Congress Jung Siren: ఉద్రిక్తంగా కాంగ్రెస్ జంగ్ సైరన్
ఎక్కడికక్కడ అరెస్టులు... ప్రధాన మార్గాల మూసివేత.. ముఖ్య నాయకుల గృహ నిర్బంధాల మధ్య కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన విద్యార్థి, నిరుద్యోగ జంగ్ సైరన్ శనివారం నగరంలో తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. నిరుద్యోగ సమస్యలను...
రేవంత్రెడ్డి సహా ముఖ్య నేతల గృహ నిర్బంధం
వలయాలను ఛేదించుకుని ఎల్బీనగర్ చేరిన కార్యకర్తలు
లాఠీఛార్జిలో పలువురికి గాయాలు
నేడు రాష్ట్రవ్యాప్త నిరసనలకు పీసీసీ పిలుపు
ఈనాడు, హైదరాబాద్- న్యూస్టుడే, జూబ్లీహిల్స్, దిల్సుఖ్నగర్, వనస్థలిపురం, నాగోలు, గాంధీభవన్: ఎక్కడికక్కడ అరెస్టులు... ప్రధాన మార్గాల మూసివేత.. ముఖ్య నాయకుల గృహ నిర్బంధాల మధ్య కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన విద్యార్థి, నిరుద్యోగ జంగ్ సైరన్ శనివారం నగరంలో తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. నిరుద్యోగ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ అక్టోబరు 2 నుంచి డిసెంబరు 9 వరకు విద్యార్థి, నిరుద్యోగ జంగ్ సైరన్ తలపెట్టింది. తొలి కార్యక్రమంగా శనివారం దిల్సుఖ్నగర్ రాజీవ్చౌక్ నుంచి ఎల్బీనగర్ శ్రీకాంతాచారి చౌరస్తా వరకు ర్యాలీకి పీసీసీ పిలుపునిచ్చింది. దిల్సుఖ్నగర్ కూడలిలో భారీ బందోబస్తు కారణంగా.. ఏ క్షణం ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ ఏర్పడింది. కొత్తపేటలో బారికేడ్లు ఏర్పాటు చేసి వాహనాలను సరూర్నగర్వైపు మళ్లించారు. కాంగ్రెస్ నాయకులు మెట్రో రైళ్లలో వచ్చే అవకాశం ఉందని భావించి మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 7 వరకు దిల్సుఖ్నగర్ మెట్రోస్టేషన్ను పూర్తిగా మూసివేశారు. అయినప్పటికీ కొందరు విద్యార్థి నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు దిల్సుఖ్నగర్ రాజీవ్చౌక్కు చేరుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయగా ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు వారిని అరెస్టు చేశారు. పోలీసుల నిర్బంధాలు, అరెస్టులు, బారికేడ్లను దాటుకుని సాయంత్రానికి భారీసంఖ్యలో కాంగ్రెస్, యూత్కాంగ్రెస్, ఎన్ఎస్యూఐ కార్యకర్తలు, నాయకులు ఎల్బీనగర్ చౌరస్తాకు చేరుకున్నారు. శ్రీకాంతాచారి విగ్రహానికి పూలదండ వేసేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. భారీగా వచ్చిన కార్యకర్తలను పోలీసులు చెదరగొట్టారు. లాఠీఛార్జిలో పలువురికి గాయాలయ్యాయి. మల్లు రవి కిందపడ్డారు. ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు, హుజూరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి బల్మూరి వెంకట్ సహా పలువురు గాయపడ్డారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
రేవంత్ ఇంటి వద్దా తోపులాట
గాంధీభవన్లో మహాత్మాగాంధీకి నివాళులర్పించి జూబ్లీహిల్స్లోని ఇంటికి చేరుకున్న పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డిని పోలీసులు గృహ నిర్బంధం చేశారు. జంగ్ సైరన్ కార్యక్రమానికి వెళ్లకుండా అడ్డుకున్నారు. సమాచారం తెలుసుకుని భారీ సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు ఆయన నివాసానికి చేరుకున్నారు. పోలీసులు, కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. ఇంటి వద్దనే బైఠాయించి రేవంత్ నిరసన తెలిపారు. ఆయనకు మాజీ మంత్రి షబ్బీర్అలీ వచ్చి మద్దతు పలికారు. ఎమ్మెల్యే జగ్గారెడ్డి, మాజీ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి తదితరులనూ గృహ నిర్బంధం చేశారు. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా అంబేడ్కర్, గాంధీ విగ్రహాల ఎదుట కేసీఆర్, కేటీఆర్ దిష్టి బొమ్మల దహనానికి కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది.
రాష్ట్రంలో దుర్మార్గ పాలన: రేవంత్రెడ్డి
రాష్ట్రంలో దుర్మార్గ పాలన సాగుతోందని రేవంత్రెడ్డి ధ్వజమెత్తారు. గృహనిర్బంధం సందర్భంగా ఇంటి వద్ద మీడియాతో మాట్లాడారు. ఏడేళ్లుగా ఏడాదికి పదివేల ఉద్యోగాలు ఖాళీ అవుతున్నా ఎందుకు భర్తీ చేయడం లేదో.. ఫీజు రీఇంబర్స్మెంట్ ఎందుకు ఇవ్వడం లేదో ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. శ్రీకాంతాచారి త్యాగ పునాదులపై ఏర్పడ్డ తెలంగాణలో నివాళులర్పిద్దామంటే నిరంకుశంగా అడ్డుకున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ కార్యకర్తలపై జరిగిన దాడిని నాలుగు కోట్ల రాష్ట్ర ప్రజలపై జరిగిన దాడిగా వర్ణించారు. తెలంగాణ సమాజాన్ని కేసీఆర్, కేటీఆర్లు శత్రువులు, తీవ్రవాదులుగా భావిస్తున్నారని ఆరోపించారు. తమ తొలి అడుగును అడ్డుకున్నప్పటికీ.. మలి అడుగు పాలమూరులో వేయబోతున్నామని చెప్పారు. ఆ రోజు అడ్డుకోవాలని చూస్తే తమ తడాఖా చూపిస్తామన్నారు. గాంధీజీ స్ఫూర్తితోనే శనివారం మౌనంగా ఉన్నామన్నారు.
* పోలీసుల తీరును నిరసిస్తూ ఎల్బీనగర్ వద్ద మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం మాచిరాజుపల్లికి చెందిన విద్యార్థి దిల్లీ కల్యాణ్ అనే కార్యకర్త పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. కార్యకర్తలు అడ్డుకుని ఆసుపత్రికి తరలించారు. సరూర్నగర్ స్టేడియం వద్ద సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను నాయకులు దహనం చేశారు. కార్యక్రమాల్లో నేతలు మధుయాస్కీ, సంపత్, దాసోజు, మహేశ్కుమార్గౌడ్, మహేశ్వర్రెడ్డి, బి.వి.శ్రీనివాస్, శివసేనారెడ్డి, రితీష్ తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రైతాంగ సమస్యలపై మే 15 నుంచి ఆందోళనలు
రాష్ట్రవ్యాప్తంగా అన్నదాతలు ఎదుర్కొంటున్న సమస్యలు, కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కర్షక వ్యతిరేక విధానాలపై ఆందోళనలు చేపట్టేందుకు సిద్ధం కావాలని అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం (ఏఐపీకేఎస్) రాష్ట్ర అధ్యక్షుడు రాయల చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. -
అనుమతుల్లేని క్లినిక్లపై దాడి.. రూ. 2.6 లక్షల విలువైన మందుల స్వాధీనం
రాష్ట్రంలో అనుమతి లేకుండా నిర్వహిస్తున్న క్లినిక్లపై దాడి చేసి నిబంధనలకు విరుద్ధంగా నిల్వ ఉంచిన ఔషధాలను స్వాధీనం చేసుకున్నట్లు ఔషధ నియంత్రణ మండలి (డీసీఏ) డైరెక్టర్ జనరల్ వి.బి.కమలాసన్రెడ్డి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. -
పాలిటెక్నిక్ లెక్చరర్స్ జీఆర్ఎల్ వెల్లడి
ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో లెక్చరర్ పోస్టులకు నిర్వహించిన రాతపరీక్షలో ప్రతిభ ఆధారంగా జనరల్ ర్యాంకు జాబితాను (జీఆర్ఎల్) టీఎస్పీఎస్సీ ప్రకటించింది. -
డీఎంఈ పరిధిలోని.. 16,024 మంది సిబ్బంది సేవల పొడిగింపు
వైద్య విద్య డైరెక్టర్(డీఎంఈ) పరిధిలోని వైద్య కళాశాలలు, బోధనాసుపత్రుల్లో కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్, గౌరవవేతనంతో విధులు నిర్వహిస్తున్న 16,024 మంది సిబ్బంది సేవలను మరో ఏడాది పాటు పొడిగిస్తూ రాష్ట్ర ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. -
సాగర్ టెయిల్పాండ్ నుంచి 4 టీఎంసీలు తరలించిన ఏపీ: తెలంగాణ ఫిర్యాదు
నాగార్జునసాగర్ ప్రాజెక్టు దిగువన విద్యుత్ ఉత్పత్తికోసం నిర్మించిన టెయిల్పాండ్ నుంచి నాలుగు టీఎంసీల నీటిని ఏపీ తరలించుకుపోయిందని కృష్ణా బోర్డుకు తెలంగాణ ఫిర్యాదు చేసింది. -
ఇచ్చంపల్లి నుంచే కావేరికి.. గోదావరి జలాలు
తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో గోదావరి నదిపై ఇచ్చంపల్లి బ్యారేజీ నిర్మాణం చేపట్టి, అక్కణ్నుంచి కావేరి పరీవాహకానికి నీటిని తరలించాలని దాదాపు నిర్ణయానికొచ్చారు. -
మహారాష్ట్ర ఎన్నికల్లో ఓటేసిన సరిహద్దు గ్రామాల ఓటర్లు!
కుమురం భీం జిల్లా కెరమెరి మండలంలో తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దు మధ్య 12 వివాదాస్పద గ్రామాలున్నాయి. -
కారులో తరలిస్తున్న రూ.1.50 కోట్ల స్వాధీనం
వికారాబాద్ జిల్లా నవాబ్పేట మండలంలో ఎన్నికల నియమావళికి విరుద్ధంగా కారులో తరలిస్తున్న రూ.1.50 కోట్ల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
రికార్డు స్థాయిలో వేసవి రైళ్లు
వేసవి కాలంలో పెరిగే రాకపోకలకు అనుగుణంగా ఈసారి రికార్డు స్థాయిలో ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది. -
బతుకమ్మ చీరల బకాయిలు రూ.50 కోట్లు విడుదల
బతుకమ్మ చీరల తయారీకి సంబంధించి నేత కార్మికులకు చెల్లించాల్సిన బకాయిల్లో రూ.50 కోట్లను వెంటనే విడుదల చేయాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి శుక్రవారం అధికారులను ఆదేశించారు. -
నటుడు రఘుబాబు అరెస్టు.. బెయిలు
నార్కట్పల్లి- అద్దంకి రహదారిపై ఈ నెల 17న నల్గొండ పట్టణ సమీపంలో సినీ నటుడు ఎర్ర రఘుబాబు కారు ఢీకొని భారాస నాయకుడు జనార్ధన్రావు మృతి చెందిన విషయం తెలిసిందే. -
ఒకటో తరగతికి కనీస వయసు ఆరేళ్లపై వివరణ ఇవ్వండి
ఒకటో తరగతికి కనీస వయసు ఆరేళ్లు ఉండాలంటూ జారీ చేసిన ఉత్తర్వులపై వివరణ ఇవ్వాలంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు శుక్రవారం హైకోర్టు నోటీసులు జారీ చేసింది. -
గురుకులంలో అల్పాహారం వికటించి 25 మందికి అస్వస్థత
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలలో అల్పాహారం వికటించి 25 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. -
శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ సీఎస్
తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎ.శాంతికుమారి దంపతులు శుక్రవారం తెల్లవారుజామున శ్రీవారి అభిషేక సేవలో పాల్గొన్నారు. -
‘వాట్సప్ గురు’ మరో ఘనత!
తెలంగాణ అదనపు డీజీపీ (రైల్వేస్ అండ్ రోడ్ సేఫ్టీ) మహేశ్ మురళీధర్ భగవత్ మరో ఘనత సాధించారు. -
జూబ్లీహిల్స్ రోడ్డు ప్రమాదం కేసులో మరో ఎస్సై సస్పెన్షన్
పోలీసు శాఖలో సస్పెన్షన్ల పరంపర కొనసాగుతోంది. రెండు రోజుల క్రితం ఆరుగురు పోలీస్ అధికారులను, సిబ్బందిని మల్టీజోన్-1 ఐజీ సస్పెండ్ చేయగా.. తాజాగా మరో ఎస్సైపై వేటు పడింది. -
దేశంలో మరో 114 కృషి విజ్ఞాన కేంద్రాలు
వ్యవసాయరంగ అభివృద్ధితోపాటు రైతులకు విస్తృతమైన సేవలందించేందుకు దేశంలో మరో 114 కృషి విజ్ఞాన కేంద్రాల(కేవీకే)ను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి(ఐకార్) డైరెక్టర్ జనరల్ హిమాన్ష్ పాఠక్ తెలిపారు. -
ఫోన్ ట్యాపింగ్ అత్యంత ప్రమాదకరం
పౌరుల వ్యక్తిగత జీవితాల్లోకి చొరబడి వారిని నియంత్రించడానికి గత ప్రభుత్వ పాలకులు ఫోన్ ట్యాపింగ్ను వాడుకున్నారని, అది అత్యంత ప్రమాదకరం అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. -
సిద్దిపేట జిల్లాలో ఉద్యోగుల సస్పెన్షన్పై హైకోర్టు స్టే
భారాస నిర్వహించిన ఎన్నికల కార్యక్రమంలో పాల్గొన్నారన్న కారణంగా కొంత మంది ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ ఏప్రిల్ 8న సిద్దిపేట జిల్లా ఎన్నికల అధికారి అయిన కలెక్టర్ జారీ చేసిన ఆదేశాల అమలును నిలిపివేస్తూ హైకోర్టు శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. -
మేడిగడ్డ పూర్తవకుండానే పూర్తయినట్లు సర్టిఫికెట్
మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణం పూర్తి కాకుండానే, అయినట్లుగా సంబంధిత ఇంజినీర్లు గుత్తేదారుకు సర్టిఫికెట్ ఇచ్చినట్లు ప్రాజెక్టు చీఫ్ ఇంజినీర్ నీటిపారుదల శాఖకు నివేదించారు. -
గరుడ ప్రసాదం... పోటెత్తిన భక్తజనం
రంగారెడ్డి జిల్లాలోని చిలుకూరు బాలాజీ ఆలయంలో శుక్రవారం నిర్వహించిన బ్రహ్మోత్సవాలు... గరుడ ప్రసాద వితరణ భక్తులకు తీవ్ర అసౌకర్యం కలిగించింది.