మందుల ధరలకు కళ్లెం..
మధుమేహం, అధిక రక్తపోటు.. 40 ఏళ్లు దాటాక సుమారు 60 శాతం మందిలో ఈ రెండింటిలో ఒకటైనా కనిపిస్తోంది. ఒక్కసారి వీటి బారిన పడితే జీవితాంతం మందులు వాడాలి. వీటి ఖర్చు మధ్యతరగతి ప్రజలకు భారమే. దీన్ని దృష్టిలో ఉంచుకొని జాతీయ ఔషధ
30-40 శాతం వరకు తగ్గింపు
84 రకాల అత్యవసర ఔషధ ధరల స్థిరీకరణ
ఎన్పీపీఏ తాజా ఉత్తర్వులు
ఈనాడు, హైదరాబాద్: మధుమేహం, అధిక రక్తపోటు.. 40 ఏళ్లు దాటాక సుమారు 60 శాతం మందిలో ఈ రెండింటిలో ఒకటైనా కనిపిస్తోంది. ఒక్కసారి వీటి బారిన పడితే జీవితాంతం మందులు వాడాలి. వీటి ఖర్చు మధ్యతరగతి ప్రజలకు భారమే. దీన్ని దృష్టిలో ఉంచుకొని జాతీయ ఔషధ ధరల నియంత్రణ సంస్థ (ఎన్పీపీఏ) మందుల ధరలను సవరిస్తూ.. మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ జాబితాలో రక్తపోటు, మధుమేహం, జీర్ణాశయ సమస్యలు, కొలెస్ట్రాల్, గుండెపోటు, పక్షవాతం, నొప్పి నివారణలకు వాడే అతి ముఖ్యమైన ఔషధాలున్నాయి. ఫలితంగా వినియోగదారులపై 30-40 శాతం మేర భారం తగ్గనుంది. సవరించిన ధరల మేరకే ఆయా మందులను అమ్మాలని ఉత్పత్తి సంస్థలను ఎన్పీపీఏ ఆదేశించింది. ఇవే ఔషధాలను వేర్వేరు ఫార్ములాలతో కొత్తగా విపణిలోకి తేవాలనుకుంటే.. ప్రభుత్వ అనుమతి పొందాలని స్పష్టం చేసింది. దీంతో కొత్త ఔషధం పేరిట మందులను ఇష్టానుసారంగా విక్రయించకుండా అడ్డుకట్ట వేసినట్లయ్యింది. ఎక్కువగా సమ్మిళిత ఔషధాల (కాంబినేషన్ డ్రగ్స్) ధరలకు ముకుతాడు వేసింది.
ధరల పట్టికను ప్రదర్శించాలి
ఔషధ ఉత్పత్తి సంస్థలు నిర్ణీత ధరలను కచ్చితంగా పాటించాలని, లేకుంటే వడ్డీతో పాటు అధిక మొత్తంలో జరిమానా చెల్లించాల్సి ఉంటుందని ఎన్పీపీఏ నోటిఫికేషన్లో పేర్కొంది. ‘ఇంటిగ్రేటెడ్ ఫార్మాస్యూటికల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ (ఐపీడీఎంఎస్)’ ద్వారా ధరల జాబితాను సమర్పించాలని ఔషధ తయారీదారులను కోరింది. ప్రతి రిటైలర్, డీలర్ ఔషధ ధరల జాబితాను, అనుబంధ ధరల జాబితాను వ్యాపార ప్రాంగణంలో స్పష్టమైన భాగంలో ప్రదర్శించాలి. మరో ప్రత్యేక ప్రకటనలో లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ అండ్ ఆక్సిజన్ ఇన్హేలేషన్ (ఔషధ వాయువు) సవరించిన సీలింగ్ ధరను ఈ ఏడాది సెప్టెంబరు 30 వరకూ పొడిగించినట్లు ఎన్పీపీఏ తెలిపింది.
ధరలు సవరించిన మందుల్లో కొన్ని..
* సిప్లా, ప్యూర్ అండ్ కేర్ హెల్త్కేర్ తదితర సంస్థలు విక్రయిస్తున్న అటోర్వాస్టాటిన్, ఫెనోఫైబ్రేట్ మాత్ర ధర ఒక్కోటి రూ.13.87గా నిర్ణయించింది. ఈ మందులను గుండె, మధుమేహ రోగులు వినియోస్తారు.
* అకుమ్స్ డ్రగ్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్, జర్మన్ రెమెడీస్ ఫార్మాస్యూటికల్స్ విక్రయిస్తున్న ‘ఒల్మెసార్టన్ ప్లస్ మెడోక్సోమిల్ ప్లస్ అమ్లోడిపైన్ ప్లస్ హైడ్రోక్లోరోథియాజైడ్’.. ఔషధాన్ని గుండె, రక్తపోటు వ్యాధులకు ఉపయోగిస్తారు. దీని చిల్లర ధరను ఒక్కో మాత్రకు రూ.12.91గా స్థిరీకరించింది.
* వొగ్లిబోస్ అండ్ (ఎస్ఆర్) మెట్ఫార్మిన్ హైడ్రోక్లోరైడ్ ఒక్కో మాత్ర ధరను రూ.10.47గా నిర్ణయించింది.
* పారాసిటమాల్, కెఫిన్ల ధరను ఒక్కో మాత్రకు రూ.2.88గా నిర్ణయించింది.
* రోసువాస్టాటిన్ ఆస్పిరిన్, క్లోపిడోగ్రెల్ క్యాప్సూల్ ధరను ఒక్కో దానికి రూ.13.91గా స్థిరీకరించింది.
* నొప్పి నివారణకు ఉపయోగించే పారాసిటమాల్, ఐబూప్రొఫెన్ సస్పెన్షన్ ధరను ఒక్కో మిల్లీలీటరు(ఎంఎల్)కు రూ.0.33గా నిర్ణయించింది.
* శ్వాసకోశ, ఇతర ఇన్ఫెక్షన్లకు యాంటీబయాటిక్స్గా వినియోగించే ‘అమోక్సిసిలిన్ అండ్ పొటాషియం క్లావులనేట్ ఐపీ’ ఒక్కో మాత్ర ధర రూ.34.03గా పేర్కొంది. ఇదే కాంబినేషన్లో ఓరల్ సస్పెన్షన్కు ఒక్కో ఎంఎల్కు రూ.3.90గా ధరను స్థిరీకరించింది.
* రక్తహీనతను తగ్గించడానికి వినియోగించే ఫెర్రస్ అస్కార్బేట్ అండ్ ఫోలిక్ యాసిడ్ ఓరల్ డ్రాప్స్ గరిష్ఠ చిల్లర ధరను ఒక్కో ఎంఎల్కు రూ.5.06గా నిర్ణయించింది.
* నొప్పి, వాపులు తగ్గించడానికి వినియోగించే అసెక్లోఫినాక్ అండ్ పారాసిటమాల్, ట్రిప్సిన్, క్రైమోట్రిప్సిన్ కాంబినేషన్లో వచ్చిన మందు ఒక్కో మాత్ర ధర రూ.13.85గా స్థిరీకరించింది.
* క్లోపిడొగ్రెల్ అండ్ ఆస్పిరిన్ మాత్రలను గుండెజబ్బులు, మధుమేహ రోగులు వినియోగిస్తారు. ఈ మాత్ర ధర ఒక్కో దానికి రూ.4.34గా నిర్ణయించింది.
* కాల్షియం కార్బోనేట్, కాల్షిట్రోల్ అండ్ జింక్ క్యాప్స్యూల్ను ఎముకల బలానికి వినియోగిస్తుంటారు. ఒక్కో క్యాప్స్యూల్ ధరను రూ.14.07గా నిర్ణయించింది.
* సెఫ్ట్రైయాక్సిన్ అండ్ టాజోబాక్టమ్ ఇంజక్షన్ను శస్త్రచికిత్సల అనంతరం, ఇన్ఫెక్షన్ తీవ్రంగా ఉన్నప్పుడు వినియోగిస్తారు. దీని ధర ఒక్కో ఇంజక్షన్కు రూ.168.43గా నిర్ణయించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పతి దేవుడికి గుడి కట్టింది!
కరోనా మహమ్మారి ఆమె జీవితంలో అంతులేని విషాదాన్ని నింపింది. కళ్లల్లో పెట్టుకుని చూసుకునే భర్తను తన నుంచి దూరం చేసింది. మూడేళ్ల క్రితం భర్త కొవిడ్తో మృతి చెందడంతో ఆమె ఒంటరిగా మారారు. -
కొత్తవారొచ్చారు
ఆంధ్రప్రదేశ్ నిఘా విభాగాధిపతిగా సీనియర్ ఐపీఎస్ అధికారి కుమార్ విశ్వజిత్ను, విజయవాడ నగర పోలీసు కమిషనర్గా పీహెచ్డీ రామకృష్ణను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. -
జేఈఈ మెయిన్స్లో తెలుగోళ్ల సత్తా
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. దేశవ్యాప్తంగా 56 మందికి 100 పర్సంటైల్ రాగా.. ఇందులో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందినవారే 22 మంది ఉన్నారు. జేఈఈ మెయిన్స్ తుది ఫలితాలను జాతీయ పరీక్షల విభాగం (ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసింది. -
కాళేశ్వరంపై కమిషన్ విచారణ షురూ
కాళేశ్వరం ఎత్తిపోతల్లోని బ్యారేజీలపై న్యాయ విచారణకు ఏర్పాటు చేసిన కమిషన్ కార్యాచరణ మొదలుపెట్టింది. బుధవారం కమిషన్ ఛైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ ఆయన సతీమణి దేబ్జానీ ఘోష్తో కలిసి హైదరాబాద్కు చేరుకున్నారు. -
ఫస్టియర్లో 60.01%.. సెకండియర్లో 64.19%
ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో 60.01 శాతం, రెండో సంవత్సరంలో 64.19 శాతం మంది విద్యార్థులు (ఒకేషనల్ కోర్సులతో కలిపి) ఉత్తీర్ణత సాధించారు. -
కవిత బెయిల్పై మే 6న తీర్పు
ఈడీ కేసులో బెయిల్ కోసం భారాస ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్పై తీర్పును ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు మే 6కి వాయిదా వేసింది. -
చదువుల ‘సిరి’.. రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని పట్టుదల
వారానికి రెండుసార్లు డయాలసిస్.. ఒంట్లో సత్తువ లేక కళాశాలకూ వెళ్లలేని పరిస్థితి.. అయినా మొక్కవోని పట్టుదలతో చదివిన పేదింటి బిడ్డ ప్రతిభ చాటింది. -
విజన్-2026కు డోర్నకల్ ఉపాధ్యాయుల శ్రీకారం
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు విజన్-2026 పేరిట ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. -
ఇంటర్ ఫలితాల్లో కవలల ప్రతిభ
సూర్యాపేట జిల్లా ఆత్మకూర్(ఎస్) మండల కేంద్రానికి చెందిన డేగల వీరభద్రయ్య, మంజుల దంపతుల కవల పిల్లలు డేగల రామ్, లక్ష్మణ్ ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో ప్రతిభ చూపారు. -
రాష్ట్రంలో వంతెనల పరిశీలన..!
రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న చిన్నా, పెద్ద వంతెనలను పరిశీలించేందుకు అధికారులు ఆయత్తం అవుతున్నారు. జిల్లాల వారీగా నిర్మాణ స్థితిగతులపై జాబితాలను రూపొందించే పనిలో ఉన్నారు. -
యాదాద్రి విద్యుత్కేంద్రానికి పర్యావరణ అనుమతి
యాదాద్రి థర్మల్ విద్యుత్కేంద్రానికి పర్యావరణ అనుమతి (ఈసీ) ఇవ్వడానికి కేంద్ర పర్యావరణ శాఖ ఆమోదం తెలిపింది. -
మెట్రో రైలు శబ్దకాలుష్యంపై వివరణివ్వండి
మెట్రో రైల్వే లైను వంపుల్లో రైలు వెళ్లినపుడు పరిమితికి మించి వస్తున్న శబ్దకాలుష్యంపై వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వానికి, మెట్రో రైల్వే ఎండీకి బుధవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
ఆర్జేసీ, మోడల్, కేజీబీవీ విద్యార్థుల ప్రతిభ
టీఎస్ఆర్జేసీ నేరెళ్ల గురుకుల విద్యార్థిని ఎంపీసీలో 991 మార్కులు, బైపీసీలో తాటిపల్లి విద్యార్థిని 990 మార్కులు సాధించినట్లు యాజమాన్యం తెలిపింది. -
ఫోన్ ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావుకు మధ్యంతర బెయిలు నిరాకరణ
ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టయిన టాస్క్ఫోర్స్ మాజీ ఓఎస్డీ రాధాకిషన్రావుకు ఎల్ఎల్ఎం పరీక్షలు రాసేందుకు వీలుగా మధ్యంతర బెయిలు ఇచ్చేందుకు నాంపల్లి కోర్టు నిరాకరించింది. -
పోలింగ్ రోజు వేతనంతో కూడిన సెలవు
లోక్సభ ఎన్నికల పోలింగ్ జరిగే రోజును వేతనంతో కూడిన సెలవుగా ప్రకటించారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్రాజ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
జస్టిస్ రామలింగేశ్వరరావుకు హైకోర్టు ఘన నివాళి
గుండెపోటుతో ఇటీవల మృతి చెందిన ఉమ్మడి హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎ.రామలింగేశ్వరరావుకు బుధవారం హైకోర్టు ఘన నివాళి అర్పించింది. -
శనగ విత్తనోత్పత్తి రైతుల ఆందోళన
‘పంట విక్రయించి నెల రోజులవుతోంది. డబ్బులు ఎప్పుడు ఇస్తారో.. క్వింటాకు ఎంత కట్టిస్తారో ఇప్పటికీ తెలియదు. -
విచారణ నుంచి తప్పుకొన్న జస్టిస్ శేషసాయి ధర్మాసనం
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసుపై మాట్లాడొద్దంటూ కడప జిల్లా కోర్టు(పీడీజే) ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ వివేకా కుమార్తె నర్రెడ్డి సునీత, పులివెందుల తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.రవీంద్రనాథ్రెడ్డి అలియాస్ బీటెక్ రవి దాఖలు చేసిన వ్యాజ్యాల విచారణ నుంచి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏవీ శేషసాయి నేతృత్వంలోని ధర్మాసనం తప్పుకొంది. -
ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఇంటర్ ప్రవేశాలు
రాష్ట్రంలోని ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో ప్రవేశాల పేరిట డొనేషన్లు, అధిక రుసుముల వసూళ్లు, ఇతరత్రా అక్రమాలను నిరోధించేందుకు వీలుగా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఆన్లైన్ ప్రవేశాల విధానాన్ని ప్రవేశపెట్టాలని యోచిస్తున్నామని విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. -
మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ
ష్ట్రంలో మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. షెడ్యూలును విద్యాశాఖ బుధవారం విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు (4)
రాష్ట్రంలో వచ్చే నెల 6వ తేదీన జరగనున్న తెలంగాణ రాష్ట్ర ఇంజినీరింగు కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (టీఎస్ఈసెట్)ను మే చివరి వారానికి వాయిదా వేయాలని పలువురు అభ్యర్థులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని కోరారు.
తాజా వార్తలు (Latest News)
-
‘రాంచీలో ఉన్నా.. రూ.600 కావాలి’.. ధోనీ పేరుతో మెసేజ్ వైరల్
-
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ
-
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్
-
అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్ కీలక ప్రతిపాదన!
-
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM