G-20 Summit 2021: శతాబ్ది మధ్య నాటికి కర్బన కళ్లెం
వాతావరణ మార్పులకు కళ్లెం వేయడంపై జి-20 దేశాల శిఖరాగ్ర సదస్సు కీలక నిర్ణయం తీసుకుంది. కాలుష్యానికి ముకుతాడు వేసి కర్బన తటస్థత(కార్బన్ న్యూట్రాలిటీ/ నెట్ జీరో)ను ...
వాతావరణ మార్పులపై జి-20 తీర్మానం
తాప విద్యుత్కేంద్రాలకు సాయం నిలుపుదల
సురక్షిత టీకాలకు పరస్పరం గుర్తింపు
క్రమబద్ధంగా అంతర్జాతీయ ప్రయాణాలకు అనుమతి
డిక్లరేషన్తో ముగిసిన శిఖరాగ్ర సదస్సు
రోమ్లోని సుప్రసిద్ధ ట్రెవీ ఫౌంటెన్లోకి ఆదివారం నాణేలు విసురుతున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్, జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్, ఇటలీ ప్రధానమంత్రి మారియో డ్రాగీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్, బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్
రోమ్: వాతావరణ మార్పులకు కళ్లెం వేయడంపై జి-20 దేశాల శిఖరాగ్ర సదస్సు కీలక నిర్ణయం తీసుకుంది. కాలుష్యానికి ముకుతాడు వేసి కర్బన తటస్థత(కార్బన్ న్యూట్రాలిటీ/ నెట్ జీరో)ను ఈ శతాబ్ది మధ్యనాటికి సాధించాలని ప్రతినబూనాయి. రెండ్రోజుల పాటు రోమ్లో జరిగిన సదస్సు ఆదివారం ముగిసింది. ఐరాస ఆధ్వర్యంలో గ్లాస్గోలో మొదలైన వాతావరణ మార్పుల సదస్సుకు చర్చనీయాంశాన్ని దీనిలో ఖరారు చేసినట్లయింది. బొగ్గును మండించడం వల్ల ఎదురవుతున్న సమస్యల్ని నివారించాలంటే.. విదేశాల్లోని తాప విద్యుత్కేంద్రాలకు ప్రభుత్వాల తరఫున నిధులు ఇవ్వడాన్ని నిలిపివేయాలని దేశాధినేతలు నిర్ణయం తీసుకున్నారు. ఈ ఏడాది చివరి నుంచే ఇది అమల్లోకి రానుంది. బొగ్గు వినియోగాన్ని దేశీయంగా క్రమంగా తగ్గించుకునేందుకు మాత్రం ఎలాంటి లక్ష్యాన్ని నిర్దేశించలేదు. ఈ మేరకు భారత్, చైనా వంటి దేశాలకు కొంత ఊరటనిచ్చే ఉమ్మడి ప్రకటన విడుదలైంది. గ్రీన్హౌస్ వాయువుల్లో నాలుగింట మూడొంతులు ఒక్క జి-20 దేశాల నుంచే వెలువడుతున్నాయి. వాతావరణ మార్పుల్ని ఎదుర్కోవడంలో పేద దేశాలకు సాయపడేందుకు ధనిక దేశాలు ఏటా 100 బిలియన్ డాలర్లు (సుమారు రూ.7,50,000 కోట్లు) సమీకరించాలన్న మునుపటి నిర్ణయానికి కట్టుబడి ఉన్నట్లు కూటమి దేశాలు పునరుద్ఘాటించాయి.
సరఫరాల్లో ఇబ్బందుల్ని పరిష్కరించాలి: బైడెన్
కొవిడ్-19 మహమ్మారి నుంచి బయటపడేందుకు అన్ని దేశాలూ కలిపి 15 లక్షల కోట్ల డాలర్లను ఖర్చు చేస్తున్నా, సరఫరాల పరంగా ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని పరిష్కరించాల్సి ఉందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తన ప్రసంగంలో ప్రస్తావించారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తెరిపిన పడాలంటే ఇలాంటి అవరోధాలు ఉండకూడదని అన్నారు. టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్దోగన్తో బైడెన్ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ భేటీ అయ్యారు. తైవాన్ విషయంలో చైనా అనుసరిస్తున్న వైఖరి వల్ల ఉద్రిక్తత పెరుగుతోందని ఆందోళన వెలిబుచ్చారు.
ట్రెవీ ఫౌంటెన్లో నాణెం విసిరిన మోదీ
మోదీ పలు ప్రపంచ దేశాధినేతలతో కలిసి రోమ్లోని సుప్రసిద్ధ ట్రెవీ ఫౌంటెన్కు వెళ్లారు. అక్కడి నీటిలో ఓ నాణెం కూడా విసిరారు. భుజం మీదుగా నీళ్లలో నాణెం విసిరితే మళ్లీ రోమ్ వెళ్తారని ప్రజల నమ్మకం. మోదీ కూడా ఇతర నేతలతో కలిసి ఇదే పని చేశారు.
స్పెయిన్ ప్రధాని పెడ్రో సాంచెజ్తో చర్చలు జరుపుతున్న ప్రధాని మోదీ
మెర్కెల్, సాంచెజ్లతో ద్వైపాక్షిక చర్చలు
సదస్సుకు హాజరైన జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్, స్పెయిన్ ప్రధాని పెడ్రో సాంచెజ్తో మోదీ విడివిడిగా చర్చలు జరిపారు. వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కొనసాగించడానికి కట్టుబడి ఉండాలని నిర్ణయించారు. ద్వైపాక్షిక బంధాల బలోపేతంపై అర్థవంతమైన సమాలోచనలు సాగినట్లు ఆయన ట్వీట్ చేశారు. హరిత హైడ్రోజన్, మౌలిక సదుపాయాలు, రక్షణ రంగ ఉత్పత్తుల తయారీలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా స్పెయిన్ను మోదీ కోరారు. ద్వైపాక్షిక వాణిజ్యంలో పురోగతిపై ఇరువురు నేతలు సంతృప్తి వెలిబుచ్చారు. ఎయిర్బస్ స్పెయిన్ నుంచి సి-295 విమానాల కొనుగోలుకు భారత్తో ఇటీవల కుదిరిన ఒప్పందం సహా వివిధ అంశాలు ప్రస్తావనకు వచ్చాయి.
టీకాల కార్యక్రమం ప్రపంచానికి మంచిది
కరోనా వ్యాక్సిన్లకు అత్యవసర వినియోగ అనుమతులు వేగంగా లభించేలా చూడడంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో)ను బలోపేతం చేయాలని జి-20 దేశాలు నిర్ణయించినట్లు భారత వాణిజ్య, పరిశ్రమల శాఖల మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. కరోనా టీకాల కార్యక్రమం ప్రపంచానికి మంచిదని ‘రోమ్ డిక్లరేషన్’ పేర్కొన్నట్లు చెప్పారు. సురక్షిత, సమర్థవంతమైన టీకాలను పరస్పరం గుర్తించుకోవాలని నిర్ణయించినట్లు తెలిపారు.
* టీకాల సరఫరాను గణనీయంగా పెంచి.. ప్రపంచ జనాభాలో కనీసం 40% మందికి ఈ ఏడాది చివరినాటికి, 70% మందికి వచ్చే ఏడాది మధ్య నాటికి కరోనా టీకాలు అందేలా చూడాలని సమావేశం తీర్మానించింది. కొవిడ్-19ను ఎదుర్కోవడంలో ముందు వరసలో ఉన్న సిబ్బంది, అంతర్జాతీయ సంస్థలు, శాస్త్రవేత్తల కృషిని కొనియాడుతున్నట్లు తీర్మానంలో చేర్చింది.
తదుపరి సదస్సు ఇండొనేసియాలో
జి-20 సదస్సు 2022లో ఇండొనేసియాలో, 2023లో భారత్లో, 2024లో బ్రెజిల్లో జరగనున్నాయి. ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడింది. సురక్షితంగా, క్రమబద్ధంగా అంతర్జాతీయ ప్రయాణాలను పునఃప్రారంభించాలని దేశాలు నిర్ణయించాయి. జీవ వైవిధ్య ముప్పును 2030 నాటికి తిరోగమనం పట్టించే చర్యల్ని బలోపేతం చేయాలని తీర్మానించాయి. అందరికీ పోషకాహారం అందించేలా చూస్తామని ప్రతినబూనాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పతి దేవుడికి గుడి కట్టింది!
కరోనా మహమ్మారి ఆమె జీవితంలో అంతులేని విషాదాన్ని నింపింది. కళ్లల్లో పెట్టుకుని చూసుకునే భర్తను తన నుంచి దూరం చేసింది. మూడేళ్ల క్రితం భర్త కొవిడ్తో మృతి చెందడంతో ఆమె ఒంటరిగా మారారు. -
కొత్తవారొచ్చారు
ఆంధ్రప్రదేశ్ నిఘా విభాగాధిపతిగా సీనియర్ ఐపీఎస్ అధికారి కుమార్ విశ్వజిత్ను, విజయవాడ నగర పోలీసు కమిషనర్గా పీహెచ్డీ రామకృష్ణను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. -
జేఈఈ మెయిన్స్లో తెలుగోళ్ల సత్తా
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. దేశవ్యాప్తంగా 56 మందికి 100 పర్సంటైల్ రాగా.. ఇందులో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందినవారే 22 మంది ఉన్నారు. జేఈఈ మెయిన్స్ తుది ఫలితాలను జాతీయ పరీక్షల విభాగం (ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసింది. -
కాళేశ్వరంపై కమిషన్ విచారణ షురూ
కాళేశ్వరం ఎత్తిపోతల్లోని బ్యారేజీలపై న్యాయ విచారణకు ఏర్పాటు చేసిన కమిషన్ కార్యాచరణ మొదలుపెట్టింది. బుధవారం కమిషన్ ఛైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ ఆయన సతీమణి దేబ్జానీ ఘోష్తో కలిసి హైదరాబాద్కు చేరుకున్నారు. -
ఫస్టియర్లో 60.01%.. సెకండియర్లో 64.19%
ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో 60.01 శాతం, రెండో సంవత్సరంలో 64.19 శాతం మంది విద్యార్థులు (ఒకేషనల్ కోర్సులతో కలిపి) ఉత్తీర్ణత సాధించారు. -
కవిత బెయిల్పై మే 6న తీర్పు
ఈడీ కేసులో బెయిల్ కోసం భారాస ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్పై తీర్పును ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు మే 6కి వాయిదా వేసింది. -
చదువుల ‘సిరి’.. రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని పట్టుదల
వారానికి రెండుసార్లు డయాలసిస్.. ఒంట్లో సత్తువ లేక కళాశాలకూ వెళ్లలేని పరిస్థితి.. అయినా మొక్కవోని పట్టుదలతో చదివిన పేదింటి బిడ్డ ప్రతిభ చాటింది. -
విజన్-2026కు డోర్నకల్ ఉపాధ్యాయుల శ్రీకారం
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు విజన్-2026 పేరిట ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. -
ఇంటర్ ఫలితాల్లో కవలల ప్రతిభ
సూర్యాపేట జిల్లా ఆత్మకూర్(ఎస్) మండల కేంద్రానికి చెందిన డేగల వీరభద్రయ్య, మంజుల దంపతుల కవల పిల్లలు డేగల రామ్, లక్ష్మణ్ ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో ప్రతిభ చూపారు. -
రాష్ట్రంలో వంతెనల పరిశీలన..!
రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న చిన్నా, పెద్ద వంతెనలను పరిశీలించేందుకు అధికారులు ఆయత్తం అవుతున్నారు. జిల్లాల వారీగా నిర్మాణ స్థితిగతులపై జాబితాలను రూపొందించే పనిలో ఉన్నారు. -
యాదాద్రి విద్యుత్కేంద్రానికి పర్యావరణ అనుమతి
యాదాద్రి థర్మల్ విద్యుత్కేంద్రానికి పర్యావరణ అనుమతి (ఈసీ) ఇవ్వడానికి కేంద్ర పర్యావరణ శాఖ ఆమోదం తెలిపింది. -
మెట్రో రైలు శబ్దకాలుష్యంపై వివరణివ్వండి
మెట్రో రైల్వే లైను వంపుల్లో రైలు వెళ్లినపుడు పరిమితికి మించి వస్తున్న శబ్దకాలుష్యంపై వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వానికి, మెట్రో రైల్వే ఎండీకి బుధవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
ఆర్జేసీ, మోడల్, కేజీబీవీ విద్యార్థుల ప్రతిభ
టీఎస్ఆర్జేసీ నేరెళ్ల గురుకుల విద్యార్థిని ఎంపీసీలో 991 మార్కులు, బైపీసీలో తాటిపల్లి విద్యార్థిని 990 మార్కులు సాధించినట్లు యాజమాన్యం తెలిపింది. -
ఫోన్ ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావుకు మధ్యంతర బెయిలు నిరాకరణ
ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టయిన టాస్క్ఫోర్స్ మాజీ ఓఎస్డీ రాధాకిషన్రావుకు ఎల్ఎల్ఎం పరీక్షలు రాసేందుకు వీలుగా మధ్యంతర బెయిలు ఇచ్చేందుకు నాంపల్లి కోర్టు నిరాకరించింది. -
పోలింగ్ రోజు వేతనంతో కూడిన సెలవు
లోక్సభ ఎన్నికల పోలింగ్ జరిగే రోజును వేతనంతో కూడిన సెలవుగా ప్రకటించారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్రాజ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
జస్టిస్ రామలింగేశ్వరరావుకు హైకోర్టు ఘన నివాళి
గుండెపోటుతో ఇటీవల మృతి చెందిన ఉమ్మడి హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎ.రామలింగేశ్వరరావుకు బుధవారం హైకోర్టు ఘన నివాళి అర్పించింది. -
శనగ విత్తనోత్పత్తి రైతుల ఆందోళన
‘పంట విక్రయించి నెల రోజులవుతోంది. డబ్బులు ఎప్పుడు ఇస్తారో.. క్వింటాకు ఎంత కట్టిస్తారో ఇప్పటికీ తెలియదు. -
విచారణ నుంచి తప్పుకొన్న జస్టిస్ శేషసాయి ధర్మాసనం
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసుపై మాట్లాడొద్దంటూ కడప జిల్లా కోర్టు(పీడీజే) ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ వివేకా కుమార్తె నర్రెడ్డి సునీత, పులివెందుల తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.రవీంద్రనాథ్రెడ్డి అలియాస్ బీటెక్ రవి దాఖలు చేసిన వ్యాజ్యాల విచారణ నుంచి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏవీ శేషసాయి నేతృత్వంలోని ధర్మాసనం తప్పుకొంది. -
ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఇంటర్ ప్రవేశాలు
రాష్ట్రంలోని ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో ప్రవేశాల పేరిట డొనేషన్లు, అధిక రుసుముల వసూళ్లు, ఇతరత్రా అక్రమాలను నిరోధించేందుకు వీలుగా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఆన్లైన్ ప్రవేశాల విధానాన్ని ప్రవేశపెట్టాలని యోచిస్తున్నామని విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. -
మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ
ష్ట్రంలో మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. షెడ్యూలును విద్యాశాఖ బుధవారం విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు (4)
రాష్ట్రంలో వచ్చే నెల 6వ తేదీన జరగనున్న తెలంగాణ రాష్ట్ర ఇంజినీరింగు కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (టీఎస్ఈసెట్)ను మే చివరి వారానికి వాయిదా వేయాలని పలువురు అభ్యర్థులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని కోరారు.
తాజా వార్తలు (Latest News)
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
టెక్ మహీంద్రా లాభంలో 41 శాతం క్షీణత.. ఒక్కో షేరుపై రూ.28 డివిడెండ్
-
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశం