Nagaland Firing: పౌరులపై కాల్పులు విచారకరం
నాగాలాండ్ కాల్పుల ఘటనపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర విచారం వ్యక్తంచేసింది. ఈ వ్యవహారంపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) నెల రోజుల్లోనే దర్యాప్తును ముగిస్తుందని తెలిపింది. సాధారణ పౌరులపై కాల్పులు పునరావృతం కాకుండా సాయుధ
నాగాలాండ్ ఘటనలపై లోక్సభలో అమిత్ షా వివరణ
దిల్లీ: నాగాలాండ్ కాల్పుల ఘటనపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర విచారం వ్యక్తంచేసింది. ఈ వ్యవహారంపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) నెల రోజుల్లోనే దర్యాప్తును ముగిస్తుందని తెలిపింది. సాధారణ పౌరులపై కాల్పులు పునరావృతం కాకుండా సాయుధ బలగాలు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని హితవు పలికింది. నాగాలాండ్లో తాజా పరిణామాలపై తాము కన్నేసి ఉంచామని పేర్కొంది. అక్కడ శాంతియుత వాతావరణం నెలకొల్పేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించింది. నాగాలాండ్ కాల్పుల వ్యవహారంపై ప్రతిపక్షాల డిమాండ్ల నేపథ్యంలో లోక్సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా సోమవారం ఈ మేరకు వివరణ ఇచ్చారు. సైన్యం కాల్పుల్లో మృతిచెందినవారి కుటుంబాలకు తీవ్ర సంతాపం తెలిపారు. కాల్పులు చోటుచేసుకున్న పరిణామక్రమాన్ని ఆయన సభకు నివేదించారు.
‘‘నాగాలాండ్లోని మోన్ జిల్లాలో తిరుగుబాటుదారుల కదలికలపై సైన్యానికి శనివారం సమాచారం అందింది. వెంటనే మెరుపుదాడి జరిపేందుకు 21 పారా కమాండో బలగాలు రంగంలోకి దిగాయి. తిరు, ఓటింగ్ గ్రామాల మధ్య రోడ్డుపై వెళ్తున్న ఓ వాహనాన్ని ఆపేందుకు ప్రయత్నించాయి. బలగాల సిగ్నల్ను పట్టించుకోకుండా వాహనం మరింత వేగంగా ముందుకెళ్లేందుకు ప్రయత్నించింది. దీంతో- అందులో తిరుగుబాటుదారులు ఉన్నారని అనుమానించి భద్రతా సిబ్బంది కాల్పులు జరిపారు. వాహనంలో ఉన్న 8 మందిలో ఆరుగురు కాల్పుల్లో మృత్యువాతపడ్డారు. వారు తిరుగుబాటుదారులు కాదని, బలగాల పొరపాటు కారణంగా కాల్పులు చోటుచేసుకున్నాయని తర్వాత నిర్ధారణ అయింది. గాయపడ్డ ఇద్దరిని సైనిక సిబ్బంది ఆసుపత్రికి తరలించారు. కాల్పుల సంగతి తెలియగానే స్థానికులు బలగాలను చుట్టుముట్టి దాడి చేశారు. ఈ ఘర్షణలో ఓ సైనికుడు ప్రాణాలు కోల్పోయాడు. పలువురు గాయపడ్డారు. ఆందోళనకారులను చెదరగొట్టే ప్రయత్నంలో ఆత్మరక్షణ కోసం భద్రతా బలగాలు మళ్లీ కాల్పులు జరిపాయి. ఫలితంగా మరో ఏడుగురు పౌరులు దుర్మరణం పాలయ్యారు. ఆందోళనకారులు ఆదివారం సాయంత్రం అస్సాం రైఫిల్స్ శిబిరంపై దాడి చేయగా.. అక్కడ సిబ్బంది కాల్పులు జరపడంతో ఓ పౌరుడు మృత్యువాతపడ్డాడు’’ అని షా వివరించారు. అమిత్ షా ప్రకటనపై సంతృప్తి చెందని కాంగ్రెస్, డీఎంకే, ఎస్పీ, బీఎస్పీ, ఎన్సీపీ సహా పలు ప్రతిపక్ష పార్టీల సభ్యులు లోక్సభ నుంచి వాకౌట్ చేశారు. తృణమూల్ ఎంపీలు వాకౌట్ చేయలేదు.
ఓటింగ్ వద్ద జరిగిన కాల్పుల్లో మృతులకు నివాళులర్పిస్తున్న కుటుంబసభ్యులు, స్థానికులు
దద్దరిల్లిన పార్లమెంటు
అంతకుముందు, నాగాలాండ్ కాల్పుల వ్యవహారం పార్లమెంటును కుదిపేసింది. పౌరుల హత్యలను కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, శివసేన, వైకాపా, డీఎంకే, బీఎస్పీ సహా పలు పార్టీల ఎంపీలు తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనపై నిష్పక్షపాత దర్యాప్తు జరిపించాలని, నాగాలాండ్లో సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని (ఏఎఫ్ఎస్పీఏ) ఉపసంహరించుకోవాలని, కాల్పులపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. ఏఎఫ్ఎస్పీఏను ఎప్పుడు రద్దు చేస్తారో చెప్పాలంటూ కేంద్రాన్ని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ నిలదీశారు.
తీవ్ర దురదృష్టకరం: ఎం.వెంకయ్యనాయుడు
పౌరులపై కాల్పుల వ్యవహారం రాజ్యసభనూ తాకింది. తొలుత ఈ ఘటనపై కేంద్ర హోంమంత్రి ప్రకటన చేయాలని ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే (కాంగ్రెస్) డిమాండ్ చేశారు. ఛైర్మన్ ఎం.వెంకయ్యనాయుడు స్పందిస్తూ.. తాను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, హోంమంత్రి అమిత్ షాలతో మాట్లాడానని తెలిపారు. సోమవారం మధ్యాహ్నమే ప్రకటన చేస్తానంటూ షా తనకు చెప్పినట్లు పేర్కొన్నారు. ప్రతిపక్ష నేత అప్పటికే ఆ అంశాన్ని లేవనెత్తిన నేపథ్యంలో ఇతర ఎంపీలు దానిపై మాట్లాడేందుకు ఛైర్మన్ వెంకయ్య నాయుడు అనుమతి ఇవ్వలేదు. షా ప్రకటన చేశాక మళ్లీ ఆ అంశంపై మాట్లాడేందుకు అనుమతిస్తానని హామీ ఇచ్చారు. కాల్పుల ఘటన తీవ్ర దురదృష్టకరమని వెంకయ్యనాయుడు అన్నారు. దాని సున్నితత్వం, తీవ్రతను దృష్టిలో పెట్టుకొని నడుచుకోవాలని ఎంపీలకు సూచించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఉపాధి కూలీల కనీస వేతనం రూ.300
ఏప్రిల్ నుంచి మొదలయ్యే కొత్త ఆర్థిక సంవత్సరంలో (2024-25) రాష్ట్రంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (నరేగా) కూలీల కనీస వేతనం రూ.300గా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. -
ప్రవీణ్ప్రకాశ్ భేటీ వెనుక ఉద్దేశం ఏమిటో!
రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థుల తల్లిదండ్రులతో ఏప్రిల్ 23న ప్రత్యేక సమావేశం నిర్వహిస్తానని పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ ప్రకటించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
ఊసరవెల్లులే సిగ్గుతో చచ్చిపోతాయ్!
దెయ్యాలు వేదాలు వల్లించడమంటే ఇదేనేమో! మాజీ మంత్రి వై.ఎస్.వివేకానందరెడ్డి హత్య కేసు గురించి సీఎం జగన్ ప్రొద్దుటూరు సభలో బుధవారం చేసిన వ్యాఖ్యలు వింటే ఊసరవెల్లులు సైతం సిగ్గుతో చచ్చిపోతాయేమో! -
సీఎం పీఆర్ఓలా... వైకాపా నాయకులా?
ముఖ్యమంత్రి జగన్ కార్యాలయంలో ప్రజాసంబంధాల అధికారులు (పీఆర్ఓ)గా పనిచేస్తున్నవారు ఎన్నికల నిబంధనల్ని తుంగలో తొక్కుతూ అధికారపార్టీ సేవలో తరిస్తున్నారు. -
కంప్యూటర్ ఎక్కడ? ఇంకా బిల్లులెన్ని ఉన్నాయి?.. ఆసుపత్రిలో ట్రెజరీ ఉద్యోగి కలవరింతలు
‘కంప్యూటర్ ఏదీ.. ఎక్కడ ఉంది.. మౌస్ కనిపించట్లేదు. బిల్లులు ఇంకా ఎన్ని ఉన్నాయి. త్వరగా చూడాలి. ఫైళ్లన్నీ తీసుకురండి’ అంటూ మడకశిర ఉప ఖజనా శాఖ (ఎస్టీఓ) కార్యాలయంలో పని చేస్తున్న సీనియర్ ఎకౌంటెంట్ హరినాథ్ ఆసుపత్రి పడకపై కలవరిస్తున్న తీరు హృదయ విదారకంగా ఉంది. -
సీఎంను కీర్తించేందుకు.. ‘మేమంతా సిద్ధం’!
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర గురువారం నంద్యాల జిల్లాలో జరగనుంది. ఉదయం ఆళ్లగడ్డ నుంచి జగన్ బస్సు యాత్ర పలు గ్రామాల మీదుగా ప్రయాణించి నంద్యాల చేరుకుంటుంది. -
దాడి చేసి.. దండంతో సరి!
కాకినాడలోని పెద్ద శివాలయంలో అర్చకులు వెంకట సత్యసాయి, విజయ్కుమార్లను కొట్టిన మాజీ కార్పొరేటర్, వైకాపా నేత సిరియాల చంద్రరావును కాపాడేందుకు ఆ పార్టీ నాయకులు నానాతంటాలు పడుతున్నారు. -
సంధ్య ఆక్వా ఎండీ సోదరుడి ఇంటికి మంత్రి మేరుగు నాగార్జున.. ముచ్చట్లలో మర్మమేమి?
‘డ్రైడ్ఈస్ట్ పేరుతో విశాఖకు మాదక ద్రవ్యాలను దిగుమతి చేస్తుంటే సీబీఐ ఈ మధ్యకాలంలో దాడి చేసింది. పచ్చసోదరులంతా ఉలిక్కిపడి.. మన (వైకాపా)మీద నెట్టేయడానికి సిద్ధమయ్యారు. -
స్క్రీనింగ్ లేకుండానే రూ. 2,000 కోట్ల చెల్లింపులు
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత రూ.2,000 కోట్ల చెల్లింపులు ఎలాంటి స్క్రీనింగ్ లేకుండానే జరిగిపోయాయి. ఇందులో పారదర్శకత లేదు. -
బాబాయిని చంపిందెవరో దేవుడికి, ప్రజలకు తెలుసు
వివేకానందరెడ్డి హత్యపై 2019 ఎన్నికల ముందు పదేపదే మాట్లాడిన జగన్ సీఎం అయ్యాక ఆ విషయాన్ని ప్రస్తావించనే లేదు. తాజాగా సార్వత్రిక ఎన్నికల ముందు ప్రొద్దుటూరు సభలో మరోసారి బాబాయి హత్య, హంతకుల గురించి మాట్లాడుతూ..వారికి మద్దతిస్తున్నారంటూ చంద్రబాబును విమర్శించారు. -
జగన్ అనే నేను.. ఒక వినాశకారి!
జగన్ అనే నేను... ఆంధ్రావనికి ఒక్క పరిశ్రమనూ రానివ్వనని పాత వాటిని పారదోలుతానని... కొత్త కొలువులు సృష్టించనని... అంతఃకరణ శుద్ధితో ఆత్మసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.... ... అని చెప్పకున్నా... అయిదేళ్లుగా దాదాపు ఆ పనే చేశారు వైకాపా నేత! -
ఎన్నికల కోడ్ తర్వాత రూ.వేల కోట్ల పందేరం
ఎవరైనా మనకు ఆర్టీజీఎస్, నెఫ్ట్, ఐఎంపీఎస్ విధానంలో డబ్బులు బదిలీ చేస్తే మన ఖాతాకు ఎంతసేపట్లో చేరతాయి? కొద్ది గంటల్లో రావచ్చు. -
ఏం అభివృద్ధి చేశారని మా ఊరొచ్చారు?
‘సారూ.. ఏం అభివృద్ధి చేశారని మా ఊరొచ్చారు?’ అని ఏలూరు జిల్లా నూజివీడు ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప అప్పారావును మహిళలు, గ్రామస్థులు నిలదీశారు. -
‘యాప్’రే రూ.30 లక్షలా?
విద్యార్థులు ఫీజుల రూపంలో చెల్లించే డబ్బులను ఉన్నత విద్యామండలి దుర్వినియోగం చేస్తోంది. బ్యాంకు ఖాతాల్లో రూ.కోట్లు ఉండడంతో ఏదో ఒక కార్యక్రమం పేరు చెప్పి, వాటిని ఖాళీ చేస్తోంది. -
తిరుమలలో జస్టిస్ దుప్పల వెంకటరమణ కుమారుడి వివాహ వేడుక
మధ్యప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దుప్పల వెంకటరమణ కుమారుడు భానుప్రకాశ్, సౌజన్యల వివాహ వేడుక స్థానిక పుష్పగిరి మఠంలో బుధవారం జరిగింది. -
శ్రీవారి సేవలో అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి
అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డి.రమేష్ బుధవారం శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం శ్రీవారి ఆలయం వద్దకు చేరుకున్న న్యాయమూర్తి కుటుంబానికి తితిదే అధికారులు స్వాగతం పలికారు. -
డోన్, విజయనగరం జిల్లా గుత్తేదార్లకే టోకెన్లు
కేంద్ర రహదారి మౌలిక వసతుల నిధి (సీఆర్ఐఎఫ్) కింద పనులు చేసిన గుత్తేదారులు రూ.176 కోట్ల బిల్లుల కోసం సీఎఫ్ఎంఎస్లో అప్లోడ్ చేసి చాలాకాలంగా ఎదురుచూస్తున్నారు. -
అప్పు తేవాలి.. బొగ్గు కొనాలి!
అప్పు పుడితే బొగ్గు వస్తుంది.. బొగ్గు వస్తే థర్మల్ యూనిట్లు నడుస్తాయి.. ఇదీ ఏపీ జెన్కో పరిస్థితి. రాష్ట్ర విద్యుత్ అవసరాల్లో సుమారు 40 శాతం జెన్కో నుంచి అందుతోంది. -
ఆరంభమే ఫ్లాప్
వైకాపా అధ్యక్షుడు, ముఖ్యమంత్రి జగన్ ప్రచార యాత్ర ఆరంభమే ఫ్లాప్ అయింది.. గత ఎన్నికల్లో స్వీప్ చేసిన సొంత జిల్లాలో జనం ఆయనకు షాకిచ్చారు. -
నమ్మించారు.. వంచించారు
‘హైదరాబాద్కు సముద్రాన్ని తీసుకొస్తా’ అని సినిమాలో ఒక రాజకీయ నాయకుడి పాత్రలో నటుడు చెప్పినట్లుగా.. మన ముఖ్యమంత్రి హామీల మీద హామీలు గుప్పించారు. -
జగన్ ‘ఓట్లాట’లో ఓడిన రైతు!
కనికట్టు చేయడంలో... మాటల గారడీతో మభ్యపెట్టడంలో... పేటెంట్ హక్కు సీఎం జగన్దే... మొన్నటి వరకు విద్యుత్ కోతలతో ప్రజలను అల్లాడించిన వ్యక్తే... ఇప్పుడు ఎన్నికలు రావడంతో పంథా మార్చేశారు... వేసవి కాలం పేరిట ఓటర్లను ఏ‘మార్చు’తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఫోన్ ట్యాపింగ్ కేసు.. పోలీసుల అదుపులో మరో ఇద్దరు
-
ఎంఎఫ్లో మదుపు చేస్తున్నారా? రీకేవైసీకి మార్చి 31 డెడ్లైన్!
-
వివేకా హత్యకేసు.. సీబీఐ కోర్టుకు ఎంపీ అవినాష్రెడ్డి
-
‘హార్దిక్ కెప్టెన్సీ దారుణం’.. సోషల్ మీడియా యూజర్ వ్యాఖ్యలకు భారత మాజీ క్రికెటర్ కౌంటర్
-
రివ్యూ: ఆడుజీవితం: ది గోట్లైఫ్.. పృథ్వీరాజ్ సుకుమారన్ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
స్కిల్ డెవలప్మెంట్ కేసు.. అచ్చెన్నాయుడికి ఊరట