Kishan Reddy: సాధారణ బియ్యం కొంటాం
హుజూరాబాద్ ఉపఎన్నిక ఫలితాల తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ భాజపా, కేంద్ర ప్రభుత్వంపైన అనవసర విమర్శలు చేస్తున్నారు. నాలుక చీరేస్తామంటూ భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కేసీఆర్
ఉప్పుడు బియ్యం కొనలేం
పంజాబ్ తర్వాత ఎక్కువ కొనేది తెలంగాణ నుంచే
కేంద్ర మంత్రి కిషన్రెడ్డి
హుజూరాబాద్ ఉపఎన్నిక ఫలితాల తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ భాజపా, కేంద్ర ప్రభుత్వంపైన అనవసర విమర్శలు చేస్తున్నారు. నాలుక చీరేస్తామంటూ భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కేసీఆర్ బెదిరింపులకు, తాటాకు చప్పుళ్లకు భాజపా, కేంద్ర ప్రభుత్వం భయపడవు. గొంతు పెంచినంత మాత్రాన సమస్యలు సమసిపోవు.
- కేంద్ర మంత్రి కిషన్రెడ్డి
ఈనాడు, దిల్లీ: సాధారణ బియ్యాన్ని (రా రైస్) దశలవారీగా కొనుగోలు చేస్తామని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖల మంత్రి కిషన్రెడ్డి తెలిపారు. ఉప్పుడు బియ్యం కొనలేమని స్పష్టంచేశారు. ధాన్యం, బియ్యం విషయంలో ముఖ్యమంత్రి రైతులను పక్కదారి పట్టిస్తున్నారన్నారు. పంజాబ్ తర్వాత తెలంగాణ నుంచే కేంద్రం ఎక్కువగా బియ్యం కొంటోందన్నారు. ఉప్పుడు బియ్యాన్ని రాష్ట్రంలో తినరని, కేరళలోనూ వాడకం తగ్గినందున ఆ బియ్యాన్ని కొనలేమని గతంలోనే కేంద్రం స్పష్టం చేసిందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం 2014లో తెలంగాణ నుంచి 43 లక్షల మెట్రిక్ టన్నుల (ఎల్ఎంటీ) బియ్యం సేకరిస్తే 2020-21లో 94 ఎల్ఎంటీలకు పెరిగిందని చెప్పారు. దిల్లీలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. వివరాలు..‘‘తెలంగాణ నుంచి ధాన్యం సేకరణకు 2014లో రూ.3,404 కోట్లు వెచ్చించగా 2020-21 నాటికి అది రూ.26,641 కోట్లకు పెరిగింది. సంచులు, సుత్లీ, హమాలీ ఖర్చులకూ కేంద్రమే నిధులిస్తోంది. రైస్మిల్లుల్లో టెక్నాలజీ మార్చుకొని రా రైస్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరాం. 2020-21లో 24.75 ఎల్ఎంటీ దొడ్డు బియ్యం సేకరించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకున్నా.. రాష్ట్ర ప్రభుత్వం అదనంగా మరో 20 ఎల్ఎంటీ కొనాలని కోరితే ఆ మొత్తాన్నీ సేకరించాం. భవిష్యత్తులో ఎఫ్సీఐకి దొడ్డు బియ్యం పంపబోమని రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. దిల్లీలో ఆగస్టు 17న జరిగిన కేంద్ర, రాష్ట్రాల పౌరసరఫరాల శాఖ కార్యదర్శుల సమావేశంలో తెలంగాణ నుంచి 40 ఎల్ఎంటీ బియ్యం సేకరించాలని ఒప్పందం జరిగింది. 108 ఎల్ఎంటీ కొనాలని రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాయగా 90 ఎల్ఎంటీ సేకరించాలని ముఖ్యమంత్రి మరో లేఖ రాశారు. (ఆ లేఖలను చూపారు) ఎంత విస్తీర్ణంలో పంట వేశారు.. ఎంత ఉత్పత్తి వస్తుందనే అంశాలపై రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టత లేదు.
* కరోనా తగ్గుముఖం పట్టి జీఎస్టీ రాబడిలో స్థిరత్వం ఏర్పడటంతో పెట్రో ఉత్పత్తులపై ధరలు తగ్గించాం. గతంలో సెస్ ద్వారా వచ్చిన ఆదాయంతో దేశంలో 80 కోట్ల మందికి ఏడాదిన్నర పాటు ఉచితంగా బియ్యం, పప్పులు అందజేశాం. కరోనావ్యాక్సిన్ను ఉచితంగా ఇచ్చాం. పెట్రో ధరలతో దోచుకుంటున్నారని కేసీఆర్ మాట్లాడటం తగదు. కేంద్రం ఒక్క రూపాయీ అవినీతి చేయడం లేదు.
* రాష్ట్రంలో వైద్య కళాశాలల ఏర్పాటుకు సంబంధించి లేఖరాస్తే సమాధానం రాలేదు. రాష్ట్రంలో సచివాలయం లేదు.. ఏ విభాగం ఎక్కడుందో తెలియదు... కేంద్రం పంపించిన లేఖను ముఖ్యమంత్రి చూశారో లేదో తెలియదు. వైద్య కళాశాలలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 60:40 శాతం వ్యయం చేయాల్సి ఉంటుంది. అందుకే కేసీఆర్ మాట్లాడలేదేమో. ఎయిమ్స్కు ఇప్పటికీ స్థలం అప్పగించలేదు. అంటువ్యాధుల పరిశోధన కేంద్రానికి మూడెకరాలు ఇమ్మంటే స్పందన లేదు. 8 ఆపరేషన్ థియేటర్ల సామర్థ్యంతో ఆదిలాబాద్, వరంగల్లలో ఆసుపత్రులు నిర్మిస్తే వాటిని ప్రారంభించలేదు. కరోనా కాలంలో పంపిన వెంటిలేటర్లను తెరవలేదు. కరోనా మరణాలు తక్కువచేసి చూపినా వివాదాలు వద్దని చూసీచూడనట్లు పోయాం.
* హుజూరాబాద్లో ఇంటింటికీ రూ.లక్షలు పంపిణీ చేసినా, దళితబంధు పేరుతో రూ.పది లక్షలు ఇచ్చినా ఓడిపోవడంతో ముఖ్యమంత్రి బెంబేలెత్తిపోతున్నారు. కుమారుడు ముఖ్యమంత్రి కాలేడనే ఆవేదన, ఆక్రోశంతో అలా మాట్లాడుతున్నారు. ఆయనకు సానుభూతి వ్యక్తం చేయడం తప్ప ఏం చేయలేం. సైనికులను, వారి త్యాగాలను అవమానించేలా కేసీఆర్ మాట్లాడుతున్నారు.భాష విషయంలో ఇతరులను విమర్శించే అర్హత కేసీఆర్కు, ఆయన కుటుంబసభ్యులకు లేదు’’ అని కేంద్రమంత్రి కిషన్రెడ్డి అన్నారు.
పెట్రో ఉత్పత్తులపై ధరలు పెరిగినప్పుడల్లా వ్యాట్ పెరిగి రాష్ట్రాలకు ఆదాయం వచ్చింది. పెట్రోలుపై వ్యాట్ పెంచలేదని ముఖ్యమంత్రి అంటున్నారు. 2015లో వ్యాట్ పెంచిన విషయాన్ని ఆయన మర్చిపోయారా?
కేంద్రంలో రాష్ట్రం నుంచి ఓ మంత్రి ఉన్నారనే విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించలేదు. ఈ అంశంపై త్వరలో ప్రత్యేకంగా మాట్లాడతా.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పతి దేవుడికి గుడి కట్టింది!
కరోనా మహమ్మారి ఆమె జీవితంలో అంతులేని విషాదాన్ని నింపింది. కళ్లల్లో పెట్టుకుని చూసుకునే భర్తను తన నుంచి దూరం చేసింది. మూడేళ్ల క్రితం భర్త కొవిడ్తో మృతి చెందడంతో ఆమె ఒంటరిగా మారారు. -
కొత్తవారొచ్చారు
ఆంధ్రప్రదేశ్ నిఘా విభాగాధిపతిగా సీనియర్ ఐపీఎస్ అధికారి కుమార్ విశ్వజిత్ను, విజయవాడ నగర పోలీసు కమిషనర్గా పీహెచ్డీ రామకృష్ణను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. -
జేఈఈ మెయిన్స్లో తెలుగోళ్ల సత్తా
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. దేశవ్యాప్తంగా 56 మందికి 100 పర్సంటైల్ రాగా.. ఇందులో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందినవారే 22 మంది ఉన్నారు. జేఈఈ మెయిన్స్ తుది ఫలితాలను జాతీయ పరీక్షల విభాగం (ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసింది. -
కాళేశ్వరంపై కమిషన్ విచారణ షురూ
కాళేశ్వరం ఎత్తిపోతల్లోని బ్యారేజీలపై న్యాయ విచారణకు ఏర్పాటు చేసిన కమిషన్ కార్యాచరణ మొదలుపెట్టింది. బుధవారం కమిషన్ ఛైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ ఆయన సతీమణి దేబ్జానీ ఘోష్తో కలిసి హైదరాబాద్కు చేరుకున్నారు. -
ఫస్టియర్లో 60.01%.. సెకండియర్లో 64.19%
ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో 60.01 శాతం, రెండో సంవత్సరంలో 64.19 శాతం మంది విద్యార్థులు (ఒకేషనల్ కోర్సులతో కలిపి) ఉత్తీర్ణత సాధించారు. -
కవిత బెయిల్పై మే 6న తీర్పు
ఈడీ కేసులో బెయిల్ కోసం భారాస ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్పై తీర్పును ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు మే 6కి వాయిదా వేసింది. -
చదువుల ‘సిరి’.. రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని పట్టుదల
వారానికి రెండుసార్లు డయాలసిస్.. ఒంట్లో సత్తువ లేక కళాశాలకూ వెళ్లలేని పరిస్థితి.. అయినా మొక్కవోని పట్టుదలతో చదివిన పేదింటి బిడ్డ ప్రతిభ చాటింది. -
విజన్-2026కు డోర్నకల్ ఉపాధ్యాయుల శ్రీకారం
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు విజన్-2026 పేరిట ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. -
ఇంటర్ ఫలితాల్లో కవలల ప్రతిభ
సూర్యాపేట జిల్లా ఆత్మకూర్(ఎస్) మండల కేంద్రానికి చెందిన డేగల వీరభద్రయ్య, మంజుల దంపతుల కవల పిల్లలు డేగల రామ్, లక్ష్మణ్ ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో ప్రతిభ చూపారు. -
రాష్ట్రంలో వంతెనల పరిశీలన..!
రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న చిన్నా, పెద్ద వంతెనలను పరిశీలించేందుకు అధికారులు ఆయత్తం అవుతున్నారు. జిల్లాల వారీగా నిర్మాణ స్థితిగతులపై జాబితాలను రూపొందించే పనిలో ఉన్నారు. -
యాదాద్రి విద్యుత్కేంద్రానికి పర్యావరణ అనుమతి
యాదాద్రి థర్మల్ విద్యుత్కేంద్రానికి పర్యావరణ అనుమతి (ఈసీ) ఇవ్వడానికి కేంద్ర పర్యావరణ శాఖ ఆమోదం తెలిపింది. -
మెట్రో రైలు శబ్దకాలుష్యంపై వివరణివ్వండి
మెట్రో రైల్వే లైను వంపుల్లో రైలు వెళ్లినపుడు పరిమితికి మించి వస్తున్న శబ్దకాలుష్యంపై వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వానికి, మెట్రో రైల్వే ఎండీకి బుధవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
ఆర్జేసీ, మోడల్, కేజీబీవీ విద్యార్థుల ప్రతిభ
టీఎస్ఆర్జేసీ నేరెళ్ల గురుకుల విద్యార్థిని ఎంపీసీలో 991 మార్కులు, బైపీసీలో తాటిపల్లి విద్యార్థిని 990 మార్కులు సాధించినట్లు యాజమాన్యం తెలిపింది. -
ఫోన్ ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావుకు మధ్యంతర బెయిలు నిరాకరణ
ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టయిన టాస్క్ఫోర్స్ మాజీ ఓఎస్డీ రాధాకిషన్రావుకు ఎల్ఎల్ఎం పరీక్షలు రాసేందుకు వీలుగా మధ్యంతర బెయిలు ఇచ్చేందుకు నాంపల్లి కోర్టు నిరాకరించింది. -
పోలింగ్ రోజు వేతనంతో కూడిన సెలవు
లోక్సభ ఎన్నికల పోలింగ్ జరిగే రోజును వేతనంతో కూడిన సెలవుగా ప్రకటించారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్రాజ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
జస్టిస్ రామలింగేశ్వరరావుకు హైకోర్టు ఘన నివాళి
గుండెపోటుతో ఇటీవల మృతి చెందిన ఉమ్మడి హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎ.రామలింగేశ్వరరావుకు బుధవారం హైకోర్టు ఘన నివాళి అర్పించింది. -
శనగ విత్తనోత్పత్తి రైతుల ఆందోళన
‘పంట విక్రయించి నెల రోజులవుతోంది. డబ్బులు ఎప్పుడు ఇస్తారో.. క్వింటాకు ఎంత కట్టిస్తారో ఇప్పటికీ తెలియదు. -
విచారణ నుంచి తప్పుకొన్న జస్టిస్ శేషసాయి ధర్మాసనం
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసుపై మాట్లాడొద్దంటూ కడప జిల్లా కోర్టు(పీడీజే) ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ వివేకా కుమార్తె నర్రెడ్డి సునీత, పులివెందుల తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.రవీంద్రనాథ్రెడ్డి అలియాస్ బీటెక్ రవి దాఖలు చేసిన వ్యాజ్యాల విచారణ నుంచి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏవీ శేషసాయి నేతృత్వంలోని ధర్మాసనం తప్పుకొంది. -
ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఇంటర్ ప్రవేశాలు
రాష్ట్రంలోని ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో ప్రవేశాల పేరిట డొనేషన్లు, అధిక రుసుముల వసూళ్లు, ఇతరత్రా అక్రమాలను నిరోధించేందుకు వీలుగా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఆన్లైన్ ప్రవేశాల విధానాన్ని ప్రవేశపెట్టాలని యోచిస్తున్నామని విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. -
మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ
ష్ట్రంలో మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. షెడ్యూలును విద్యాశాఖ బుధవారం విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు (4)
రాష్ట్రంలో వచ్చే నెల 6వ తేదీన జరగనున్న తెలంగాణ రాష్ట్ర ఇంజినీరింగు కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (టీఎస్ఈసెట్)ను మే చివరి వారానికి వాయిదా వేయాలని పలువురు అభ్యర్థులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని కోరారు.
తాజా వార్తలు (Latest News)
-
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
-
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు
-
323km రేంజ్.. 155km టాప్ స్పీడ్తో అల్ట్రావయోలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
-
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?
-
అభిమాన హీరోను కొట్టాలంటే భయమేసింది: మృణాల్ ఠాకూర్