ తుది ఫలితాలను జాతీయ పరీక్షల విభాగం (ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసింది. -
కాళేశ్వరంపై కమిషన్ విచారణ షురూ
కాళేశ్వరం ఎత్తిపోతల్లోని బ్యారేజీలపై న్యాయ విచారణకు ఏర్పాటు చేసిన కమిషన్ కార్యాచరణ మొదలుపెట్టింది. బుధవారం కమిషన్ ఛైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ ఆయన సతీమణి దేబ్జానీ ఘోష్తో కలిసి హైదరాబాద్కు చేరుకున్నారు. -
ఫస్టియర్లో 60.01%.. సెకండియర్లో 64.19%
ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో 60.01 శాతం, రెండో సంవత్సరంలో 64.19 శాతం మంది విద్యార్థులు (ఒకేషనల్ కోర్సులతో కలిపి) ఉత్తీర్ణత సాధించారు. -
కవిత బెయిల్పై మే 6న తీర్పు
ఈడీ కేసులో బెయిల్ కోసం భారాస ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్పై తీర్పును ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు మే 6కి వాయిదా వేసింది. -
చదువుల ‘సిరి’.. రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని పట్టుదల
వారానికి రెండుసార్లు డయాలసిస్.. ఒంట్లో సత్తువ లేక కళాశాలకూ వెళ్లలేని పరిస్థితి.. అయినా మొక్కవోని పట్టుదలతో చదివిన పేదింటి బిడ్డ ప్రతిభ చాటింది. -
విజన్-2026కు డోర్నకల్ ఉపాధ్యాయుల శ్రీకారం
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు విజన్-2026 పేరిట ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. -
ఇంటర్ ఫలితాల్లో కవలల ప్రతిభ
సూర్యాపేట జిల్లా ఆత్మకూర్(ఎస్) మండల కేంద్రానికి చెందిన డేగల వీరభద్రయ్య, మంజుల దంపతుల కవల పిల్లలు డేగల రామ్, లక్ష్మణ్ ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో ప్రతిభ చూపారు. -
రాష్ట్రంలో వంతెనల పరిశీలన..!
రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న చిన్నా, పెద్ద వంతెనలను పరిశీలించేందుకు అధికారులు ఆయత్తం అవుతున్నారు. జిల్లాల వారీగా నిర్మాణ స్థితిగతులపై జాబితాలను రూపొందించే పనిలో ఉన్నారు. -
యాదాద్రి విద్యుత్కేంద్రానికి పర్యావరణ అనుమతి
యాదాద్రి థర్మల్ విద్యుత్కేంద్రానికి పర్యావరణ అనుమతి (ఈసీ) ఇవ్వడానికి కేంద్ర పర్యావరణ శాఖ ఆమోదం తెలిపింది. -
మెట్రో రైలు శబ్దకాలుష్యంపై వివరణివ్వండి
మెట్రో రైల్వే లైను వంపుల్లో రైలు వెళ్లినపుడు పరిమితికి మించి వస్తున్న శబ్దకాలుష్యంపై వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వానికి, మెట్రో రైల్వే ఎండీకి బుధవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
ఆర్జేసీ, మోడల్, కేజీబీవీ విద్యార్థుల ప్రతిభ
టీఎస్ఆర్జేసీ నేరెళ్ల గురుకుల విద్యార్థిని ఎంపీసీలో 991 మార్కులు, బైపీసీలో తాటిపల్లి విద్యార్థిని 990 మార్కులు సాధించినట్లు యాజమాన్యం తెలిపింది. -
ఫోన్ ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావుకు మధ్యంతర బెయిలు నిరాకరణ
ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టయిన టాస్క్ఫోర్స్ మాజీ ఓఎస్డీ రాధాకిషన్రావుకు ఎల్ఎల్ఎం పరీక్షలు రాసేందుకు వీలుగా మధ్యంతర బెయిలు ఇచ్చేందుకు నాంపల్లి కోర్టు నిరాకరించింది. -
పోలింగ్ రోజు వేతనంతో కూడిన సెలవు
లోక్సభ ఎన్నికల పోలింగ్ జరిగే రోజును వేతనంతో కూడిన సెలవుగా ప్రకటించారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్రాజ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
జస్టిస్ రామలింగేశ్వరరావుకు హైకోర్టు ఘన నివాళి
గుండెపోటుతో ఇటీవల మృతి చెందిన ఉమ్మడి హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎ.రామలింగేశ్వరరావుకు బుధవారం హైకోర్టు ఘన నివాళి అర్పించింది. -
శనగ విత్తనోత్పత్తి రైతుల ఆందోళన
‘పంట విక్రయించి నెల రోజులవుతోంది. డబ్బులు ఎప్పుడు ఇస్తారో.. క్వింటాకు ఎంత కట్టిస్తారో ఇప్పటికీ తెలియదు. -
విచారణ నుంచి తప్పుకొన్న జస్టిస్ శేషసాయి ధర్మాసనం
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసుపై మాట్లాడొద్దంటూ కడప జిల్లా కోర్టు(పీడీజే) ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ వివేకా కుమార్తె నర్రెడ్డి సునీత, పులివెందుల తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.రవీంద్రనాథ్రెడ్డి అలియాస్ బీటెక్ రవి దాఖలు చేసిన వ్యాజ్యాల విచారణ నుంచి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏవీ శేషసాయి నేతృత్వంలోని ధర్మాసనం తప్పుకొంది. -
ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఇంటర్ ప్రవేశాలు
రాష్ట్రంలోని ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో ప్రవేశాల పేరిట డొనేషన్లు, అధిక రుసుముల వసూళ్లు, ఇతరత్రా అక్రమాలను నిరోధించేందుకు వీలుగా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఆన్లైన్ ప్రవేశాల విధానాన్ని ప్రవేశపెట్టాలని యోచిస్తున్నామని విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. -
మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ
ష్ట్రంలో మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. షెడ్యూలును విద్యాశాఖ బుధవారం విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు (4)
రాష్ట్రంలో వచ్చే నెల 6వ తేదీన జరగనున్న తెలంగాణ రాష్ట్ర ఇంజినీరింగు కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (టీఎస్ఈసెట్)ను మే చివరి వారానికి వాయిదా వేయాలని పలువురు అభ్యర్థులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని కోరారు.
తాజా వార్తలు (Latest News)
-
అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్ కీలక ప్రతిపాదన!
-
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
హోటల్లో భారీ అగ్ని ప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం
-
విద్యార్థుల చిరునవ్వుల కోసం ఓ టీచర్ ఫన్నీ యాక్ట్.. వీడియో వైరల్
-
(ADVT) జేఈఈ మెయిన్ ఓపెన్ కేటగిరీలో ఆలిండియా 1st ర్యాంక్ నారాయణదే