పాటకు పట్టం.. కథకు వందనం
దక్షిణాది నుంచి నలుగురు ప్రముఖులకు కేంద్ర ప్రభుత్వం తాజాగా రాజ్యసభ అవకాశం కల్పించింది. దశాబ్దాలుగా తన సుస్వరాలతో అభిమానులను అలరిస్తున్న దిగ్గజ సంగీత దర్శకుడు ఇళయరాజా (తమిళనాడు)తో పాటు బాహుబలి, ఆర్ఆర్ఆర్ లాంటి సినిమాలకు కథలు అందించడం ద్వారా భారతీయ సినిమా ప్రపంచ స్థాయి గుర్తింపు పొందడంలో
రాజ్యసభకు ఇళయరాజా, విజయేంద్రప్రసాద్
పి.టి.ఉష, వీరేంద్ర హెగ్గడేలకూ అవకాశం
రాష్ట్రపతి కోటాలో నామినేట్ చేసిన కేంద్రం
నలుగురూ దక్షిణాది వారే
ఈనాడు, దిల్లీ: దక్షిణాది నుంచి నలుగురు ప్రముఖులకు కేంద్ర ప్రభుత్వం తాజాగా రాజ్యసభ అవకాశం కల్పించింది. దశాబ్దాలుగా తన సుస్వరాలతో అభిమానులను అలరిస్తున్న దిగ్గజ సంగీత దర్శకుడు ఇళయరాజా (తమిళనాడు)తో పాటు బాహుబలి, ఆర్ఆర్ఆర్ లాంటి సినిమాలకు కథలు అందించడం ద్వారా భారతీయ సినిమా ప్రపంచ స్థాయి గుర్తింపు పొందడంలో కీలక పాత్ర పోషించిన కథారచయిత/దర్శకుడు వి.విజయేంద్రప్రసాద్ (ఆంధ్రప్రదేశ్)లను రాష్ట్రపతి కోటాలో పెద్దల సభకు నామినేట్ చేసింది. పరుగుల రాణిగా పేరొందిన పి.టి.ఉష (కేరళ), ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వీరేంద్ర హెగ్గడే (కర్ణాటక)లకూ అదే కోటాలో ఎగువ సభకు అవకాశం కల్పించింది. ఈ నలుగురూ దక్షిణాది వారే కావడంతో.. రాష్ట్రపతి ఎన్నికల విషయంలో దక్షిణ భారతీయులను అధికార పక్షం విస్మరించిందంటూ వస్తున్న విమర్శలకు కొంతమేర అడ్డుకట్ట పడే అవకాశముంది. ఈ నలుగురు తమ రంగాలకు దశాబ్దాలుగా విశేష సేవ చేస్తున్నారని కేంద్రం తెలిపింది. అందుకు గుర్తింపుగానే వారిని రాజ్యసభకు నామినేట్ చేసినట్లు పేర్కొంది.
కథావిజయేంద్రుడు
విజయేంద్రప్రసాద్ ఆంధ్రప్రదేశ్లోని కొవ్వూరులో 1947 మే 27న జన్మించారు. విజయవాడ లయోలా కాలేజీలో చదువుకున్నారు. దిగ్గజ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి ఈయన కుమారుడే. భజరంగీ భాయిజాన్, బాహుబలి, ఆర్ఆర్ఆర్ తదితర సూపర్హిట్ చిత్రాలకు విజయేంద్రప్రసాద్ కథలు అందించారు. తెలుగు జాతి ఖ్యాతిని, భారతీయ చిత్రసీమ సత్తాను వాటితో ప్రపంచానికి చాటారు. భజరంగీ భాయిజాన్ సినిమాకు 2016లో ఈయన ఉత్తమ కథారచయితగా ఫిల్మ్ఫేర్ అవార్డు అందుకున్నారు.
సినీ సంగీత సామ్రాట్
ఇళయరాజా తమిళనాడులోని మదురై జిల్లాలో దళిత కుటుంబంలో జన్మించారు. భారతీయ సినిమా సంగీత సామ్రాట్గా గుర్తింపు పొందారు. అయిదు దశాబ్దాల కెరీర్లో వెయ్యికి పైగా చిత్రాలకు సంగీతం అందించారు. 7 వేలకు పైగా పాటలు సృష్టించారు. 2018లో ఈయన పద్మ విభూషణ్ పురస్కారాన్ని అందుకున్నారు. అయిదు జాతీయ సినిమా అవార్డులు, సంగీత నాటక అకాడమీ అవార్డులూ పొందారు.
పరుగుల రాణి
కేరళలో కోజికోడ్ జిల్లాలోని ఓ కుగ్రామంలో జన్మించిన ఉష.. దాదాపు రెండు దశాబ్దాల పాటు తన పరుగుతో ట్రాక్పై పతకాల పంట పండించారు. ‘పయ్యోలి ఎక్స్ప్రెస్’గా పేరొందారు. కెరీర్లో ఎన్నోసార్లు జాతీయ, కామన్వెల్త్, ఆసియా రికార్డులు బద్దలుకొట్టారు. 1984 లాస్ఏంజెలెస్ ఒలింపిక్స్లో 400మీ హర్డిల్స్లో సెకనులో వందో వంతు తేడాతో నాలుగో స్థానానికి పరిమితమయ్యారు. ఆసియా క్రీడల్లో 4 స్వర్ణాలతో సహా 11 పతకాలు గెలిచారు. ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో ఏకంగా 14 పసిడి పతకాలు అందుకున్నారు.పరుగుకు వీడ్కోలు పలికాక ఉషా స్కూల్ ఆఫ్ అథ్లెటిక్స్ను ప్రారంభించి ఛాంపియన్లను తీర్చిదిద్దే బాధ్యత చేపట్టారు. అర్జున, పద్మశ్రీ పురస్కారాలు పొందారు.
ధర్మస్థల ధర్మాధికారి
వీరేంద్ర హెగ్గడే 20వ ఏట నుంచే తన జీవితాన్ని సమాజ సేవకు అంకితం చేశారు. గ్రామీణాభివృద్ధి, స్వయం ఉపాధి శిక్షణ కేంద్రం (ఆర్డీసెటీ) ఏర్పాటుతో గ్రామీణ యువతకు చేయూతనందిస్తున్నారు. ప్రస్తుతం ఈ సంస్థ ఆధ్వర్యంలో 6 లక్షల స్వయం సహాయక సంఘాలు నడుస్తున్నాయి. కర్ణాటకలోని ప్రఖ్యాత ధర్మస్థల ఆలయానికి ధర్మాధికారి ఈయన. ధర్మస్థల మంజునాథేశ్వర ఎడ్యుకేషన్ ట్రస్ట్కు నేతృత్వం వహిస్తూ.. వేల మంది చిన్నారులకు నాణ్యమైన విద్యను అందిస్తున్నారు. 2015లో పద్మ విభూషణ్ అవార్డు అందుకున్నారు.
ప్రధాని అభినందనలు
రాజ్యసభకు నామినేట్ అయిన ఇళయరాజా, విజయేంద్రప్రసాద్, పి.టి.ఉష, వీరేంద్ర హెగ్గడేలను ప్రధాని మోదీ ట్విటర్ వేదికగా అభినందించారు. ‘‘వి.విజయేంద్రప్రసాద్ దశాబ్దాల తరబడి సృజనాత్మక ప్రపంచంతో మమేకమై ఉన్నారు. ఆయన వల్ల అద్భుతమైన భారతీయ సంస్కృతి ప్రపంచస్థాయి గుర్తింపు పొందింది. రాజ్యసభకు నామినేట్ అయిన సందర్భంగా ఆయనకు అభినందనలు’’ అని ప్రధాని పేర్కొన్నారు. ‘‘సృజనాత్మక మేధావి ఇళయరాజా తన సంగీత మేధస్సుతో తరతరాలను ఆనంద డోలికల్లో ఊపుతున్నారు. ఆయన పని ఎన్నో భావోద్వేగాలను ప్రతిబింబించింది. ఆయన అట్టడుగు స్థాయి నుంచి అత్యున్నత స్థానానికి ఎదిగి ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచారు’’ అని ఇళయరాజాను ఉద్దేశించి మోదీ వ్యాఖ్యానించారు. విద్య, వైద్యం, సంస్కృతుల అభ్యున్నతికి వీరేంద్ర హెగ్గడే గొప్ప కృషిచేస్తున్నారని కీర్తించారు. క్రీడారంగంలో పి.టి.ఉష చూపిన ప్రతిభాపాటవాలు జగద్విదితమని పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రోజంతా ఆసుపత్రి గదిలో చిక్కుకుపోయిన 5 ఏళ్ల బాలుడు
మాటలు రాని, వినపడని ఓ అయిదేళ్ల చిన్నారి అనుకోని పరిస్థితుల్లో ఆసుపత్రి గదిలో ఒక రోజంతా బందీ అయిపోయిన ఘటన కర్నూలు జిల్లా సర్వజన ఆసుపత్రిలో జరిగింది. -
Bapatla: రహదారిపై యుద్ధవిమానాల ల్యాండింగ్
బాపట్ల జిల్లా మీదుగా వెళ్లే 16వ నంబరు జాతీయ రహదారిపై వైమానిక దళం విన్యాసాలు చేపట్టింది. సోమవారం జరిగిన ఈ కార్యక్రమంలో అత్యవసర సమయాల్లో రహదారిపైనే ఉన్న రన్వేపై యుద్ధ విమానాలను ల్యాండ్ చేసే సామర్థ్యాన్ని మదింపు చేశారు. -
తెలంగాణ సొమ్ము దిల్లీకి
భారాస, కాంగ్రెస్ల బంధాన్ని తెలంగాణ ప్రజలు చూస్తున్నారు. కాళేశ్వరం కుంభకోణంలో కోట్ల రూపాయలు ఎక్కడికి వెళ్లాయో ఎవరికీ తెలియదు? మరోవైపు తప్పుడు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ వాటిని అమలు చేయడంలేదు. -
గవర్నర్ తమిళిసై రాజీనామా
గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తన పదవికి రాజీనామా చేశారు. పుదుచ్చేరి ఇన్ఛార్జి లెఫ్టినెంట్ గవర్నర్(ఎల్జీ) పదవికి సైతం రాజీనామా సమర్పించారు. ఈ మేరకు లేఖను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు సోమవారం పంపించారు. -
దాతలూ స్పందించండి.. ఈ చిన్నారిని ఆదుకోండి
నిరుపేద తల్లిదండ్రులకు పెద్ద కష్టం వచ్చిపడింది. ఏడాది వయస్సున్న కుమారుడి తలకు ఏర్పడిన భారీ కణితి ప్రాణాంతకంగా మారింది. తల్లిదండ్రులు అప్పులు చేసి హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో మూడుసార్లు శస్త్రచికిత్స చేయించినప్పటికీ ఫలితం లేకపోయింది. -
ఆప్ నేతలకు రూ.100 కోట్ల చెల్లింపులో కవిత పాత్ర
దిల్లీ మద్యం విధానంలో పొందిన ప్రయోజనాలకు ప్రతిఫలంగా భారాస ఎమ్మెల్సీ కవిత ఆప్ నేతలకు రూ.100 కోట్లు చెల్లించడంలో భాగస్వామి అయ్యారని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తెలిపింది. -
హైకోర్టు న్యాయమూర్తులుగా జస్టిస్ సుజయ్పాల్, జస్టిస్ మౌసమీ భట్టాచార్య
-
రూ.50 వేలకు పైగా నగదు తీసుకెళ్లేవారు.. పత్రాలను వెంట ఉంచుకోవాలి
-
సిరిసిల్ల, ఆదిలాబాద్ జిల్లాల్లో వడగళ్లు
రాష్ట్రంలో సోమవారం పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. రాజన్న సిరిసిల్ల, ఆదిలాబాద్ జిల్లాల్లో సోమవారం వడగళ్లవాన పడింది. రాజన్న సిరిసిల్ల మండలంలో విద్యుత్ స్తంభం కూలిన ఘటనలో ఓ రైతు మరణించారు. -
రూ.లక్షలు పెట్టు.. ఫ్యాన్సీ నంబరు పట్టు!
రాష్ట్రంలో నూతన రిజిస్ట్రేషన్ కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ఫ్యాన్సీ నంబర్లు రవాణా శాఖకు కాసులు కురిపిస్తున్నాయి. రూ.లక్షలు పెట్టి అయినా.. వాటిని దక్కించుకునేందుకు వాహనదారులు పోటీ పడుతున్నారు. -
కవిత పిటిషన్పై నేడు సుప్రీంలో విచారణ
దిల్లీ మద్యం కేసులో తనకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జారీచేసిన సమన్లను సవాల్ చేస్తూ భారాస ఎమ్మెల్సీ కె.కవిత గత ఏడాది మార్చి 15న దాఖలు చేసిన రిట్ పిటిషన్ మంగళవారం సుప్రీంకోర్టు ముందు విచారణకు రానుంది. -
తల్లీ వందనం.. తపనకు అభినందనం
దివ్యాంగుడైన కుమారుడిని పదోతరగతి పరీక్ష రాయించడానికి తల్లి పడుతున్న తపన స్ఫూర్తిదాయకం. నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలం చించోలి(బి)కి చెందిన చరణ్కు పోలియోతో కాళ్లు చచ్చుబడగా, చేతుల కదలికలూ పరిమితంగానే ఉన్నాయి. -
యాదగిరీశుడి కల్యాణ వైభోగం
యాదాద్రిలో శ్రీలక్ష్మీనరసింహుల కల్యాణం సోమవారం రాత్రి వైభవంగా జరిగింది. గజ వాహనంపై నారసింహుడు, పల్లకినెక్కి అమ్మ లక్ష్మీదేవి.. మండపానికి చేరుకోగా, పూజారులు ఎదుర్కొని కల్యాణ తతంగాలను చేపట్టారు. -
బోరుతోనే ఊరికి పేరు.. 40 ఏళ్లుగా ఇంకని తీరు
ఆదిలాబాద్ గ్రామీణ మండలం తిప్ప పంచాయతీ పరిధిలోని బోరింగ్గూడ గ్రామంలో ఉన్న చేతిపంపు నుంచి నిరంతరం నీరు ఉబికివస్తోంది. గ్రామంలో 40 ఏళ్ల క్రితం బోరు వేసి.. ఈ చేతిపంపు ఏర్పాటు వేశారు. దీని కారణంగానే గ్రామానికి బోరింగ్గూడ అని పేరొచ్చిందని తిప్ప మాజీ సర్పంచి కిషన్ తెలిపారు. -
ఎల్లక్కపేట దసిలిపట్టు గుడ్డు.. దేశంలోనే వెరీగుడ్
మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం ఎల్లక్కపేట సమీపంలోని దసిలిపట్టు గుడ్ల తయారీ కేంద్రం దేశంలోనే నంబర్వన్గా నిలిచింది. ఐదేళ్ల నుంచి ఏటా సుమారు 2.80 లక్షలకుపైగా ఈ గుడ్లు ఉత్పత్తి చేస్తుండగా.. ఈ ఏడాది(ఫిబ్రవరితో గుడ్ల తయారీ ముగుస్తుంది) 3.27 లక్షలతో అగ్రస్థానాన్ని పొందింది. -
ఎన్నికల తర్వాతే వీసీల నియామకాలు
రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలకు కొత్త ఉపకులపతుల నియామక ప్రక్రియ లోక్సభ ఎన్నికల తర్వాతే చేపట్టనున్నారు. ఇప్పటికే దరఖాస్తుల స్వీకరణ, పరిశీలన పూర్తయింది. -
భర్తీ చేస్తున్నా.. భారీగా ఖాళీలు
ప్రభుత్వ పోటీ పరీక్షల్లో కొందరు అభ్యర్థులు విశేష ప్రతిభతో రెండు, మూడు, నాలుగు, అయిదేసి పోస్టులకు ఎంపికవడం మిగిలిన వారికి అశనిపాతంగా మారుతోంది. -
గొత్తికోయల ఆక్రమణలో 26 వేల ఎకరాలు
గొత్తికోయలు రాష్ట్రంలో 26 వేల ఎకరాల అటవీ ప్రాంతాల్ని ఆక్రమించినట్లు అటవీశాఖ అధికారులు గుర్తించారు. ఈ వివరాల్ని కొద్దిరోజుల క్రితం నిర్వహించిన సమీక్షలో ఆ శాఖ మంత్రి కొండా సురేఖకు నివేదించారు. -
‘స్టేట్మెంట్’ దాఖలు విషయంలో అనిశ్చితి!
తెలంగాణ, ఏపీల మధ్య కృష్ణా జలాల పునఃపంపిణీకి సంబంధించి విచారణ చేపట్టిన కృష్ణా ట్రైబ్యునల్-2 వద్ద రెండు రాష్ట్రాలూ దాఖలు చేయాల్సిన ‘స్టేట్మెంట్ ఆఫ్ కేస్’ విషయమై అనిశ్చితి నెలకొంది. ఈ నెల 20వ తేదీన దాఖలు చేయడానికి కేడబ్ల్యూడీటీ-2 రెండు రాష్ట్రాలకూ గడువు ఇచ్చింది. -
20 నుంచి మళ్లీ అయ్యర్ కమిటీ పర్యటన
కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన బ్యారేజీల్లో లోటుపాట్లపై పరిశీలనకు నియమించిన నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ(ఎన్.డి.ఎస్.ఎ.) నిపుణుల కమిటీ ఈనెల 20న హైదరాబాద్కు రానుంది. -
ప్రభుత్వ ఆదేశాలనే అమలు చేస్తున్నాం
గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్లలోపు వినియోగించే ఇళ్లకు జీరో బిల్లులకు విద్యుత్తు చట్ట ప్రకారం రాయితీ నిధులు ఇస్తామని రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి(ఈఆర్సీ) తెలిపింది. దీనికి సంబంధించిన వివరణ పత్రాన్ని సోమవారం విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
TDP: ప్రతి గడపను తట్టినాదో అమ్మామాయమ్మ!.. నారా భువనేశ్వరిపై పాట ఆవిష్కరణ
-
అన్నక్యాంటీన్ సేవలు ఆపాల్సిందే!.. ఎన్నికల కోడ్ అంటూ అధికారుల అభ్యంతరం
-
ఉపరాష్ట్రపతి కావొచ్చనే ఉద్దేశంతో తమిళిసై రాజీనామా: మంత్రి అనితా రాధాకృష్ణన్
-
ఉత్తర కోస్తాలో రేపు భారీ వర్షాలు
-
AP News: తెలుగు రాద్దామనుకుంటే.. హిందీ ప్రశ్నపత్రం వచ్చింది
-
బస్సుల్లేక బాధలు.. తికమకలో మరో కేంద్రానికి విద్యార్థిని