KCR: ఉద్యమ స్ఫూర్తితో దళితబంధు
ఉద్యమ స్ఫూర్తితో దళితబంధును అమలు చేయనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. వచ్చే బడ్జెట్లో దీనికి రూ.20 వేల కోట్లను కేటాయించనున్నట్లు తెలిపారు. పార్టీలు, రాజకీయాలకు అతీతంగా పథకం అమలవుతుందన్నారు. ఇలాంటి పథకం ప్రపంచంలోనే ఎక్కడా అమలు కావడంలేదన్నారు.
వచ్చే బడ్జెట్లో రూ.20 వేల కోట్లు
మార్చినాటికి ప్రతి నియోజకవర్గంలో వంద కుటుంబాలకు ప్రయోజనం
బీసీ కుల గణనపై తీర్మానం
ఎస్సీ రిజర్వేషన్లనూ పెంచాలి
మళ్లీ మేమే గెలుస్తాం
కొత్తగా 80 వేల ఉద్యోగాలు
శాసనసభలో ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడి
ఈనాడు, హైదరాబాద్: ఉద్యమ స్ఫూర్తితో దళితబంధును అమలు చేయనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. వచ్చే బడ్జెట్లో దీనికి రూ.20 వేల కోట్లను కేటాయించనున్నట్లు తెలిపారు. పార్టీలు, రాజకీయాలకు అతీతంగా పథకం అమలవుతుందన్నారు. ఇలాంటి పథకం ప్రపంచంలోనే ఎక్కడా అమలు కావడంలేదన్నారు. దీని ద్వారా లబ్ధిపొందే కుటుంబాలకు ప్రస్తుతం అందుతున్న సంక్షేమ పథకాలు, ప్రయోజనాలు అన్నీ యథావిధిగా అమలవుతాయని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. దేశంలో బీసీ కుల గణన చేయాలని కేంద్రాన్ని కోరుతూ రాష్ట్ర శాసనసభ తీర్మానం చేసి పంపుతుందని ప్రకటించారు. దళితుల జనాభా పెరిగిన నేపథ్యంలో వారికి రిజర్వేషన్లను పెంచాలని అన్నారు. దళితబంధు పథకం నాలుగు దశల్లో అమలు కానుండగా రూ.1.8 లక్షల కోట్లను వ్యయం చేయనున్నటు వివరించారు. ప్రతి జిల్లాలో నాలుగువేల కోట్ల రూపాయలతో కలెక్టర్ల వద్ద దళిత రక్షణనిధి ఏర్పాటు చేస్తామన్నారు. మొదటి దశలో హుజూరాబాద్ నియోజకవర్గంతో పాటు ఎంపిక చేసిన 4 మండలాల్లో వందశాతం దళిత కుటుంబాలకు పథకం అమలవుతుందన్నారు. వచ్చే ఏడాది మార్చిలోపు ప్రతి నియోజకవర్గంలో 100 కుటుంబాలకు ప్రయోజనం అందుతుందన్నారు. ఆ వందమందిని ఎంపికచేసే బాధ్యతను ఎమ్మెల్యేలు తీసుకోవాలన్నారు. శాసనసభలో మంగళవారం దళితబంధుపై జరిగిన చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడారు. ‘‘హుజూరాబాద్ ఎన్నిక కోసం ఈ పథకం రాలేదు. 1986 నుంచీ దళిత అభ్యున్నతిపై దృష్టి సారించా. గత ఏడాదే అమలుకావాల్సి ఉండగా కరోనాతో వాయిదా పడింది. దళితుల అభ్యున్నతికి అమలు చేస్తున్న ఈపథకం రాష్ట్ర ఆర్థిక పురోగతికి తోడ్పడుతుంది. అన్ని ఎస్సీ కుటుంబాలకు ప్రయోజనం కలుగుతుంది.
భవిష్యత్తులో కేంద్రంలో తెరాస కీలకం కావచ్చు
అధికారం కోసం కొందరు కలలు కంటున్నారు. కానీ వచ్చేసారి కూడా మేమే గెలుస్తాం. మేలు చేసే వాళ్లను ప్రజలు ఎప్పుడూ గుర్తుంచుకుంటారు. మేమేమి మఠం నడపడంలేదు. భవిష్యత్తులో కేంద్రంలో తెరాస కీలకం కావచ్చు. ప్రతి అంశాన్నీ ఓట్ల కోణంలో చూడటం సరికాదు. హుజూరాబాద్ ఎన్నిక తర్వాత దళితబంధు ఖాతాల్లోని డబ్బును వెనక్కి తీసుకుంటారని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. తెలంగాణ ధనిక రాష్ట్రమే. రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకెళ్తోంది. ఏడాదిలో రూ.10 లక్షల కోట్ల లావాదేవీలు జరుగుతున్నాయి. వచ్చే ఏడేళ్లలో రూ.23 లక్షల కోట్లను ప్రభుత్వం ఖర్చు పెడుతుంది. ఇందులో దళితబంధు కోసం రూ.1.80 లక్షల కోట్లు ఖర్చు చేస్తాం. 11.5 శాతం వృద్ధిరేటు నమోదైంది. దేశ జీడీపీకి అత్యధికంగా దోహదపడుతున్న 4 రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి. ఇవన్నీ కాగ్, ఆర్బీఐ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.
అన్ని వర్గాల అభ్యున్నతే లక్ష్యం
రాష్ట్రం ఏర్పడితే అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతి సాధ్యమని పోరాడి తెలంగాణ సాధించుకున్నాం. రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా అనేక కుట్రలు జరిగాయి. రెండు రాష్ట్రాలు కలసిపోతాయని కూడా ప్రచారం చేశారు. తెలంగాణకు చెందిన ఏడు మండలాలను, సీలేరు ప్రాజెక్టును తీసేసుకున్నారు. గిరిజనులు, బీసీలు,మైనార్టీలు, అగ్రవర్ణాల్లోని పేదలను ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. వ్యవసాయరంగం స్థిరీకరణకు రైతుబంధును అన్ని వర్గాలకు అమలు చేశాం. రాష్ట్రంలో మూడు కోట్ల టన్నుల వరిధాన్యం పండుతుండటమే దీనికి నిదర్శనం. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి అన్ని వర్గాలను లక్ష్యంగా చేసుకొని కార్యక్రమాలు అమలు చేస్తున్నాం.
17.53 శాతం మంది దళితులు
రాష్ట్రంలో దళితులు 15 శాతం మాత్రమే అనేది సరికాదు. జనాభాలో 17.53 శాతం ఉన్నారు. అత్యధికంగా మంచిర్యాల జిల్లాలో 25.46 శాతం ఉండగా తక్కువగా హైదరాబాద్ జిల్లాలో 11.77శాతం మంది ఉన్నారు. అనేక జిల్లాల్లో 20 శాతానికిపైగా ఉన్నారు. సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం రాష్ట్రంలో 1,03,93,967 కోట్ల కుటుంబాలు ఉండగా ఇందులో 18,22,291 దళిత కుటుంబాలున్నాయి. ఆరేడేళ్లలో ఈ కుటుంబాల సంఖ్య పెరిగి ఉంటుంది.
భాజపా ఎస్సీ వర్గీకరణ చేయిస్తే స్వాగతిస్తాం
ఎస్సీ వర్గీకరణపై శాసనసభ తీర్మానం చేసి కేంద్రానికి పంపడమే కాకుండా 25 ఉత్తరాలు రాశాం. ప్రధానికి స్వయంగా వివరించాం. భాజపా సభ్యులు వర్గీకరణను చేయిస్తే ఎయిర్పోర్టుకు వెళ్లి వారికి స్వాగతం చెబుతాం. బీసీ కులగణనను కేంద్రం ఎందుకు నిరాకరిస్తోంది? కేంద్ర ప్రభుత్వం తోడ్పాటును ఇస్తే దళితబంధు మరింత బాగా అమలు చేయవచ్చు’’ అని కేసీఆర్ అన్నారు.
ఒక్కొక్కరిదీ ఒక్కో సెంటిమెంట్
ఒక్కొక్కరికీ ఒక్కో సెంటిమెంట్ ఉంటుందని పార్టీలనుద్దేశించి వికారాబాద్ ఎమ్మెల్యే (తెరాస) మెతుకు ఆనంద్ వ్యాఖ్యానించారు. ‘దళిత బంధు’ హుజూరాబాద్ ఎన్నికల కోసమేనని, లేకుంటే అక్కడే ఎందుకు అమలు చేస్తున్నారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయని.., ఒకరికి భాగ్యలక్ష్మి ఆలయం, మరొకరికి చేవెళ్ల అయితే.. కేసీఆర్కు కరీంనగర్ జిల్లా సెంటిమెంట్ అని పేర్కొన్నారు. మీరుపెట్టే సభలు, సమావేశాలు, ప్రజాసంగ్రామ యాత్రలు కూడా ఓట్ల కోసమేనా? అని వ్యాఖ్యానించారు.
ఎన్నికల కోసం కాదని నిరూపితమైంది
ఏ ఎన్నికలున్నాయని కేసీఆర్ కల్యాణలక్ష్మి పథకాన్ని తెచ్చారు? పథకాలు ఎన్నికల కోసం కాదని ఎప్పుడో రుజువైందని తుంగతుర్తి ఎమ్మెల్యే(తెరాస) గాదరి కిశోర్కుమార్ చెప్పారు. పేదముస్లింలకు ఇలాంటి పథకాన్ని అమలు చేయాలని ఎంఐఎం ఎమ్మెల్యే బలాల కోరారు.
ఇప్పటికే 1.51 లక్షల ఉద్యోగాల భర్తీకి చర్యలు
జిల్లాల పునర్వ్యవస్థీకరణ, నూతన జిల్లాల ఏర్పాటు, కొత్త జోనల్ విధానంతో ఉద్యోగావకాశాలు పెరిగాయి. తాజా జోనల్ విధానంతో 95 శాతం ఉద్యోగాలు స్థానికులకే దక్కుతాయి. త్వరలోనే ఉద్యోగ సంఘాలతో చర్చించి ఈ విధానంలో ఉద్యోగులను కేటాయిస్తాం. అనంతరం ఖాళీల భర్తీకి చర్యలు తీసుకుంటాం. కొత్తగా 70 వేల నుంచి 80 వేల ఉద్యోగాలకు అవకాశం ఉంటుంది. ఇప్పటికే రాష్ట్రంలో 1.51 లక్షల ఉద్యోగాల భర్తీకి చర్యలు తీసుకోగా 1.31 లక్షల మంది ఉద్యోగాల్లో చేరారు.
వచ్చిన పని... నచ్చిన చోట
ఈ ఏడాది బడ్జెట్లో దళిత సాధికారతకు రూ.1,000 కోట్లను కేటాయించాం. సుమారు రూ.2,500 కోట్లను వ్యయం చేస్తాం. దళితబంధుకు రూ.10 లక్షల మొత్తాన్ని శాస్త్రీయంగా నిర్ణయించాం. వందశాతం గ్రాంట్ రూపంలో ఇస్తున్నాం. యూనిట్లను ఏర్పాటు చేసుకునేందుకు ఎలాంటి ఆంక్షలూ లేవు. లబ్ధిదారుల ఇష్టమే. ఈ పథకం కింద వచ్చిన పని నచ్చిన చోట చేసుకోవచ్చు. ఎస్సీ ఉప ప్రణాళికకు చట్టబద్ధత ఉంది. పథకాలకు ప్రత్యేకంగా అవసరంలేదు. దళితబంధు పొందని కుటుంబాలకు దళిత రక్షణ నిధి ద్వారా తోడ్పాటును అందించడంపై దృష్టిసారిస్తాం. ప్రభుత్వం లైసెన్స్లు ఇచ్చే అన్నింటిలో ఎస్సీలకు రిజర్వేషన్లు కల్పిస్తాం. ఇందులో భాగంగానే వారికి 250 నుంచి 300 మద్యం దుకాణాలు దక్కనున్నాయి. రాష్ట్రంలో 75 లక్షల మంది దళితులు ఉంటే వారి చేతిలో 13 లక్షల ఎకరాలే ఉంది. గిరిజనులకంటే తక్కువ భూమి ఎస్సీలకు ఉంది. దళితులకు మూడెకరాలు ఇస్తామని చెప్పలేదు. అయినా 16 వేల ఎకరాలను ఇచ్చాం. వైద్య ఆరోగ్యశాఖలో ఎస్సీ ఉద్యోగులకు పదోన్నతులు కల్పించేలా చర్యలు తీసుకుంటాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రెండు రాష్ట్రాలు.. రెండు ఓట్లు!
సాధారణంగా ఓటరు ఒక్కసారే ఓటు వేయాల్సి ఉంటుంది. ఎన్నికల కమిషన్(ఈసీ) కూడా అదే చెబుతుంది. -
సమస్య ఓ చోట.. సమర్పించేది మరోచోట.. పాస్పోర్టు దరఖాస్తుదారుల్లో గందరగోళం
ధ్రువపత్రాల సమర్పణలో పొరపాట్లతో తిరస్కరణకు గురైన పాస్పోర్టు దరఖాస్తుదారుల్లో గందరగోళం నెలకొంటోంది. పాస్పోర్టు సేవాకేంద్రాల్లో సమర్పించాల్సిన ధ్రువపత్రాలను రీజనల్ సేవా కేంద్రంలో సమర్పిస్తుండడమే దీనికి కారణం -
50 ఏళ్ల తరువాత.. నవమి రోజున సీతారాముల కల్యాణం
దేశంలోని ప్రధాన రామాలయాల్లో ఏటా శ్రీరాముడి జన్మ నక్షత్రమైన పునర్వసు (శ్రీరామ నవమి) శుభ ఘడియల్లో సీతారాముల కల్యాణం నిర్వహిస్తారు. -
సీతమ్మను మనువాడె భద్రాద్రి రామయ్య
భద్రాచలంలో శ్రీ సీతారామచంద్రస్వామి వార్షిక కల్యాణోత్సవం అశేష భక్తజనుల జయజయధ్వానాల నడుమ ఆద్యంతం వైభవోపేతంగా సాగింది. -
చెలమల నీళ్లే గొంతు తడుపుతున్నాయ్
రాష్ట్రంలోని ఏజెన్సీ గ్రామాలు, ఆవాసాల్లో తాగునీటి కటకట నెలకొంది. తాగునీటి సరఫరా ప్రాజెక్టుల నిర్మాణం, నిర్వహణలో లోపాలు, ప్రణాళిక లేమితో గిరిజనులకు రక్షిత జలం అందక.. కాలువలు, చెలమల్లోని నీళ్లే దిక్కయ్యాయి. -
సొమ్ము వెనక్కి వచ్చేది ఎప్పుడో?
ఏదన్నా కారణంతో ధరణి సేవలను రద్దు చేసుకున్న వారు అప్పటికే ప్రభుత్వానికి చెల్లించిన రుసుం తిరిగి పొందడానికి అష్ట కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తోంది. -
బంగారం బిస్కెట్లుగా ఆలయాల ఆభరణాలు
రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాలకు భక్తులు సమర్పించిన బంగారం, వెండి ఆభరణాల్లో దేవతామూర్తుల అలం -
కార్టూనిస్ట్ శ్రీధర్ ఆధ్వర్యంలో 21న పెయింటింగ్ వర్క్షాప్
ఔత్సాహిక చిత్రకారుల కోసం వేసవి సెలవుల్లో ఒక ప్రత్యేక వర్క్షాప్ నిర్వహిస్తున్నట్టు శ్రీధర్ ఆర్ట్ ఇన్స్టిట్యూట్ నిర్వాహకులు, ప్రముఖ కార్టూనిస్ట్ శ్రీధర్ తెలిపారు. -
అమరావతిపై ఇంత కక్షా!
అమరావతిపై వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యానికి, కక్ష సాధింపునకు పరాకాష్ఠ ఇది. రాజధానికి శంకుస్థాపన జరిగిన ప్రాంతంలో అమరావతి నమూనాలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. -
గురుకుల విద్యార్థి ప్రశాంత్ మరణానికి బాధ్యులపై తగిన చర్యలు
భువనగిరి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థి ప్రశాంత్ మరణం బాధాకరమని ఆ శాఖ కార్యదర్శి సీతాలక్ష్మి బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. -
పదేళ్ల తర్వాత రాష్ట్ర ప్రభుత్వ వైద్యుల సంఘం ఎన్నికలు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వైద్యుల సంఘం (టీజీడీఏ)ఎన్నికలకు హైకోర్టు అనుమతించిన నేపథ్యంలో ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు ఆ సంఘం కోర్ కమిటీ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొంది. -
విద్యుదుత్పత్తి చేసి.. బయట అమ్ముకోవచ్చు!
దేశంలో విద్యుత్ డిమాండ్ పెరగడంతో గ్యాస్ ఆధారిత విద్యుదుత్పత్తి కేంద్రాలకు కేంద్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. -
శ్రీవారి ఆలయంలో వైభవంగా శ్రీరామనవమి ఆస్థానం
శ్రీవారి ఆలయంలో శ్రీరామనవమి ఆస్థానాన్ని పురస్కరించుకుని శ్రీసీతారామలక్ష్మణ సమేత హనుమంతులవారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనాన్ని బుధవారం వైభవంగా నిర్వహించారు. -
సాగర్లో అత్యవసర మోటార్ల ట్రయల్ రన్ ప్రారంభం
హైదరాబాద్ జంట నగరాలు, నల్గొండ జిల్లా తాగునీటి అవసరాలు తీర్చేందుకు నాగార్జునసాగర్ జలాశయంలో హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బీ (జలమండలి) ఆధ్వర్యాన ఏర్పాటు చేస్తున్న అత్యవసర మోటార్ల ప్రయోగాత్మక పరిశీలన (ట్రయల్ రన్) బుధవారం ప్రారంభమైంది. -
నదుల అనుసంధానంపై దిల్లీలో టాస్క్ఫోర్స్ సమావేశం రేపు
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన నదుల అనుసంధాన ప్రాజెక్టులో భాగంగా గోదావరి-కావేరి లింక్పై శుక్రవారం నదుల అనుసంధాన టాస్క్ఫోర్స్ కమిటీ చర్చించనుంది. -
సమస్య గుర్తించక ముందే మరమ్మతులెలా నిర్ణయిస్తారు..?
మేడిగడ్డ బ్యారేజీ మరమ్మతు పనులను గుత్తేదారులకు అప్పగించేందుకు నీటిపారుదలశాఖ నిర్ణయించినట్లు జరుగుతున్న ప్రచారంపై ప్రభుత్వ పెద్దలు ఆగ్రహంతో ఉన్నట్లు తెలిసింది. -
సివిల్స్ విజేతలకు కేటీఆర్ శుభాకాంక్షలు
సివిల్స్లో విజయం సాధించిన తెలుగు రాష్ట్రాల అభ్యర్థులంతా పూర్తి శక్తి సామర్థ్యాలను వినియోగించి.. దేశ భవిష్యత్ నిర్మాణంలో ప్రధానపాత్ర పోషిస్తారని ఆశిస్తున్నట్లు భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ ఆకాంక్షించారు. -
సివిల్స్లో సత్తా చాటిన తెలుగువారికి చంద్రబాబు అభినందనలు
సివిల్స్కు తెలుగు రాష్ట్రాల నుంచి ఎంపికైన అభ్యర్థులకు తెదేపా అధినేత చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. -
ప్రైవేటు బడుల ఫీ‘జులుం’!
రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేటు, కార్పొరేటు పాఠశాలల్లో రుసుములు ఆకాశాన్నంటుతున్నాయి. ప్లేస్కూల్, ఎల్కేజీ, యూకేజీ, మొదటి తరగతి నుంచి పదో తరగతి వరకు.. డొనేషన్లు, అభివృద్ధి ఛార్జీలు, రుసుములతో పాటు పుస్తకాలు, దుస్తులు, బూట్లు, బెల్టుల పేరిట తల్లిదండ్రుల జేబులకు భారీగా చిల్లులు పెడుతున్నాయి. -
రోజుకు రూ.కోటి ఆదాయం పెరగాలి!
ప్రయాణికుల నుంచి మరింత ఆదాయం రాబట్టుకునేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) సిద్ధమవుతోంది. ఇందుకోసం డీలక్స్, సూపర్లగ్జరీ, ఏసీ బస్సుల సేవలపై దృష్టిపెట్టబోతోంది. -
ద.మ రైల్వేకు రూ.20,339 కోట్ల రికార్డు ఆదాయం
దక్షిణ మధ్య రైల్వే రికార్డు స్థాయిలో ఆదాయాన్ని గడించింది. తొలిసారి రూ.20 వేల కోట్ల మైలురాయిని దాటింది.
తాజా వార్తలు (Latest News)
-
చెప్పుకొనే పనుల్లేక.. ‘కప్పు’డు ప్రచారం!
-
యూట్యూబర్ దుస్సాహసం.. రన్వేపై వీడియో చిత్రీకరించి యూట్యూబ్లో అప్లోడ్
-
ఎమ్మెల్యేకు వాలంటీరు సత్కారం... ఎన్నికల అధికారులకు తెదేపా ఫిర్యాదు
-
విశాఖ ఎంపీ, గాజువాక శాసనసభ స్థానానికి పోటీ: పాల్
-
ఐరాసలో భారత్కు వీటో అధికారం.. మస్క్ ప్రతిపాదనపై అమెరికా స్పందనిదే..
-
రెండు రాష్ట్రాలు.. రెండు ఓట్లు!