Junk Food: జంక్ సైరన్!
చిన్నారుల జీవితాల్ని చిరుతిళ్లు శాసిస్తున్నాయి. ఇంట్లో అమ్మ చేసి పెట్టే తినుబండారాల కంటే వారు మార్కెట్లో దొరికే ఆహార పదార్థాలను ఎక్కువగా ఇష్టపడుతుండడం పరిపాటి అయ్యింది. బడుల వద్ద కూడా జంక్ ఫుడ్ కోసం పరుగులు పెడుతున్నారు. అది వారికి బలమివ్వకపోగా,
మార్కెట్లోని చిరుతిళ్లతో చిన్నారులకు ప్రమాదం
ఈట్ రైట్’ నినాదంతో ఆదర్శంగా నిలుస్తున్న కేరళ
ప్రత్యేక పౌష్టికాహార మెనూ..జంక్ ఫుడ్ కట్టడి
ఈనాడు డిజిటల్, హైదరాబాద్: చిన్నారుల జీవితాల్ని చిరుతిళ్లు శాసిస్తున్నాయి. ఇంట్లో అమ్మ చేసి పెట్టే తినుబండారాల కంటే వారు మార్కెట్లో దొరికే ఆహార పదార్థాలను ఎక్కువగా ఇష్టపడుతుండడం పరిపాటి అయ్యింది. బడుల వద్ద కూడా జంక్ ఫుడ్ కోసం పరుగులు పెడుతున్నారు. అది వారికి బలమివ్వకపోగా, ప్రమాదంలోకి నెడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ విషయంలో భారత ఆహార భద్రత, ప్రమాణాల సంస్థ (ఎఫ్ఎస్ఎస్ఏఐ) నిబంధనల్ని కఠినంగా పాటిస్తున్న కేరళ రాష్ట్రం ‘ఈట్ రైట్’ నినాదంతో ఆదర్శంగా నిలుస్తోంది. జంక్ ఫుడ్ను దూరం పెట్టడంతో పాటు పౌష్టికాహారాన్ని చిన్నారుల పళ్లెంలోకి చేర్చే ప్రయత్నం చేస్తోంది.
అక్కడ కఠినంగా!
పాఠశాలలకు 50 మీటర్ల పరిధిలో చిరుతిళ్ల దుకాణాలుండొద్దనే నిబంధనలు తెలుగు రాష్ట్రాల్లో సరిగా అమలు కావట్లేదు. కేరళ మాత్రం కఠినంగా అమలు చేస్తోంది. బడుల్లో వాతావరణం (20%), చిరుతిళ్ల వ్యాపారాలు (30%), ఆహార పరీక్షలు, పర్యవేక్షణ (20%), శిక్షణ, వనరులు (10%), వినియోగంపై అవగాహన (20%) అంశాల ఆధారంగా ఎఫ్ఎస్ఎస్ఏఐ మూడేళ్లుగా రాష్ట్రాల ర్యాంకులను నిర్ణయిస్తోంది. ‘ఈట్ రైట్’ నినాదంతో విధానాల్ని మెరుగుపరుచుకున్న కేరళ రాష్ట్రం రెండో స్థానానికి చేరుకోగా.. 49 పాయింట్లతో తెలంగాణ 10వ స్థానంలో, 36 పాయింట్లతో ఏపీ 19వ స్థానంలో నిలిచాయి.
కేరళలో ఏం చేస్తున్నారంటే...
బడుల్లో ఇవీ నిబంధనలు..
* శుభ్రమైన తాగునీరు అందించాలి.
*తృణధాన్యాలు, పాలు, గుడ్లు, ఇతర పౌష్టికాహారంతో కూడిన మెనూ ఉండాలి.
* తాజా, స్థానిక ఉత్పత్తులతోనే వంట చేయాలి. ప్యాక్ చేసిన ఉత్పత్తులేవీ వాడొద్దు.
* వంటనూనె ఒకేసారి వాడాలి. అదీ రోజూ 25 గ్రాములకు మించరాదు.
* పాఠశాలలు, విద్యార్థుల హాస్టళ్లకు 50 మీటర్ల దరిదాపుల్లో చిరుతిళ్ల దుకాణాలుండకూడదు. క్యాంటీన్లలో మిఠాయిలు, ఫ్రెంచ్ ఫ్రైస్, బర్గర్లు, చిప్స్, పిజ్జా, సమోసాలు, నూడుల్స్, గులాబ్ జామూన్, శీతల పానీయాలు నిషేధం.
బడి బువ్వలో ఉండేవి ఇవీ...
* గోధుమ, బియ్యం, రాగులు, సజ్జలు, కొర్రలు, జొన్నలతో వంటకాలు
* తక్కువ కొవ్వు ఉన్న పాలు, పెరుగు, పన్నీరు, చికెన్, చేపలు, కోడిగుడ్లు
* 300 గ్రాముల కూరగాయలు. వీటిలో ఆకు కూరలు 50 గ్రా, ఇతరాలు 200 గ్రా, దుంపలు 50 గ్రా. ఉండాలి. 100గ్రా. పండ్లు
* బాదం, పిస్తా,ఉప్పు లేకుండావేయించిన గింజలు
* ఉడికించిన చిరుతిళ్లు, ఉప్మా, పోహా, డోఖ్లా
పిల్లలకు ఇచ్చే స్నాక్ బాక్సుల్లో..
ఫ్రూట్ సలాడ్లు, పల్లీలు, బెల్లంతో చేసిన చిక్కీలు, లడ్డూలు, బాదం, పిస్తాతో చేసిన తినుబండారాలు, మినప, ఉలవ పిండి లడ్డూలు, రాగులు, జొన్నలు, సజ్జలతో చేసే స్నాక్స్.
రోగనిరోధక శక్తిని పెంచే ఆహారమిద్దాం
గత పదేళ్లలో పిల్లల ఆహారపుటలవాట్లు పూర్తిగా మారిపోయాయి. సరైన సమయానికి, సరైన తిండి తినట్లేదు. రోగ నిరోధక శక్తి పెరగాలంటే వారికి మంచి ఆహారం అందించాలి. జంక్ ఫుడ్ను నివారించి, పీచు, బలవర్ధక పదార్ధాలు ఇవ్వాలి. పాఠశాలల పరిసరాల్లో జంక్ ఫుడ్, ఇతర చిరుతిళ్లను ఉంచనివ్వొద్దు. పాలు, గుడ్లు, మన సంప్రదాయ ఆహారాన్ని తినేందుకు ప్రోత్సహించాలి.
- సుజాత, పోషకాహార నిపుణురాలు
ఆసక్తి.. అవగాహన పెంచాలి
పిల్లలకు ఇంట్లో ఏం పెట్టాలో తల్లిదండ్రులు చూసుకుంటున్నట్లే బడుల్లో గురువులు బాధ్యత తీసుకోవాలి. ఏ ఆహారం తింటే ఏమవుతుందో చిన్నారులకు అర్థమయ్యేలా చెప్పాలి. లంచ్ బాక్సుల్లో రోజుకో రకం వినూత్న వంటకం పెట్టాలి. పండ్లు, ఇతర పదార్థాలతో కూడిన భిన్న ఆహారాలతో వారికి ఆసక్తి కలిగించాలి.
- సయ్యదా సనా, పోషకాహార నిపుణురాలు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పతి దేవుడికి గుడి కట్టింది!
కరోనా మహమ్మారి ఆమె జీవితంలో అంతులేని విషాదాన్ని నింపింది. కళ్లల్లో పెట్టుకుని చూసుకునే భర్తను తన నుంచి దూరం చేసింది. మూడేళ్ల క్రితం భర్త కొవిడ్తో మృతి చెందడంతో ఆమె ఒంటరిగా మారారు. -
కొత్తవారొచ్చారు
ఆంధ్రప్రదేశ్ నిఘా విభాగాధిపతిగా సీనియర్ ఐపీఎస్ అధికారి కుమార్ విశ్వజిత్ను, విజయవాడ నగర పోలీసు కమిషనర్గా పీహెచ్డీ రామకృష్ణను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. -
జేఈఈ మెయిన్స్లో తెలుగోళ్ల సత్తా
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. దేశవ్యాప్తంగా 56 మందికి 100 పర్సంటైల్ రాగా.. ఇందులో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందినవారే 22 మంది ఉన్నారు. జేఈఈ మెయిన్స్ తుది ఫలితాలను జాతీయ పరీక్షల విభాగం (ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసింది. -
కాళేశ్వరంపై కమిషన్ విచారణ షురూ
కాళేశ్వరం ఎత్తిపోతల్లోని బ్యారేజీలపై న్యాయ విచారణకు ఏర్పాటు చేసిన కమిషన్ కార్యాచరణ మొదలుపెట్టింది. బుధవారం కమిషన్ ఛైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ ఆయన సతీమణి దేబ్జానీ ఘోష్తో కలిసి హైదరాబాద్కు చేరుకున్నారు. -
ఫస్టియర్లో 60.01%.. సెకండియర్లో 64.19%
ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో 60.01 శాతం, రెండో సంవత్సరంలో 64.19 శాతం మంది విద్యార్థులు (ఒకేషనల్ కోర్సులతో కలిపి) ఉత్తీర్ణత సాధించారు. -
కవిత బెయిల్పై మే 6న తీర్పు
ఈడీ కేసులో బెయిల్ కోసం భారాస ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్పై తీర్పును ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు మే 6కి వాయిదా వేసింది. -
చదువుల ‘సిరి’.. రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని పట్టుదల
వారానికి రెండుసార్లు డయాలసిస్.. ఒంట్లో సత్తువ లేక కళాశాలకూ వెళ్లలేని పరిస్థితి.. అయినా మొక్కవోని పట్టుదలతో చదివిన పేదింటి బిడ్డ ప్రతిభ చాటింది. -
విజన్-2026కు డోర్నకల్ ఉపాధ్యాయుల శ్రీకారం
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు విజన్-2026 పేరిట ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. -
ఇంటర్ ఫలితాల్లో కవలల ప్రతిభ
సూర్యాపేట జిల్లా ఆత్మకూర్(ఎస్) మండల కేంద్రానికి చెందిన డేగల వీరభద్రయ్య, మంజుల దంపతుల కవల పిల్లలు డేగల రామ్, లక్ష్మణ్ ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో ప్రతిభ చూపారు. -
రాష్ట్రంలో వంతెనల పరిశీలన..!
రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న చిన్నా, పెద్ద వంతెనలను పరిశీలించేందుకు అధికారులు ఆయత్తం అవుతున్నారు. జిల్లాల వారీగా నిర్మాణ స్థితిగతులపై జాబితాలను రూపొందించే పనిలో ఉన్నారు. -
యాదాద్రి విద్యుత్కేంద్రానికి పర్యావరణ అనుమతి
యాదాద్రి థర్మల్ విద్యుత్కేంద్రానికి పర్యావరణ అనుమతి (ఈసీ) ఇవ్వడానికి కేంద్ర పర్యావరణ శాఖ ఆమోదం తెలిపింది. -
మెట్రో రైలు శబ్దకాలుష్యంపై వివరణివ్వండి
మెట్రో రైల్వే లైను వంపుల్లో రైలు వెళ్లినపుడు పరిమితికి మించి వస్తున్న శబ్దకాలుష్యంపై వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వానికి, మెట్రో రైల్వే ఎండీకి బుధవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
ఆర్జేసీ, మోడల్, కేజీబీవీ విద్యార్థుల ప్రతిభ
టీఎస్ఆర్జేసీ నేరెళ్ల గురుకుల విద్యార్థిని ఎంపీసీలో 991 మార్కులు, బైపీసీలో తాటిపల్లి విద్యార్థిని 990 మార్కులు సాధించినట్లు యాజమాన్యం తెలిపింది. -
ఫోన్ ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావుకు మధ్యంతర బెయిలు నిరాకరణ
ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టయిన టాస్క్ఫోర్స్ మాజీ ఓఎస్డీ రాధాకిషన్రావుకు ఎల్ఎల్ఎం పరీక్షలు రాసేందుకు వీలుగా మధ్యంతర బెయిలు ఇచ్చేందుకు నాంపల్లి కోర్టు నిరాకరించింది. -
పోలింగ్ రోజు వేతనంతో కూడిన సెలవు
లోక్సభ ఎన్నికల పోలింగ్ జరిగే రోజును వేతనంతో కూడిన సెలవుగా ప్రకటించారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్రాజ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
జస్టిస్ రామలింగేశ్వరరావుకు హైకోర్టు ఘన నివాళి
గుండెపోటుతో ఇటీవల మృతి చెందిన ఉమ్మడి హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎ.రామలింగేశ్వరరావుకు బుధవారం హైకోర్టు ఘన నివాళి అర్పించింది. -
శనగ విత్తనోత్పత్తి రైతుల ఆందోళన
‘పంట విక్రయించి నెల రోజులవుతోంది. డబ్బులు ఎప్పుడు ఇస్తారో.. క్వింటాకు ఎంత కట్టిస్తారో ఇప్పటికీ తెలియదు. -
విచారణ నుంచి తప్పుకొన్న జస్టిస్ శేషసాయి ధర్మాసనం
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసుపై మాట్లాడొద్దంటూ కడప జిల్లా కోర్టు(పీడీజే) ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ వివేకా కుమార్తె నర్రెడ్డి సునీత, పులివెందుల తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.రవీంద్రనాథ్రెడ్డి అలియాస్ బీటెక్ రవి దాఖలు చేసిన వ్యాజ్యాల విచారణ నుంచి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏవీ శేషసాయి నేతృత్వంలోని ధర్మాసనం తప్పుకొంది. -
ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఇంటర్ ప్రవేశాలు
రాష్ట్రంలోని ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో ప్రవేశాల పేరిట డొనేషన్లు, అధిక రుసుముల వసూళ్లు, ఇతరత్రా అక్రమాలను నిరోధించేందుకు వీలుగా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఆన్లైన్ ప్రవేశాల విధానాన్ని ప్రవేశపెట్టాలని యోచిస్తున్నామని విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. -
మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ
ష్ట్రంలో మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. షెడ్యూలును విద్యాశాఖ బుధవారం విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు (4)
రాష్ట్రంలో వచ్చే నెల 6వ తేదీన జరగనున్న తెలంగాణ రాష్ట్ర ఇంజినీరింగు కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (టీఎస్ఈసెట్)ను మే చివరి వారానికి వాయిదా వేయాలని పలువురు అభ్యర్థులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని కోరారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?
-
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు
-
మన దగ్గర ఇదే సమస్య.. హార్దిక్ గురించి పిల్లలకూ చెబుతాం: వసీమ్ అక్రమ్
-
‘యానిమల్’ టూ రామాయణ’.. రణబీర్ ట్రాన్స్ఫర్మేషన్ షేర్ చేసిన ట్రైనర్
-
రూ.29కే జియోసినిమా ప్రీమియం.. యాడ్ ఫ్రీ కంటెంట్, 4K వీడియో క్వాలిటీ