British Rule: బయట రాబందులు.. లోన రాచవిందులు
1870 ప్రాంతంలో దక్కన్ పీఠభూమి క్షామాన్ని ఎదుర్కొంది. వాతావరణ పరిస్థితులు అనుకూలించలేదు. వీటికి తోడు బ్రిటిష్ ప్రభుత్వం ఆహార పంటలకు బదులు వాణిజ్య పంటలను ప్రోత్సహించటంతో ఆహారధాన్యాల ఉత్పత్తి ...
వాళ్లు సత్యాగ్రహులు కాదు...
నిరసనా తెలపలేదు...
తిరుగుబాట్లూ చేయలేదు...
ప్రకృతి కన్నెర్రకు బలైన బడుగు జీవులు!
తినటానికి మెతుకు లేక ఎముకల గూళ్లుగా మారిన వారిని చూసి బండలు సైతం కరిగాయి... కానీ బ్రిటిష్వారి గుండెలు కరగలేదు. బయట లక్షల మంది అన్నార్తుల మరణ మృదంగం వినిపిస్తుంటే.. దర్బార్లో రాణి పేరిట లక్షల ఖర్చుతో విందులు వినోదాలు చేసింది బ్రిటిష్ ప్రభుత్వం!
1870 ప్రాంతంలో దక్కన్ పీఠభూమి క్షామాన్ని ఎదుర్కొంది. వాతావరణ పరిస్థితులు అనుకూలించలేదు. వీటికి తోడు బ్రిటిష్ ప్రభుత్వం ఆహార పంటలకు బదులు వాణిజ్య పంటలను ప్రోత్సహించటంతో ఆహారధాన్యాల ఉత్పత్తి తగ్గింది. పండిన పంటను కూడా ప్రజలకు పంచే బదులు ఐరోపాకు ఎగుమతి చేయటంపైనే బ్రిటిష్ ప్రభుత్వం దృష్టిసారించింది. మద్రాసు రాష్ట్రంలో ప్రజలు అన్నమో రామచంద్రా అంటూ అల్లాడుతుంటే... సుమారు 3లక్షల 20వేల టన్నుల గోధుమల్ని ఇంగ్లాండ్కు ఓడల్లో ఎక్కించాడు అప్పటి వైస్రాయి లార్డ్ రాబర్ట్ లిటన్. 1876-77నాటికి కరవు తీవ్రమైంది. రోజుల తరబడి తిండి లేక మద్రాసు రాష్ట్రంలో రోడ్లపైనే వేలమంది మరణిస్తున్న వేళ ప్రజలను ఆదుకునేందుకు బ్రిటిష్ ప్రభుత్వం నిరాకరించింది. ‘ఇలాంటి పరిస్థితుల్లో పేదలకు సాయం చేస్తే... వారికదే అలవాటవుతుంది. ఆశిస్తూనే ఉంటారలా’ అంటూ వారి ప్రాణాలను గాలికి వదిలేశాడు వైస్రాయి లిటన్!
స్వేచ్ఛా మార్కెట్లో ప్రభుత్వం తలదూర్చకూడదన్న ఆర్థిక సిద్ధాంతాన్ని అనుసరించిన ఆంగ్లేయులు ప్రజల పట్ల బాధ్యతను మరిచారు. అలాగని ఆర్థిక క్రమశిక్షణ ఏమైనా పాటించారా అంటే అదీ లేదు. ఒకవైపు వీధుల్లో రాబందులు రాజ్యమేలుతుంటే... 1877లో దిల్లీ దర్బార్ పేరిట లక్షల రూపాయలతో గానాబజానా ఏర్పాటు చేశారు. విక్టోరియా రాణి భారత్కు కూడా ఇకమీదట రాణి అని ప్రకటించటానికి ఏర్పాటు చేసిన ఈ హంగామా వారంపాటు సాగింది. వివిధ సంస్థానాల రాజులు, మహారాజులతో మొదలెడితే... దాదాపు 70వేల మందికి అత్యంత ఖరీదైన ఆతిథ్యం ఇచ్చారు. ‘‘బయట లక్షలమంది మరణిస్తుంటే... దర్బార్లో లక్షల రూపాయలు పారబోస్తున్నారు...’’ అంటూ రాశాడో విదేశీ పాత్రికేయుడు.
పోనీ... బతికున్నవారు కష్టపడి సంపాదించుకుందామంటే దానికీ ఆంక్షలు విధించింది ప్రభుత్వం. ప్రతి ఒక్కరూ తామున్నచోటి నుంచి 10 కిలోమీటర్ల బయటే పనిచేయాలన్న నిబంధన పెట్టింది. అసలే తిండిలేక చేతగాని స్థితిలో ఉన్న ఆ బడుగు జీవులు... పనికోసం పదికిలోమీటర్లు నడిచే క్రమంలో... వేలమంది రోడ్లమీదే ప్రాణాలు విడిచారు. దాదాపు 5.5లక్షల మంది ఆ క్షామంలో మృత్యువాత పడ్డారు.
నిర్దయకు నజరానా
అంతకుముందు 1874 బెంగాల్ క్షామం సమయంలో అక్కడ పనిచేసిన రిచర్డ్ టెంపుల్ అనే అధికారికే ఈసారి మద్రాసులో సహాయ కార్యక్రమాల బాధ్యత అప్పగించారు. గమ్మత్తేమంటే... బెంగాల్లో ఉన్నప్పుడు మానవతతో బర్మా నుంచి బియ్యం తెప్పించి... ప్రజలకు టెంపుల్ అంతో ఇంతో సాయం చేశారు. మరణాలను తగ్గించేందుకు ప్రయత్నించారు. అందుకుగాను ఆయన్ను బ్రిటిష్ ప్రభుత్వం తీవ్రంగా హెచ్చరించింది. వేధించింది. ఆ అనుభవాన్ని దృష్టిలో ఉంచుకున్న ఆయన... మద్రాసులో తన గుండెను, కళ్లను పూర్తిగా మూసుకొని ప్రజలకు ఏమాత్రం సాయం అందకుండా కఠినంగా వ్యవహరించారు. ప్రభుత్వంతో శభాష్ అనిపించుకున్నారు. తర్వాత ఆయన్ను... ముంబయి గవర్నర్గా నియమించి గౌరవించింది బ్రిటిష్ ప్రభుత్వం!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మేనల్లుడికి అత్యున్నతాధికారి నజరానా!
విశ్వవిద్యాలయాలను రాజకీయాలకు కేంద్ర బిందువులుగా మార్చి సీఎం జగన్ భ్రష్టు పట్టిస్తే.. ఆయన ప్రభుత్వంలో అత్యున్నతాధికారి తన మేనల్లుడి కోసం ద్రవిడ విశ్వవిద్యాలయం నిబంధనలనే కాలరాశారు. -
ముఖ్యమంత్రితో ముఖాముఖిలో వాలంటీరు
రాజకీయ పార్టీల కార్యక్రమాల్లో వాలంటీర్లు పాల్గొనకూడదనే నిబంధన ఉన్నా.. నంద్యాల జిల్లా శిరివెళ్ల మండలంలోని వాలంటీరు వై.లక్ష్మీనారాయణరెడ్డి దాన్ని ఉల్లంఘించారు. -
నారాయణ ఎడ్యుకేషనల్ సొసైటీ బ్యాంకు ఖాతాల స్తంభన
నారాయణ ఎడ్యుకేషనల్ సొసైటీ బ్యాంకు ఖాతాలను పోలీసులు ఫ్రీజ్ చేశారు. నెల్లూరు పోలీసులు లేఖ రాయడంతో.. హైదరాబాద్లోని హిమాయత్నగర్, ఖైరతాబాద్ శాఖల్లో ఉన్న నాలుగు ఖాతాలను స్తంభింపజేసినట్లు తెలిసింది. -
హమ్మయ్య.. జగన్ పర్యటనల నుంచి అవస్థలు తప్పాయి
ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో ముఖ్యమంత్రి జగన్ పర్యటనలు, సభల నుంచి ప్రజలకు అవస్థలు తప్పాయి. గడిచిన నాలుగున్నరేళ్లలో ఆయన ఉమ్మడి కర్నూలు జిల్లాకు వచ్చిన ప్రతిసారీ భద్రత పేరుతో దుకాణాలు మూయించి, వాటికి అడ్డంగా బారికేడ్లు పెట్టేవారు. -
జగన్.. సొంత జిల్లా ప్రజలకు మాటిస్తివి.. ఏమార్చితివి!
రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు అయిదేళ్ల పాటు అరచేతిలో వైకుంఠం చూపించిన సీఎం జగన్.. తన సొంత ఇలాకా వైయస్ఆర్ జిల్లా ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు పరిశ్రమలను కూడా ఏర్పాటు చేయించలేకపోయారు. -
ఎండలు ముదిరాయి.. సెగ పెరిగింది
రాష్ట్రంలో ఎండలు ముదురుతున్నాయి. సెగ పెరుగుతోంది. గురువారం ఉత్తరకోస్తా, రాయలసీమ ప్రాంతాల్లోని 31 మండలాల్లో వడగాలులు వీచాయి. -
రంగులు తొలగిస్తే ఊరుకోను.. వైకాపా నాయకుడి వీరంగం
తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం కూనవరం పంచాయతీ సర్పంచి గంగాభవాని భర్త, వైకాపా నాయకుడు సుంకర నరసింహారావు తన దుకాణంపై వేసిన పార్టీ రంగులను తొలగిస్తే సహించేది లేదంటూ అధికారులపై విరుచుకుపడ్డారు. -
కన్నారా.. ఇది విన్నారా?
ఎన్నికల నియమావళి ఉల్లంఘన విషయంలో వైకాపా నేతల బరితెగింపు తారస్థాయికి చేరింది. కాకినాడ జిల్లా వైకాపా అధ్యక్షుడు, కాకినాడ గ్రామీణ నియోజకవర్గ అభ్యర్థి కురసాల కన్నబాబు ఓ అడుగు ముందుకేసి జిల్లా ఎన్నికల అధికారి ప్రసంగాన్ని రికార్డు చేసి ఊరూవాడా ప్రదర్శిస్తూ వైకాపా ప్రచారానికి తెగ వాడేస్తుండటం వివాదాస్పదంగా మారింది. -
ఇలా అయితే.. విద్యావ్యవస్థ నాశనం
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో బోధనేతర సిబ్బంది (లైబ్రేరియన్లు, ఫిజికల్ డైరెక్టర్లు) ప్రిన్సిపల్స్గా పదోన్నతి పొందేందుకు వీలు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో 76 జారీ చేయడంపై హైకోర్టు నిప్పులు చెరిగింది. -
రైతులు, రైతు కూలీలకు రిజర్వేషన్లు కల్పించాలి
‘ఇప్పుడున్న పరిస్థితుల్లో రైతులు, రైతు కూలీల వంటి వర్గాలకు న్యాయం జరగాలంటే వారికి న్యాయవ్యవస్థ సహా వివిధ శాఖల్లో ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలి. -
నీ పేరు బయటికి వస్తుందని సీబీఐ దర్యాప్తు వద్దన్నావా?
‘‘మాజీమంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ను ఎందుకు ఉపసంహరించుకున్నావు? నీ పేరు బయటికి వస్తుందని భయపడ్డావా?’’ అని సీఎం జగన్ను వివేకా కుమార్తె సునీతారెడ్డి నిలదీశారు. -
సర్వం జగన్నామం
గ్రామస్థులతో ముఖాముఖి అన్నారు. ఎవరు ఎలా, ఏం మాట్లాడాలో ముందే ‘సిద్ధం’ చేశారు. తర్వాత ‘రాజు’వారు వచ్చారు. -
బ్రహ్మ రాకాసి!
అలనాడు బ్రహ్మనాయుడు తిరగాడిన నేల అది. ఆ యోధుడు కదనరంగంలో కాలుమోపితే చాలు.. యుద్ధభూమే కంపించిపోయేది.. అంతటి పరాక్రమం బ్రహ్మనాయుడి సొంతం. -
వైకాపా రాక్షస పాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడుకుందాం
పోర్టు ద్వారా గంజాయి వ్యాపారం చేసేందుకే విశాఖను రాజధానిగా చేస్తామంటున్నారు. అందుకే 25 వేల కేజీల మాదక ద్రవ్యాలను అక్కడ దించారు. -
నాడు దర్జా.. నేడు గజగజ!
తాచెడ్డ కోతి వనమంతా పాడు చేసిందని... ఒక్కసారి అవకాశం ఇవ్వండని వేడుకుని, అధికారం దక్కించుకున్న జగన్ రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలను దారుణంగా కుప్పకూల్చారు. -
వైకాపా అభ్యర్థి రాజ్యలక్ష్మి ఎస్టీ కాదంటూ వ్యాజ్యం
వైకాపా తరఫున పోలవరం శాసనసభ (ఎస్టీ) నియోజకవర్గం అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగనున్న తెల్లం రాజ్యలక్ష్మి ఎస్టీ కాదంటూ దాఖలైన వ్యాజ్యంపై హైకోర్టు స్పందించింది. -
ఏపీలో రోగులకు ఎన్నికల కష్టాలు
ఎన్నికలు వచ్చాయంటే సామాన్యులకు పండగే అంటారు. కానీ, ఓ విషయంలో మాత్రం వారికి నానా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. -
సీఎస్, డీజీపీలను బదిలీ చేయండి
‘‘ఆంధ్రప్రదేశ్ సీఎస్ కేఎస్ జవహర్రెడ్డి, డీజీపీ కేవీ రాజేంద్రనాథరెడ్డి ఆయా హోదాల్లో కొనసాగితే ఎన్నికలు నిష్పక్షపాతంగా, స్వేచ్ఛగా జరగవు. -
వైకాపాకు ప్రచారానికే సలహాదారు ఎత్తుగడ
ఏపీ ఎన్జీఓ సంఘం మాజీ అధ్యక్షుడు, ప్రభుత్వ సలహాదారు చంద్రశేఖరరెడ్డి ఉద్యోగులకు మేలు చేయకపోగా.. వారి జీవితాలను నాశనం చేస్తున్నారని ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ అధ్యక్షుడు పాలంకి సుబ్బరాయన్ ఓ ప్రకటనలో విమర్శించారు. -
తిరుమల నడకదారిలో చిరుత కలకలం
అలిపిరి-తిరుమల నడకదారిలో మరోసారి చిరుత సంచారం కలకలం సృష్టించింది. ఈ నెల 25, 26వ తేదీల్లో తెల్లవారుజామున నడకదారికి 150 మీటర్ల దూరంలో చిరుత సంచరించిందని తితిదే అటవీ శాఖ డీఎఫ్వో శ్రీనివాసులు గురువారం వెల్లడించారు. -
సూపర్ఫాస్ట్ రైలులో ప్రయాణికుల ఉక్కిరిబిక్కిరి!
షాలిమార్ నుంచి సికింద్రాబాద్ వెళ్లే వారాంతపు సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలు(22849)లో సాంకేతిక సమస్య తలెత్తి అందులోని ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు.
తాజా వార్తలు (Latest News)
-
హెన్రిచ్ క్లాసెన్.. సన్రైజర్స్కు భలే దొరికాడు
-
రాజకీయం అంటే ప్రజలకు సేవ చేయడమని ఎన్టీఆర్ నిరూపించారు: చంద్రబాబు
-
సిప్ ప్రారంభిస్తారా ?ఇవి తెలుసుకోండి..
-
సీఎం రేవంత్రెడ్డితో ఎంపీ కె.కేశవరావు భేటీ
-
ఉత్తర్ప్రదేశ్లో హైఅలర్ట్.. గ్యాంగ్స్టర్ ముఖ్తార్ మృతిపై కుటుంబం అనుమానాలు!
-
కాంగ్రెస్కు మళ్లీ షాక్.. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు