PM Modi: భారత్కు రండి
రోమన్ కేథలిక్ చర్చి అధిపతి, క్రైస్తవ మత ప్రధాన గురువు పోప్ ఫ్రాన్సిస్ను.. త్వరలో భారతదేశ సందర్శనకు రావాల్సిందిగా ప్రధాని మోదీ ఆహ్వానించారు. జి-20 శిఖరాగ్ర సదస్సు కోసం ఇటలీ వచ్చిన ఆయన శనివారం వాటికన్ సిటీలో పోప్తో భేటీ అయ్యారు. ప్రపంచ దేశాలపై కొవిడ్-19 ప్రభావం,
పోప్ ఫ్రాన్సిస్కు ప్రధాని మోదీ ఆత్మీయ ఆహ్వానం
వాటికన్ సిటీలో గంటసేపు ఇరువురి భేటీ
వాటికన్ సిటీలో శనివారం పోప్ ఫ్రాన్సిస్తో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
వాటికన్ సిటీ, రోమ్: రోమన్ కేథలిక్ చర్చి అధిపతి, క్రైస్తవ మత ప్రధాన గురువు పోప్ ఫ్రాన్సిస్ను.. త్వరలో భారతదేశ సందర్శనకు రావాల్సిందిగా ప్రధాని మోదీ ఆహ్వానించారు. జి-20 శిఖరాగ్ర సదస్సు కోసం ఇటలీ వచ్చిన ఆయన శనివారం వాటికన్ సిటీలో పోప్తో భేటీ అయ్యారు. ప్రపంచ దేశాలపై కొవిడ్-19 ప్రభావం, వాతావరణ మార్పులతో ఎదురవుతున్న సవాళ్లు సహా అనేక అంశాలపై చర్చించారు. 2013లో ఫ్రాన్సిస్ పోప్ అయిన తర్వాత భారత ప్రధాని ఆయనతో భేటీ కావడం ఇదే తొలిసారి. గత 2 దశాబ్దాల్లో భారతదేశ ప్రధానులెవరూ పోప్ను కలవలేదని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. 2000 సంవత్సరంలో అప్పటి ప్రధాని హోదాలో ఎ.బి.వాజ్పేయీ ఆనాటి పోప్.. జాన్పాల్-2ను కలిశారని పేర్కొంది.
అత్యంత సుహృద్భావ వాతావరణంలో..
పోప్ను ఆత్మీయంగా హత్తుకున్న చిత్రాలను మోదీ ట్విటర్లో పంచుకున్నారు. ఇది అత్యంత సుహృద్భావ భేటీ అని, వివిధ అంశాలను ఆయనతో చర్చించే అవకాశం లభించిందని ప్రధాని తెలిపారు. వంద కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్లు వేయడంలో భారత్ సాధించిన విజయాన్ని, వాతావరణ మార్పులకు కళ్లెం వేసేందుకు తీసుకున్న చొరవను మోదీ ఆయనకు వివరించారు. వాతావరణ మార్పులపై తీసుకువచ్చిన విశేష పుస్తకాన్ని, వెండితో ప్రత్యేకంగా రూపొందించిన జ్ఞాపికను పోప్ ఫ్రాన్సిస్కు బహుమతిగా మోదీ ఇచ్చారు. ‘ఎడారి ఒక పూదోటగా మారుతుంది’ అనే అర్థం వచ్చే సందేశం ఉన్న కాంస్య ఫలకాన్ని మోదీకి కానుకగా పోప్ ఇచ్చారు. ముందు నిర్ణయించిన ప్రకారం 20 నిమిషాల పాటు పోప్తో సమావేశం జరగాల్సి ఉన్నప్పటికీ.. గంటకు పైగా భేటీ కొనసాగడం విశేషం. భారత్కు వచ్చేందుకు పోప్ ఆనందంగా అంగీకరించినట్లు అధికారిక ప్రకటన తెలిపింది.
ఇటలీ రాజధాని రోమ్లో శనివారం జీ-20 సదస్సు వేదిక వద్ద అమెరికా అధ్యక్షుడు జో బైడెన్తో ముచ్చటిస్తున్న ప్రధాని మోదీ
ప్రవాస భారతీయులతో మాటామంతీ
ఇటలీ పర్యటనలో ఉన్న మోదీ.. ప్రవాస భారతీయుల బృందాన్ని కలిశారు. ‘దేశంతో ఎనలేని బంధాన్ని ఏర్పరచుకున్న ప్రవాసులతో సంభాషణలు గొప్పగా జరిగాయి. వివిధ అంశాలపై వారి ఆలోచనలు వినడం అద్భుతంగా అనిపించింది’ అని పేర్కొన్నారు. ఈ భేటీపై ‘సనాతన్ ధర్మ సంఘం’ అధ్యక్షురాలు స్వామిని హంసనంద గిరి స్పందించారు. ‘ఇటలీలో హిందువుగా జీవించడం మైనారిటీలకు కష్టం. ఇలాంటి చోట మోదీని కలవడం చాలా గౌరవంగా ఉంది’ అని తెలిపారు. తమలో ప్రతిఒక్కరి గురించి ఆయన అడిగి తెలుసుకున్నారని, తమిళనాడు తనకు ఇష్టమని చెబితే తమిళంలో కొద్దిసేపు మాట్లాడారని ఆమె సంబరపడ్డారు. మరోవైపు.. త్వరలో రాబోతున్న దీపావళి సందర్భంగా హిందువులందరికీ వాటికన్ సిటీ శుభాకాంక్షలు తెలిపింది. మతాల మధ్య సామరస్య పూరిత వాతావరణం.. ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతుందని ఆశాభావం వ్యక్తం చేసింది.
పలువురు దేశాధినేతలతో మంతనాలు
జీ-20 సదస్సుకు హాజరైన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయెల్ మెక్రాన్లతో మోదీ విడిగా ముచ్చటించారు. వారితో కాసేపు ఆహ్లాదంగా గడిపారు. పరస్పర ప్రయోజనకరమైన అంశాలతో పాటు ప్రపంచ విషయాలపై ఫలప్రదంగా చర్చలు జరిగినట్లు పీఎంవో కార్యాలయం ట్వీట్ చేసింది. బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో, సింగపూర్ ప్రధాని లీ సీన్ లూంగ్, జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్, దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే-ఇన్, ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియా గుటెరస్లతో కూడా మోదీ ముచ్చటించారు. ఆదివారం ఆయన గ్లాస్గోలో కాప్-26 సదస్సులో పాల్గొంటారు.
చరిత్రలో నిలిచిపోతుంది: నడ్డా
దిల్లీ: భారత ప్రధాని మోదీ, పోప్ ఫ్రాన్సిస్ల భేటీ చరిత్రలో నిలిచిపోతుందని భాజపా జాతీయాధ్యక్షుడు జె.పి.నడ్డా పేర్కొన్నారు. శాంతి, సామరస్యతల దిశగా ఇదో పెద్ద అడుగు అని ట్వీట్ చేశారు. పోప్తో భేటీ అయి ఆయన్ని భారత్కు రావాల్సిందిగా మోదీ ఆహ్వానించడం గొప్ప పరిణామంగా కేరళ కేథలిక్ బిషప్ల మండలి పేర్కొంది. దీనిద్వారా ప్రపంచంలో భారత్ ప్రతిష్ఠ మరింత ఇనుమడిస్తుందని తెలిపింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రెండు రాష్ట్రాలు.. రెండు ఓట్లు!
సాధారణంగా ఓటరు ఒక్కసారే ఓటు వేయాల్సి ఉంటుంది. ఎన్నికల కమిషన్(ఈసీ) కూడా అదే చెబుతుంది. -
సమస్య ఓ చోట.. సమర్పించేది మరోచోట.. పాస్పోర్టు దరఖాస్తుదారుల్లో గందరగోళం
ధ్రువపత్రాల సమర్పణలో పొరపాట్లతో తిరస్కరణకు గురైన పాస్పోర్టు దరఖాస్తుదారుల్లో గందరగోళం నెలకొంటోంది. పాస్పోర్టు సేవాకేంద్రాల్లో సమర్పించాల్సిన ధ్రువపత్రాలను రీజనల్ సేవా కేంద్రంలో సమర్పిస్తుండడమే దీనికి కారణం -
50 ఏళ్ల తరువాత.. నవమి రోజున సీతారాముల కల్యాణం
దేశంలోని ప్రధాన రామాలయాల్లో ఏటా శ్రీరాముడి జన్మ నక్షత్రమైన పునర్వసు (శ్రీరామ నవమి) శుభ ఘడియల్లో సీతారాముల కల్యాణం నిర్వహిస్తారు. -
సీతమ్మను మనువాడె భద్రాద్రి రామయ్య
భద్రాచలంలో శ్రీ సీతారామచంద్రస్వామి వార్షిక కల్యాణోత్సవం అశేష భక్తజనుల జయజయధ్వానాల నడుమ ఆద్యంతం వైభవోపేతంగా సాగింది. -
చెలమల నీళ్లే గొంతు తడుపుతున్నాయ్
రాష్ట్రంలోని ఏజెన్సీ గ్రామాలు, ఆవాసాల్లో తాగునీటి కటకట నెలకొంది. తాగునీటి సరఫరా ప్రాజెక్టుల నిర్మాణం, నిర్వహణలో లోపాలు, ప్రణాళిక లేమితో గిరిజనులకు రక్షిత జలం అందక.. కాలువలు, చెలమల్లోని నీళ్లే దిక్కయ్యాయి. -
సొమ్ము వెనక్కి వచ్చేది ఎప్పుడో?
ఏదన్నా కారణంతో ధరణి సేవలను రద్దు చేసుకున్న వారు అప్పటికే ప్రభుత్వానికి చెల్లించిన రుసుం తిరిగి పొందడానికి అష్ట కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తోంది. -
బంగారం బిస్కెట్లుగా ఆలయాల ఆభరణాలు
రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాలకు భక్తులు సమర్పించిన బంగారం, వెండి ఆభరణాల్లో దేవతామూర్తుల అలం -
కార్టూనిస్ట్ శ్రీధర్ ఆధ్వర్యంలో 21న పెయింటింగ్ వర్క్షాప్
ఔత్సాహిక చిత్రకారుల కోసం వేసవి సెలవుల్లో ఒక ప్రత్యేక వర్క్షాప్ నిర్వహిస్తున్నట్టు శ్రీధర్ ఆర్ట్ ఇన్స్టిట్యూట్ నిర్వాహకులు, ప్రముఖ కార్టూనిస్ట్ శ్రీధర్ తెలిపారు. -
అమరావతిపై ఇంత కక్షా!
అమరావతిపై వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యానికి, కక్ష సాధింపునకు పరాకాష్ఠ ఇది. రాజధానికి శంకుస్థాపన జరిగిన ప్రాంతంలో అమరావతి నమూనాలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. -
గురుకుల విద్యార్థి ప్రశాంత్ మరణానికి బాధ్యులపై తగిన చర్యలు
భువనగిరి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థి ప్రశాంత్ మరణం బాధాకరమని ఆ శాఖ కార్యదర్శి సీతాలక్ష్మి బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. -
పదేళ్ల తర్వాత రాష్ట్ర ప్రభుత్వ వైద్యుల సంఘం ఎన్నికలు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వైద్యుల సంఘం (టీజీడీఏ)ఎన్నికలకు హైకోర్టు అనుమతించిన నేపథ్యంలో ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు ఆ సంఘం కోర్ కమిటీ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొంది. -
విద్యుదుత్పత్తి చేసి.. బయట అమ్ముకోవచ్చు!
దేశంలో విద్యుత్ డిమాండ్ పెరగడంతో గ్యాస్ ఆధారిత విద్యుదుత్పత్తి కేంద్రాలకు కేంద్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. -
శ్రీవారి ఆలయంలో వైభవంగా శ్రీరామనవమి ఆస్థానం
శ్రీవారి ఆలయంలో శ్రీరామనవమి ఆస్థానాన్ని పురస్కరించుకుని శ్రీసీతారామలక్ష్మణ సమేత హనుమంతులవారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనాన్ని బుధవారం వైభవంగా నిర్వహించారు. -
సాగర్లో అత్యవసర మోటార్ల ట్రయల్ రన్ ప్రారంభం
హైదరాబాద్ జంట నగరాలు, నల్గొండ జిల్లా తాగునీటి అవసరాలు తీర్చేందుకు నాగార్జునసాగర్ జలాశయంలో హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బీ (జలమండలి) ఆధ్వర్యాన ఏర్పాటు చేస్తున్న అత్యవసర మోటార్ల ప్రయోగాత్మక పరిశీలన (ట్రయల్ రన్) బుధవారం ప్రారంభమైంది. -
నదుల అనుసంధానంపై దిల్లీలో టాస్క్ఫోర్స్ సమావేశం రేపు
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన నదుల అనుసంధాన ప్రాజెక్టులో భాగంగా గోదావరి-కావేరి లింక్పై శుక్రవారం నదుల అనుసంధాన టాస్క్ఫోర్స్ కమిటీ చర్చించనుంది. -
సమస్య గుర్తించక ముందే మరమ్మతులెలా నిర్ణయిస్తారు..?
మేడిగడ్డ బ్యారేజీ మరమ్మతు పనులను గుత్తేదారులకు అప్పగించేందుకు నీటిపారుదలశాఖ నిర్ణయించినట్లు జరుగుతున్న ప్రచారంపై ప్రభుత్వ పెద్దలు ఆగ్రహంతో ఉన్నట్లు తెలిసింది. -
సివిల్స్ విజేతలకు కేటీఆర్ శుభాకాంక్షలు
సివిల్స్లో విజయం సాధించిన తెలుగు రాష్ట్రాల అభ్యర్థులంతా పూర్తి శక్తి సామర్థ్యాలను వినియోగించి.. దేశ భవిష్యత్ నిర్మాణంలో ప్రధానపాత్ర పోషిస్తారని ఆశిస్తున్నట్లు భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ ఆకాంక్షించారు. -
సివిల్స్లో సత్తా చాటిన తెలుగువారికి చంద్రబాబు అభినందనలు
సివిల్స్కు తెలుగు రాష్ట్రాల నుంచి ఎంపికైన అభ్యర్థులకు తెదేపా అధినేత చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. -
ప్రైవేటు బడుల ఫీ‘జులుం’!
రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేటు, కార్పొరేటు పాఠశాలల్లో రుసుములు ఆకాశాన్నంటుతున్నాయి. ప్లేస్కూల్, ఎల్కేజీ, యూకేజీ, మొదటి తరగతి నుంచి పదో తరగతి వరకు.. డొనేషన్లు, అభివృద్ధి ఛార్జీలు, రుసుములతో పాటు పుస్తకాలు, దుస్తులు, బూట్లు, బెల్టుల పేరిట తల్లిదండ్రుల జేబులకు భారీగా చిల్లులు పెడుతున్నాయి. -
రోజుకు రూ.కోటి ఆదాయం పెరగాలి!
ప్రయాణికుల నుంచి మరింత ఆదాయం రాబట్టుకునేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) సిద్ధమవుతోంది. ఇందుకోసం డీలక్స్, సూపర్లగ్జరీ, ఏసీ బస్సుల సేవలపై దృష్టిపెట్టబోతోంది. -
ద.మ రైల్వేకు రూ.20,339 కోట్ల రికార్డు ఆదాయం
దక్షిణ మధ్య రైల్వే రికార్డు స్థాయిలో ఆదాయాన్ని గడించింది. తొలిసారి రూ.20 వేల కోట్ల మైలురాయిని దాటింది.
తాజా వార్తలు (Latest News)
-
మణి అన్నపురెడ్డిని ఎందుకు పట్టుకోవట్లేదు?
-
ఉత్తర్ప్రదేశ్ బరిలో తెలంగాణ మహిళ.. ఆమె ఆస్తులు ఎంతంటే?
-
నాయికలు ‘తెర’ పంచుకుంటే.. వినోదం పెంచినట్టే
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 22,268
-
స్పీకర్ తమ్మినేని కోటకు బీటలు!
-
నా భార్యకు ఏమైనా అయితే.. పాక్ ఆర్మీ చీఫ్కు ఇమ్రాన్ఖాన్ వార్నింగ్