దేశానికి కేసీఆర్ వంటి నేత అవసరం
అసాధారణ పరిస్థితుల్లో రాష్ట్రపతి ఎన్నికలు జరుగుతున్నాయని విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హా పేర్కొన్నారు. విశాల భారత పరిరక్షణ, పిల్లల బంగారు భవిష్యత్తు కోసం జరిగే పోరాటమిదని చెప్పారు. దేశంలో పరిస్థితులు రోజురోజుకూ దిగజారుతున్నాయని..
ఆయన అడిగిన ప్రశ్నలకు మోదీ వద్ద సమాధానాలే లేవు
విశాల భారత పరిరక్షణ కోసమే మా పోరాటం
ప్రధానికి ప్రజాస్వామ్యంపై నమ్మకం లేదు
కేసీఆర్ ఉన్నంత వరకు ప్రజాస్వామ్యానికి ఢోకా లేదు
విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా
ఈనాడు, హైదరాబాద్: అసాధారణ పరిస్థితుల్లో రాష్ట్రపతి ఎన్నికలు జరుగుతున్నాయని విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హా పేర్కొన్నారు. విశాల భారత పరిరక్షణ, పిల్లల బంగారు భవిష్యత్తు కోసం జరిగే పోరాటమిదని చెప్పారు. దేశంలో పరిస్థితులు రోజురోజుకూ దిగజారుతున్నాయని.. కేంద్ర ప్రభుత్వ విధానాలతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. కేవలం ఒక్క వ్యక్తి చెబితే 135 కోట్ల మంది వింటూ కూర్చోవడం ప్రజాస్వామ్యం కాదన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో దేశానికి కేసీఆర్ లాంటి నేత అవసరమని అభిప్రాయపడ్డారు. అసాధ్యమనుకున్న తెలంగాణను కేసీఆర్ సాధించారని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి... ఇప్పుడు దేశాభ్యున్నతి కోసం ముందుకొస్తున్నారని కొనియాడారు. ఆయనతో కలిసి తానూ పోరాటంలో పాల్గొంటానని.. త్వరలోనే తాము మళ్లీ కలుస్తామన్నారు. ప్రధాని మోదీకి ప్రజాస్వామ్యంపై ఏ మాత్రం నమ్మకం లేదని, అడ్డదారుల్లో పయనిస్తున్నారని మండిపడ్డారు. కేంద్ర సంస్థలను రాజకీయాల కోసం వాడుకోవడం దారుణమని దుయ్యబట్టారు. కేసీఆర్ అడిగిన ఏ ఒక్క ప్రశ్నకూ మోదీ సమాధానం చెప్పలేదన్నారు. తెరాస, కేసీఆర్ ఉన్నంత వరకు దేశంలో ప్రజాస్వామ్యానికి ఢోకా లేదని ధీమా వ్యక్తంచేశారు. హైదరాబాద్లోని జలవిహార్లో యశ్వంత్కు మద్దతుగా సీఎం కేసీఆర్ అధ్యక్షతన తెరాస ప్రజాప్రతినిధుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా యశ్వంత్ మాట్లాడుతూ.. ‘‘తెలంగాణలో ప్రజాచైతన్యాన్ని ప్రత్యక్షంగా చూస్తున్నా. హైదరాబాద్లో పలికిన అద్భుత స్వాగతం నాకు గొప్ప అనుభూతిని ఇచ్చింది. చాలా రోజులుగా కేంద్ర విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నా. మోదీ పాలన ప్రజాస్వామ్యయుతంగా లేదు. చర్చలు, సంప్రదింపులు, ఉమ్మడి నిర్ణయాలుండవు. తనకు తోచిందే చేస్తారు. రాష్ట్రపతి ఎన్నికల విషయంలోనూ అలాగే వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం కేంద్రంలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. వాజ్పేయీ హయాంలో అయిదేళ్లు కేంద్రమంత్రిగా ఉన్నా. ఆ సమయంలో ఏ రోజూ ఐటీ, ఈడీ, ఇతర ప్రభుత్వరంగ సంస్థల అధిపతులను పిలిచి మాట్లాడలేదు. రాజకీయంగా దెబ్బతీసేందుకు ఒక వ్యక్తిపై దాడులకు ఉసిగొల్పలేదు. ఇప్పుడంతా అదే జరుగుతోంది. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కేంద్రాన్ని ఇలా ప్రశ్నించారో లేదో అలా నోటీసులిచ్చారు. ఐటీ, ఈడీ, సీబీఐ లాంటి సంస్థలను గతంలో ఎవరూ ఇంతలా దుర్వినియోగం చేయలేదు.
ఫోన్ చేస్తే స్పందన లేదు..
రాష్ట్రపతి అభ్యర్థిగా నామినేషన్ వేశాక ప్రధానమంత్రికి ఫోన్ చేశాను. తాను అందుబాటులో లేనని సిబ్బందితో చెప్పించారు. ఇప్పటి వరకు మళ్లీ ఫోన్ చేయలేదు. రాష్ట్రపతి అభ్యర్థికి కనీస గౌరవం ఇవ్వని వ్యక్తి ప్రధానిగా ఉండడం మన దౌర్భాగ్యం. అమెరికా అధ్యక్షుడు బడి పిల్లలనూ కలుస్తారు. వారి సమస్యలను అడిగి తెలుసుకుంటారు. మన ప్రధాని మాత్రం ఎనిమిదేళ్లలో ఒక్కసారి కూడా మీడియా సమావేశం నిర్వహించలేదు.
తెలంగాణ ప్రభుత్వం ప్రధాని మోదీకి ఎన్నో ప్రశ్నలు సంధించింది. కానీ, అందులో ఒక్క ప్రశ్నకు సైతం జవాబు రాలేదు. ఎందుకంటే మోదీ వద్ద సమాధానాలు లేవు. ఎవరైనా చర్చలకు రాకపోతే, స్పందించకపోతే సమస్యలు ఎలా పరిష్కారమవుతాయి. కేంద్రంపై పోరాటానికి కేసీఆర్ లాంటి నేతలు అవసరం. దేశంలోని పరిస్థితులు ఎలా ఉన్నాయో ఆయన కళ్లకు కట్టినట్లు చెప్పారు. ఈ ఎన్నికల తర్వాత సైతం మోదీ విధానాలపై దేశం మొత్తం పోరాటం కొనసాగిస్తాం. సీఎం కేసీఆర్తో మరోసారి భేటీ అయి మా పోరాటంపై చర్చిస్తాం. రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపికయ్యాక కేసీఆర్ మద్దతునిచ్చారు. కేటీఆర్ స్వయంగా దిల్లీకి రావడం నాకు స్థైర్యాన్ని ఇచ్చింది. అందరి ఆదరాభిమానాలకు కృతజ్ఞతలు’’ అని తెలిపారు.
కేసీఆర్ అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు..
తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకునేందుకు గళం విప్పిన వ్యక్తి కేసీఆర్. అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన ఘనత ఆయనదే. కొత్త రాష్ట్రమైనప్పటికీ తక్కువ కాలంలో గొప్పగా అభివృద్ధి చేశారు. ఇలాంటి విధానాలనే దేశవ్యాప్తంగా అనుసరిస్తే ప్రయోజనం ఉంటుంది. నోబెల్ గ్రహీత అమర్త్యసేన్ చెప్పినట్లుగా.. పోరాటం అనేది ఎప్పుడూ మన కోసం కాకుండా.. భావి తరాల కోసం, దేశం కోసం ఉండాలి. ఇప్పుడు మేం మొదలుపెట్టిన పోరాటం అలాంటిదే. రాష్ట్రపతిగా ఎన్నికైతే రాజ్యాంగం విలువలను కాపాడతాను.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వలకు చిక్కిన 30 కిలోల చేప
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని రాజరాజేశ్వర జలాశయంలో నీటి నిల్వ తగ్గడంతో మత్స్యకారుడి వలకు గురువారం భారీ చేప చిక్కింది. -
నిప్పుల గుండంలా తెలంగాణ.. ఆరు జిల్లాల్లో 45 డిగ్రీల కంటే ఎక్కువే..
రాష్ట్రం నిప్పుల గుండంలా మారింది. గురువారం రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం నుంచే ప్రారంభమైన వేడి మధ్యాహ్నానికి తీవ్రస్థాయికి చేరింది. -
ఈపీఎస్ ఆదాయం పెరుగుతున్నా.. కనీస పింఛను రూ.వెయ్యేనా?
ఉద్యోగుల పింఛను నిధి పథకం (ఈపీఎస్) ఆదాయం పెరుగుతున్నా.. లబ్ధిదారులు కనీస పింఛను పెంపునకు నోచుకోక ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు వృద్ధాప్య పింఛను కింద నెలకు రూ.2 వేలు ఇస్తుండగా.. ఈపీఎఫ్వో పింఛనుదారులు దాదాపు 75 శాతం మంది నెలకు రూ.వెయ్యితో జీవితాలను నెట్టుకువస్తుండడం పరిస్థితికి అద్దం పడుతోంది. -
ఏపీ సీఎస్, డీజీపీలపై.. ఈసీఐ నిర్ణయం కోసం చూస్తున్నాం
ఆంధ్రప్రదేశ్లోని సీనియర్ అధికారులపై అందిన ఫిర్యాదులపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) తీసుకునే నిర్ణయం కోసం వేచిచూస్తున్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా చెప్పారు. -
వైకాపాకు ప్రచారం చేసిన వెంకట్రామిరెడ్డిపై ఈసీ వేటు
వైకాపాతో అంటకాగుతూ.. ఆ పార్టీ కార్యకర్తలా వ్యవహరిస్తున్న రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఎట్టకేలకు వేటు పడింది. -
గులకరాయి కేసులో ఏ2 ఎవరు..?
సీఎం జగన్పై గులకరాయి విసిరిన కేసులో విజయవాడ పోలీసులు గురువారం అరెస్టు చూపించారు. అజిత్సింగ్నగర్ వడ్డెర కాలనీకి చెందిన సతీష్ అలియాస్ సత్తిని నిందితుడిగా తేల్చారు. -
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
పెద్దపులిని చూస్తే అడవిలో జంతువులు హడలిపోతాయి. ఒక్క ఎలుగుబంటి తప్ప. భల్లూకానికి కోపం వస్తే పెద్దపులిని సైతం పరుగులు పెట్టిస్తుంది. -
ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్రాజ్ తెలిపారు. -
ఆ 106 ఎకరాలు రక్షిత అటవీభూమే
భూపాలపల్లి జిల్లా కేంద్రం సమీపంలోని కొంపెల్లి గ్రామ పరిధిలోని సర్వే నం.171/3 నుంచి 171/7ల్లో ఉన్న రూ.వందల కోట్ల విలువైన 106.34 ఎకరాలు అటవీభూమేనని, అది ప్రైవేటు వ్యక్తులది కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
రూ.800 కోట్ల బియ్యం ఏమయ్యాయి?
రైస్మిల్లులకు వెళ్లిన ధాన్యం కస్టమ్ మిల్లింగ్(సీఎంఆర్) తర్వాత తిరిగిరావడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. అనేక వాయిదాలు ఇచ్చినప్పటికీ పలు జిల్లాల్లో మిల్లర్లు బియ్యం ఇవ్వలేకపోతున్నారు. -
జర్మనీలో ఘనంగా హిందూ నూతన సంవత్సర వేడుకలు
హిందూ నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని జర్మనీలోని మైంజ్-విస్బాడెన్లో భారత్ వాసి జర్మనీ అసోసియేషన్ ఘనంగా వేడుకలు నిర్వహించింది. -
ఎయిమ్స్లో హీమోడయాలసిస్ యూనిట్ ఏర్పాటు
యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీనగర్ ఎయిమ్స్లో హీమోడయాలసిస్ యూనిట్ను డైరెక్టర్ వికాస్ భాటియా గురువారం ప్రారంభించారు. -
ఇథనాల్ కంపెనీల అనుమతులు రద్దు చేయాలి
పంట పొలాలకు తీవ్ర నష్టం కలిగిస్తూ పర్యావరణ విధ్వంసానికి కారణమవుతున్న 28 ఇథనాల్ కంపెనీల అనుమతులను వెంటనే రద్దు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రొఫెసర్ హరగోపాల్ డిమాండ్ చేశారు. -
జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ 30కి వాయిదా
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అక్రమాస్తుల వ్యవహారంలో సీబీఐ నమోదు చేసిన 11 కేసులతోపాటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నమోదు చేసిన 9 కేసుల విచారణను హైదరాబాద్ సీబీఐ కోర్టు ఈ నెల 30వ తేదీకి వాయిదా వేసింది. -
ఓటేద్దాం.. పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేసుకుందాం
దేశంలోని పర్యాటక ప్రాంతాల్లో వివిధ సౌకర్యాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం ‘దేఖో అప్నాదేశ్ పీపుల్ ఛాయిస్’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. -
మంచి పుస్తకం మనో వికాసం
తెలుగు బాల సాహిత్య ప్రచురణలో ‘మంచి పుస్తకం’ది ఒక ప్రత్యేక ఒరవడి. డిజిటల్ యుగంలోనూ ఆ సంస్థది చెరగని సంతకం. -
శ్రీవారి ఆలయంలో ఘనంగా శ్రీరామపట్టాభిషేకం
శ్రీవారి ఆలయంలో గురువారం రాత్రి శ్రీరామపట్టాభిషేకం ఘనంగా జరిగింది. సాయంత్రం 4నుంచి శ్రీ సీతారామలక్ష్మణ ఆంజనేయ స్వామివారి ఉత్సవమూర్తులకు విశేష సమర్పణ.. సహస్ర దీపాలంకారణ సేవ చేశారు. -
కనుమరుగవుతున్నా.. కనిపిస్తూనే ఉండాలని..!
డీజిల్ రైలు ఇంజిన్లు కనుమరుగవుతున్న నేపథ్యంలో.. ఎప్పటికీ అందరికీ గుర్తుండిపోయేలా కాజీపేట డీజిల్ లోకోషెడ్ కార్మికులు ఓ వారసత్వపు డీజిల్ రైలు ఇంజిన్ను రూపొందించారు. -
మావోయిస్టుల ఏరివేతలో సింగం
ఏ పోలీసుకైనా తన సర్వీసులో ఒకసారి రాష్ట్రపతి శౌర్య పురస్కారం అందుకోవడమే గొప్ప. అలాంటిది 17 ఏళ్ల తన సర్వీసులో ఆయన ఏకంగా ఆరుసార్లు ఆ పురస్కారాన్ని అందుకున్నారు. -
ముగిసిన సిరిపెల్లి ప్రస్థానం..
జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన మావోయిస్టు నేత సిరిపెల్లి శంకర్రావు అలియాస్ సుధాకర్ అలియాస్ మురళి, ఆయన భార్య దాశేశ్వర్ అలియాస్ సుమన అలియాస్ రంజితల విప్లవ ప్రస్థానం ముగిసింది. -
ఆసుపత్రికి మంత్రి కోమటిరెడ్డి 32 ఏసీల వితరణ
నల్గొండ జిల్లా ఆసుపత్రిలోని మాతాశిశు ఆరోగ్య కేంద్రం(ఎంసీహెచ్)లో 32 ఏసీలు ఏర్పాటు చేయించి మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఉదారత చాటుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
స్కూల్లో ఫేషియల్ చేయించుకున్న ప్రిన్సిపల్.. వీడియో తీసిన ఉపాధ్యాయురాలిపై దాడి
-
‘సివిల్స్’ టాపర్లకు వచ్చిన మార్కులెన్నో తెలుసా?
-
పురందేశ్వరి సహా రెండో రోజు ప్రముఖుల నామినేషన్లు
-
యూపీఎస్సీ మిస్సయిన వారికి డిట్టో ఇన్సూరెన్స్ జాబ్ ఆఫర్
-
తెలంగాణలో నామినేషన్ల సందడి.. ర్యాలీలతో హోరెత్తించిన అభ్యర్థులు
-
జగన్ ప్రభుత్వం.. శిలాఫలకాల ప్రభుత్వం: వైఎస్ షర్మిల