వెళ్లలేం.. వదల్లేం..
రాష్ట్రంలోని కొత్త పారిశ్రామిక పార్కుల్లో టౌన్షిప్ల నిర్మాణ పనులు ముందుకు సాగక కార్మికులు అగచాట్లు పడుతున్నారు. పారిశ్రామిక వాడల్లోగానీ, వాటికి సమీపాల్లో గానీ నివాస వసతి లేక దూరప్రాంతాల్లో ఉంటూ వ్యయప్రయాసలకోర్చి పనులకు
పారిశ్రామిక పార్కుల్లో వసతుల లేమి
ఊసేలేని టౌన్షిప్ల నిర్మాణం
రాకపోకలకు కార్మికుల అవస్థలు
నెరవేరని మంత్రి కేటీఆర్ హామీ
ఈనాడు - హైదరాబాద్
రాష్ట్రంలోని కొత్త పారిశ్రామిక పార్కుల్లో టౌన్షిప్ల నిర్మాణ పనులు ముందుకు సాగక కార్మికులు అగచాట్లు పడుతున్నారు. పారిశ్రామిక వాడల్లోగానీ, వాటికి సమీపాల్లో గానీ నివాస వసతి లేక దూరప్రాంతాల్లో ఉంటూ వ్యయప్రయాసలకోర్చి పనులకు రావాల్సి వస్తోంది. రాష్ట్రంలో 156 పారిశ్రామిక పార్కులున్నాయి. ఇందులో 16 లక్షల మంది కార్మికులు పనిచేస్తున్నారు. త్వరలో మరో 12 ప్రారంభం కానున్నాయి. నైపుణ్యం ఉన్నవారితో పాటు లేని వారికి సైతం పనులు దొరుకుతున్నందున పెద్ద సంఖ్యలో కార్మికులు పనుల్లో చేరుతున్నారు. ఇంకా నాలుగులక్షల మందికి పైగా కార్మికుల అవసరం ఉందని పరిశ్రమల యాజమాన్యాలు పేర్కొంటున్నాయి.
తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్లో పరిశ్రమల ఏర్పాటును నిషేధించింది. నగరానికి దూరంగా 26 కొత్తగా పారిశ్రామిక పార్కులను ఏర్పాటు చేసింది. ఇవన్నీ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి. పారిశ్రామిక పార్కుల కోసం రహదారులను నిర్మించింది. వాటిల్లో నీరు, విద్యుత్, ఇతర మౌలిక వసతులను కల్పించింది. కార్మికుల వసతులకు మాత్రం ఇబ్బందులున్నాయి. పారిశ్రామిక పార్కులకు రవాణా వసతి లేదు. బస్సులు, ఆటోలు వెళ్లడం లేదు. దీంతో కార్మికులు దూరంగా ఉన్న బస్స్టాప్ల వద్ద, ఆటో స్టాండ్ల వద్ద దిగి పరిశ్రమలకు వస్తున్నారు.
ముందుకెళ్లని ప్రతిపాదనలు
కొత్త పారిశ్రామికపార్కుల ఏర్పాటు సందర్భంగా కార్మికులకు నివాస వసతి గురించి పరిశ్రమల సంఘాలు, యాజమాన్యాలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాయి. పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు వీటిపై స్పందించి... పారిశ్రామికపార్కుల వద్ద టౌన్షిప్లను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. సమీకృత టౌన్షిప్ విధానంలో దీనిని చేర్చారు. దీనికి అనుగుణంగా ఎక్కువ విస్తీర్ణం గల పారిశ్రామిక పార్కుల్లో కొంత స్థలాన్ని టౌన్షిప్ల కోసం ఏర్పాటు చేసి ఇళ్లను నిర్మించాలని ప్రతిపాదించారు. తక్కువ విస్తీర్ణం గల ప్రాంతాల్లో కార్మికులకు కనీస వసతులతో కూడిన డార్మెటరీ తరహా గదులను నిర్మించాలని భావించారు. దీనిలో భాగంగా కుత్బుల్లాపూర్, ఇబ్రహీంపట్నం, మాదాపూర్, వరంగల్లలో పారిశ్రామిక టౌన్షిప్ల ఏర్పాటు, దండుమల్కాపూర్లోని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల పార్కులోనూ టౌన్షిప్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ఇప్పటి వరకు నిర్మాణాలు ప్రారంభం కాలేదు.
దండుమల్కాపూర్ పారిశ్రామిక పార్కులోని పరిశ్రమలో శ్రీనివాస్ కార్మికుడు. అక్కడికి 45 కిలోమీటర్ల దూరం నుంచి రోజూ అక్కడికి వస్తూ, పోతున్నారు. పార్క్కు సమీపంలో ఉండడానికి ఇళ్లు లేకపోవడంతో రోజూ రాకపోకలకు ఇబ్బంది అవుతోందని తెలిపారు.
సుల్తాన్పూర్లోని వైద్యపరికరాల పార్కులోని యంత్రాల తయారీ పరిశ్రమలో పనిచేసే రాజం అక్కడికి 30 కిలోమీటర్ల దూరంలోని సంగారెడ్డి నుంచి రాకపోకలు సాగిస్తున్నారు.
నివాస వసతి కల్పించాలి
పారిశ్రామిక పార్కులతో పాటు టౌన్షిప్ల ఏర్పాటు అటు కార్మికులతో పాటు ఇటు పరిశ్రమలకు ప్రయోజనకరం. నివాస వసతుల్లేక కార్మికులు కార్యాలయ వేళల మాదిరే పనిచేస్తున్నారు. రెండు, మూడు షిప్ట్ల్లో పనిచేసే అవకాశం ద్వారా పరిశ్రమల్లో ఉత్పత్తులు పెరగడంతో పాటు కార్మికులకు మరింత ఉపాధి లభించే అవకాశం ఉంది. ప్రభుత్వం పారిశ్రామిక విధానంలోనూ దీనిని చేర్చాలి.
- దామోదరాచారి, పారిశ్రామికవేత్త
నూతన భారీ ప్రాజెక్టుల్లో ఏర్పాటుకు చర్యలు
తెలంగాణలో కొత్తగా ఏర్పాటయ్యే ప్రతి భారీ ప్రాజెక్టు వద్ద టౌన్షిప్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. హైదరాబాద్ ఔషధనగరిలో పెద్దఎత్తున టౌన్షిప్లుంటాయి. జహీరాబాద్ నిమ్జ్లోనూ దీనిని ప్రతిపాదించాం. దండుమల్కాపూర్లో ప్రాజెక్టుపై కార్యాచరణ మొదలైంది. కార్మికుల వసతి దృష్ట్యా కాలుష్యరహితంగా అన్ని పారిశ్రామిక పార్కులను తీర్చిదిద్దుతున్నాం.
- వెంకటనర్సింహారెడ్డి, టీఎస్ఐఐసీ ఎండీ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మార్చిలోనే వడగాలులు!
దేశంలో మార్చి ఆఖరి వారంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే పరిస్థితులున్నాయి. వడగాలులకూ అవకాశాలున్నాయి. -
న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్లో భూపాలపల్లి ఫొటోగ్రాఫర్ చిత్రం ప్రదర్శన
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రానికి చెందిన ఫొటోగ్రాఫర్, డాక్టర్ అరుణ్కుమార్ నలిమెల అరుదైన ఘనత సాధించారు. -
మౌలిక వసతులతో రెట్టింపు పని
న్యాయమూర్తులు, న్యాయవాదులు తమ విధులను గౌరవప్రదంగా నిర్వహించడానికి న్యాయస్థానాల్లో మౌలిక వసతులు కీలకమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ డి.వై.చంద్రచూడ్ అన్నారు. -
వ్యాట్నూ తాగేశారు
మద్యం అమ్మకాల్లో కొన్నేళ్లుగా భారీ స్థాయిలో ‘పన్ను ఎగవేత’ కుంభకోణం జరిగిందని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. -
తాకట్టులోని ఫ్లాట్లకు రిజిస్ట్రేషన్లు..!
స్థిరాస్తి వెంచర్ల పేరిట వేల మంది కొనుగోలుదారులను రూ.వందల కోట్ల మేర మోసగించినట్లు అభియోగాలు ఎదుర్కొంటున్న సాహితీ ఇన్ఫ్రాటెక్ నిర్వాహకుల మరో నిర్వాకం వెలుగులోకి వచ్చింది. -
యాదాద్రిని సందర్శించిన భారత నౌకాదళాధిపతి
భారత నౌకాదళాధిపతి అడ్మిరల్ ఆర్.హరికుమార్ తన కుటుంబ సభ్యులతో బుధవారం యాదాద్రిని సందర్శించారు. -
మధుమేహంపై పరిశోధనలకు ఎండోక్రైన్ పాంక్రియాస్ సెంటర్
క్లోమ గ్రంథిలోని ఎండోక్రైన్ పనితీరుపై అధ్యయనం చేయడం.. తద్వారా డయాబెటిస్ చికిత్స పద్ధతులు, పరిష్కారాలను అర్థం చేసుకొని పరిశోధనలు చేసేందుకు ఆసియాలో తొలిసారిగా ఎండోక్రైన్ పాంక్రియాస్ పరిశోధన కేంద్రాన్ని హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ(ఏఐజీ)లో బుధవారం అందుబాటులోకి తెచ్చారు. -
శ్రీవారి సేవలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ దంపతులు బుధవారం తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. -
ఎన్హెచ్ఎం నిధులు రానట్లే!
జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్హెచ్ఎం) కింద కేంద్రం నుంచి రావాల్సిన రూ.348 కోట్ల నిధులపై రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ఆశలు వదులుకుంది. -
పశువుల మేతగా మారుతున్న ఆరుగాలం పంట
ఆరుగాలం శ్రమించి పంట పండించే రైతన్నకు కన్నీరే మిగులుతోంది. ఈ యాసంగి సీజన్లో భూగర్భ జలాలు అడుగంటి, సాగునీటి ప్రాజెక్టుల నుంచి కూడా నీరు అందక పంటలు పొట్టకు వచ్చిన దశలో ఎండిపోతున్నాయి. -
చి‘వరి’కి మిగిలింది చెలమ నీరు..
మండుతున్న ఎండలతో జిల్లాల్లో భూగర్భజలాలు రోజురోజుకు తగ్గిపోతున్నాయి. బోర్లు, బావులు, వాగుల్లో నీరు కరవైంది. -
శ్రీవారి సేవలో తెలంగాణ ఇన్ఛార్జి గవర్నర్
తెలంగాణ ఇన్ఛార్జి గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ బుధవారం శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో ఆలయం వద్దకు చేరుకున్న గవర్నర్కు తితిదే అధికారులు శ్రీవారి మూలమూర్తి దర్శనం చేయించారు. -
భారత్, ఫ్రాన్స్ మధ్య దృఢమైన దౌత్య సంబంధాలు
రాయదుర్గం టీ హబ్లో ఫ్రాన్స్ కాన్సులేట్ జనరల్ శాఖ(బ్యూరో డీ ఫ్రాన్స్) కార్యాలయాన్ని ఆ దేశ రాయబారి థియరీ మాథావు బుధవారం ప్రారంభించారు. -
చెంగిచర్ల పార్థీబస్తీలో బాధితులకు బండి పరామర్శ
హోలీ రోజు హైదరాబాద్ చెంగిచర్ల పార్థీబస్తీలో ఇరువర్గాల ఘర్షణలో గాయాలపాలైన వారిని పరామర్శించేందుకు బుధవారం వచ్చిన భాజపా జాతీయ ప్రధానకార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ను పోలీసులు అడ్డుకున్నారు. -
రాష్ట్రంలో తగ్గిన శతాధిక వృద్ధ ఓటర్లు
రాష్ట్రంలో శతాధిక వృద్ధ ఓటర్ల సంఖ్య తగ్గింది. ఏటా నిర్వహించే ఓటర్ల జాబితా సవరణ తరవాత ఈ ఏడాది ఫిబ్రవరి 8న ప్రకటించిన తుది ఓటర్ల జాబితాలో వీరి సంఖ్య 6,292కు చేరింది. -
రెండు రోజుల్లో జస్టిస్ ఘోష్కు ‘ఉత్తర్వుల’ ప్రతి
కాళేశ్వరం ఎత్తిపోతల పథకంపై న్యాయ విచారణకు కమిషన్ను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వుల కాపీని.. కమిషన్కు నేతృత్వం వహించనున్న సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ పినాకి చంద్రఘోష్కు నీటిపారుదల శాఖ అందించనుంది. -
ఫోన్ట్యాపింగ్ కేసులో నిందితుల కస్టడీ పిటిషన్పై తీర్పు రిజర్వ్
ఫోన్ ట్యాపింగ్ కేసులో అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న, సస్పెండైన డీఎస్పీ ప్రణీత్రావుల పోలీస్ కస్టడీ వ్యవహారంలో నాంపల్లి న్యాయస్థానం బుధవారం తీర్పును రిజర్వ్ చేసింది. -
టెట్ రాసేందుకు టీచర్లకు అనుమతి అవసరం లేదు
తెలంగాణలో టెట్-2024 రాసేందుకు ప్రభుత్వ ఉపాధ్యాయులు విద్యాశాఖ నుంచి అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన బుధవారం తెలిపారు. -
నెట్ స్కోర్తో పీహెచ్డీ ప్రవేశాలు
విశ్వవిద్యాలయాలు, ఉన్నత విద్యాసంస్థల్లో నెట్ స్కోరుతో పీహెచ్డీలో ప్రవేశాలు కల్పించాలని యూజీసీ సూచించింది. -
సంక్షిప్త వార్తలు (3)
ఆర్టీసీ కార్మికులకు 2013 వేతన సవరణకు సంబంధించిన బకాయిలు ఇవ్వడంలో విపరీత జాప్యం జరుగుతోందని ఇకనైనా వెంటనే చెల్లింపులు జరిగేలా చూడాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్కు ఐఎన్టీయూసీ అనుబంధ ఎస్డబ్ల్యూయూ విజ్ఞప్తి చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
కాంగ్రెస్లో చేరనున్న కె.కేశవరావు, మేయర్ విజయలక్ష్మి
-
అనధికారిక లావాదేవీలపై యూజర్ల ఆందోళన.. స్పందించిన యాక్సిస్ బ్యాంక్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
ఎన్నికల ముంగిట.. అవినీతి కేసులో ప్రఫుల్ పటేల్కు క్లీన్ చిట్
-
భవిష్యత్ తరాల కోసం తెదేపాకు ఓటు వేయాలి: భువనేశ్వరి
-
పూజాహెగ్డే ‘స్పై’ ఫొటో.. ప్రగ్యా ‘పోజు’ రిపీట్.. మెహందీతో కావ్య!