ఆగస్టు 7న ఎస్సై, 21న కానిస్టేబుల్ పరీక్షలు
పోలీస్ పరీక్షలకు రంగం సిద్ధమైంది. వచ్చే నెల 7వ తేదీన ఎస్సై, 21న కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి ప్రాథమిక రాతపరీక్ష నిర్వహించనున్నారు. తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్ నియామక మండలి ఛైర్మన్ వి.వి.శ్రీనివాసరావు సోమవారం విడుదల చేసిన
ఎస్సై ఉద్యోగాలకు 2.45 లక్షల మంది అభ్యర్థులు
కానిస్టేబుల్ కొలువులకు 6.50 లక్షల మంది పోటీ
ఈనాడు - హైదరాబాద్
పోలీస్ పరీక్షలకు రంగం సిద్ధమైంది. వచ్చే నెల 7వ తేదీన ఎస్సై, 21న కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి ప్రాథమిక రాతపరీక్ష నిర్వహించనున్నారు. తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్ నియామక మండలి ఛైర్మన్ వి.వి.శ్రీనివాసరావు సోమవారం విడుదల చేసిన ప్రకటనలో ఈ వివరాలు వెల్లడించారు. రెండు పరీక్షలూ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ జరుగుతాయి. ఎస్సై ఉద్యోగాలకు సుమారు 2,45,000 మంది, కానిస్టేబుల్ ఉద్యోగాలకు సుమారు 6,50,000 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. ఎస్సై పరీక్షను హైదరాబాద్ పరిసర ప్రాంతాలతో పాటు రాష్ట్రవ్యాప్తంగా 20 కేంద్రాల్లో, కానిస్టేబుల్ పరీక్షను హైదరాబాద్ పరిసర ప్రాంతాలతో పాటు రాష్ట్రవ్యాప్తంగా 40 కేంద్రాల్లో నిర్వహించనున్నారు.
ఈ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి తుది పరీక్ష, అనంతరం దేహదారుఢ్య పరీక్ష నిర్వహిస్తారు. ఒకేసారి లక్షల మంది అభ్యర్థులు పాల్గొననుండటంతో పరీక్షలకు భారీస్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే పరీక్ష కేంద్రాలను గుర్తించారు. అభ్యర్థులకు సమీపంలోని కేంద్రాలనే కేటాయించేందుకు ప్రయత్నిస్తున్నారు.
సన్నద్ధమవుతున్న అభ్యర్థులు
గత ఏప్రిల్ 25వ తేదీన పోలీస్ నియామకాలకు ప్రకటన వెలువడినప్పటి నుంచీ రాష్ట్రవ్యాప్తంగా లక్షల మంది అభ్యర్థులు పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు. మరే ప్రభుత్వ శాఖలో లేనివిధంగా పోలీస్ శాఖలో ఏకంగా 17 వేలకు పైగా పోస్టులను భర్తీ చేస్తుండటంతో ఎక్కువ మంది వీటికే పోటీ పడుతున్నారు. మిగతా ప్రభుత్వ ఉద్యోగాలతో పోల్చుకుంటే పోలీస్ నియామకాలు భిన్నంగా ఉంటాయి. ఇందులో రాత పరీక్షలతో పాటు దేహదారుఢ్య పరీక్షల్లోనూ ఉత్తీర్ణులు కావాల్సి ఉంటుంది. గతంలో అభ్యర్థులను వడపోసే ఉద్దేశంతో తొలుత 5 కిలోమీటర్ల పరుగుపందెం నిర్వహించేవారు. అందులో దాదాపు సగం మంది అభ్యర్థులే తదుపరి పరీక్షలకు అర్హత సాధించేవారు. ఇప్పుడు దేహదారుఢ్య పరీక్షలను చివర్లో నిర్వహిస్తున్నారు. తొలుత నిర్వహించనున్న రాతపరీక్షలకు హైదరాబాద్తో పాటు వరంగల్, కరీంనగర్, ఖమ్మం వంటి చోట్ల ఏర్పాటు చేసిన ప్రైవేట్ శిక్షణ కేంద్రాలు అభ్యర్థులతో కిటకిటలాడుతున్నాయి. ప్రాథమిక రాతపరీక్షల తేదీలు వెలువడటంతో అభ్యర్థుల్లో ఉత్సాహం రెట్టింపైంది.
హాల్టికెట్ల డౌన్లోడ్
ఎస్సై అభ్యర్థులు జులై 30 నుంచి, కానిస్టేబుల్ అభ్యర్థులు ఆగస్టు 10వ తేదీ నుంచి నియామక మండలి వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు.
ప్రాథమిక రాత పరీక్షలకు సిలబస్ ఇదే..
కానిస్టేబుల్ పోస్టులు (సివిల్, ఏఆర్, ఎస్ఏఆర్ సీపీఎల్, టీఎస్ఎస్పీ, స్పెషల్ పోలీస్, అగ్నిమాపక, వార్డర్ స్త్రీ, పురుషులు)
ఈ పరీక్షకు సిలబస్ ఇంటర్మీడియట్ స్థాయిలో ఉంటుంది. 200 ప్రశ్నలుంటాయి. ఆంగ్లం, అరిథ్మెటిక్, జనరల్ సైన్స్, భారతదేశ చరిత్ర- సంస్కృతి- జాతీయ ఉద్యమం, భారతదేశ భౌగోళిక స్వరూపం, పాలిటీ, ఎకానమీ, జాతీయ, అంతర్జాతీయ సమకాలీన అంశాలు, రీజనింగ్/మెంటల్ ఎబిలిటీ, తెలంగాణ రాష్ట్ర అంశాలపై ప్రశ్నలు అడుగుతారు.
ఆబ్కారీ, రవాణా శాఖల కానిస్టేబుల్ సిలబస్..
200 మార్కులకు ప్రశ్నలుంటాయి. ఆంగ్లం, అరిథ్మెటిక్, జనరల్ సైన్స్, భారతదేశ చరిత్ర, భారత జాతీయోద్యమం, ప్రిన్సిపల్స్ ఆఫ్ జాగ్రఫీ, భారతదేశ జాగ్రఫీ, రాజకీయ, అర్థశాస్త్రం, జాతీయ, అంతర్జాతీయ వర్తమాన అంశాలు, టెస్ట్ఆఫ్రీజనింగ్ లేదా మెంటల్ ఎబిలిటీ, రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై ప్రశ్నలు అడుగుతారు.
ఎస్సై (సివిల్, ఏఆర్, ఎస్ఏఆర్ సీపీఎల్, టీఎస్ఎస్పీ, ఎస్పీఎఫ్, అగ్నిమాపక, డిప్యూటీ జైలర్) రాతపరీక్షల సిలబస్ ఇలా...
ఎస్సై ఉద్యోగాలకు ప్రాథమిక పరీక్షలో 200 మార్కులకు 200 ప్రశ్నలుంటాయి. అరిథ్మెటిక్/మెంటల్ ఎబిలిటీపై 100 ప్రశ్నలు, జనరల్ స్టడీస్పై 100 ప్రశ్నలుంటాయి. జనరల్ స్టడీస్లో జనరల్ సైన్స్, జాతీయ, అంతర్జాతీయ సమకాలీన అంశాలు, దేశ చరిత్ర, జాతీయ ఉద్యమం, సామాజిక, ఆర్థిక సాంస్కృతిక, రాజకీయ అంశాలు, దేశ భౌగోళిక స్వరూపం, జాతీయ ఆర్థిక, రాజకీయ వ్యవస్థ, గ్రామీణాభివృద్ధి, ప్రణాళిక- ఆర్థిక సంస్కరణలు, తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఏర్పాటు అంశాలపై ప్రశ్నలు వస్తాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వలకు చిక్కిన 30 కిలోల చేప
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని రాజరాజేశ్వర జలాశయంలో నీటి నిల్వ తగ్గడంతో మత్స్యకారుడి వలకు గురువారం భారీ చేప చిక్కింది. -
నిప్పుల గుండంలా తెలంగాణ.. ఆరు జిల్లాల్లో 45 డిగ్రీల కంటే ఎక్కువే..
రాష్ట్రం నిప్పుల గుండంలా మారింది. గురువారం రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం నుంచే ప్రారంభమైన వేడి మధ్యాహ్నానికి తీవ్రస్థాయికి చేరింది. -
ఈపీఎస్ ఆదాయం పెరుగుతున్నా.. కనీస పింఛను రూ.వెయ్యేనా?
ఉద్యోగుల పింఛను నిధి పథకం (ఈపీఎస్) ఆదాయం పెరుగుతున్నా.. లబ్ధిదారులు కనీస పింఛను పెంపునకు నోచుకోక ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు వృద్ధాప్య పింఛను కింద నెలకు రూ.2 వేలు ఇస్తుండగా.. ఈపీఎఫ్వో పింఛనుదారులు దాదాపు 75 శాతం మంది నెలకు రూ.వెయ్యితో జీవితాలను నెట్టుకువస్తుండడం పరిస్థితికి అద్దం పడుతోంది. -
ఏపీ సీఎస్, డీజీపీలపై.. ఈసీఐ నిర్ణయం కోసం చూస్తున్నాం
ఆంధ్రప్రదేశ్లోని సీనియర్ అధికారులపై అందిన ఫిర్యాదులపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) తీసుకునే నిర్ణయం కోసం వేచిచూస్తున్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా చెప్పారు. -
వైకాపాకు ప్రచారం చేసిన వెంకట్రామిరెడ్డిపై ఈసీ వేటు
వైకాపాతో అంటకాగుతూ.. ఆ పార్టీ కార్యకర్తలా వ్యవహరిస్తున్న రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఎట్టకేలకు వేటు పడింది. -
గులకరాయి కేసులో ఏ2 ఎవరు..?
సీఎం జగన్పై గులకరాయి విసిరిన కేసులో విజయవాడ పోలీసులు గురువారం అరెస్టు చూపించారు. అజిత్సింగ్నగర్ వడ్డెర కాలనీకి చెందిన సతీష్ అలియాస్ సత్తిని నిందితుడిగా తేల్చారు. -
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
పెద్దపులిని చూస్తే అడవిలో జంతువులు హడలిపోతాయి. ఒక్క ఎలుగుబంటి తప్ప. భల్లూకానికి కోపం వస్తే పెద్దపులిని సైతం పరుగులు పెట్టిస్తుంది. -
ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్రాజ్ తెలిపారు. -
ఆ 106 ఎకరాలు రక్షిత అటవీభూమే
భూపాలపల్లి జిల్లా కేంద్రం సమీపంలోని కొంపెల్లి గ్రామ పరిధిలోని సర్వే నం.171/3 నుంచి 171/7ల్లో ఉన్న రూ.వందల కోట్ల విలువైన 106.34 ఎకరాలు అటవీభూమేనని, అది ప్రైవేటు వ్యక్తులది కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
రూ.800 కోట్ల బియ్యం ఏమయ్యాయి?
రైస్మిల్లులకు వెళ్లిన ధాన్యం కస్టమ్ మిల్లింగ్(సీఎంఆర్) తర్వాత తిరిగిరావడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. అనేక వాయిదాలు ఇచ్చినప్పటికీ పలు జిల్లాల్లో మిల్లర్లు బియ్యం ఇవ్వలేకపోతున్నారు. -
జర్మనీలో ఘనంగా హిందూ నూతన సంవత్సర వేడుకలు
హిందూ నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని జర్మనీలోని మైంజ్-విస్బాడెన్లో భారత్ వాసి జర్మనీ అసోసియేషన్ ఘనంగా వేడుకలు నిర్వహించింది. -
ఎయిమ్స్లో హీమోడయాలసిస్ యూనిట్ ఏర్పాటు
యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీనగర్ ఎయిమ్స్లో హీమోడయాలసిస్ యూనిట్ను డైరెక్టర్ వికాస్ భాటియా గురువారం ప్రారంభించారు. -
ఇథనాల్ కంపెనీల అనుమతులు రద్దు చేయాలి
పంట పొలాలకు తీవ్ర నష్టం కలిగిస్తూ పర్యావరణ విధ్వంసానికి కారణమవుతున్న 28 ఇథనాల్ కంపెనీల అనుమతులను వెంటనే రద్దు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రొఫెసర్ హరగోపాల్ డిమాండ్ చేశారు. -
జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ 30కి వాయిదా
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అక్రమాస్తుల వ్యవహారంలో సీబీఐ నమోదు చేసిన 11 కేసులతోపాటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నమోదు చేసిన 9 కేసుల విచారణను హైదరాబాద్ సీబీఐ కోర్టు ఈ నెల 30వ తేదీకి వాయిదా వేసింది. -
ఓటేద్దాం.. పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేసుకుందాం
దేశంలోని పర్యాటక ప్రాంతాల్లో వివిధ సౌకర్యాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం ‘దేఖో అప్నాదేశ్ పీపుల్ ఛాయిస్’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. -
మంచి పుస్తకం మనో వికాసం
తెలుగు బాల సాహిత్య ప్రచురణలో ‘మంచి పుస్తకం’ది ఒక ప్రత్యేక ఒరవడి. డిజిటల్ యుగంలోనూ ఆ సంస్థది చెరగని సంతకం. -
శ్రీవారి ఆలయంలో ఘనంగా శ్రీరామపట్టాభిషేకం
శ్రీవారి ఆలయంలో గురువారం రాత్రి శ్రీరామపట్టాభిషేకం ఘనంగా జరిగింది. సాయంత్రం 4నుంచి శ్రీ సీతారామలక్ష్మణ ఆంజనేయ స్వామివారి ఉత్సవమూర్తులకు విశేష సమర్పణ.. సహస్ర దీపాలంకారణ సేవ చేశారు. -
కనుమరుగవుతున్నా.. కనిపిస్తూనే ఉండాలని..!
డీజిల్ రైలు ఇంజిన్లు కనుమరుగవుతున్న నేపథ్యంలో.. ఎప్పటికీ అందరికీ గుర్తుండిపోయేలా కాజీపేట డీజిల్ లోకోషెడ్ కార్మికులు ఓ వారసత్వపు డీజిల్ రైలు ఇంజిన్ను రూపొందించారు. -
మావోయిస్టుల ఏరివేతలో సింగం
ఏ పోలీసుకైనా తన సర్వీసులో ఒకసారి రాష్ట్రపతి శౌర్య పురస్కారం అందుకోవడమే గొప్ప. అలాంటిది 17 ఏళ్ల తన సర్వీసులో ఆయన ఏకంగా ఆరుసార్లు ఆ పురస్కారాన్ని అందుకున్నారు. -
ముగిసిన సిరిపెల్లి ప్రస్థానం..
జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన మావోయిస్టు నేత సిరిపెల్లి శంకర్రావు అలియాస్ సుధాకర్ అలియాస్ మురళి, ఆయన భార్య దాశేశ్వర్ అలియాస్ సుమన అలియాస్ రంజితల విప్లవ ప్రస్థానం ముగిసింది. -
ఆసుపత్రికి మంత్రి కోమటిరెడ్డి 32 ఏసీల వితరణ
నల్గొండ జిల్లా ఆసుపత్రిలోని మాతాశిశు ఆరోగ్య కేంద్రం(ఎంసీహెచ్)లో 32 ఏసీలు ఏర్పాటు చేయించి మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఉదారత చాటుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
డ్రోన్లను కూల్చేశామన్న ఇరాన్.. ‘నో కామెంట్స్’ అంటున్న ఇజ్రాయెల్
-
ఇక్కడ ప్రభాస్, విష్ణు.. అక్కడ రజనీకాంత్, కమల్ హాసన్: వీరి చిత్రాల స్పెషల్ ఏంటంటే?
-
కొనసాగుతోన్న తొలివిడత పోలింగ్.. ఓటేసిన ప్రముఖులు
-
వినూత్న ‘సైకిల్’ ప్రచారం.. ఓటర్లను ఆకట్టుకునే యత్నం!
-
ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల ఎఫెక్ట్.. భారీ నష్టాల్లో మార్కెట్ సూచీలు
-
అంపైర్గా పని చేసి.. ఐపీఎల్లో అదరగొట్టి... నయా సంచలనం అశుతోష్ కథ ఇది!