Formula ERace: సాగర్ తీరంలో ప్రపంచ ఫార్ములా ఈ-రేస్
అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఫార్ములా ఈ-రేస్కు తెలంగాణ వేదిక కానుంది. ఫార్ములా వన్కు ప్రత్యామ్నాయంగా పూర్తిగా ఎలక్ట్రిక్ కార్లతో నిర్వహించే ఈ పోటీలకు హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఇప్పటికే పారిస్, రోమ్
నవంబరు- ఫిబ్రవరి మధ్య హైదరాబాద్లో పోటీలు
2.37 కిలోమీటర్ల ప్రత్యేక ట్రాక్
ఎలక్ట్రిక్ వాహనరంగానికి మరింత ఊతం: మంత్రి కేటీఆర్
ఫార్ములా ఈ-రేస్కు వేదికగా హైదరాబాద్ ఎంపికపై సోమవారం కేటీఆర్ సమక్షంలో ఒప్పంద
పత్రాలు చూపుతున్న గ్రీన్కో సంస్థ సీఈవో అనిల్ చలమలశెట్టి,ఫార్ములా-ఈ సహ వ్యవస్థాపకుడు
అల్బెర్టో లాంగో, పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్
ఈనాడు, హైదరాబాద్: అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఫార్ములా ఈ-రేస్కు తెలంగాణ వేదిక కానుంది. ఫార్ములా వన్కు ప్రత్యామ్నాయంగా పూర్తిగా ఎలక్ట్రిక్ కార్లతో నిర్వహించే ఈ పోటీలకు హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఇప్పటికే పారిస్, రోమ్, లండన్, హాంకాంగ్, న్యూయార్క్, బెర్లిన్ తదితర 18 నగరాలు వేదికగా ఉండగా... మరో 60 నగరాలతో పోటీపడి కొత్త వేదికగా భారత్ నుంచి తొలిసారిగా హైదరాబాద్ ఈ అవకాశాన్ని దక్కించుకుంది. నవంబరు 22 నుంచి ఫిబ్రవరి వరకు ఫార్ములా ఈ-రేసు పోటీలు ప్రపంచవ్యాప్తంగా జరుగుతాయని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా తెలిపారు. హైదరాబాద్లో పోటీలు జరిగే తేదీలను త్వరలోనే నిర్వాహకులు ప్రకటిస్తారని ఆయన చెప్పారు. దీని కోసం నెక్లెస్రోడ్, సచివాలయం, తెలుగుతల్లి ఫ్లైఓవర్, హుస్సేన్సాగర్ చుట్టూ 2.37 కిలోమీటర్ల ఈ-రేసింగ్ ట్రాక్ను ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ, వాడకాన్ని పెద్దఎత్తున ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. పినాకిల్ ఎలక్ట్రిక్ కార్ రేసింగ్ ఛాంపియన్ షిప్ పేరిట జరిగే ఫార్ములా ఈ-రేసుకు హైదరాబాద్ను వేదికగా ఎంపిక చేస్తూ అంతర్జాతీయ వాహన సమాఖ్య ఫార్మలా-ఈతో రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్లో సోమవారం ఒప్పందం కుదుర్చుకుంది. ఫార్ములా-ఈ సహ వ్యవస్థాపకుడు, చీఫ్ ఛాంపియన్ షిప్ ఆఫీసర్ అల్బెర్టో లాంగో, ప్రమోటర్, గ్రీన్కో సంస్థ సీఈవో అనిల్ చలమలశెట్టి, పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్కుమార్లు ఈ ఒప్పంద పత్రంపై సంతకాలు చేశారు. దీనిపై మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తంచేశారు. తెలంగాణకు గర్వకారణమన్నారు. పోటీల నిర్వహణ వల్ల ఎలక్ట్రిక్ వాహనాలపై ప్రజలకు మరింత అవగాహన వస్తుందని, దేశవ్యాప్తంగా వినియోగం పెరుగుతుందన్నారు. బీజింగ్లో జరిగిన పోటీల్లో భారత్కు చెందిన ఫార్ములా జట్టు మూడో స్థానంలో నిలిచిందని, హైదరాబాద్లో జరిగే పోటీల్లో అగ్రస్థానం పొందుతుందనే ఆశాభావాన్ని మంత్రి వ్యక్తం చేశారు. త్వరలో హైదరాబాద్లో మూడు రోజుల పాటు ఎలక్ట్రిక్ వాహనాలు అంతర్జాతీయ ప్రదర్శన నిర్వహిస్తామని కేటీఆర్ చెప్పారు.
హైదరాబాద్లో ఏర్పాటు చేయనున్న ఫార్ములా ఈ-రేస్ ట్రాక్ నమూనా
తెలంగాణ విధానం దేశంలోనే అత్యుత్తమం
అత్యుత్తమ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ విధానాన్ని రాష్ట్రం అమలు చేస్తోందని, దీని ద్వారా దేశవ్యాప్తంగా వినియోగం విస్తృతమైందని మంత్రి తెలిపారు. ఇప్పటికే సీతారామ్పూర్, దివిటిపల్లిలో వాహనాల తయారీ పరిశ్రమల సమూహాలను ఏర్పాటు చేశామని, పలు సంస్థలతో ఒప్పందాలు చేసుకున్నామని కేటీఆర్ వెల్లడించారు. ఫార్ములా-ఈ సహ వ్యవస్థాపకుడు అల్బెర్టో లాంగో మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం అత్యంత వేగంగా ఈ-రేసు నిర్వహణకు అనుమతులిచ్చిందన్నారు. కేటీఆర్ చొరవే ఇందుకు కారణమన్నారు. సౌదీ ఆరేబియాలో 28, 29 తేదీల్లో జరిగే ఏబీబీ ప్రపంచ ఫార్ములా-ఈ దిరియా ప్రిక్స్-2022 రేసుకు హాజరు కావాలని కేటీఆర్ను ఆహ్వానించగా మంత్రి సానుకూలంగా స్పందించారు. సమావేశంలో ట్రాక్ అండ్ ఓవర్లే డైరెక్టర్ అగస్ జోమానో, మహీంద్రా రేసింగ్ సీఈవో దిల్బాగ్ గిల్, మేఘా సంస్థ ప్రతినిధి అఖిల్రెడ్డి, రాష్ట్ర ఎలక్ట్రిక్ వాహనాల సంచాలకుడు సుజయ్ కారంపురి మాట్లాడారు.
ఫార్ములా- ఈ అంటే?
ఫార్ములా వన్.. రేసింగ్పై అభిరుచి ఉన్న ప్రపంచ వ్యాప్త అభిమానులందరికీ పరిచయం అక్కర్లేని ఛాంపియన్షిప్ ఇది. కార్లను ట్రాక్పై రయ్మని పరుగులు పెట్టిస్తూ.. తమ వేగంతో రేసర్లు ఎఫ్1లో అదరగొడతారు. ఏడాదిలో 20కు పైగా గ్రాండ్ప్రిలు.. వాటిల్లో గెలిచిన పాయింట్ల ఆధారంగా చివర్లో అగ్రస్థానంలో నిలిచే రేసర్కు ప్రపంచ ఛాంపియన్ టైటిల్ దక్కుతుంది. మరి ఫార్ములా- ఈ అంటే.. అది కూడా ఫార్ములా వన్ లాంటిదే. కానీ అక్కడ ఇంధనంతో నడిచే కార్లు పోటీల్లో పరుగులు పెడితే.. ఫార్ములా- ఈ రేసుల్లో ఎలక్ట్రిక్ కార్లు ట్రాక్పై దూసుకెళ్తాయి. ఫార్ములా- ఈ, ఎఫ్1 మధ్య ఇదే ప్రధాన తేడా. ఎఫ్1 ఛాంపియన్షిప్ను నిర్వహించే అంతర్జాతీయ ఆటోమొబైల్ సమాఖ్య (ఎఫ్ఐఏ)నే ఫార్ములా- ఈ రేసులనూ నిర్వహిస్తోంది. నగరాల్లోని రోడ్లపై కూడా ఈ రేసులు నిర్వహించడమే దీని ప్రత్యేకత. మన మహీంద్రాతో పాటు మెర్సిడెస్, నిసాన్, జాగ్వర్, పోర్షే లాంటి జట్లు ఈ ఛాంపియన్షిప్లో పోటీపడుతున్నాయి. ఎఫ్1 కార్లు అత్యధికంగా గంటకు 397 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలవు. ఫార్ములా- ఈ కార్లలో అది గంటకు 280 కిలోమీటర్లుగా ఉంది. కర్బన ఉద్గారాలు లేని కారు రేసులు నిర్వహించడం, విద్యుత్తు వాహనాలకు డిమాండ్ పెంచాలనే లక్ష్యంతో 2014లో ఫార్ములా- ఈ ఛాంపియన్షిప్కు శ్రీకారం చుట్టారు. పర్యావరణ హితం కోసం మొదలెట్టిన ఈ ఛాంపియన్షిప్కు క్రమంగా ఆదరణ పెరుగుతోంది.
స్వదేశంలో ఈ పోటీలు నా చిరకాల స్వప్నం: ఆనంద్మహీంద్రా
ఫార్ములా ఈ-రేసు నిర్వహణ అవకాశాన్ని హైదరాబాద్ దక్కించుకోవడంపై మంత్రి కేటీఆర్ను మహీంద్రాగ్రూపు అధినేత ఆనంద్ మహీంద్రా అభినందించారు. తమ చిరకాల స్వప్నం నెరవేరిందన్నారు. రేసింగ్లో చాలాకాలంగా విదేశాల్లో తమ జట్టు పాల్గొంటోందన్నారు. స్వదేశంలో, స్థానిక ప్రేక్షకుల మధ్య ఈ పోటీలు జరిగితే ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటుందని తాను నమ్మేవాడినని, ఈ కలను సాకారం చేసే దిశగా అడుగులు వేశారని ట్విటర్ ద్వారా కేటీఆర్కు ఆయన ధన్యవాదాలు తెలిపారు. హైదరాబాద్లో పోటీకి తమ జట్టు సిద్ధమవుతోందన్నారు. దీనిపై కేటీఆర్ స్పందిస్తూ ఆనంద్ మహీంద్రాకు కృతజ్ఞతలు చెప్పారు. తెలంగాణను ఎలక్ట్రిక్ వాహనాల తయారీ హబ్గా మార్చేందుకు మద్దతు, మార్గదర్శకత్వం కావాలని కోరారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పతి దేవుడికి గుడి కట్టింది!
కరోనా మహమ్మారి ఆమె జీవితంలో అంతులేని విషాదాన్ని నింపింది. కళ్లల్లో పెట్టుకుని చూసుకునే భర్తను తన నుంచి దూరం చేసింది. మూడేళ్ల క్రితం భర్త కొవిడ్తో మృతి చెందడంతో ఆమె ఒంటరిగా మారారు. -
కొత్తవారొచ్చారు
ఆంధ్రప్రదేశ్ నిఘా విభాగాధిపతిగా సీనియర్ ఐపీఎస్ అధికారి కుమార్ విశ్వజిత్ను, విజయవాడ నగర పోలీసు కమిషనర్గా పీహెచ్డీ రామకృష్ణను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. -
జేఈఈ మెయిన్స్లో తెలుగోళ్ల సత్తా
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. దేశవ్యాప్తంగా 56 మందికి 100 పర్సంటైల్ రాగా.. ఇందులో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందినవారే 22 మంది ఉన్నారు. జేఈఈ మెయిన్స్ తుది ఫలితాలను జాతీయ పరీక్షల విభాగం (ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసింది. -
కాళేశ్వరంపై కమిషన్ విచారణ షురూ
కాళేశ్వరం ఎత్తిపోతల్లోని బ్యారేజీలపై న్యాయ విచారణకు ఏర్పాటు చేసిన కమిషన్ కార్యాచరణ మొదలుపెట్టింది. బుధవారం కమిషన్ ఛైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ ఆయన సతీమణి దేబ్జానీ ఘోష్తో కలిసి హైదరాబాద్కు చేరుకున్నారు. -
ఫస్టియర్లో 60.01%.. సెకండియర్లో 64.19%
ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో 60.01 శాతం, రెండో సంవత్సరంలో 64.19 శాతం మంది విద్యార్థులు (ఒకేషనల్ కోర్సులతో కలిపి) ఉత్తీర్ణత సాధించారు. -
కవిత బెయిల్పై మే 6న తీర్పు
ఈడీ కేసులో బెయిల్ కోసం భారాస ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్పై తీర్పును ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు మే 6కి వాయిదా వేసింది. -
చదువుల ‘సిరి’.. రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని పట్టుదల
వారానికి రెండుసార్లు డయాలసిస్.. ఒంట్లో సత్తువ లేక కళాశాలకూ వెళ్లలేని పరిస్థితి.. అయినా మొక్కవోని పట్టుదలతో చదివిన పేదింటి బిడ్డ ప్రతిభ చాటింది. -
విజన్-2026కు డోర్నకల్ ఉపాధ్యాయుల శ్రీకారం
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు విజన్-2026 పేరిట ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. -
ఇంటర్ ఫలితాల్లో కవలల ప్రతిభ
సూర్యాపేట జిల్లా ఆత్మకూర్(ఎస్) మండల కేంద్రానికి చెందిన డేగల వీరభద్రయ్య, మంజుల దంపతుల కవల పిల్లలు డేగల రామ్, లక్ష్మణ్ ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో ప్రతిభ చూపారు. -
రాష్ట్రంలో వంతెనల పరిశీలన..!
రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న చిన్నా, పెద్ద వంతెనలను పరిశీలించేందుకు అధికారులు ఆయత్తం అవుతున్నారు. జిల్లాల వారీగా నిర్మాణ స్థితిగతులపై జాబితాలను రూపొందించే పనిలో ఉన్నారు. -
యాదాద్రి విద్యుత్కేంద్రానికి పర్యావరణ అనుమతి
యాదాద్రి థర్మల్ విద్యుత్కేంద్రానికి పర్యావరణ అనుమతి (ఈసీ) ఇవ్వడానికి కేంద్ర పర్యావరణ శాఖ ఆమోదం తెలిపింది. -
మెట్రో రైలు శబ్దకాలుష్యంపై వివరణివ్వండి
మెట్రో రైల్వే లైను వంపుల్లో రైలు వెళ్లినపుడు పరిమితికి మించి వస్తున్న శబ్దకాలుష్యంపై వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వానికి, మెట్రో రైల్వే ఎండీకి బుధవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
ఆర్జేసీ, మోడల్, కేజీబీవీ విద్యార్థుల ప్రతిభ
టీఎస్ఆర్జేసీ నేరెళ్ల గురుకుల విద్యార్థిని ఎంపీసీలో 991 మార్కులు, బైపీసీలో తాటిపల్లి విద్యార్థిని 990 మార్కులు సాధించినట్లు యాజమాన్యం తెలిపింది. -
ఫోన్ ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావుకు మధ్యంతర బెయిలు నిరాకరణ
ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టయిన టాస్క్ఫోర్స్ మాజీ ఓఎస్డీ రాధాకిషన్రావుకు ఎల్ఎల్ఎం పరీక్షలు రాసేందుకు వీలుగా మధ్యంతర బెయిలు ఇచ్చేందుకు నాంపల్లి కోర్టు నిరాకరించింది. -
పోలింగ్ రోజు వేతనంతో కూడిన సెలవు
లోక్సభ ఎన్నికల పోలింగ్ జరిగే రోజును వేతనంతో కూడిన సెలవుగా ప్రకటించారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్రాజ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
జస్టిస్ రామలింగేశ్వరరావుకు హైకోర్టు ఘన నివాళి
గుండెపోటుతో ఇటీవల మృతి చెందిన ఉమ్మడి హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎ.రామలింగేశ్వరరావుకు బుధవారం హైకోర్టు ఘన నివాళి అర్పించింది. -
శనగ విత్తనోత్పత్తి రైతుల ఆందోళన
‘పంట విక్రయించి నెల రోజులవుతోంది. డబ్బులు ఎప్పుడు ఇస్తారో.. క్వింటాకు ఎంత కట్టిస్తారో ఇప్పటికీ తెలియదు. -
విచారణ నుంచి తప్పుకొన్న జస్టిస్ శేషసాయి ధర్మాసనం
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసుపై మాట్లాడొద్దంటూ కడప జిల్లా కోర్టు(పీడీజే) ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ వివేకా కుమార్తె నర్రెడ్డి సునీత, పులివెందుల తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.రవీంద్రనాథ్రెడ్డి అలియాస్ బీటెక్ రవి దాఖలు చేసిన వ్యాజ్యాల విచారణ నుంచి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏవీ శేషసాయి నేతృత్వంలోని ధర్మాసనం తప్పుకొంది. -
ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఇంటర్ ప్రవేశాలు
రాష్ట్రంలోని ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో ప్రవేశాల పేరిట డొనేషన్లు, అధిక రుసుముల వసూళ్లు, ఇతరత్రా అక్రమాలను నిరోధించేందుకు వీలుగా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఆన్లైన్ ప్రవేశాల విధానాన్ని ప్రవేశపెట్టాలని యోచిస్తున్నామని విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. -
మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ
ష్ట్రంలో మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. షెడ్యూలును విద్యాశాఖ బుధవారం విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు (4)
రాష్ట్రంలో వచ్చే నెల 6వ తేదీన జరగనున్న తెలంగాణ రాష్ట్ర ఇంజినీరింగు కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (టీఎస్ఈసెట్)ను మే చివరి వారానికి వాయిదా వేయాలని పలువురు అభ్యర్థులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని కోరారు.
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!
-
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా
-
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
-
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు
-
323km రేంజ్.. 155km టాప్ స్పీడ్తో అల్ట్రావయోలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్