CM KCR: ఉపేక్షించం
తెలంగాణ నుంచి వరి ధాన్యాన్ని తీసుకునే విషయంలో కేంద్రం అసంబద్ధ, ద్వంద్వ వైఖరిని అవలంబిస్తోందని, ఇది రాష్ట్ర కర్షకులకు, దేశ వ్యవసాయరంగానికి ఇబ్బందికరంగా మారిందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. అన్ని రాష్ట్రాల్లో ఒకేలా సేకరణ జరిగేలా... తక్షణమే సమగ్ర జాతీయ ధాన్యసేకరణ విధానం ప్రకటించాలని డిమాండు చేశారు. రాష్ట్ర రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు కట్టుబడి
డిమాండ్ల సాధనకు సభలో, బయటా ఆందోళనలు
కేంద్రానిది అసంబద్ధ, ద్వంద్వ వైఖరి...
సమగ్ర జాతీయ ధాన్య సేకరణ విధానం ప్రకటించాలి
పార్లమెంటు వేదికగా కేంద్రం తీరును ఎండగడదాం
ప్రాజెక్టులు, నిధుల కోసం ఒత్తిడి తేవాలి
తెరాస పార్లమెంటరీ పార్టీ సమావేశంలో సీఎం కేసీఆర్
ఈనాడు, హైదరాబాద్: తెలంగాణ నుంచి వరి ధాన్యాన్ని తీసుకునే విషయంలో కేంద్రం అసంబద్ధ, ద్వంద్వ వైఖరిని అవలంబిస్తోందని, ఇది రాష్ట్ర కర్షకులకు, దేశ వ్యవసాయరంగానికి ఇబ్బందికరంగా మారిందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. అన్ని రాష్ట్రాల్లో ఒకేలా సేకరణ జరిగేలా... తక్షణమే సమగ్ర జాతీయ ధాన్యసేకరణ విధానం ప్రకటించాలని డిమాండు చేశారు. రాష్ట్ర రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు కట్టుబడి ఉన్నామని, దీనిపై పార్లమెంటు వేదికగా కేంద్రాన్ని నిలదీస్తామని పేర్కొన్నారు. కేంద్రం తెలంగాణ పట్ల సానుకూలంగా లేదని, ఏడేళ్లుగా ఓపిక పట్టామని, ఇక ఉపేక్షించేది లేదన్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులకు సంబంధించి తీవ్ర ఒత్తిడి తేవాలని, తెలంగాణ వాణిని పార్లమెంటులో గట్టిగా వినిపించాలని... సభ బయటా నిరసనలు తెలపాలని స్పష్టం చేశారు. సోమవారం నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాల నేపథ్యంలో ఆదివారం ప్రగతిభవన్లో కేసీఆర్తో తెరాస పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. దీనికి తెరాస పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు, వ్యవసాయ, రోడ్లుభవనాల శాఖల మంత్రులు నిరంజన్రెడ్డి, ప్రశాంత్రెడ్డి, ఎంపీలు లక్ష్మీకాంతరావు, కె.ఆర్.సురేశ్రెడ్డి, జోగినపల్లి సంతోష్ కుమార్, బీబీపాటిల్, కొత్త ప్రభాకర్రెడ్డి, గడ్డం రంజిత్రెడ్డి, పోతుగంటి రాములు, పసునూరి దయాకర్, మాలోత్ కవిత, బి.వెంకటేశ్ నేత, మన్నె శ్రీనివాస్రెడ్డి, ఎమ్మెల్సీ వెంకట్రామరెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్శర్మ, సీఎస్ సోమేశ్కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఎంపీలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు.
ప్రగతిభవన్లో ఆదివారం జరిగిన తెరాస పార్లమెంటరీ పార్టీ సమావేశంలో మాట్లాడుతున్న తెరాస
అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్. చిత్రంలో, మంత్రి నిరంజన్ రెడ్డి, తెరాస పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు
అన్నింటా అన్యాయమే
‘ఏడేళ్లుగా తెలంగాణకు కేంద్రం చేసిందేమీ లేదు. విభజన హామీలను పూర్తిగా విస్మరించింది. ధాన్యం సేకరణపై కేంద్రం తీరు దారుణంగా ఉంది. రైతుల గురించి ఆలోచించకుండా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటోంది. రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థనలను పెడచెవిన పెట్టింది. ఈ వానాకాలంలో వరిధాన్యం సాగు విస్తీర్ణం విషయంలో పూటకోమాట మాట్లాడుతూ కిరికిరి పెడుతోంది. 90 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం సేకరించాల్సి ఉండగా... 60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని(40 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని) మాత్రమే సేకరిస్తామని కేంద్రం మళ్లీ పాతపాటే పాడుతోంది. రాష్ట్ర రైతుల సమస్యనే అత్యంత ప్రాధాన్యాంశంగా పార్లమెంటులో లేవనెత్తాలి. కనీస మద్దతు ధర చట్టం, విద్యుత్ చట్టం రద్దు కోసం పోరాడాలి. నదీజలాల్లో రాష్ట్ర వాటా ఖరారు కోసం పట్టుబట్టాలి. కేంద్రం వైఖరి ఎలా ఉన్నా తెలంగాణలో రైతులకు యథావిధిగా ఉచిత విద్యుత్ సరఫరా చేస్తాం’ అని తెలిపారు.
పాల్గొన్న ఎంపీలు
కేంద్రం వైఖరిపై సమావేశం అసంతృప్తి
ధాన్యం దిగుబడిలో అనతి కాలంలో మన కర్షకులు.. దేశ రైతాంగానికి ఆదర్శంగా నిలుస్తున్న క్రమంలో, కేంద్రం అనుసరిస్తున్న వైఖరి తెలంగాణ వ్యవసాయ రంగానికి అశనిపాతంగా మారిందని పార్లమెంటరీ పార్టీ సమావేశం అసంతృప్తి వ్యక్తం చేసింది. రాష్ట్ర మంత్రులు, అధికారుల బృందం దిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ని, కేంద్ర ప్రభుత్వ అధికారులను కలసి విజ్ఞప్తి చేసినా ఎటూ తేల్చడం లేదని పేర్కొంది. వార్షిక ధాన్యసేకరణ క్యాలండర్ను విడుదల చేయాలని సీఎం కేసీఆర్ చక్కటి సూచన చేసినా కేంద్రం స్పందించడం లేదని, అయోమయం, అస్పష్టతతో గందరగోళం సృష్టిస్తోందని, దీనిపై పోరాడాలని నిర్ణయించింది.
ధాన్యం కొనుగోళ్లపై సమీక్ష
అంతకుముందు ప్రగతిభవన్లో ధాన్యం కొనుగోళ్లపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రులతో జరిగిన చర్చల సారాంశాన్ని సీఎంకు మంత్రి నిరంజన్రెడ్డి వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వలకు చిక్కిన 30 కిలోల చేప
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని రాజరాజేశ్వర జలాశయంలో నీటి నిల్వ తగ్గడంతో మత్స్యకారుడి వలకు గురువారం భారీ చేప చిక్కింది. -
నిప్పుల గుండంలా తెలంగాణ.. ఆరు జిల్లాల్లో 45 డిగ్రీల కంటే ఎక్కువే..
రాష్ట్రం నిప్పుల గుండంలా మారింది. గురువారం రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం నుంచే ప్రారంభమైన వేడి మధ్యాహ్నానికి తీవ్రస్థాయికి చేరింది. -
ఈపీఎస్ ఆదాయం పెరుగుతున్నా.. కనీస పింఛను రూ.వెయ్యేనా?
ఉద్యోగుల పింఛను నిధి పథకం (ఈపీఎస్) ఆదాయం పెరుగుతున్నా.. లబ్ధిదారులు కనీస పింఛను పెంపునకు నోచుకోక ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు వృద్ధాప్య పింఛను కింద నెలకు రూ.2 వేలు ఇస్తుండగా.. ఈపీఎఫ్వో పింఛనుదారులు దాదాపు 75 శాతం మంది నెలకు రూ.వెయ్యితో జీవితాలను నెట్టుకువస్తుండడం పరిస్థితికి అద్దం పడుతోంది. -
ఏపీ సీఎస్, డీజీపీలపై.. ఈసీఐ నిర్ణయం కోసం చూస్తున్నాం
ఆంధ్రప్రదేశ్లోని సీనియర్ అధికారులపై అందిన ఫిర్యాదులపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) తీసుకునే నిర్ణయం కోసం వేచిచూస్తున్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా చెప్పారు. -
వైకాపాకు ప్రచారం చేసిన వెంకట్రామిరెడ్డిపై ఈసీ వేటు
వైకాపాతో అంటకాగుతూ.. ఆ పార్టీ కార్యకర్తలా వ్యవహరిస్తున్న రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఎట్టకేలకు వేటు పడింది. -
గులకరాయి కేసులో ఏ2 ఎవరు..?
సీఎం జగన్పై గులకరాయి విసిరిన కేసులో విజయవాడ పోలీసులు గురువారం అరెస్టు చూపించారు. అజిత్సింగ్నగర్ వడ్డెర కాలనీకి చెందిన సతీష్ అలియాస్ సత్తిని నిందితుడిగా తేల్చారు. -
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
పెద్దపులిని చూస్తే అడవిలో జంతువులు హడలిపోతాయి. ఒక్క ఎలుగుబంటి తప్ప. భల్లూకానికి కోపం వస్తే పెద్దపులిని సైతం పరుగులు పెట్టిస్తుంది. -
ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్రాజ్ తెలిపారు. -
ఆ 106 ఎకరాలు రక్షిత అటవీభూమే
భూపాలపల్లి జిల్లా కేంద్రం సమీపంలోని కొంపెల్లి గ్రామ పరిధిలోని సర్వే నం.171/3 నుంచి 171/7ల్లో ఉన్న రూ.వందల కోట్ల విలువైన 106.34 ఎకరాలు అటవీభూమేనని, అది ప్రైవేటు వ్యక్తులది కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
రూ.800 కోట్ల బియ్యం ఏమయ్యాయి?
రైస్మిల్లులకు వెళ్లిన ధాన్యం కస్టమ్ మిల్లింగ్(సీఎంఆర్) తర్వాత తిరిగిరావడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. అనేక వాయిదాలు ఇచ్చినప్పటికీ పలు జిల్లాల్లో మిల్లర్లు బియ్యం ఇవ్వలేకపోతున్నారు. -
జర్మనీలో ఘనంగా హిందూ నూతన సంవత్సర వేడుకలు
హిందూ నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని జర్మనీలోని మైంజ్-విస్బాడెన్లో భారత్ వాసి జర్మనీ అసోసియేషన్ ఘనంగా వేడుకలు నిర్వహించింది. -
ఎయిమ్స్లో హీమోడయాలసిస్ యూనిట్ ఏర్పాటు
యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీనగర్ ఎయిమ్స్లో హీమోడయాలసిస్ యూనిట్ను డైరెక్టర్ వికాస్ భాటియా గురువారం ప్రారంభించారు. -
ఇథనాల్ కంపెనీల అనుమతులు రద్దు చేయాలి
పంట పొలాలకు తీవ్ర నష్టం కలిగిస్తూ పర్యావరణ విధ్వంసానికి కారణమవుతున్న 28 ఇథనాల్ కంపెనీల అనుమతులను వెంటనే రద్దు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రొఫెసర్ హరగోపాల్ డిమాండ్ చేశారు. -
జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ 30కి వాయిదా
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అక్రమాస్తుల వ్యవహారంలో సీబీఐ నమోదు చేసిన 11 కేసులతోపాటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నమోదు చేసిన 9 కేసుల విచారణను హైదరాబాద్ సీబీఐ కోర్టు ఈ నెల 30వ తేదీకి వాయిదా వేసింది. -
ఓటేద్దాం.. పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేసుకుందాం
దేశంలోని పర్యాటక ప్రాంతాల్లో వివిధ సౌకర్యాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం ‘దేఖో అప్నాదేశ్ పీపుల్ ఛాయిస్’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. -
మంచి పుస్తకం మనో వికాసం
తెలుగు బాల సాహిత్య ప్రచురణలో ‘మంచి పుస్తకం’ది ఒక ప్రత్యేక ఒరవడి. డిజిటల్ యుగంలోనూ ఆ సంస్థది చెరగని సంతకం. -
శ్రీవారి ఆలయంలో ఘనంగా శ్రీరామపట్టాభిషేకం
శ్రీవారి ఆలయంలో గురువారం రాత్రి శ్రీరామపట్టాభిషేకం ఘనంగా జరిగింది. సాయంత్రం 4నుంచి శ్రీ సీతారామలక్ష్మణ ఆంజనేయ స్వామివారి ఉత్సవమూర్తులకు విశేష సమర్పణ.. సహస్ర దీపాలంకారణ సేవ చేశారు. -
కనుమరుగవుతున్నా.. కనిపిస్తూనే ఉండాలని..!
డీజిల్ రైలు ఇంజిన్లు కనుమరుగవుతున్న నేపథ్యంలో.. ఎప్పటికీ అందరికీ గుర్తుండిపోయేలా కాజీపేట డీజిల్ లోకోషెడ్ కార్మికులు ఓ వారసత్వపు డీజిల్ రైలు ఇంజిన్ను రూపొందించారు. -
మావోయిస్టుల ఏరివేతలో సింగం
ఏ పోలీసుకైనా తన సర్వీసులో ఒకసారి రాష్ట్రపతి శౌర్య పురస్కారం అందుకోవడమే గొప్ప. అలాంటిది 17 ఏళ్ల తన సర్వీసులో ఆయన ఏకంగా ఆరుసార్లు ఆ పురస్కారాన్ని అందుకున్నారు. -
ముగిసిన సిరిపెల్లి ప్రస్థానం..
జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన మావోయిస్టు నేత సిరిపెల్లి శంకర్రావు అలియాస్ సుధాకర్ అలియాస్ మురళి, ఆయన భార్య దాశేశ్వర్ అలియాస్ సుమన అలియాస్ రంజితల విప్లవ ప్రస్థానం ముగిసింది. -
ఆసుపత్రికి మంత్రి కోమటిరెడ్డి 32 ఏసీల వితరణ
నల్గొండ జిల్లా ఆసుపత్రిలోని మాతాశిశు ఆరోగ్య కేంద్రం(ఎంసీహెచ్)లో 32 ఏసీలు ఏర్పాటు చేయించి మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఉదారత చాటుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
భారాస అధినేత కేసీఆర్ బస్సు యాత్ర షెడ్యూల్ ఖరారు
-
మెటా ప్లాట్ఫామ్స్లో ఏఐ.. వాట్సప్లో ఇక చిత్రాలూ రూపొందించొచ్చు!
-
స్కూల్లో ఫేషియల్ చేయించుకున్న ప్రిన్సిపల్.. వీడియో తీసిన ఉపాధ్యాయురాలిపై దాడి
-
‘సివిల్స్’ టాపర్లకు వచ్చిన మార్కులెన్నో తెలుసా?
-
పురందేశ్వరి సహా రెండో రోజు ప్రముఖుల నామినేషన్లు
-
యూపీఎస్సీ మిస్సయిన వారికి డిట్టో ఇన్సూరెన్స్ జాబ్ ఆఫర్