మోదీ అండ.. పార్టీ జెండా..
ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వం, పార్టీ విధానాలు తమకు కీలక విజయాలను అందిస్తున్నాయని భారతీయ జనతా పార్టీ పదాధికారులు అభిప్రాయపడ్డారు. భాజపాకు దేశ ప్రజల ఆశీస్సులు బాగా ఉన్నాయని, ఇటీవల జరిగిన ఉత్తర్ప్రదేశ్, ఉత్తరాఖండ్,....
ఇవే మన బలాలు
రానున్న శాసనసభ ఎన్నికలే లక్ష్యం
బూత్స్థాయి నుంచి భాజపా బలోపేతం
కష్టపడితే తెలంగాణలో అధికారంలోకి..
పదాధికారుల సమావేశంలో నేతల ఉద్ఘాటన
ఈనాడు - హైదరాబాద్
ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వం, పార్టీ విధానాలు తమకు కీలక విజయాలను అందిస్తున్నాయని భారతీయ జనతా పార్టీ పదాధికారులు అభిప్రాయపడ్డారు. భాజపాకు దేశ ప్రజల ఆశీస్సులు బాగా ఉన్నాయని, ఇటీవల జరిగిన ఉత్తర్ప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపుర్ రాష్ట్రాల్లో విజయకేతనం ఎగురవేయడమే దీనికి నిదర్శనమని పేర్కొన్నారు. యూపీలో గతంలో ఎన్నడూ గెలవని రాంపుర్, ఆజంగఢ్లాంటి స్థానాల్లో కూడా భాజపా ఇటీవలి ఉపఎన్నికల్లో గెలవడం మార్పునకు సంకేతమని అన్నారు. భాజపా ఎనిమిదేళ్లపాలనను ప్రజల్లోకి తీసుకెళ్లడంపై సమావేశంలో చర్చించారు. త్వరలో శాసనసభ ఎన్నికలు జరగనున్న హిమాచల్ప్రదేశ్, గుజరాత్, కర్ణాటక, నాగాలాండ్లలో విజయమే లక్ష్యంగా శ్రేణులు పనిచేయాలని అగ్రనేతలు సూచించారు. హైదరాబాద్లో శనివారం ప్రారంభమైన భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాల్లో భాగంగా ఉదయం పదాధికారుల సమావేశం జరిగింది. సుమారు అయిదుగంటల పాటు జరిగిన ఈ సమావేశంలో 148 మంది పదాధికారులు పాల్గొన్నారు.భాజపా జాతీయ అధ్యక్షుడు జె.పి.నడ్డా, ప్రధాన కార్యదర్శి బి.ఎల్.సంతోష్లు జ్యోతి ప్రజ్వలన చేసి ఈ సమావేశాన్ని ప్రారంభించారు. జాతీయ కార్యవర్గ సమావేశంలో ప్రతిపాదించాల్సిన రాజకీయ, ఆర్థిక తీర్మానాల ముసాయిదాపై సుదీర్ఘంగా చర్చించారు. దేశంలో ఇటీవలి రాజకీయ పరిణామాలతోపాటు ఉప ఎన్నికలు, రానున్న శాసనసభ ఎన్నికలపై చర్చించారు. కేంద్ర ప్రభుత్వ స్వచ్ఛపాలన, గరీబ్ కల్యాణ్యోజన వంటి పథకాలను ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్లాలని నిర్ణయించారు. శాసనసభ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో పోలింగ్ బూత్లవారీగా పార్టీని బలోపేతం చేయాలని, ఆగస్టు 15లోగా కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని ప్రకటించారు. పశ్చిమబెంగాల్, తెలంగాణ, కేరళ రాష్ట్రాల్లో భాజపా కార్యకర్తలు అనేక ఇబ్బందులను, వేధింపులను ఎదుర్కొంటూ పార్టీ కోసం పోరాడుతున్నారని ప్రశంసించారు.భాజపాను సంస్థాగతంగా బలోపేతం చేయడంపై జాతీయ ప్రధానకార్యదర్శి బి.ఎల్.సంతోష్ వివరించారు. దేశవ్యాప్తంగా 3.40 కోట్ల ఇళ్ల నిర్మాణం, 27 నగరాల్లో మెట్రో రైలు సౌకర్యం, 171 కోట్ల వ్యాక్సినేషన్ సహా వివిధ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. పదాధికారుల సమావేశం అనంతరం భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు, రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధరరాజేే సింధియా వివరాలను విలేకరుల సమావేశంలో వెల్లడించారు.
ఆర్థిక వృద్ధిరేటుతో దేశం దూసుకెళ్తోంది: వసుంధర రాజే
ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉన్నప్పటికీ, ప్రపంచ సగటు జీడీపీ 6 గా ఉన్నా భారతదేశ జీడీపీ 8.7 శాతం వృద్ధిరేటుతో దూసుకెళ్లడానికి భాజపా ప్రభుత్వమే కారణమని పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు వసుంధర రాజే అన్నారు. ‘‘సమావేశంలో వర్తమాన రాజకీయాలు, దేశ ఆర్థిక వ్యవస్థ, పేదల సంక్షేమంపై చర్చించాం. జాతీయ కార్యవర్గ సమావేశాల్లో రాజకీయాలు, ఆర్థిక వ్యవస్థ-పేదల సంక్షేమంపై రెండు తీర్మానాలు చేయనున్నాం.భాజపా నాయకులు బూత్స్థాయి కార్యకర్తలతో మాట్లాడి, పార్టీని బలోపేతం చేయడంపై దృష్టిసారించాలి. నిరంతరం ప్రజలతో చర్చలు నిర్వహించాలి. ఒక్కో బూత్లో కనీసం 200 మంది క్రియాశీలక కార్యకర్తలను గుర్తించి, వారిని ఒకవేదికపైగా తీసుకువచ్చేలా వాట్సప్ గ్రూపులను ఏర్పాటు చేయనున్నాం. దేశవ్యాప్తంగా పన్నాప్రముఖ్లను తయారు చేయనున్నాం. ఈ వ్యవస్థతో భాజపా పటిష్ఠమైంది. దీని పునాదులపైనే పార్టీ, భాజపా ప్రభుత్వాల నిర్మాణం జరిగిందని గుర్తించాలి.
20 కోట్ల కుటుంబాల లక్ష్యంతో ఇంటింటికీ తిరంగా..
ఆజాదీకా అమృత్ మహోత్సవ్లో భాగంగా పార్టీ తరఫున వివిధ రాష్ట్రాల్లో కార్యక్రమాలు నిర్వహించనున్నాం. ప్రతిఇంట్లో మూడు రంగుల జెండా లక్ష్యంగా దేశంలో 20 కోట్ల మంది వద్దకు ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్తాం. ఇంటింటిపై జెండా ఎగురవేసి దేశ ప్రజలందరినీ ఒక ఉద్యమంలా సంఘటితం చేయాలని నిర్ణయించాం’’ అని వసుంధర రాజే తెలిపారు.
తెలంగాణలో అధికారానికి కృషి
తెలంగాణలోనూ మంచి వాతావరణం ఉందని, ఉప ఎన్నికల ఫలితాలే దీనికి నిదర్శనమని ముఖ్యనేతలు సమావేశంలో పేర్కొన్నారు. మరింత కష్టపడితే అధికారంలోకి వస్తామనే ధీమా ఉందన్నారు. భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాలకు తెలంగాణ వేదికైన నేపథ్యంలో రాష్ట్రానికి సంబంధించి ప్రకటన చేయాల్సిన అవసరం ఉందని సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడుతూ జాతీయ నేతల ఆశీస్సులతో రాష్ట్రంలో భాజపాను అధికారంలోకి తీసుకువచ్చేందుకు కృషి చేస్తామన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఉపాధి కూలీల కనీస వేతనం రూ.300
ఏప్రిల్ నుంచి మొదలయ్యే కొత్త ఆర్థిక సంవత్సరంలో (2024-25) రాష్ట్రంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (నరేగా) కూలీల కనీస వేతనం రూ.300గా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. -
ప్రవీణ్ప్రకాశ్ భేటీ వెనుక ఉద్దేశం ఏమిటో!
రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థుల తల్లిదండ్రులతో ఏప్రిల్ 23న ప్రత్యేక సమావేశం నిర్వహిస్తానని పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ ప్రకటించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
ఊసరవెల్లులే సిగ్గుతో చచ్చిపోతాయ్!
దెయ్యాలు వేదాలు వల్లించడమంటే ఇదేనేమో! మాజీ మంత్రి వై.ఎస్.వివేకానందరెడ్డి హత్య కేసు గురించి సీఎం జగన్ ప్రొద్దుటూరు సభలో బుధవారం చేసిన వ్యాఖ్యలు వింటే ఊసరవెల్లులు సైతం సిగ్గుతో చచ్చిపోతాయేమో! -
సీఎం పీఆర్ఓలా... వైకాపా నాయకులా?
ముఖ్యమంత్రి జగన్ కార్యాలయంలో ప్రజాసంబంధాల అధికారులు (పీఆర్ఓ)గా పనిచేస్తున్నవారు ఎన్నికల నిబంధనల్ని తుంగలో తొక్కుతూ అధికారపార్టీ సేవలో తరిస్తున్నారు. -
కంప్యూటర్ ఎక్కడ? ఇంకా బిల్లులెన్ని ఉన్నాయి?.. ఆసుపత్రిలో ట్రెజరీ ఉద్యోగి కలవరింతలు
‘కంప్యూటర్ ఏదీ.. ఎక్కడ ఉంది.. మౌస్ కనిపించట్లేదు. బిల్లులు ఇంకా ఎన్ని ఉన్నాయి. త్వరగా చూడాలి. ఫైళ్లన్నీ తీసుకురండి’ అంటూ మడకశిర ఉప ఖజనా శాఖ (ఎస్టీఓ) కార్యాలయంలో పని చేస్తున్న సీనియర్ ఎకౌంటెంట్ హరినాథ్ ఆసుపత్రి పడకపై కలవరిస్తున్న తీరు హృదయ విదారకంగా ఉంది. -
సీఎంను కీర్తించేందుకు.. ‘మేమంతా సిద్ధం’!
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర గురువారం నంద్యాల జిల్లాలో జరగనుంది. ఉదయం ఆళ్లగడ్డ నుంచి జగన్ బస్సు యాత్ర పలు గ్రామాల మీదుగా ప్రయాణించి నంద్యాల చేరుకుంటుంది. -
దాడి చేసి.. దండంతో సరి!
కాకినాడలోని పెద్ద శివాలయంలో అర్చకులు వెంకట సత్యసాయి, విజయ్కుమార్లను కొట్టిన మాజీ కార్పొరేటర్, వైకాపా నేత సిరియాల చంద్రరావును కాపాడేందుకు ఆ పార్టీ నాయకులు నానాతంటాలు పడుతున్నారు. -
సంధ్య ఆక్వా ఎండీ సోదరుడి ఇంటికి మంత్రి మేరుగు నాగార్జున.. ముచ్చట్లలో మర్మమేమి?
‘డ్రైడ్ఈస్ట్ పేరుతో విశాఖకు మాదక ద్రవ్యాలను దిగుమతి చేస్తుంటే సీబీఐ ఈ మధ్యకాలంలో దాడి చేసింది. పచ్చసోదరులంతా ఉలిక్కిపడి.. మన (వైకాపా)మీద నెట్టేయడానికి సిద్ధమయ్యారు. -
స్క్రీనింగ్ లేకుండానే రూ. 2,000 కోట్ల చెల్లింపులు
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత రూ.2,000 కోట్ల చెల్లింపులు ఎలాంటి స్క్రీనింగ్ లేకుండానే జరిగిపోయాయి. ఇందులో పారదర్శకత లేదు. -
బాబాయిని చంపిందెవరో దేవుడికి, ప్రజలకు తెలుసు
వివేకానందరెడ్డి హత్యపై 2019 ఎన్నికల ముందు పదేపదే మాట్లాడిన జగన్ సీఎం అయ్యాక ఆ విషయాన్ని ప్రస్తావించనే లేదు. తాజాగా సార్వత్రిక ఎన్నికల ముందు ప్రొద్దుటూరు సభలో మరోసారి బాబాయి హత్య, హంతకుల గురించి మాట్లాడుతూ..వారికి మద్దతిస్తున్నారంటూ చంద్రబాబును విమర్శించారు. -
జగన్ అనే నేను.. ఒక వినాశకారి!
జగన్ అనే నేను... ఆంధ్రావనికి ఒక్క పరిశ్రమనూ రానివ్వనని పాత వాటిని పారదోలుతానని... కొత్త కొలువులు సృష్టించనని... అంతఃకరణ శుద్ధితో ఆత్మసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.... ... అని చెప్పకున్నా... అయిదేళ్లుగా దాదాపు ఆ పనే చేశారు వైకాపా నేత! -
ఎన్నికల కోడ్ తర్వాత రూ.వేల కోట్ల పందేరం
ఎవరైనా మనకు ఆర్టీజీఎస్, నెఫ్ట్, ఐఎంపీఎస్ విధానంలో డబ్బులు బదిలీ చేస్తే మన ఖాతాకు ఎంతసేపట్లో చేరతాయి? కొద్ది గంటల్లో రావచ్చు. -
ఏం అభివృద్ధి చేశారని మా ఊరొచ్చారు?
‘సారూ.. ఏం అభివృద్ధి చేశారని మా ఊరొచ్చారు?’ అని ఏలూరు జిల్లా నూజివీడు ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప అప్పారావును మహిళలు, గ్రామస్థులు నిలదీశారు. -
‘యాప్’రే రూ.30 లక్షలా?
విద్యార్థులు ఫీజుల రూపంలో చెల్లించే డబ్బులను ఉన్నత విద్యామండలి దుర్వినియోగం చేస్తోంది. బ్యాంకు ఖాతాల్లో రూ.కోట్లు ఉండడంతో ఏదో ఒక కార్యక్రమం పేరు చెప్పి, వాటిని ఖాళీ చేస్తోంది. -
తిరుమలలో జస్టిస్ దుప్పల వెంకటరమణ కుమారుడి వివాహ వేడుక
మధ్యప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దుప్పల వెంకటరమణ కుమారుడు భానుప్రకాశ్, సౌజన్యల వివాహ వేడుక స్థానిక పుష్పగిరి మఠంలో బుధవారం జరిగింది. -
శ్రీవారి సేవలో అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి
అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డి.రమేష్ బుధవారం శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం శ్రీవారి ఆలయం వద్దకు చేరుకున్న న్యాయమూర్తి కుటుంబానికి తితిదే అధికారులు స్వాగతం పలికారు. -
డోన్, విజయనగరం జిల్లా గుత్తేదార్లకే టోకెన్లు
కేంద్ర రహదారి మౌలిక వసతుల నిధి (సీఆర్ఐఎఫ్) కింద పనులు చేసిన గుత్తేదారులు రూ.176 కోట్ల బిల్లుల కోసం సీఎఫ్ఎంఎస్లో అప్లోడ్ చేసి చాలాకాలంగా ఎదురుచూస్తున్నారు. -
అప్పు తేవాలి.. బొగ్గు కొనాలి!
అప్పు పుడితే బొగ్గు వస్తుంది.. బొగ్గు వస్తే థర్మల్ యూనిట్లు నడుస్తాయి.. ఇదీ ఏపీ జెన్కో పరిస్థితి. రాష్ట్ర విద్యుత్ అవసరాల్లో సుమారు 40 శాతం జెన్కో నుంచి అందుతోంది. -
ఆరంభమే ఫ్లాప్
వైకాపా అధ్యక్షుడు, ముఖ్యమంత్రి జగన్ ప్రచార యాత్ర ఆరంభమే ఫ్లాప్ అయింది.. గత ఎన్నికల్లో స్వీప్ చేసిన సొంత జిల్లాలో జనం ఆయనకు షాకిచ్చారు. -
నమ్మించారు.. వంచించారు
‘హైదరాబాద్కు సముద్రాన్ని తీసుకొస్తా’ అని సినిమాలో ఒక రాజకీయ నాయకుడి పాత్రలో నటుడు చెప్పినట్లుగా.. మన ముఖ్యమంత్రి హామీల మీద హామీలు గుప్పించారు. -
జగన్ ‘ఓట్లాట’లో ఓడిన రైతు!
కనికట్టు చేయడంలో... మాటల గారడీతో మభ్యపెట్టడంలో... పేటెంట్ హక్కు సీఎం జగన్దే... మొన్నటి వరకు విద్యుత్ కోతలతో ప్రజలను అల్లాడించిన వ్యక్తే... ఇప్పుడు ఎన్నికలు రావడంతో పంథా మార్చేశారు... వేసవి కాలం పేరిట ఓటర్లను ఏ‘మార్చు’తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
భారత సరిహద్దులు పూర్తి సురక్షితం - రాజ్నాథ్ సింగ్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
మహబూబ్నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో 99.86 శాతం పోలింగ్
-
పుష్ప3’ టైటిల్ ఇదేనా.. వైరలవుతోన్న న్యూస్!
-
పరిశ్రమలు తెచ్చి కొడంగల్ను అభివృద్ధి చేస్తా: సీఎం రేవంత్
-
ఆ హంతకులకు, జగన్కు ఓటు వేయొద్దు: వివేకా కుమార్తె సునీత