Azadi Ka Amrit Mahotsav: మూతులు ముడిచినా ముహూర్తం ఆగలేదు
1946 నాటికే బ్రిటన్ నుంచి స్వాతంత్య్రపు సూచనలు కనిపిస్తున్నా అడుగడుగునా అపశకునాలే... ఎవరో ఒకరి అడ్డుపుల్లలే! అత్యంత కీలకమైన రాజ్యాంగ రచన చేసే సమయానికి సంస్థానాధీశులు, ముస్లింలీగ్ నేతలు మూతి ముడిచారు. వారి బహిష్కరణ మధ్యే... 1946లో సరిగ్గా ఇదే రోజు (డిసెంబరు 9) స్వతంత్ర భారత రాజ్యాంగ రచన శ్రీకారం చుట్టుకుంది.
రాజ్యాంగ సభ ముద్ర
1946 నాటికే బ్రిటన్ నుంచి స్వాతంత్య్రపు సూచనలు కనిపిస్తున్నా అడుగడుగునా అపశకునాలే... ఎవరో ఒకరి అడ్డుపుల్లలే! అత్యంత కీలకమైన రాజ్యాంగ రచన చేసే సమయానికి సంస్థానాధీశులు, ముస్లింలీగ్ నేతలు మూతి ముడిచారు. వారి బహిష్కరణ మధ్యే... 1946లో సరిగ్గా ఇదే రోజు (డిసెంబరు 9) స్వతంత్ర భారత రాజ్యాంగ రచన శ్రీకారం చుట్టుకుంది.
ఎవరో కొంతమంది నేతలో, కాంగ్రెస్ పార్టీ నియమించిన కమిటీనో భారత రాజ్యాంగాన్ని రచించ లేదు. దేశంలోని (ఇప్పటి పాకిస్థాన్, బంగ్లాదేశ్ సహా) అన్ని ప్రాంతాలు, మతాలు, కులాలు, వర్గాలకు భాగస్వామ్యం కల్పిస్తూ... ప్రజాస్వామ్య బద్ధంగా ఎంపికైన ప్రతినిధులతో ఏర్పాటైంది భారత రాజ్యాంగ సభ. 1946 బ్రిటిష్ క్యాబినెట్ మిషన్ ప్లాన్ ఆధారంగా.... భారత రాజ్యాంగ సభకు తొలిసారి ఎన్నికలు జరిగాయి. అప్పటికే వివిధ రాష్ట్రాల్లో కొలువు దీరిన అసెంబ్లీల్లోని సభ్యుల ఓట్ల ఆధారంగా రాజ్యాంగ సభ ప్రతినిధులను ఎన్నుకున్నారు.
రాజ్యాంగ సభలో మొత్తం సభ్యుల సంఖ్య 389. వీరిలో 292 మంది రాష్ట్రాల ప్రతినిధులు. 93 మంది సంస్థానాధీశుల ప్రతినిధులు. నలుగురు చీఫ్ కమిషనర్ పాలనలోని దిల్లీ, అజ్మీర్-మెర్వారా, కూర్గ్, బలూచిస్థాన్లకు చెందినవారు. రాష్ట్రాల ప్రతినిధుల ఎంపిక 1946 ఆగస్టుకల్లా పూర్తయింది. కాంగ్రెస్ నుంచి 208 మంది; ముస్లిం లీగ్ నుంచి 73 మంది ఎంపికయ్యారు. వీరందరిలో 15 మంది మహిళలు కూడా ఉన్నారు.
అలకలు.. అసంతృప్తులు..
1946 డిసెంబరు 9న రాజ్యాంగ హాల్ (ప్రస్తుత పార్లమెంటులోని సెంట్రల్హాల్)లో చరిత్రాత్మక రాజ్యాంగ సభ తొలి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇంతలో సంస్థానాధీశులు సహకరించటానికి నిరాకరించారు. భారత స్వాతంత్య్ర ప్రక్రియలో తమ ప్రయోజనాలను పట్టించుకోవటం లేదని... తమను సంప్రదించకుండానే నిర్ణయాలు తీసుకుంటున్నారనేది వారి అలకకు కారణం. ఇక ఆది నుంచీ బ్రిటిష్ ఆడించినట్లు ఆడుతూ వచ్చిన ముస్లింలీగ్ పాకిస్థాన్ ఏర్పాటును డిమాండ్ చేస్తూ... తమకు ప్రత్యేక రాజ్యాంగ సభ ఏర్పాటు చేయాలంటూ తొలి సమావేశాన్ని బహిష్కరించింది. మరోవైపు... బ్రిటన్లోనూ చర్చిల్లాంటివారు రాజ్యాంగ సభ కూర్పుపై ‘హిందువుల సభ’ అంటూ విమర్శలు గుప్పించటం ఆరంభించారు. దీంతో... రాజ్యాంగ సభ ముందుకు సాగుతుందా అనే అనుమానాలు ఆరంభమయ్యాయి. కానీ... జాతీయోద్యమ నేతలు ఎవరేమనుకున్నా... ముందుకే వెళ్లాలని నిర్ణయించారు.
డిసెంబరు 9నాటి తొలి భేటీకి 207 మంది హాజరయ్యారు. రాజ్యాంగ నిర్మాణం కోసం ఏర్పాటైన రాజ్యాంగ సభకు ఎలాంటి పక్షపాతం, దురుద్దేశాలుండవని డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ స్పష్టం చేశారు. తాత్కాలిక ఛైర్మన్ను ఎంపిక చేసుకోవటం... సభ్యులందరితో ప్రమాణ స్వీకారం.. ఈ రెండే ఎజెండాగా తొలి సమావేశం జరిగింది. అప్పటి కాంగ్రెస్ ప్రముఖ నేత సచ్చిదానంద సిన్హాను రాజ్యాంగ సభ తాత్కాలిక అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. కార్యదర్శి హెచ్.వి.ఆర్. అయ్యంగార్ సభ్యులతో ప్రమాణం చేయించారు. తర్వాత డిసెంబరు 11న డాక్టర్ రాజేంద్రప్రసాద్ను సభ అధ్యక్షుడిగా, కోల్కతా విశ్వవిద్యాలయం మాజీ కులపతి హరేంద్ర కుమార్ ముఖర్జీని ఉపాధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. ఐసీఎస్ అధికారి బెనెగళ్ నరసింగరావును సలహాదారుగా నియమించారు. వివిధ కమిటీలను ఏర్పాటు చేశారు. రాజ్యాంగ రచన కమిటీ బాధ్యతలను అంబేడ్కర్కు అప్పగించారు. దేశ విభజన (పాకిస్థాన్ ఏర్పాటు) నిర్ణయమయ్యాక... ఈ సభను పునర్వ్యవస్థీకరించి... సభ్యుల సంఖ్యను 299కి కుదించారు. తొలుత అలిగిన సంస్థానాధీశుల ప్రతినిధులు కూడా తర్వాత మనసు మార్చుకున్నారు. మొత్తం 114 రోజుల పాటు ఈ ప్రతిష్ఠాత్మక రాజ్యాంగ సభ పని చేసింది. ‘‘డిసెంబరు 9... భారత చరిత్రలో నవశకానికి నాంది. భారతీయులం... మనదైన రాజ్యాంగాన్ని రాసుకోబోతున్నాం. స్వేచ్ఛాభారతావనికిది తొలి అడుగు...’’ అంటూ సభ సభ్యుడైన కెం.ఎం.మున్షీ వ్యాఖ్యానించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిజం చెబితే.. గురువులకు నోటీసులు!
‘ఎప్పుడూ సత్యమే పలకాలని’ పిల్లలకు చెప్పే ఉపాధ్యాయులు.. తాము నిజం చెబితే షోకాజ్ నోటీసులు అందుకోవలసి వస్తోంది. వైకాపాతో అంటకాగుతున్న పాఠశాల విద్యాశాఖలోని ఓ ఉన్నతాధికారి బరితెగించి వ్యవహరిస్తున్నారు. -
కొత్తవారొచ్చారు
ఆంధ్రప్రదేశ్ నిఘా విభాగాధిపతిగా సీనియర్ ఐపీఎస్ అధికారి కుమార్ విశ్వజిత్ను, విజయవాడ నగర పోలీసు కమిషనర్గా పీహెచ్డీ రామకృష్ణను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. -
ప్రజా రక్షకులు కారు.. వైకాపా సేవకులు!
ఖాకీలంటే... ప్రజారక్షణకు రాఖీలు... కానీ జగన్ హయాంలో కొందరు... వైకాపా పోకిరీలుగా మారి... అధికార పార్టీకి చాకిరీ చేశారు. స్వతంత్రంగా నిష్పాక్షికంగా వ్యవహరిస్తూ- ప్రజల ప్రాణాలు, ఆస్తిపాస్తులు, వారి హక్కులు, గౌరవమర్యాదలను కాపాడటం పోలీసుల విధ్యుక్త ధర్మం. -
యథా రాజ... తథా విద్య!
విద్య లేని వాడు వింత పశువు... మరి విద్యా వ్యవస్థను సర్వనాశనం చేసేవారిని ఏమనాలి? పాఠశాల విద్యార్థులను బైజూస్,బకలారియేట్ విధానాలతో కలవరపెట్టి.. స్కూళ్లలో ఉపాధ్యాయుల ఉనికే లేకుండా చేసి... ఎయిడెడ్ పాఠశాలలను బెదిరించి...మూయించి... ఇంటర్ విద్యార్థులకిచ్చే ఉచిత పుస్తకాల పంపిణీ రద్దు చేసి.. ఇంటర్న్షిప్ పేరుతో డిగ్రీ విద్యార్థులతో రొయ్యలు ఒలిపించి.. పీజీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ రద్దు చేసి.. విశ్వవిద్యాలయాలను రాజకీయ కార్యకలాపాలకు బలిచేసి... చదువుకోవాలనుకునే వారిని పక్కరాష్ట్రాలకు వలస పంపించింది అక్షరాలా... జగన్ సర్కారే! -
‘కోడ్’ కొండెక్కుతోంది?
ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26న ‘ఎచీవర్స్ డే’ పేరుతో భారీ సమావేశం నిర్వహిస్తుండటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
ఐఏఎస్ అధికారి గుల్జార్పై నిప్పులు చెరిగిన హైకోర్టు
ఓ వ్యక్తికి కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇచ్చే విషయంలో హైకోర్టు ఆదేశాలకు భిన్నంగా ఉత్తర్వులిచ్చిన ఐఏఎస్ అధికారి, ఆర్థికశాఖ పూర్వ ముఖ్య కార్యదర్శి ఎన్.గుల్జార్పై హైకోర్టు నిప్పులు చెరిగింది. -
తెలుగు మాధ్యమంలో ఉత్తీర్ణత ఉద్దేశపూర్వకంగానే తగ్గిస్తున్నారా?
రాష్ట్ర ప్రభుత్వం 2019 నుంచి తెలుగు మాధ్యమాన్ని పూర్తిగా రద్దు చేయాలని కంకణం కట్టుకుందని సామాజిక కార్యకర్త డాక్టర్ గుంటుపల్లి శ్రీనివాస్ ఆందోళన వ్యక్తం చేశారు. -
భారీ యంత్రాలతో ఇసుక తోడేద్దాం..
రాష్ట్రంలో ‘ముఖ్య’ నేత సోదరుడి కనుసన్నల్లో సాగుతున్న ఇసుక దోపిడీని మరింత భారీ స్థాయిలో చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. -
స్వగ్రామాల్లో జీవనం సాగించేలా పిటిషనర్లకు రక్షణ కల్పించండి
రాజకీయ కక్షతో తమను గ్రామాల నుంచి తరిమేసిన వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన అనుచరుల నుంచి రక్షణ కల్పించేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యాలపై హైకోర్టు స్పందించింది. -
అవినీతి ‘ప్రసాద’ం.. దందాల ‘రాజ’సం!
ఇసుకలో కోట్లాది రూపాయల సారం.. ఇళ్ల పట్టాల్లోనూ నిబంధనల పేరిట బేరం.. కాగితాలకు దొరకని వ్యాపారం.. బినామీలు, అనుచరులతోనే వ్యవహారం.. వంతెన మార్గాన్నే మార్చి భూముల పందేరం.. కొవిడ్ విరాళాల్లో స్వాహాకారం.. మొత్తంగా.. ఆ గోదారి తీరం.. అక్కడి ప్రజాప్రతినిధికి వేయాలి అవినీతి హారం.. వెరసి పేదలు, సామాన్యుల హాహాకారం.. -
పేరుకే పెంపు.. ఊకదంపు
పేదలే నా ప్రాణం... వారి ఆయురారోగ్యాలే నా ధ్యేయం... ఆరోగ్యశ్రీ వారి కోసమేనంటూ... జగన్ తన ప్రసంగాల్లో ఊదరగొడుతున్నారు... వాస్తవంగా చూస్తే పథకానికే అనారోగ్యమొచ్చింది... ప్రచారం చేసుకుంటున్నంత గొప్పతనమేమీ లేదు! ప్రభుత్వ ఉద్యోగులను పట్టించుకోవడమే లేదు!! -
హీరో ఎవరు? విలన్ ఎవరు?
‘మనమంతా సినిమాకు పోతాం. ఆ సినిమాలో హీరో ఎందుకు నచ్చుతాడో, విలన్ ఎందుకు నచ్చడో అందరూ ఆలోచించాలి. -
ఓటమి ‘కాసు‘క్కూర్చుంది!
ఈ అయిదేళ్లలో గురజాల పట్టణంలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏమీ లేదు. ఈ రోడ్లు కూడా గత ప్రభుత్వంలో వేసినవే. అందువల్లే ఈసారి ఇక్కడ మార్పు కావాలనుకుంటున్నాం. -
నిఘా విభాగాధిపతి పోస్టుకు సంజయ్ పేరు ఎలా ప్రతిపాదిస్తారు?
నిఘా విభాగాధిపతి పోస్టు కోసం ముగ్గురు అధికారుల పేర్లతో పంపిన ప్యానల్ జాబితాలో సీఐడీ విభాగాధిపతి ఎన్.సంజయ్ పేరును.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.ఎస్.జవహర్రెడ్డి చేర్చడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
పండుటాకులపై పగ.. ఇది జగన్ మార్కు దగా.. అ‘విశ్రాంత’ ఆవేదన
బాధ్యతల బరువును మోసి... జీవితమంతా ఎన్నో శ్రమలకోర్చి... ఇక హాయిగా ఉందామనుకున్న విశ్రాంత ఉద్యోగుల బతుకుల్లో జగన్ రేపిన కల్లోలం అంతా ఇంతా కాదు... ఐఆర్, డీఆర్లకు గండికొట్టి... క్వాంటం పెన్షన్లలో కొర్రీ పెట్టి... వచ్చే ఆ నాలుగు రూపాయలనూ సమయానికి రాకుండా చేసి...వారిని రోడ్డున పడేశారు. చివరకు వారూ ధర్నాలు చేసే పరిస్థితి తెచ్చారు. -
ఫాం-12 సమర్పించినా రశీదు ఇవ్వడం లేదు
ఎన్నికల విధుల్లో భాగస్వాములయ్యే ఉద్యోగుల పోస్టల్ బ్యాలట్లపై ఉద్యోగులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పోస్టల్ బ్యాలట్ ఫాం-12 సమర్పించినా కొన్ని చోట్ల రశీదులు ఇవ్వడం లేదు. -
నేడు 54 మండలాల్లో తీవ్ర వడగాలులు
రాష్ట్రంలో ఎండ తీవ్రత క్రమంగా పెరుగుతోంది. బుధవారం 69 మండలాల్లో తీవ్ర వడగాలులు, 105 మండలాల్లో వడగాలులు వీచాయి. -
గిరిజన మహిళలను దూషిస్తే కేసు నమోదు చేయరా?
‘‘యానాదోళ్ల అమ్మాయి తెదేపాలో చేరారు. ఆమె నెత్తిన రూపాయి పెడితే ఐదు పైసలు విలువ చేయరు. గతంలో వాలంటీరుగా ఉంటే.. గౌతమ్బాబు ఆత్మకూరు ఛైర్పర్సన్గా చేశారు. -
చెల్లెమ్మలకు ఏం సమాధానం చెబుతారు జగన్?
‘మీ ఆడబిడ్డలం కొంగు చాచి అడుగుతున్నాం. న్యాయం చేయండి. ఒకవైపు రాజశేఖరరెడ్డి బిడ్డ ఎన్నికల్లో నిలబడింది.. మరోవైపు రాజశేఖరరెడ్డి తమ్ముడు వివేకా హత్య కేసులో నిందితుడు బరిలో ఉన్నారు. -
జగన్.. మరీ ఇంత బరితెగింపా?
నా ఎస్సీలు.. అంటూ నిత్యం మైకు ముందు దళితులపై ప్రేమ ఒలకబోస్తున్నట్లు నటించే జగన్ నిజస్వరూపం ఏమిటో మరోసారి బయటపడింది. -
మహాత్ముడు మన్నించినా.. ప్రజలు క్షమించరు!
ఎన్టీఆర్ జిల్లా నందిగామలో వైకాపా అభ్యర్థి మొండితోక జగన్మోహనరావు నామినేషన్ ర్యాలీ సందర్భంగా బుధవారం ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు హంగామా సృష్టించారు.
తాజా వార్తలు (Latest News)
-
‘రాంచీలో ఉన్నా.. రూ.600 కావాలి’.. ధోనీ పేరుతో మెసేజ్ వైరల్
-
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ
-
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్
-
అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్ కీలక ప్రతిపాదన!
-
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM