Huzurabad By Election: హోరు ముగిసింది... పోరు మిగిలింది
హోరాహోరీ సమరంగా మారిన హుజూరాబాద్ ఉప ఎన్నికలో ప్రచార ఘట్టానికి తెరపడింది. నియోజకవర్గంలో ప్రధానంగా విమర్శలు, ప్రతి విమర్శలతో సాగిన ప్రచార పర్వం బుధవారం రాత్రి 7 గంటలతో ముగిసింది. ఇన్నాళ్లుగా ఇక్కడికి
హుజూరాబాద్లో ప్రచారం పరిసమాప్తం
ఓటర్ల ప్రసన్నానికి ప్రారంభమైన ప్రలోభ పర్వం
ఈనాడు డిజిటల్, కరీంనగర్: హోరాహోరీ సమరంగా మారిన హుజూరాబాద్ ఉప ఎన్నికలో ప్రచార ఘట్టానికి తెరపడింది. నియోజకవర్గంలో ప్రధానంగా విమర్శలు, ప్రతి విమర్శలతో సాగిన ప్రచార పర్వం బుధవారం రాత్రి 7 గంటలతో ముగిసింది. ఇన్నాళ్లుగా ఇక్కడికి ఆయా పార్టీల నుంచి ప్రచారానికి వచ్చిన నేతలంతా వారి జిల్లాలకు వెళ్లిపోయారు. చివరి రోజున తెరాస, భాజపా, కాంగ్రెస్- మూడు పార్టీల అభ్యర్థుల తరఫున ముఖ్య నేతలు ప్రచారాల్లో పాల్గొన్నారు. తెరాస అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ తరఫున రాష్ట్ర మంత్రులు తన్నీరు హరీశ్రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, గంగుల కమలాకర్, శ్రీనివాస్గౌడ్, కొప్పుల ఈశ్వర్లు హుజూరాబాద్, జమ్మికుంట, కమలాపూర్లలో ప్రచార సభలో పాల్గొని అభివృద్ధికి పట్టంగట్టాలని కోరారు. భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్ తరఫున రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, సినీనటి విజయశాంతి, ఎంపీ అర్వింద్లు పలుచోట్ల ప్రచారంలో పాల్గొని తమ అభ్యర్థిని గెలిపించాలని ఓటర్లకు విన్నవించారు. కాంగ్రెస్ అభ్యర్థి బల్మూరి వెంకట్కు మద్దతుగా పీసీసీ అధినేత రేవంత్రెడ్డి, ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాస్కీ, మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహాలు పాల్గొని శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపారు. ఈ నెల 1వ తేదీన ఇక్కడి ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది మొదలు దాదాపుగా 27 రోజులపాటు రాజకీయ సందడి తార స్థాయికి చేరింది. పల్లెలు, పట్టణాలల్లో ప్రచారం హోరెత్తింది. నాయకులు, అభ్యర్థులు పోటాపోటీగా హామీల వర్షాన్ని కురిపించారు. ఈ నెల 30న జరిగే పోలింగ్లో ఓటర్లు అభ్యర్థుల భవితవ్యాన్ని నిర్ణయిస్తారు.
పలు పార్టీలు ప్రచారం ముగిసిన చివరి రోజు నుంచే హుజూరాబాద్ నియోజకవర్గంలో ఓటర్లకు నగదును పంపిణీ చేసే పర్వానికి తెరదీసినట్లు తెలుస్తోంది. ఓటుకింత రేటు అనేలా పంపిణీ చేపట్టినట్లు ఆయా గ్రామాలు, పట్టణాల్లో ప్రచారం సాగుతోంది. పలు వీడియోలు కూడా వైరల్ అయ్యాయి. ఇంట్లో ఉన్న ఓటర్ల సంఖ్యను కవర్పైన రాసి.. లోపల నగదు ఉంచి అందించారనే ఆరోపణలు వినిపించాయి. మున్ముందు మద్యం, నగదు పంపిణీ మరింతగా కొనసాగే అవకాశముంది. ఓటర్లను తమ వైపునకు తిప్పుకొనే ఎత్తుగడలను అమలు చేసేందుకు ఆయా పార్టీలు వ్యూహ రచనల్లో మునిగి తేలాయి.
డబ్బు, మద్యం పంపిణీపై హెచ్ఆర్సీకి ఫిర్యాదు
నారాయణగూడ, న్యూస్టుడే: హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో డబ్బు, మద్యం పంపిణీ జరుగుతోందని హైకోర్టు న్యాయవాది సయ్యద్ సలీం రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (హెచ్ఆర్సీ)కి ఫిర్యాదు చేశారు. ఓటుకు రూ.6 వేలు ఇస్తున్నారంటూ సామాజిక మాధ్యమాల్లో వీడియోలు చక్కర్లు కొడుతున్నాయన్నారు. ఎన్నిక పూర్తయ్యేవరకు పోలీసులు, ఎన్నికల కమిషన్ సమర్థంగా విధులు నిర్వర్తించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సికింద్రాబాద్ నుంచి సంత్రాగచ్చికి జనరల్ బోగీల రైళ్లు
సికింద్రాబాద్ నుంచి కోల్కతా సమీపంలోని సంత్రాగచ్చి రైల్వేస్టేషన్కు రానుపోను పదేసి ప్రత్యేక రైళ్లు నడిపించనున్నట్లు ద.మ.రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. -
జేఈఈ మెయిన్లో నారాయణ హవా
జేఈఈ మెయిన్ ఫలితాల్లో ఆలిండియా ఓపెన్ కేటగిరీలో 6 (1, 5, 6, 7, 8, 10) ర్యాంకులను తమ విద్యార్థులు సాధించి మరోసారి సత్తా చాటారని నారాయణ విద్యాసంస్థల మేనేజింగ్ డైరెక్టర్లు సింధురానారాయణ, శరణినారాయణ గురువారం తెలిపారు. -
‘ఉల్లాస్ నవభారత్ సాక్షరత’గా పేరు మార్పు
నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రాం’ పథకం అమలులో భాగంగా వివిధ రాష్ట్రాలు తమ సౌకర్యాన్ని బట్టి పేర్లను మార్చుకున్నాయి. -
జేఈఈ మెయిన్స్లో గురుకుల విద్యార్థుల ప్రతిభ
జేఈఈ మెయిన్స్లో గురుకుల సొసైటీల విద్యార్థులు ప్రతిభ చూపారు. ఎస్సీ గురుకుల సొసైటీ నుంచి 462 మంది జేఈఈ అడ్వాన్స్డ్కు అర్హత సాధించారని సొసైటీ కార్యదర్శి సీతాలక్ష్మి గురువారం తెలిపారు. -
ఏఈ పోస్టుల జనరల్ ర్యాంకు జాబితా వెల్లడి
రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ విభాగాల్లో అసిస్టెంట్ ఇంజినీర్ (ఏఈ) పోస్టుల భర్తీకి నిర్వహించిన రాతపరీక్షలో అభ్యర్థుల ప్రతిభ ఆధారంగా జనరల్ ర్యాంకు జాబితాను టీఎస్పీఎస్సీ ప్రకటించింది. -
డీజీపీ రవిగుప్తాకు పరిహారం చెల్లించండి
పనిచేయని రిక్లైనర్ సీటును కేటాయించి తీవ్ర అసౌకర్యం కలిగించడం, బిజినెస్(జెడ్) క్లాస్ టికెట్లో ఎకానమీ క్లాస్ సేవలందించిన నేపథ్యంలో డీజీపీ దంపతులకు రూ.2,07,500 పరిహారం చెల్లించాలని సింగపూర్ ఎయిర్లైన్స్ లిమిటెడ్కు హైదరాబాద్ వినియోగదారుల కమిషన్-3 ఆదేశించింది. -
సౌత్జోన్ డీసీపీగా స్నేహామెహ్రా
హైదరాబాద్లోని దక్షిణ మండలం డీసీపీగా స్నేహామెహ్రాను నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆమె రాత్రి బాధ్యతలు స్వీకరించారు. -
ఖానాపూర్ అడవుల్లో చిరుత సంచారం
నిర్మల్ జిల్లా ఖానాపూర్ అటవీ రేంజి పరిధిలో నీటి వనరుల చెంత వన్యప్రాణులు కనిపించాయి. -
కాళేశ్వరంపై సత్వర విచారణ
ప్రజా ప్రయోజనాల దృష్ట్యా కాళేశ్వరం ప్రాజెక్టుపై వీలైనంత త్వరగా విచారణ పూర్తి చేయాల్సిన అవసరం ఉందని జ్యుడిషియల్ కమిషన్ ఛైర్మన్ జస్టిస్ పినాకీ చంద్ర ఘోష్ తెలిపారు. -
మండుతున్న ఎండలు.. భగ్గుమంటున్న అడవులు
రాష్ట్రవ్యాప్తంగా ఏప్రిల్ నెలలో గతంలో ఎన్నడూ లేనివిధంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పలు జిల్లాల్లో 45 డిగ్రీల సెల్సియస్ దాటుతోంది. -
సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా యువకుడి పొరపాటు
ఇటీవల వెలువడిన యూపీఎస్సీ సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా పూడూరు మండలానికి చెందిన యువకుడు తరుణ్ కుమార్ జాతీయ స్థాయిలో 231 ర్యాంకు సాధించి ఐఏఎస్కు అర్హత సాధించినట్లుగా ప్రచారం జరిగింది. -
భద్రాచలంలో 44 డిగ్రీలు
రాష్ట్రంలో ఎండల తీవ్రత గురువారం కొనసాగింది. అన్ని జిల్లాల్లో 40 డిగ్రీలకుపైనే ఉష్ణోగ్రతలు ఉన్నాయి. అత్యధికంగా భద్రాచలంలో 44 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. -
ఎవరి కోసం చేశారు ఇదంతా...?
రాష్ట్రంలో సంచలనం సృష్టించి ప్రస్తుతానికి స్తబ్దుగా ఉన్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఎన్నికల హడావుడి ముగిసిన తర్వాత మరోమారు ఊపందుకునే అవకాశం ఉంది. -
నాణ్యమైన విత్తనాలనే వాడాలి
పంటల సాగుకు రైతులు నాణ్యమైన విత్తనాలను ఉపయోగించాలని, నాసిరకం విత్తనాలను కొనుగోలు చేసి మోసపోవద్దని వ్యవసాయ శాస్త్రవేత్తలు, విశ్వవిద్యాలయ అధికారులు సూచించారు. -
ఆయిల్పామ్ రైతులను చైతన్యపరచాలి
వేసవికాలంలో ఎండ తీవ్రత, వర్షాభావ పరిస్థితులతో భూగర్భ జలాలు తగ్గునందున ఆయిల్పామ్ మొక్కల సంరక్షణపై రైతులు ఆందోళన చెందకుండా వారిని చైతన్యపరచాలని రాష్ట్ర ఉద్యాన సంచాలకుడు అశోక్రెడ్డి అధికారులను ఆదేశించారు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా