Azadi Ka Amrit Mahotsav: జలియన్వాలాబాగ్ను జగానికి తెలిపాడని...
భారత్లో బ్రిటిష్ ప్రభుత్వ అరాచకాలపై నల్ల జెండాలెత్తిన వారిలో కొందరు తెల్లవారూ ఉన్నారు. వారిలో అత్యంత ప్రభావం చూపిన... ఇంగ్లాండ్లోని సామాన్య బ్రిటిషర్లనూ ఆలోచనలో పడేసిన... ఇంటాబయటా బ్రిటిష్ సర్కారును దోషిగా నిలబెట్టిన... అరుదైన కలం యోధుడు బి.జి.హార్నిమన్! ఆంక్షలను బేఖాతరు చేస్తూ
భారత్లో బ్రిటిష్ ప్రభుత్వ అరాచకాలపై నల్ల జెండాలెత్తిన వారిలో కొందరు తెల్లవారూ ఉన్నారు. వారిలో అత్యంత ప్రభావం చూపిన... ఇంగ్లాండ్లోని సామాన్య బ్రిటిషర్లనూ ఆలోచనలో పడేసిన... ఇంటాబయటా బ్రిటిష్ సర్కారును దోషిగా నిలబెట్టిన... అరుదైన కలం యోధుడు బి.జి.హార్నిమన్! ఆంక్షలను బేఖాతరు చేస్తూ... అత్యంత దారుణమైన మారణకాండను ప్రపంచానికి చాటిన ఈ పాత్రికేయుడిని ఏమీ చేయలేక ఓడెక్కించి లండన్ పంపించింది బ్రిటిష్ ప్రభుత్వం! కానీ ఆయన దొడ్డిదారిన మళ్లీ వచ్చి స్వతంత్ర భారత్లో కన్నుమూశారు.
అనిబిసెంట్లాంటి వారిలా సామాన్య ప్రజలకు పరిచయం లేని పేరు హార్నిమన్. కానీ భారత స్వాతంత్య్రం కోసం, భారత్లో పత్రికా స్వేచ్ఛ కోసం ఆయన చేసిన కృషి అసామాన్యం! తన రాతలతో కొరకరాని కొయ్యలా మారిన... ఆయన్ను వదలించుకోవటానికి ఆంగ్లేయ ప్రభుత్వం చేయని ప్రయత్నం లేదు. ఇంగ్లాండ్లో పాత్రికేయుడిగా ప్రస్థానం ఆరంభించిన హార్నిమన్ 1906లో కోల్కతాలోని స్టేట్స్మన్ పత్రికకు న్యూస్ ఎడిటర్గా భారత్లో అడుగుపెట్టారు. రాగానే తమ తెల్లవారి దాష్టీకాలను అర్థం చేసుకున్న ఆయన... భారతీయుల పక్షాన నిలబడ్డారు. బెంగాల్ విభజనను నిరసిస్తూ ఉద్యమంలో పాల్గొన్నారు. 1913లో ముంబయి క్రానికల్ పత్రికకు ఎడిటర్గా ముంబయికి మారారు. అప్పటిదాకా సంపన్నవర్గాల వార్తలే ప్రచురించే పత్రికలో... సామాన్యులకూ స్థానమిచ్చి వారి సమస్యలను లేవనెత్తేవారు. ప్రభుత్వ తీరును ఎండగట్టడమేగాకుండా... స్థానికులను దోచుకుంటున్నారంటూ భారత్లోని ఆంగ్లవ్యాపారుల తీరుపైనా ఆయన విమర్శలు గుప్పించేవారు. దీంతో... ఆంగ్లేయ అధికారులకు, వ్యాపారులకు హార్నిమన్ శత్రువుగా మారారు. భారత్లో పత్రికా స్వేచ్ఛను కోరుతూ... ప్రెస్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాను ఆరంభించారు. 1919లో గాంధీ పిలుపు మేరకు రౌలత్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఉద్యమంలో పాల్గొన్న ఆయన... జలియన్వాలాబాగ్ ఘటన తర్వాత పాత్రికేయుడిగా తన విశ్వరూపం ప్రదర్శించారు.
1919 ఏప్రిల్లో జరిగిన జలియన్వాలాబాగ్ ఊచకోతను ప్రపంచానికి తెలియకుండా బ్రిటిష్ ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంది. పత్రికల్లో వార్తలు, ఫొటోలు రాకుండా ఆంక్షలు విధించింది. కానీ మార్షల్లా ఆంక్షలను తోసిరాజంటూ... తమ స్థానిక విలేకరి లాలా గోవర్ధన్దాస్ ప్రత్యక్షంగా అందించిన వివరాలను హార్నిమన్ ముంబయి క్రానికల్లో ప్రచురించారు. ఇంగ్లాండ్కూ పంపించారు. రహస్యంగా ఫొటోలను సైతం లండన్కు చేరవేశారు. అక్కడి ది డైలీ హెరాల్డ్లో ఈ ఊచకోత ఫొటోలు, వార్తలు రావటంతో యావత్ ప్రపంచానికి భారత్లో ఆంగ్లేయుల దారుణం కళ్లకు కట్టినట్లు తెలిసిపోయింది. కథనం రాసిన గోవర్ధన్దాస్ను అరెస్టు చేసి మూడేళ్లు జైలుకు పంపిన బ్రిటిష్ ప్రభుత్వం... తమ వాడైన హార్నిమన్ను ఏమీ చేయలేకపోయింది. అనారోగ్యంతో ఆస్పత్రిలో ఉన్నా... బలవంతంగా ఓడెక్కించి లండన్కు తిరిగి పంపించేసింది.
అక్కడికి వెళ్లినా భారత తరఫున పోరాటాన్ని విడిచిపెట్టలేదాయన. జలియన్వాలాబాగ్ ఊచకోతకు కారణమైన డయ్యర్ తీరును తప్పుపట్టిన హార్నిమన్ తన దేశవాసులను పునరాలోచించేలా కథనాలు రాశారు.
భారత్కు తిరిగి వచ్చేందుకు ఆయన ఎన్నిసార్లు దరఖాస్తు చేసినా బ్రిటిష్ ప్రభుత్వం తిరస్కరించింది. దీంతో... 14 సంవత్సరాల తర్వాత ఓరోజు లండన్ నుంచి కొలంబోకు చేరుకున్న ఆయన... అక్కడి నుంచి భారత్కు వచ్చారు. కోర్టు సమర్థించడంతో ప్రభుత్వం ఏమీచేయలేక పోయింది. అలా ఇక్కడే ఉండిపోయిన హార్నిమన్ భారత స్వాతంత్య్ర ఆవిర్భావానికి ప్రత్యక్ష సాక్షిగా నిలిచారు. 1941లో కరంజియా, దిన్కర్ నాద్కర్ణిలతో కలసి తొలి వీక్లీ టాబ్లాయిడ్ ‘బ్లిట్జ్’ను స్థాపించిన ఈ ఆంగ్లేయుడు భారతీయుడిగా 1948 అక్టోబరులో కన్నుమూశారు. ‘‘భారత్కు స్వాతంత్య్ర మంత్రం నేర్పిన ఉదాత్త ఆంగ్లేయుడు హార్నిమన్. ఆయన సేవల్ని భారత్ ఎన్నటికీ మరచిపోలేదు’’ అని గాంధీజీ కొనియాడారు.
మన ఆంగ్లేయ అధికారులు అపరిమిత అధికారాలతో భారత్లో పాల్పడుతున్న తీవ్రవాద చర్యలను చూసి కూడా మౌనంగా ఉంటే... న్యాయాన్ని గౌరవించే వారమని మనం ఎలా చెప్పుకోగలం? మానవత, ప్రేమ మనలో ఉన్నాయని ఎలా అనుకోగలం?’’
అని ఇంగ్లాండ్ ప్రజల్లో హార్నిమన్ ఆలోచన రేకెత్తించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఉపాధి కూలీల కనీస వేతనం రూ.300
ఏప్రిల్ నుంచి మొదలయ్యే కొత్త ఆర్థిక సంవత్సరంలో (2024-25) రాష్ట్రంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (నరేగా) కూలీల కనీస వేతనం రూ.300గా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. -
ప్రవీణ్ప్రకాశ్ భేటీ వెనుక ఉద్దేశం ఏమిటో!
రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థుల తల్లిదండ్రులతో ఏప్రిల్ 23న ప్రత్యేక సమావేశం నిర్వహిస్తానని పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ ప్రకటించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
ఊసరవెల్లులే సిగ్గుతో చచ్చిపోతాయ్!
దెయ్యాలు వేదాలు వల్లించడమంటే ఇదేనేమో! మాజీ మంత్రి వై.ఎస్.వివేకానందరెడ్డి హత్య కేసు గురించి సీఎం జగన్ ప్రొద్దుటూరు సభలో బుధవారం చేసిన వ్యాఖ్యలు వింటే ఊసరవెల్లులు సైతం సిగ్గుతో చచ్చిపోతాయేమో! -
సీఎం పీఆర్ఓలా... వైకాపా నాయకులా?
ముఖ్యమంత్రి జగన్ కార్యాలయంలో ప్రజాసంబంధాల అధికారులు (పీఆర్ఓ)గా పనిచేస్తున్నవారు ఎన్నికల నిబంధనల్ని తుంగలో తొక్కుతూ అధికారపార్టీ సేవలో తరిస్తున్నారు. -
కంప్యూటర్ ఎక్కడ? ఇంకా బిల్లులెన్ని ఉన్నాయి?.. ఆసుపత్రిలో ట్రెజరీ ఉద్యోగి కలవరింతలు
‘కంప్యూటర్ ఏదీ.. ఎక్కడ ఉంది.. మౌస్ కనిపించట్లేదు. బిల్లులు ఇంకా ఎన్ని ఉన్నాయి. త్వరగా చూడాలి. ఫైళ్లన్నీ తీసుకురండి’ అంటూ మడకశిర ఉప ఖజనా శాఖ (ఎస్టీఓ) కార్యాలయంలో పని చేస్తున్న సీనియర్ ఎకౌంటెంట్ హరినాథ్ ఆసుపత్రి పడకపై కలవరిస్తున్న తీరు హృదయ విదారకంగా ఉంది. -
సీఎంను కీర్తించేందుకు.. ‘మేమంతా సిద్ధం’!
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర గురువారం నంద్యాల జిల్లాలో జరగనుంది. ఉదయం ఆళ్లగడ్డ నుంచి జగన్ బస్సు యాత్ర పలు గ్రామాల మీదుగా ప్రయాణించి నంద్యాల చేరుకుంటుంది. -
దాడి చేసి.. దండంతో సరి!
కాకినాడలోని పెద్ద శివాలయంలో అర్చకులు వెంకట సత్యసాయి, విజయ్కుమార్లను కొట్టిన మాజీ కార్పొరేటర్, వైకాపా నేత సిరియాల చంద్రరావును కాపాడేందుకు ఆ పార్టీ నాయకులు నానాతంటాలు పడుతున్నారు. -
సంధ్య ఆక్వా ఎండీ సోదరుడి ఇంటికి మంత్రి మేరుగు నాగార్జున.. ముచ్చట్లలో మర్మమేమి?
‘డ్రైడ్ఈస్ట్ పేరుతో విశాఖకు మాదక ద్రవ్యాలను దిగుమతి చేస్తుంటే సీబీఐ ఈ మధ్యకాలంలో దాడి చేసింది. పచ్చసోదరులంతా ఉలిక్కిపడి.. మన (వైకాపా)మీద నెట్టేయడానికి సిద్ధమయ్యారు. -
స్క్రీనింగ్ లేకుండానే రూ. 2,000 కోట్ల చెల్లింపులు
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత రూ.2,000 కోట్ల చెల్లింపులు ఎలాంటి స్క్రీనింగ్ లేకుండానే జరిగిపోయాయి. ఇందులో పారదర్శకత లేదు. -
బాబాయిని చంపిందెవరో దేవుడికి, ప్రజలకు తెలుసు
వివేకానందరెడ్డి హత్యపై 2019 ఎన్నికల ముందు పదేపదే మాట్లాడిన జగన్ సీఎం అయ్యాక ఆ విషయాన్ని ప్రస్తావించనే లేదు. తాజాగా సార్వత్రిక ఎన్నికల ముందు ప్రొద్దుటూరు సభలో మరోసారి బాబాయి హత్య, హంతకుల గురించి మాట్లాడుతూ..వారికి మద్దతిస్తున్నారంటూ చంద్రబాబును విమర్శించారు. -
జగన్ అనే నేను.. ఒక వినాశకారి!
జగన్ అనే నేను... ఆంధ్రావనికి ఒక్క పరిశ్రమనూ రానివ్వనని పాత వాటిని పారదోలుతానని... కొత్త కొలువులు సృష్టించనని... అంతఃకరణ శుద్ధితో ఆత్మసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.... ... అని చెప్పకున్నా... అయిదేళ్లుగా దాదాపు ఆ పనే చేశారు వైకాపా నేత! -
ఎన్నికల కోడ్ తర్వాత రూ.వేల కోట్ల పందేరం
ఎవరైనా మనకు ఆర్టీజీఎస్, నెఫ్ట్, ఐఎంపీఎస్ విధానంలో డబ్బులు బదిలీ చేస్తే మన ఖాతాకు ఎంతసేపట్లో చేరతాయి? కొద్ది గంటల్లో రావచ్చు. -
ఏం అభివృద్ధి చేశారని మా ఊరొచ్చారు?
‘సారూ.. ఏం అభివృద్ధి చేశారని మా ఊరొచ్చారు?’ అని ఏలూరు జిల్లా నూజివీడు ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప అప్పారావును మహిళలు, గ్రామస్థులు నిలదీశారు. -
‘యాప్’రే రూ.30 లక్షలా?
విద్యార్థులు ఫీజుల రూపంలో చెల్లించే డబ్బులను ఉన్నత విద్యామండలి దుర్వినియోగం చేస్తోంది. బ్యాంకు ఖాతాల్లో రూ.కోట్లు ఉండడంతో ఏదో ఒక కార్యక్రమం పేరు చెప్పి, వాటిని ఖాళీ చేస్తోంది. -
తిరుమలలో జస్టిస్ దుప్పల వెంకటరమణ కుమారుడి వివాహ వేడుక
మధ్యప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దుప్పల వెంకటరమణ కుమారుడు భానుప్రకాశ్, సౌజన్యల వివాహ వేడుక స్థానిక పుష్పగిరి మఠంలో బుధవారం జరిగింది. -
శ్రీవారి సేవలో అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి
అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డి.రమేష్ బుధవారం శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం శ్రీవారి ఆలయం వద్దకు చేరుకున్న న్యాయమూర్తి కుటుంబానికి తితిదే అధికారులు స్వాగతం పలికారు. -
డోన్, విజయనగరం జిల్లా గుత్తేదార్లకే టోకెన్లు
కేంద్ర రహదారి మౌలిక వసతుల నిధి (సీఆర్ఐఎఫ్) కింద పనులు చేసిన గుత్తేదారులు రూ.176 కోట్ల బిల్లుల కోసం సీఎఫ్ఎంఎస్లో అప్లోడ్ చేసి చాలాకాలంగా ఎదురుచూస్తున్నారు. -
అప్పు తేవాలి.. బొగ్గు కొనాలి!
అప్పు పుడితే బొగ్గు వస్తుంది.. బొగ్గు వస్తే థర్మల్ యూనిట్లు నడుస్తాయి.. ఇదీ ఏపీ జెన్కో పరిస్థితి. రాష్ట్ర విద్యుత్ అవసరాల్లో సుమారు 40 శాతం జెన్కో నుంచి అందుతోంది. -
ఆరంభమే ఫ్లాప్
వైకాపా అధ్యక్షుడు, ముఖ్యమంత్రి జగన్ ప్రచార యాత్ర ఆరంభమే ఫ్లాప్ అయింది.. గత ఎన్నికల్లో స్వీప్ చేసిన సొంత జిల్లాలో జనం ఆయనకు షాకిచ్చారు. -
నమ్మించారు.. వంచించారు
‘హైదరాబాద్కు సముద్రాన్ని తీసుకొస్తా’ అని సినిమాలో ఒక రాజకీయ నాయకుడి పాత్రలో నటుడు చెప్పినట్లుగా.. మన ముఖ్యమంత్రి హామీల మీద హామీలు గుప్పించారు. -
జగన్ ‘ఓట్లాట’లో ఓడిన రైతు!
కనికట్టు చేయడంలో... మాటల గారడీతో మభ్యపెట్టడంలో... పేటెంట్ హక్కు సీఎం జగన్దే... మొన్నటి వరకు విద్యుత్ కోతలతో ప్రజలను అల్లాడించిన వ్యక్తే... ఇప్పుడు ఎన్నికలు రావడంతో పంథా మార్చేశారు... వేసవి కాలం పేరిట ఓటర్లను ఏ‘మార్చు’తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
ఎన్నికల ముంగిట.. అవినీతి కేసులో ప్రఫుల్ పటేల్కు క్లీన్ చిట్
-
భవిష్యత్ తరాల కోసం తెదేపాకు ఓటు వేయాలి: భువనేశ్వరి
-
పూజాహెగ్డే ‘స్పై’ ఫొటో.. ప్రగ్యా ‘పోజు’ రిపీట్.. మెహందీతో కావ్య!
-
ఇతరులను బెదిరించడం కాంగ్రెస్ సంస్కృతి.. ‘లాయర్ల లేఖ’పై ప్రధాని మోదీ
-
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్సభ ఎన్నికల్లో పోటీ!