మరోసారి గ్యాస్ మంట
సామాన్యులపై మరోసారి ధరల బండపడింది. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్న తరుణంలో మళ్లీ వంట గ్యాస్ధర భగ్గుమంది. తాజాగా రూ.50 పెంచటంతో గృహావసరాలకు వినియోగించే 14.2 కిలోల వంట గ్యాస్ సిలిండరు
గృహావసర సిలిండరు ధర రూ. 50 పెంపు
24 నెలల్లో రూ. 418.50 భారం
ఈనాడు, హైదరాబాద్: సామాన్యులపై మరోసారి ధరల బండపడింది. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్న తరుణంలో మళ్లీ వంట గ్యాస్ధర భగ్గుమంది. తాజాగా రూ.50 పెంచటంతో గృహావసరాలకు వినియోగించే 14.2 కిలోల వంట గ్యాస్ సిలిండరు ధర హైదరాబాద్లో రూ.1,105కు ఎగబాకింది. నామమాత్రంగా ఇస్తున్న రాయితీ సొమ్మును కూడా రెండు నెలలుగా కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం లేదు.వంట గ్యాస్ ధర అంచనాలకు మించి పెరుగుతుండటంతో సామాన్య ప్రజలపై భారీగా భారం పడుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరల ఆధారంగా ప్రతి నెలా ఒకటో తేదీన చమురు సంస్థలు సిలిండరు ధరల్లో మార్పులు, చేర్పులు చేస్తాయి. అయితే గత సంవత్సరం ఒకే నెలలో రెండు సార్లు పెంచిన సందర్భాలూ ఉన్నాయి. గడిచిన ఏడాది చివర్లో పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో ధర పెంపుదలకు కేంద్రం బ్రేకులు వేసింది. గత నవంబరు నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకు ధరల్లో ఎలాంటి మార్పులు చేయలేదు. మార్చి నుంచి ధరల ఫిరంగులు మోగుతూనే ఉన్నాయి.
నెలకు రూ.29 కోట్ల భారం
గడిచిన ఏడాది వ్యవధిలో సిలిండరుపై రూ.193 భారం పెరిగింది. రెండేళ్ల వ్యవధిలో రూ.418.50 పెరిగింది. మూడు నెలలుగా చడీచప్పుడు లేకుండా ఉన్న చమురు సంస్థలు ఒకసారిగా సిలిండరుపై రూ.50 పెంచటంతో కంగు తినటం ప్రజల వంతవుతోంది. రాష్ట్రంలో ప్రతి నెలా సగటున 55 లక్షల సిలిండర్లు వినియోగమవుతాయి. తాజా పెంపుతో నెలకు వినియోగదారులపై రూ. 27.50 కోట్ల నుంచి రూ.29 కోట్ల వరకు భారం పడనుంది. దారిద్య్రరేఖ దిగువన ఉన్న వారికి ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన పథకం కింద సుమారు 34 లక్షల కనెక్షన్లు ఉన్నాయి. వారికి మాత్రం రూ.241.50లను రాయితీగా కేంద్రం జమ చేస్తోంది. దీంతో వారు సిలిండరుకు రూ.863.50 చెల్లించినట్లు అవుతుంది. రానున్న రోజుల్లో సిలిండరు ధర మరింత పెరుగుతుందన్న ప్రచారం సాగుతోంది. కేంద్రం దశలవారీగా భారం తగ్గించుకోవాలన్న ఆలోచనలో ఉండటమే ఇందుకు కారణమని గ్యాస్ డీలర్లు అంచనా వేస్తున్నారు. ఇటీవల దిల్లీలో జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో చమురు సంస్థలు ఈ విషయాన్ని సూచనప్రాయంగా చెప్పాయని డీలర్ ఒకరు బుధవారం ‘ఈనాడు’తో చెప్పారు. అంతర్జాతీయ మార్కెట్తో పోలిస్తే సిలిండరుపై ఉన్న రూ. 220 భారాన్ని తగ్గించుకునే క్రమంలోనే తాజాగా రూ.50 భారాన్ని వినియోగదారులపై మోపిందని చెబుతున్నారు. మిగిలిన భారం కూడా పడక తప్పదని డీలర్లు అంటున్నారు.
వంటింట్లో మంట.. మహిళలకు మోదీ కానుక
ఈనాడు, హైదరాబాద్: గ్యాస్ సిలిండర్ ధరను పెంచి కేంద్రం వంటింట్లో మంట పెట్టిందని, సిలిండర్ ధర పెంచి దేశ మహిళలకు మోదీ కానుకగా ఇచ్చేశారని మంత్రి కేటీఆర్ బుధవారం ట్విటర్లో పేర్కొన్నారు. మోదీ నిర్వాకంతో ఇక మంచిరోజులు వచ్చేశాయ్.. అందరికీ శుభాకాంక్షలని ఆయన వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. గృహావసరాల సిలిండర్పై కేంద్రం రూ.50 పెంచిందంటూ ఒక నెటిజన్ చేసిన ట్వీట్కు కేటీఆర్ స్పందించి ఈ వ్యాఖ్యలు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పతి దేవుడికి గుడి కట్టింది!
కరోనా మహమ్మారి ఆమె జీవితంలో అంతులేని విషాదాన్ని నింపింది. కళ్లల్లో పెట్టుకుని చూసుకునే భర్తను తన నుంచి దూరం చేసింది. మూడేళ్ల క్రితం భర్త కొవిడ్తో మృతి చెందడంతో ఆమె ఒంటరిగా మారారు. -
కొత్తవారొచ్చారు
ఆంధ్రప్రదేశ్ నిఘా విభాగాధిపతిగా సీనియర్ ఐపీఎస్ అధికారి కుమార్ విశ్వజిత్ను, విజయవాడ నగర పోలీసు కమిషనర్గా పీహెచ్డీ రామకృష్ణను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. -
జేఈఈ మెయిన్స్లో తెలుగోళ్ల సత్తా
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. దేశవ్యాప్తంగా 56 మందికి 100 పర్సంటైల్ రాగా.. ఇందులో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందినవారే 22 మంది ఉన్నారు. జేఈఈ మెయిన్స్ తుది ఫలితాలను జాతీయ పరీక్షల విభాగం (ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసింది. -
కాళేశ్వరంపై కమిషన్ విచారణ షురూ
కాళేశ్వరం ఎత్తిపోతల్లోని బ్యారేజీలపై న్యాయ విచారణకు ఏర్పాటు చేసిన కమిషన్ కార్యాచరణ మొదలుపెట్టింది. బుధవారం కమిషన్ ఛైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ ఆయన సతీమణి దేబ్జానీ ఘోష్తో కలిసి హైదరాబాద్కు చేరుకున్నారు. -
ఫస్టియర్లో 60.01%.. సెకండియర్లో 64.19%
ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో 60.01 శాతం, రెండో సంవత్సరంలో 64.19 శాతం మంది విద్యార్థులు (ఒకేషనల్ కోర్సులతో కలిపి) ఉత్తీర్ణత సాధించారు. -
కవిత బెయిల్పై మే 6న తీర్పు
ఈడీ కేసులో బెయిల్ కోసం భారాస ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్పై తీర్పును ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు మే 6కి వాయిదా వేసింది. -
చదువుల ‘సిరి’.. రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని పట్టుదల
వారానికి రెండుసార్లు డయాలసిస్.. ఒంట్లో సత్తువ లేక కళాశాలకూ వెళ్లలేని పరిస్థితి.. అయినా మొక్కవోని పట్టుదలతో చదివిన పేదింటి బిడ్డ ప్రతిభ చాటింది. -
విజన్-2026కు డోర్నకల్ ఉపాధ్యాయుల శ్రీకారం
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు విజన్-2026 పేరిట ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. -
ఇంటర్ ఫలితాల్లో కవలల ప్రతిభ
సూర్యాపేట జిల్లా ఆత్మకూర్(ఎస్) మండల కేంద్రానికి చెందిన డేగల వీరభద్రయ్య, మంజుల దంపతుల కవల పిల్లలు డేగల రామ్, లక్ష్మణ్ ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో ప్రతిభ చూపారు. -
రాష్ట్రంలో వంతెనల పరిశీలన..!
రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న చిన్నా, పెద్ద వంతెనలను పరిశీలించేందుకు అధికారులు ఆయత్తం అవుతున్నారు. జిల్లాల వారీగా నిర్మాణ స్థితిగతులపై జాబితాలను రూపొందించే పనిలో ఉన్నారు. -
యాదాద్రి విద్యుత్కేంద్రానికి పర్యావరణ అనుమతి
యాదాద్రి థర్మల్ విద్యుత్కేంద్రానికి పర్యావరణ అనుమతి (ఈసీ) ఇవ్వడానికి కేంద్ర పర్యావరణ శాఖ ఆమోదం తెలిపింది. -
మెట్రో రైలు శబ్దకాలుష్యంపై వివరణివ్వండి
మెట్రో రైల్వే లైను వంపుల్లో రైలు వెళ్లినపుడు పరిమితికి మించి వస్తున్న శబ్దకాలుష్యంపై వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వానికి, మెట్రో రైల్వే ఎండీకి బుధవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
ఆర్జేసీ, మోడల్, కేజీబీవీ విద్యార్థుల ప్రతిభ
టీఎస్ఆర్జేసీ నేరెళ్ల గురుకుల విద్యార్థిని ఎంపీసీలో 991 మార్కులు, బైపీసీలో తాటిపల్లి విద్యార్థిని 990 మార్కులు సాధించినట్లు యాజమాన్యం తెలిపింది. -
ఫోన్ ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావుకు మధ్యంతర బెయిలు నిరాకరణ
ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టయిన టాస్క్ఫోర్స్ మాజీ ఓఎస్డీ రాధాకిషన్రావుకు ఎల్ఎల్ఎం పరీక్షలు రాసేందుకు వీలుగా మధ్యంతర బెయిలు ఇచ్చేందుకు నాంపల్లి కోర్టు నిరాకరించింది. -
పోలింగ్ రోజు వేతనంతో కూడిన సెలవు
లోక్సభ ఎన్నికల పోలింగ్ జరిగే రోజును వేతనంతో కూడిన సెలవుగా ప్రకటించారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్రాజ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
జస్టిస్ రామలింగేశ్వరరావుకు హైకోర్టు ఘన నివాళి
గుండెపోటుతో ఇటీవల మృతి చెందిన ఉమ్మడి హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎ.రామలింగేశ్వరరావుకు బుధవారం హైకోర్టు ఘన నివాళి అర్పించింది. -
శనగ విత్తనోత్పత్తి రైతుల ఆందోళన
‘పంట విక్రయించి నెల రోజులవుతోంది. డబ్బులు ఎప్పుడు ఇస్తారో.. క్వింటాకు ఎంత కట్టిస్తారో ఇప్పటికీ తెలియదు. -
విచారణ నుంచి తప్పుకొన్న జస్టిస్ శేషసాయి ధర్మాసనం
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసుపై మాట్లాడొద్దంటూ కడప జిల్లా కోర్టు(పీడీజే) ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ వివేకా కుమార్తె నర్రెడ్డి సునీత, పులివెందుల తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.రవీంద్రనాథ్రెడ్డి అలియాస్ బీటెక్ రవి దాఖలు చేసిన వ్యాజ్యాల విచారణ నుంచి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏవీ శేషసాయి నేతృత్వంలోని ధర్మాసనం తప్పుకొంది. -
ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఇంటర్ ప్రవేశాలు
రాష్ట్రంలోని ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో ప్రవేశాల పేరిట డొనేషన్లు, అధిక రుసుముల వసూళ్లు, ఇతరత్రా అక్రమాలను నిరోధించేందుకు వీలుగా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఆన్లైన్ ప్రవేశాల విధానాన్ని ప్రవేశపెట్టాలని యోచిస్తున్నామని విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. -
మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ
ష్ట్రంలో మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. షెడ్యూలును విద్యాశాఖ బుధవారం విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు (4)
రాష్ట్రంలో వచ్చే నెల 6వ తేదీన జరగనున్న తెలంగాణ రాష్ట్ర ఇంజినీరింగు కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (టీఎస్ఈసెట్)ను మే చివరి వారానికి వాయిదా వేయాలని పలువురు అభ్యర్థులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని కోరారు.
తాజా వార్తలు (Latest News)
-
30 వైడ్ బాడీ విమానాలకు ఇండిగో ఆర్డర్.. ఎయిరిండియాకు గట్టి పోటీ!
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM