అత్యున్నత ప్రమాణాలతో సివిల్స్ స్టడీ సర్కిళ్లు
ఐఏఎస్, ఐపీఎస్ వంటి సివిల్ సర్వీసెస్, రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే గ్రూప్-1 పరీక్షలకు శిక్షణనిచ్చేందుకు తెలంగాణలో నాలుగు రాష్ట్రస్థాయి స్టడీ సర్కిళ్ల (ఆల్ ఇండియా సర్వీసెస్ స్టడీ సర్కిల్ ఆఫ్ తెలంగాణ స్టేట్)ను అత్యుత్తమ నాణ్యత ప్రమాణాలతో ఏర్పాటు
రాష్ట్రస్థాయిలో 4, జిల్లాస్థాయిలో 132
ప్రతి జిల్లాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు ఒక్కొక్కటి
సమీక్షలో సీఎం వెల్లడి
ఈనాడు, హైదరాబాద్: ఐఏఎస్, ఐపీఎస్ వంటి సివిల్ సర్వీసెస్, రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే గ్రూప్-1 పరీక్షలకు శిక్షణనిచ్చేందుకు తెలంగాణలో నాలుగు రాష్ట్రస్థాయి స్టడీ సర్కిళ్ల (ఆల్ ఇండియా సర్వీసెస్ స్టడీ సర్కిల్ ఆఫ్ తెలంగాణ స్టేట్)ను అత్యుత్తమ నాణ్యత ప్రమాణాలతో ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. రాష్ట్రం నుంచి ఏటా 50కి తగ్గకుండా అఖిలభారత సర్వీసు అధికారులను తయారు చేయాలన్నారు. ఇవి కాక ప్రతి జిల్లాలోనూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కేటగిరీలకు ఒక్కొక్కటి చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 132 స్టడీ సర్కిళ్లను ఏర్పాటు చేయాలని చెప్పారు. మంగళవారం ఆయన ప్రగతిభవన్లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, సత్యవతి రాథోడ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్, ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. సీఎం మాట్లాడుతూ.. 33 జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున మహాత్మా జ్యోతిబా ఫులే బీసీ గురుకుల విద్యాలయాలు, జిల్లాకో మహిళా డిగ్రీ కళాశాల చొప్పున 33 బీసీ గురుకుల డిగ్రీ కళాశాలలను స్థాపించాలని ఆదేశించారు. అన్ని గురుకుల పాఠశాలలు, కస్తూర్బా గాంధీ విద్యాలయాల్లో ఇంటర్మీడియెట్ను ప్రవేశపెట్టాలని సూచించారు. ఈ కార్యక్రమాలను ప్రజాప్రతినిధులు విస్తృతంగా వినియోగించుకోవాలని, పెద్దఎత్తున ప్రచారం కల్పించాలని సీఎం చెప్పారు. ‘రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ స్టడీ సర్కిళ్లు కేవలం శిక్షణ కేంద్రాలుగానే కాకుండా, ఉద్యోగం, ఉపాధిని అందించే భరోసా కేంద్రాలుగా అభివృద్ధి చెందాలి. దేశవ్యాప్తంగా ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్ల వివరాలు సహా యువత చదువుకు తగ్గ ఉద్యోగ ఉపాధి సమాచారాన్ని, మార్గదర్శకత్వాన్ని అందించే కేంద్రాలుగా తీర్చిదిద్దాలి. ఇందుకు సమర్థులైన అధికారులను నియమించాలి. అర్హులైన అభ్యర్థులకు స్టడీ సర్కిళ్లలో భోజన వసతులు, కంప్యూటర్ల వంటి సాంకేతిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి.
గురుకులాల్లో ఇంటర్మీడియట్ విద్య
రాష్ట్రవ్యాప్తంగా అన్ని గురుకుల పాఠశాలల్లో ఇంటర్మీడియట్ ప్రవేశపెట్టాలి. దీనికి ప్రత్యేక శ్రద్ధ కనబరిచే ఉన్నతాధికారిని నియమించాలి. ఏటా పదో తరగతి ఉత్తీర్ణులయ్యే విద్యార్థులు ఎంచుకుంటున్న మార్గాలపై సమగ్ర నివేదికను అందించాలి. మరో 15 మహాత్మా జ్యోతిబా ఫులే గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలు ఈ విద్యా సంవత్సరం నుంచే వస్తాయి. రాబోయే విద్యా సంవత్సరంలో 17 ఏర్పాటు చేయాలి. బీసీ జనాభా అధికంగా ఉన్నందున వారి జనాభా దామాషాలో గురుకులాలు వస్తాయి. నేటి పరిస్థితులకు అనుగుణంగా ఉద్యోగావకాశాలను కల్పించే డిగ్రీ కోర్సులను రూపొందించాలి’ అని సీఎం సూచించారు.
ఐఎఫ్ఎస్ ర్యాంకర్కు అభినందన
తొలి ప్రయత్నంలోనే ఐఎఫ్ఎస్లో 86వ ర్యాంకు సాధించిన సిద్దిపేట జిల్లా ములుగులోని ఫారెస్ట్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఎఫ్సీఆర్ఐ) విద్యార్థి కాసర్ల రాజును మంగళవారం ప్రగతిభవన్లో సీఎం అభినందించారు. రాజు స్ఫూర్తితో కళాశాల నుంచి మరింతమంది విద్యార్థులు ఇలాంటి ర్యాంకులు సాధించాలని ఆకాంక్షించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
-
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
-
40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ నుంచి 2 కొత్త ఇయర్బడ్స్
-
కాలేజీ క్యాంపస్లో ఘోరం.. కార్పొరేటర్ కుమార్తె దారుణ హత్య
-
అమ్మ చనిపోయారు.. నేను పోటీ చేయలేను: ‘హిమాచల్’ డిప్యూటీ సీఎం కుమార్తె