Bandi Sanjay: సంజయ్ పర్యటనలో ఉద్రిక్తత
రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్ల పరిస్థితిని పరిశీలించడానికి భాజపా రాష్ట్రాధ్యక్షుడు బండి సంజయ్ సోమవారం చేపట్టిన ఉమ్మడి నల్గొండ జిల్లా పర్యటన ఆద్యంతం ఉద్రిక్తంగా సాగింది. పలు ధాన్యం
నల్గొండ, మిర్యాలగూడలలో రాళ్లు రువ్వుకున్న తెరాస, భాజపా కార్యకర్తలు
భాజపా రాష్ట్రాధ్యక్షుడి కాన్వాయ్పైనా దాడి, పలు వాహనాలు ధ్వంసం
నల్గొండ ఆర్జాలబావి కొనుగోలు కేంద్రంలో ధాన్యం పరిశీలిస్తున్న భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్
ఈనాడు, నల్గొండ- సూర్యాపేట గ్రామీణం, న్యూస్టుడే: రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్ల పరిస్థితిని పరిశీలించడానికి భాజపా రాష్ట్రాధ్యక్షుడు బండి సంజయ్ సోమవారం చేపట్టిన ఉమ్మడి నల్గొండ జిల్లా పర్యటన ఆద్యంతం ఉద్రిక్తంగా సాగింది. పలు ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద తెరాస, భాజపా కార్యకర్తలు పరస్పరం రాళ్లు, కోడిగుడ్లతో దాడి చేసుకున్నారు. దీంతో ఇరువర్గాలను పోలీసులు చెదరగొట్టారు. తొలుత నల్గొండ సమీపంలోని ఆర్జాలబావి ఐకేపీ కేంద్రాన్ని సందర్శించిన సంజయ్ అక్కడికి ధాన్యం తీసుకువచ్చిన రైతులతో మాట్లాడారు. ఆ సమయంలో అక్కడే ఉన్న తెరాస కార్యకర్తలు సంజయ్ గోబ్యాక్ అని నినాదాలు చేస్తూ నల్లజెండాలతో నిరసన తెలిపారు. ప్రతిగా తెరాస ప్రభుత్వం, సీఎం కేసీఆర్కు వ్యతిరేకంగా భాజపా కార్యకర్తలు నినాదాలు చేశారు.
దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. తెరాస కార్యకర్తలు కోడిగుడ్లు విసరడంతో భాజపా కార్యకర్తలు వారి పైకి దూసుకెళ్లేందుకు యత్నించారు. పోలీసులు అడ్డుకున్నా తోపులాటకు దిగడంతో ఐకేపీ కేంద్రంలోకి రైతులు తీసుకొచ్చిన ధాన్యం చెల్లాచెదురైంది. పలువురు రైతులు ఇరుపార్టీల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఉద్రిక్తతల మధ్యే సంజయ్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. తర్వాత వేములపల్లి మండలం కుక్కడం వద్ద ఉన్న కేంద్రాన్ని పరిశీలించడానికి వెళ్లగా నార్కట్పల్లి- అద్దంకి రహదారిపై తెరాస కార్యకర్తలు కాన్వాయ్ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. వెంటనే పోలీసులు లాఠీలకు పనిచెప్పారు. శెట్టిపాలెం వద్ద ధాన్యాన్ని మిల్లులకు తీసుకువచ్చిన రైతులతో మాట్లాడటానికి వచ్చిన సంజయ్కు వ్యతిరేకంగా అక్కడే ఉన్న తెరాస శ్రేణులు నినాదాలు చేశాయి. దీంతో ఇరువర్గాలు రాళ్లు, కోడిగుడ్లతో దాడి చేసుకోగా.. ఓ టీవీ ఛానల్ విలేకరితో పాటు పలువురు తెరాస, భాజపా కార్యకర్తలకు గాయాలయ్యాయి. సూర్యాపేట జిల్లాకు వెళుతున్న సంజయ్ కాన్వాయ్పై మూసి బ్రిడ్జి వద్ద తెరాస శ్రేణులు రాళ్లతో దాడి చేయడంతో పలు వాహనాల అద్దాలు ధ్వంసమయ్యాయి. రాళ్లతో దాడి చేసిన వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కాన్వాయ్ను సూర్యాపేట జిల్లాలోకి అనుమతించారు.
నల్గొండ జిల్లా వేములపల్లి మండలం శెట్టిపాలెం వద్ద భాజపా, తెరాస వర్గీయుల ఘర్షణ.. అడ్డుకుంటున్న పోలీసులు
వాహనశ్రేణి దారి మళ్లింపు
శాంతిభద్రతల దృష్ట్యా సంజయ్ కాన్వాయ్ను సోమవారం రాత్రి 8 గంటలకు సూర్యాపేట మండలం తాళ్లఖమ్మంపహాడ్ వైపు దారి మళ్లించారు. తెరాస శ్రేణుల దాడి కారణంగా పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు ఈమేరకు చర్యలు చేపట్టారు. వాహనశ్రేణిని ఇమాంపేట మీదుగా జానారెడ్డి నగర్కు తరలించారు. రాత్రి 11 గంటలు దాటాక సంజయ్ సూర్యాపేటకు వెళ్లి భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వరరావు గృహంలో బస చేశారు. మరోవైపు సంజయ్ పర్యటనలో శాంతి భద్రతల సమస్య తలెత్తవచ్చని నిఘావర్గాలు హెచ్చరించినా నల్గొండ, సూర్యాపేట జిల్లాల పోలీసులు సరైన రీతిలో స్పందించలేదని తెరాస, భాజపా శ్రేణులు విమర్శిస్తున్నాయి. ఎస్పీలిద్దరూ స్పష్టమైన ఆదేశాలిచ్చినా రెండు జిల్లాల అధికారులు విఫలమయ్యారన్న వాదనలు వినిపిస్తున్నాయి.
శెట్టిపాలెం వద్ద రాళ్ల దాడిలో గాయపడిన తెరాస కార్యకర్త
ఇరుపార్టీల నేతలపై కేసు నమోదు
నల్గొండ నేరవిభాగం, న్యూస్టుడే: నల్గొండలోని ఆర్జాలబావి ధాన్యం కొనుగోలు కేంద్రంలో సోమవారం చోటుచేసుకున్న భాజపా, తెరాస నేతలు, కార్యకర్తల దాడుల్లో ఇరు వర్గాలపై ఫిర్యాదులు వచ్చినట్లు రూరల్ ఎస్సై రాజశేఖర్రెడ్డి తెలిపారు. కోడ్ ఉల్లంఘనపై స్థానిక ఎంపీడీవో శ్రీనివాసరెడ్డి ఫిర్యాదు మేరకు సంజయ్తో పాటు ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు, కార్యకర్తలు, నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి, తెరాస నేతలు, కార్యకర్తలపై కేసు నమోదు చేశామన్నారు.
పోలీసుల సహకారంతోనే దాడులు: సంజయ్
పెన్పహాడ్, గన్ఫౌండ్రి- న్యూస్టుడే: పోలీసుల సహకారంతో ముఖ్యమంత్రి కేసీఆర్ తమపై దాడులు చేయిస్తున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. పెన్పహాడ్ మండలం జానారెడ్డినగర్లో సోమవారం రాత్రి ఆయన విలేకరులతో మాట్లాడారు. రైతులు తిరగబడి దాడులకు పాల్పడతారనే ఇంటెలిజెన్స్ సమాచారం కేసీఆర్ వద్ద ఉందని, అందుకే అసహనంతో దాడులు చేయిస్తున్నారని విమర్శించారు. తెరాస శ్రేణుల దాడిలో 8 వాహనాలు ధ్వంసమయ్యాయన్నారు. కేసీఆర్ తన పర్యటనను అడ్డుకునేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు. 60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని తీసుకోవాలని కేంద్రం ఆదేశించినా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు కొనకుండా రైతులను ఇబ్బందులకు గురిచేస్తుందన్నారు. జనగామలో మంగళవారం పదాధికారుల అత్యవసర సమావేశం జరుగుతుందని, అక్కడ తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని సంజయ్ వెల్లడించారు. నల్గొండ ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ గజినీ వేషాలు వేస్తున్నారని విమర్శించారు. ప్రతి గింజా కొంటామని చెప్పి, ఇప్పుడు కేంద్రంపై ఆ నెపం వేస్తున్నారన్నారు. 2023లోగా ధాన్యం మద్దతు ధరను రెట్టింపు చేస్తామన్నారు.
* హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత సీఎం కేసీఆర్, తెరాస నేతలు రాజ్యాంగ విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారని, తమ పార్టీ నేతలకు రక్షణ కల్పించాలని భాజపా నేత ఎన్.రాంచందర్రావు డీజీపీ, పోలీసు యంత్రాంగాన్ని కోరారు.
నేరేడుచర్ల వద్ద రాళ్ల దాడిలో ధ్వంసమైన భాజపా కాన్వాయ్లోని కారు అద్దాలు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పతి దేవుడికి గుడి కట్టింది!
కరోనా మహమ్మారి ఆమె జీవితంలో అంతులేని విషాదాన్ని నింపింది. కళ్లల్లో పెట్టుకుని చూసుకునే భర్తను తన నుంచి దూరం చేసింది. మూడేళ్ల క్రితం భర్త కొవిడ్తో మృతి చెందడంతో ఆమె ఒంటరిగా మారారు. -
కొత్తవారొచ్చారు
ఆంధ్రప్రదేశ్ నిఘా విభాగాధిపతిగా సీనియర్ ఐపీఎస్ అధికారి కుమార్ విశ్వజిత్ను, విజయవాడ నగర పోలీసు కమిషనర్గా పీహెచ్డీ రామకృష్ణను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. -
జేఈఈ మెయిన్స్లో తెలుగోళ్ల సత్తా
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. దేశవ్యాప్తంగా 56 మందికి 100 పర్సంటైల్ రాగా.. ఇందులో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందినవారే 22 మంది ఉన్నారు. జేఈఈ మెయిన్స్ తుది ఫలితాలను జాతీయ పరీక్షల విభాగం (ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసింది. -
కాళేశ్వరంపై కమిషన్ విచారణ షురూ
కాళేశ్వరం ఎత్తిపోతల్లోని బ్యారేజీలపై న్యాయ విచారణకు ఏర్పాటు చేసిన కమిషన్ కార్యాచరణ మొదలుపెట్టింది. బుధవారం కమిషన్ ఛైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ ఆయన సతీమణి దేబ్జానీ ఘోష్తో కలిసి హైదరాబాద్కు చేరుకున్నారు. -
ఫస్టియర్లో 60.01%.. సెకండియర్లో 64.19%
ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో 60.01 శాతం, రెండో సంవత్సరంలో 64.19 శాతం మంది విద్యార్థులు (ఒకేషనల్ కోర్సులతో కలిపి) ఉత్తీర్ణత సాధించారు. -
కవిత బెయిల్పై మే 6న తీర్పు
ఈడీ కేసులో బెయిల్ కోసం భారాస ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్పై తీర్పును ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు మే 6కి వాయిదా వేసింది. -
చదువుల ‘సిరి’.. రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని పట్టుదల
వారానికి రెండుసార్లు డయాలసిస్.. ఒంట్లో సత్తువ లేక కళాశాలకూ వెళ్లలేని పరిస్థితి.. అయినా మొక్కవోని పట్టుదలతో చదివిన పేదింటి బిడ్డ ప్రతిభ చాటింది. -
విజన్-2026కు డోర్నకల్ ఉపాధ్యాయుల శ్రీకారం
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు విజన్-2026 పేరిట ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. -
ఇంటర్ ఫలితాల్లో కవలల ప్రతిభ
సూర్యాపేట జిల్లా ఆత్మకూర్(ఎస్) మండల కేంద్రానికి చెందిన డేగల వీరభద్రయ్య, మంజుల దంపతుల కవల పిల్లలు డేగల రామ్, లక్ష్మణ్ ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో ప్రతిభ చూపారు. -
రాష్ట్రంలో వంతెనల పరిశీలన..!
రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న చిన్నా, పెద్ద వంతెనలను పరిశీలించేందుకు అధికారులు ఆయత్తం అవుతున్నారు. జిల్లాల వారీగా నిర్మాణ స్థితిగతులపై జాబితాలను రూపొందించే పనిలో ఉన్నారు. -
యాదాద్రి విద్యుత్కేంద్రానికి పర్యావరణ అనుమతి
యాదాద్రి థర్మల్ విద్యుత్కేంద్రానికి పర్యావరణ అనుమతి (ఈసీ) ఇవ్వడానికి కేంద్ర పర్యావరణ శాఖ ఆమోదం తెలిపింది. -
మెట్రో రైలు శబ్దకాలుష్యంపై వివరణివ్వండి
మెట్రో రైల్వే లైను వంపుల్లో రైలు వెళ్లినపుడు పరిమితికి మించి వస్తున్న శబ్దకాలుష్యంపై వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వానికి, మెట్రో రైల్వే ఎండీకి బుధవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
ఆర్జేసీ, మోడల్, కేజీబీవీ విద్యార్థుల ప్రతిభ
టీఎస్ఆర్జేసీ నేరెళ్ల గురుకుల విద్యార్థిని ఎంపీసీలో 991 మార్కులు, బైపీసీలో తాటిపల్లి విద్యార్థిని 990 మార్కులు సాధించినట్లు యాజమాన్యం తెలిపింది. -
ఫోన్ ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావుకు మధ్యంతర బెయిలు నిరాకరణ
ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టయిన టాస్క్ఫోర్స్ మాజీ ఓఎస్డీ రాధాకిషన్రావుకు ఎల్ఎల్ఎం పరీక్షలు రాసేందుకు వీలుగా మధ్యంతర బెయిలు ఇచ్చేందుకు నాంపల్లి కోర్టు నిరాకరించింది. -
పోలింగ్ రోజు వేతనంతో కూడిన సెలవు
లోక్సభ ఎన్నికల పోలింగ్ జరిగే రోజును వేతనంతో కూడిన సెలవుగా ప్రకటించారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్రాజ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
జస్టిస్ రామలింగేశ్వరరావుకు హైకోర్టు ఘన నివాళి
గుండెపోటుతో ఇటీవల మృతి చెందిన ఉమ్మడి హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎ.రామలింగేశ్వరరావుకు బుధవారం హైకోర్టు ఘన నివాళి అర్పించింది. -
శనగ విత్తనోత్పత్తి రైతుల ఆందోళన
‘పంట విక్రయించి నెల రోజులవుతోంది. డబ్బులు ఎప్పుడు ఇస్తారో.. క్వింటాకు ఎంత కట్టిస్తారో ఇప్పటికీ తెలియదు. -
విచారణ నుంచి తప్పుకొన్న జస్టిస్ శేషసాయి ధర్మాసనం
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసుపై మాట్లాడొద్దంటూ కడప జిల్లా కోర్టు(పీడీజే) ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ వివేకా కుమార్తె నర్రెడ్డి సునీత, పులివెందుల తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.రవీంద్రనాథ్రెడ్డి అలియాస్ బీటెక్ రవి దాఖలు చేసిన వ్యాజ్యాల విచారణ నుంచి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏవీ శేషసాయి నేతృత్వంలోని ధర్మాసనం తప్పుకొంది. -
ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఇంటర్ ప్రవేశాలు
రాష్ట్రంలోని ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో ప్రవేశాల పేరిట డొనేషన్లు, అధిక రుసుముల వసూళ్లు, ఇతరత్రా అక్రమాలను నిరోధించేందుకు వీలుగా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఆన్లైన్ ప్రవేశాల విధానాన్ని ప్రవేశపెట్టాలని యోచిస్తున్నామని విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. -
మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ
ష్ట్రంలో మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. షెడ్యూలును విద్యాశాఖ బుధవారం విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు (4)
రాష్ట్రంలో వచ్చే నెల 6వ తేదీన జరగనున్న తెలంగాణ రాష్ట్ర ఇంజినీరింగు కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (టీఎస్ఈసెట్)ను మే చివరి వారానికి వాయిదా వేయాలని పలువురు అభ్యర్థులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని కోరారు.
తాజా వార్తలు (Latest News)
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
-
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
-
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
-
పతి దేవుడికి గుడి కట్టింది!