నుపుర్శర్మ దేశాన్ని రెచ్చగొట్టారు
మహమ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి సస్పెండైన భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి నుపుర్శర్మపై సర్వోన్నత న్యాయస్థానం తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆమె నోటి దురుసు దేశాన్ని మంటల్లోకి నెట్టిందని, ప్రస్తుతం వివిధ..
నోటి దురుసుతో బాధ్యతారాహిత్య వ్యాఖ్యలు
ఆ కారణంగానే దేశమంతా ఆగ్రహాగ్ని
బేషరతుగా క్షమాపణ చెప్పాలి
సస్పెండైన భాజపా నేతపై సుప్రీం తీవ్ర ఆగ్రహం
దిల్లీ: మహమ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి సస్పెండైన భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి నుపుర్శర్మపై సర్వోన్నత న్యాయస్థానం తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆమె నోటి దురుసు దేశాన్ని మంటల్లోకి నెట్టిందని, ప్రస్తుతం వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న దురదృష్టకర సంఘటనలకు ఆమే ఏకైక బాధ్యురాలని పేర్కొంది. తనపై వివిధ రాష్ట్రాల్లో దాఖలైన ఎఫ్ఐఆర్లను దిల్లీకి బదిలీ చేయాలంటూ నుపుర్శర్మ దాఖలు చేసిన పిటిషన్ను శుక్రవారం సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈ సందర్భంగా భాజపా అధికార ప్రతినిధిగా ఆమె ఓ టీవీ చర్చలో మహమ్మద్ ప్రవక్తపై చేసిన వ్యాఖ్యలను న్యాయమూర్తులు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జేబీ పర్దీవాలాల ధర్మాసనం తీవ్రంగా గర్హించింది. ‘‘ఆమె నోటిదురుసుతో టీవీలో అన్నిరకాలైన బాధ్యతారాహిత్య ప్రకటనలు చేసి దేశంలో మంటలు సృష్టించారు. తాను చేసిన వ్యాఖ్యలకు దేశం మొత్తానికి ఆమె క్షమాపణ చెప్పి ఉండాల్సింది. ఆమె వ్యాఖ్యలు అహంకారపూరితంగా ఉన్నాయి. అయినా అలాంటి మాటలు అనాల్సిన అవసరం ఏముంది..? ఈ వ్యాఖ్యలు దేశంలో దురదృష్టకర సంఘటనలు జరగడానికి కారణమయ్యాయి. ఇలాంటి వ్యక్తులకు మతాలపై గౌరవం ఉండదు. చౌకబారు ప్రచారం కోసం లేదా రాజకీయ ఎజెండా కోసం లేదా నీచ కార్యకలాపాల కోసం ఏమైనా చేస్తారు’’ అని తీవ్రంగా ఆక్షేపించింది. ఇస్లాంను అవమానపరిచారని ఉదయ్పుర్లో ఓ దర్జీని ఇద్దరు వ్యక్తులు దారుణంగా హత్య చేసిన సంఘటన నేపథ్యంలో న్యాయస్థానం నుంచి ఈ వ్యాఖ్యలు వెలువడడం గమనార్హం. నుపుర్శర్మ ప్రాణాలకు ముప్పు ఉందంటూ ఆమె తరఫు న్యాయవాది మణిందర్సింగ్ చేసిన వాదనలను ధర్మాసనం తోసిపుచ్చింది. ‘‘ఆమెకు ముప్పు ఉందా.. ఆమెతో దేశ భద్రతకు ముప్పు ఉందా’’ అని ప్రశ్నించింది. ‘‘మేం కూడా టీవీలో చర్చను చూశాం. ఆమె భావోద్వేగాలు తీవ్రంగా రెచ్చగొట్టారు. ప్రస్తుతం దేశంలో జరుగుతున్న పరిణామాలకు ఆమెదే ఏకైక బాధ్యత’’ అని పేర్కొంది. జరిగిన సంఘటనకు నుపుర్ లిఖితపూర్వక క్షమాపణ చెప్పారని మణిందర్ సింగ్ ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. దీన్ని న్యాయమూర్తులు అంగీకరించలేదు. ‘‘షరతులతో ఆమె చేసిన దాన్ని క్షమాపణ అంటారా.. ఆమె టీవీలో దేశం మొత్తానికి క్షమాపణ చెప్పాలి’’ అని పేర్కొన్నారు. వివిధ రాష్ట్రాల్లో తనపై దాఖలైన ఎఫ్ఐఆర్లను ఒకటిగా చేయాలంటూ నుపుర్ వేసిన పిటిషన్పైనా ధర్మాసనం అభ్యంతరం వ్యక్తం చేసింది.
అధికార ప్రతినిధి అయితే ఏమైనా అనొచ్చా..!
నుపుర్.. భాజపా అధికార ప్రతినిధిగా చర్చలో స్పందించారని, ఉద్దేశపూర్వకంగా వ్యాఖ్యలు చేయలేదంటూ మణిందర్సింగ్ చేసిన వాదనలతో సుప్రీంకోర్టు విభేదించింది.‘‘ పార్టీ అధికార ప్రతినిధి అయితే ఏమైనా మాట్లాడటానికి లైసెన్సు ఇచ్చినట్లా. ఒక వేళ చర్చ పక్కతోవ పట్టి ఉంటే అందుకు కారణమైన యాంకర్పై ఎఫ్ఐఆర్ దాఖలు చేయాలి’’ అని న్యాయమూర్తులు పేర్కొన్నారు. గతంలో పాత్రికేయుడు అర్ణబ్గోస్వామి కేసులో ఎఫ్ఐఆర్లను కలిపే అవకాశం సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిందని, ఒకే చర్యకు రెండో ఎఫ్ఐఆర్ ఉండకూడదని పేర్కొందని మణిందర్ సింగ్ చేసిన వాదనలపై జస్టిస్ సూర్యకాంత్ ఏకీభవించలేదు. ‘‘అది ఒక నిర్దిష్ట సమస్యపై ఒక పాత్రికేయుడి హక్కులకు సంబంధించిన అంశం. దానికీ ఓ పార్టీ అధికార ప్రతినిధి చేసిన బాధ్యతారాహిత్య వ్యాఖ్యలకూ సంబంధం లేదు’’ అని పేర్కొన్నారు. నుపుర్శర్మ పిటిషన్ను విచారించలేమని, హైకోర్టును ఆశ్రయించాలని ధర్మాసనం తెలిపింది. నుపుర్శర్మపై దిల్లీలో దాఖలైన ఎఫ్ఐఆర్పైనా సుప్రీంకోర్టు ప్రశ్నలు లేవనెత్తింది. ‘‘ఇప్పటివరకు ఆమెపై విచారణ ఎంతవరకు వచ్చింది. దిల్లీ పోలీసులేం చేశారు. ఆ విషయాలు మాతో చెప్పించకండి. వారు మీకు ఎర్రతివాచీ పరిచి ఉంటారు’’ అని ధర్మాసనం తెలిపింది. మరోవైపు సుప్రీంకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో దిల్లీ పోలీసులు శుక్రవారం నుపుర్శర్మకు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 18న విచారణకు హాజరుకావాలని అందులో పేర్కొన్నారు.
భాజపా సిగ్గుతో తలదించుకోవాలి: కాంగ్రెస్
నుపుర్ శర్మపై సుప్రీం కోర్టు వ్యాఖ్యలను విపక్షాలు స్వాగతించాయి. ఈ వ్యాఖ్యలు చూసైనా అధికార పార్టీ సిగ్గుతో తలదించుకోవాలని కాంగ్రెస్ వ్యాఖ్యానించింది. ఎన్డీయే ప్రభుత్వం దేశంలో విద్వేష వాతావరణం సృష్టిస్తోందని కాంగ్రెస్ సీనియర్నేత రాహుల్గాంధీ అన్నారు. నుపుర్ శర్మ వ్యాఖ్యలకు మోదీ, అమిత్షా, భాజపా, ఆరెస్సెస్ బాధ్యత వహించాలని పేర్కొన్నారు. శుక్రవారం రాహుల్.. కేరళలోని తన సొంత నియోజకవర్గమైన వయనాడ్లో కొన్ని రోజుల క్రితం ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు ధ్వంసం చేసిన తన పార్టీ కార్యాలయాన్ని సందర్శించారు. నుపుర్శర్మను తక్షణమే అరెస్టు చేయాలని ఏఐఎంఐఎం అధిపతి అసదుద్దీన్ ఒవైసీ డిమాండ్ చేశారు. సుప్రీం కోర్టు ప్రకారం.. ఈ విద్వేష వాతావరణానికి కారణం నుపుర్శర్మ అని ఆమెపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. మరోవైపు నుపుర్శర్మ పిటిషన్ విచారణ సందర్భంగా న్యాయమూర్తులు చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని కోరుతూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణకు దిల్లీకి చెందిన సామాజిక కార్యకర్త అజయ్ గౌతమ్ లేఖ రాశారు. ఈ లేఖనే ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా పరిగణించాలని కోరారు.
దేశ పరిస్థితి చూసి భయపడుతున్నా: అమర్త్యసేన్
కోల్కతా: దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై నోబెల్ అవార్డు గ్రహీత, ప్రముఖ ఆర్థిక వేత్త అమర్త్యసేన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన సాల్ట్లేక్ ప్రాంతంలో అమర్త్య పరిశోధన కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘‘ఏ విషయం గురించి అయినా భయపడుతున్నారా అని నన్ను అడిగితే.. అవును అంటాను. ఇప్పుడు భయపడటానికి కారణం ఉంది. దేశంలో ప్రస్తుత పరిస్థితే ఈ భయానికి కారణం. దేశం సమైక్యంగా ఉండాలని కోరుకుంటాను. చరిత్రపరంగా ఉదారవాద దేశమైన భారత్లో విభజనలు రావాలని కోరుకోవడం లేదు. అందరూ కలిసి సమైక్యంగా పని చేయాలి’’ అని సేన్ అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బోన్మ్యారో మార్పిడితో యువకుడికి పునర్జన్మ
ఓ రకమైన రక్త క్యాన్సర్తో బాధపడుతున్న యువకుడికి హైదరాబాద్లోని ప్రభుత్వ ఎంఎన్జే ఆసుపత్రి పునర్జన్మ ప్రసాదించింది. -
ఫిర్యాదు రాగానే లావాదేవీ నిలిపివేయాలి: ఆర్బీఐకి తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో సూచన
సైబర్ నేరాల దర్యాప్తులో దేశానికే మార్గదర్శకంగా ఉన్న తెలంగాణ పోలీసుశాఖ మరో ముందడుగు వేసింది. -
మా వాళ్లు ఏం చెబితే.. అది చేయ్.. అన్నీ నేను చూసుకుంటా..
మాజీ మంత్రి వివేకా హత్య కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరి మరికొన్ని సంచలన విషయాలు బయటపెట్టారు. -
జగన్ భక్త ఐపీఎస్లపై వేటు
అధికార వైకాపాతో అంటకాగుతూ... గత ఐదేళ్లుగా ఆ పార్టీ అరాచకాలకు అడుగడుగునా కొమ్ముకాస్తూ వచ్చిన ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారులపై ఎన్నికల సంఘం ఎట్టకేలకు బదిలీ వేటు వేసింది. -
ఆస్తులు వేల కోట్లు.. చూపింది వందల కోట్లు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పులివెందుల నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్న ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తన అఫిడవిట్లో ఆస్తుల విలువ తక్కువగా చూపించారు. -
ఏబీ వెంకటేశ్వరరావు పిటిషన్పై క్యాట్ విచారణ 29కి వాయిదా
ఆంధ్రప్రదేశ్కు చెందిన ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ వివాదంపై హైదరాబాద్లోని కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ (క్యాట్) విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది. -
తాగునీటికి.. మూసీ శుద్ధికి
ఒక్క ప్రాజెక్టుతో రెండు ప్రయోజనాలు నెరవేరబోతున్నాయి. గజ్వేల్ నియోజకవర్గంలోని కొండపోచమ్మ రిజర్వాయర్ నుంచి పైపులైను ద్వారా తాగునీటిని హైదరాబాద్కు తరలించడం ద్వారా రాజధాని పరిధిలో తాగునీటి అవసరాలను సంపూర్ణంగా తీర్చడంతోపాటు, మురికి కూపంగా మారిన మూసీని ప్రక్షాళన చేయబోతున్నారు. -
గరం.. గరం
రాష్ట్రంలో ఎక్కడో ఒకచోట రోజూ 45 గరిష్ఠ ఉష్ణోగ్రత డిగ్రీలకు తాకుతుండటం ఆందోళన కలిగిస్తోంది. మంగళవారం మిర్యాలగూడలో 45.1 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. -
కూలిన మానేరు వాగు వంతెన గడ్డర్లు
పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలను అనుసంధానిస్తూ మానేరు వాగుపై నిర్మాణంలో ఉన్న వంతెన గడ్డర్లు సోమవారం రాత్రి నేలకూలాయి. -
ఎక్సైజ్ అధికారుల బదిలీల్లో మినహాయింపులెందుకు?
ఎన్నికల సందర్భంగా నిర్వహించే బదిలీల్లో ఎక్సైజ్ అధికారులకు మినహాయింపు ఎందుకు ఇచ్చారో తెలపాలని హైకోర్టు మంగళవారం ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించింది. -
ఆశలు ఆవిరి.. మూగజీవాలకు వదిలి..
విత్తనోత్పత్తి వరి సాగు చేపట్టిన రైతులకు కన్నీళ్లే మిగిలాయి. పంట పొట్టదశలో నీటి తడులు అందక ఎదుగుదల లోపిస్తోంది. -
26న ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ రాక
ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ ఈ నెల 26న రాష్ట్రానికి రానున్నారు. పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు. ఇందుకు ఏర్పాట్లు చేయాలని సీఎస్ ఎ.శాంతికుమారి ఉన్నతాధికారులను ఆదేశించారు. -
రక్షణ చర్యలు లేకపోవడం వల్లే ఎస్బీ ఆర్గానిక్స్లో పేలుడు
సంగారెడ్డి జిల్లా హత్నూర మండలంలోని ఎస్బీ ఆర్గానిక్స్లో ఇటీవల జరిగిన ప్రమాదానికి సరైన భద్రతా చర్యలు లేకపోవడమే కారణమని ఐఐసీటీ (ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ) మాజీ చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ బాబురావు అభిప్రాయపడ్డారు. -
టీ-సాట్ ఆధ్వర్యంలో నేడు, రేపు ‘నీట్’ పాఠ్యాంశాల ప్రత్యక్ష ప్రసారం
మే 5న నిర్వహించే ‘నీట్’ పరీక్షపై టీ-సాట్ నెట్వర్క్ ఛానళ్లు ప్రత్యేక పాఠ్యాంశాలను ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నట్లు టీ-సాట్ సీఈవో బి.వేణుగోపాల్రెడ్డి మంగళవారం తెలిపారు. -
ఇదీ సంగతి!
ఆదాయంలోనే కాదు సార్.. కేసుల్లో కూడా ఏ సీఎం మీ దరిదాపుల్లోకి రాలేరు సార్! -
నేడు ఇంటర్ ఫలితాలు
ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షల ఫలితాలు బుధవారం విడుదల కానున్నాయి. -
రుణం ఎగవేత కేసులో రూ.55.73 కోట్ల ఆస్తుల జప్తు
వ్యాపారం కోసం రుణం తీసుకొని సొంత ఖాతాల్లోకి మళ్లించుకొని బ్యాంకుల్ని మోసం చేసిన కేసులో వీఎంసీ సిస్టమ్స్ లిమిటెడ్కు చెందిన రూ.55.73 కోట్ల స్థిర, చరాస్తులను హైదరాబాద్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
నేటి నుంచి కాళేశ్వరంపై న్యాయ విచారణ
కాళేశ్వరం ఎత్తిపోతల నిర్మాణంపై బుధవారం నుంచి జ్యుడిషియల్ విచారణ ప్రారంభం కానుంది. -
బాబ్లీ కేసు విచారణ మే 7కు వాయిదా
బాబ్లీ ప్రాజెక్టు ముట్టడి కేసు విచారణ వచ్చే నెల 7కు వాయిదా పడింది. -
పుట్టుకతోనే కాలేయ వ్యాధి.. మా బాబును ఆదుకోండి!
రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబం.. లేక లేక కలిగిన సంతానం.. పెళ్లైన తొమ్మిదేళ్లకు బాబు పుట్టాడు. కూలి పనులు చేసుకుని జీవనం సాగించే ఆ దంపతులకు బిడ్డ పుట్టాడన్న ఆనందం ఎంతోసేపు నిలవలేదు. -
యాదాద్రిలో వైభవంగా తెప్పోత్సవం
చైత్ర పౌర్ణమిని పురస్కరించుకొని యాదాద్రి దివ్యక్షేత్రంలో మంగళవారం తెప్పోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. శ్రీలక్ష్మీనరసింహులను ముస్తాబు చేసి మంగళ వాయిద్యాల నడుమ కొండపైన ఉన్న విష్ణు పుష్కరిణి వద్దకు ఊరేగింపుగా తీసుకెళ్లారు.
తాజా వార్తలు (Latest News)
-
విజయ్తో సినిమా కష్టమే..: వెట్రిమారన్
-
ఆ ఇద్దరికి నో ప్లేస్.. వన్డౌన్ బ్యాటర్గా అతడే: ఇర్ఫాన్ పఠాన్
-
సంపద పంచుతారంటూ మోదీ ఆరోపణలు.. రాహుల్ క్లారిటీ
-
ప్రమాదవశాత్తు పేలిన తుపాకీ.. సీఆర్పీఎఫ్ డీఎస్పీ మృతి
-
వారసత్వ ఆస్తుల్నీ వదలరట: పిట్రోడా వ్యాఖ్యలపై మోదీ విమర్శలు
-
జగన్పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి