Bipin Rawat: వ్యూహరచనా నిపుణుడు రావత్
భారత సైన్యాధ్యక్షుడిగా, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్గా జనరల్ బిపిన్ రావత్ అత్యుత్తమ సేవలు అందించారు. స్వతహాగా సైనికుడి కుమారుడైన ఆయన.. భారత సైనికదళాల్లో అత్యున్నత స్థాయికి ఎదిగారు. తండ్రి స్ఫూర్తితో ఆయన విధులు నిర్వర్తించే బెటాలియన్లోనే చేరి, అంచెలంచెలుగా ఎదిగి త్రిదళాధిపతి స్థాయికి చేరారు.
సర్జికల్ స్ట్రైక్ సహా పలు ఆపరేషన్లకు నేతృత్వం
ఐక్యరాజ్య సమితిలోనూ సేవలందించిన ఘనత
లెక్కలేనన్ని పతకాలు ఆయన సొంతం
సైనిక కుటుంబం నుంచి వచ్చి అత్యున్నత స్థాయికి..
ప్రధాని మోదీతో బిపిన్ రావత్
దిల్లీ: భారత సైన్యాధ్యక్షుడిగా, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్గా జనరల్ బిపిన్ రావత్ అత్యుత్తమ సేవలు అందించారు. స్వతహాగా సైనికుడి కుమారుడైన ఆయన.. భారత సైనికదళాల్లో అత్యున్నత స్థాయికి ఎదిగారు. తండ్రి స్ఫూర్తితో ఆయన విధులు నిర్వర్తించే బెటాలియన్లోనే చేరి, అంచెలంచెలుగా ఎదిగి త్రిదళాధిపతి స్థాయికి చేరారు. సైన్యానికి సేవలందిస్తున్న కుటుంబం నుంచి వచ్చిన ఆయన.. అదే సైన్యంలో దాదాపు 40 ఏళ్ల సేవలు అందించి, ఎన్నో శిఖరాలను అధిరోహించారు.
అపార ప్రతిభాశాలి
1958 మార్చి 16న ఉత్తరాఖండ్లో హిందూ గర్వాలీ రాజ్పుత్ కుటుంబంలో జన్మించారు. బిపిన్ తండ్రి లక్ష్మణ్సింగ్ రావత్ ఆర్మీలో లెఫ్టినెంట్ జనరల్ హోదాలో పనిచేశారు. ఆయన తల్లి ఉత్తరకాశీకి చెందిన ఓ మాజీ ఎమ్మెల్యే కుమార్తె. దేహ్రాదూన్లోని కాంబ్రియన్ హాల్, సెయింట్ ఎడ్వర్డ్స్ పాఠశాలలో రావత్ విద్యాభ్యాసం చేశారు. అనంతరం నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఖడక్వల్సా), ఇండియన్ మిలిటరీ అకాడమీ (దేహ్రాదూన్), వెల్లింగ్టన్లోని డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజ్లో చదువుకున్నారు. ఇండియన్ మిలిటరీ అకాడమీలో ఆయన ప్రతిభకు ‘స్వార్డ్ ఆఫ్ ఆనర్’ అవార్డు లభించింది. అమెరికా కాన్సాస్లోని యూఎస్ ఆర్మీ కమాండ్, జనరల్ స్టాఫ్ కాలేజీలో హయ్యర్ కమాండ్ కోర్స్ చేశారు.
నేపాల్ ఆర్మీకీ అధ్యక్షత
1978 డిసెంబరు 16న బిపిన్ రావత్ ఆర్మీలో చేరారు. తన తండ్రి పనిచేసిన 11 గోర్ఖా రైఫిల్స్ ఐదో బెటాలియన్లోనే బాధ్యతలు చేపట్టారు. ఎత్తైన ప్రాంతాల్లో చేసే యుద్ధాల్లో రావత్కు తిరుగులేదు. పదేళ్ల పాటు తిరుగుబాటు వ్యతిరేక ఆపరేషన్లు నిర్వహించారు. జమ్ము కశ్మీర్లోని ఉరీలో మేజర్ హోదాలో పనిచేశారు. అనంతరం అంచెలంచెలుగా ఎదిగిన ఆయన 2016 డిసెంబరు 31న ఆర్మీ చీఫ్గా బాధ్యతలు చేపట్టారు. ఇద్దరు సీనియర్లను వెనక్కి నెట్టి ఆయన ఈ పదవి దక్కించుకున్నారు. గోర్ఖా బ్రిగేడ్ నుంచి ఆర్మీ చీఫ్గా ఎదిగిన ముగ్గురు అధికారుల్లో రావత్ ఒకరు. అంతేకాదు.. ఆయన నేపాల్ ఆర్మీకి గౌరవాధ్యక్షులు కూడా.
రావత్ కీలక మిషన్లు..
చైనాతో 1987లో జరిగిన ఘర్షణలో రావత్ బెటాలియన్ ముందుండి పోరాడింది. 1962 యుద్ధం తర్వాత మెక్మోహన్ రేఖ వద్ద జరిగిన తొలి సైనిక ఘర్షణ ఇదే. ఈ సమయంలో తన బృందాన్ని ఆయన సమర్థంగా నడిపించారు. డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో ఐరాస తరఫున నిర్వహించిన మిషన్.. రావత్ విజయాల్లో చెప్పుకోదగినది. దక్షిణ కివూ రాజధాని గోమాను ఆక్రమించుకునేందుకు సాయుధ తిరుగుబాటుదారులు చేసిన ప్రయత్నాన్ని వమ్ము చేశారు. ఐరాస శాంతి దళాల తరఫున పోరాడిన బృందానికి రావత్ అధ్యక్షత వహించారు. మిషన్లో పాల్గొన్న సైనికుల్లో సగం మంది రావత్ బృందంలో ఉన్నారు. ఈ ఆపరేషన్ నాలుగు నెలలు జరిగింది. గోమాను తిరుగుబాటుదారుల వశం కాకుండా కాపాడటమే కాకుండా.. సాయుధ దళాలను చర్చలకు దిగివచ్చేలా చేశారు.
సర్జికల్ స్ట్రైక్కి నేతృత్వం
సర్జికల్ స్ట్రైక్... ఈ మాట వినగానే గుర్తుకొచ్చే పేరు జనరల్ బిపిన్ రావత్! 2016 సెప్టెంబరు 29న పాక్ సరిహద్దుల్లోకి భారత సైన్యం వెళ్లి అత్యంత సాహసోపేతంగా అక్కడి ఉగ్ర స్థావరాలను కూకటివేళ్లతో పెకలించిన ఘటన గుర్తుకొస్తేనే భారతీయులందరికీ రోమాలు నిక్కబొడుచుకుంటాయి. రావత్ భారత సైన్యానికి ఉప అధిపతి అయిన నెల రోజుల్లోపే ఈ దాడి జరిగింది. ఉరీలోని సైనిక శిబిరం మీద, పుల్వామాలో సీఆర్పీఎఫ్ బలగం మీద జరిగిన దాడులకు ప్రతీకారంగా బిపిన్ రావత్ నేతృత్వంలో చేసిన ఈ సర్జికల్ స్ట్రైక్లో పలువురు ఉగ్రవాదులను హతమార్చడంతో పాటు వాళ్ల శిబిరాలనూ మన సైన్యం ధ్వంసం చేసింది.
మయన్మార్ దాడి..
2015 జూన్లో మణిపుర్కు చెందిన యూఎన్ఎల్ఎఫ్డబ్ల్యూ తిరుగుబాటుదారులు భారత సైనికులపై దాడి చేసి 18 మందిని పొట్టనబెట్టుకున్నారు. ఆ సమయంలో దిమాపుర్ కేంద్రంగా పనిచేసే కోర్ 3 కమాండింగ్ అధికారిగా రావత్ వ్యవహరించారు. ఈ ఘటన తర్వాత.. సీమాంతర దాడులతో భారతసైన్యం విరుచుకుపడింది. 21వ బెటాలియన్కు చెందిన పారాషూట్ రెజిమెంట్.. ఎన్ఎస్సీఎన్-కే తిరుగుబాటు సంస్థ స్థావరాన్ని ధ్వంసం చేసి పలువురు ఉగ్రవాదులను మట్టుబెట్టింది.
దౌత్య సేవలూ..
మిలిటరీతో పాటు దౌత్యపరంగానూ విశేష సేవలు అందించారు రావత్. అమెరికా, రష్యా, నేపాల్, శ్రీలంక, మయన్మార్, భూటాన్ తదితర దేశాల్లో పర్యటించారు. ఆయా దేశ అధ్యక్షులు, సైనిక అధికారులతో కీలక సమావేశాలు నిర్వహించారు. దేశాల మధ్య సైనిక సంబంధాలను బలోపేతం చేయడంలో కృషిచేశారు.
పలు పతకాలు..
సుదీర్ఘ సేవాకాలంలో ఆయనకు ఉత్తమ యుద్ధసేవా మెడల్, అతి విశిష్ఠ సేవామెడల్, యుద్ధసేవా మెడల్, సేవామెడల్, విశిష్ఠ సేవామెడల్ లాంటి పలు పతకాలు అందాయి. ఐక్యరాజ్యసమితిలో పనిచేసిప్పుడు ఆయనకు ఫోర్స్ కమాండర్ నుంచి ప్రశంసలందాయి.
డాక్టర్ రావత్
జాతీయ భద్రత, నాయకత్వం లాంటి అంశాలపై వివిధ పత్రికల్లో ఆయన లెక్కలేనన్ని వ్యాసాలు రాశారు. మద్రాస్ యూనివర్సిటీ ఆయనకు రక్షణ రంగంలో ఎంఫిల్ అందించింది. మేనేజ్మెంట్, కంప్యూటర్ సైన్సెస్లో రెండు డిప్లొమాలు కూడా ఆయనకు ఉన్నాయి. మేరాఠ్లోని చౌధరి చరణ్సింగ్ విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్డీ పొందారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా వైన్స్.. ప్రొప్రయిటర్ జగన్
రాష్ట్రంలో ఎవరైనా సరే.. మూడుకు మించి మద్యం సీసాలు కలిగి ఉండటం నేరం. కానీ సీఎం జగన్ ‘మేమంతా సిద్ధం’ పేరిట నిర్వహిస్తున్న సభల్లో లక్షలకొద్దీ మద్యం సీసాలు గలగలలాడుతున్నాయి. ఈ సభల కోసం జనాల్ని తరలిస్తున్న ఆర్టీసీ బస్సుల్లో మద్యం కేసులు పొంగిపొర్లుతున్నాయి. -
సీఎంపై సతీష్ రాయి విసిరాడని వీఆర్వోకు చెప్పారట!
ఏదైనా నేరానికి సంబంధించిన సమాచారం తెలిస్తే.. ఎవరైనా ఏం చేస్తారు? శాంతిభద్రతల అంశం కాబట్టి సంబంధిత పోలీస్స్టేషన్కు వెళ్లి ఆ ఘటనకు సంబంధించిన సమాచారాన్ని తెలియజేస్తారు. -
పసివాడిన ప్రాణాలు!
పెద్దవాళ్లయితే సమస్యను చెప్పగలరు.. కానీ, చిన్నపిల్లలు అలా కాదు.. వారి బాధను మనమే అర్థం చేసుకోవాలి.. అయితే.. జగన్ సర్కారుకు అంత తీరిక ఎక్కడుంది? అక్రమాలు, అవినీతి, ఓట్ల వేట తప్ప.. ఆయనకు మరో ధ్యాసే ఉండదు కదా.. అందుకే నవజాత శిశువుల సంరక్షణను గాలికొదిలేశారు. -
పేదలతో చెడు‘గూడు’!
‘ఒక్క అవకాశం ఇవ్వండి.. మీ సొంతింటి కల నెరవేరుస్తా..’ అని జగన్ చెబితే.. నమ్మి ఓటేశారు పేదలు. తీరా అధికారంలోకి వచ్చాక.. ‘దోచుకోవడం దాచుకోవడం’ మీద పెట్టిన శ్రద్ధలో కాస్తయినా పేదలకు ఇళ్లు కట్టించడంపైన పెట్టలేదు జగన్. -
మంచాలలో ప్రబలిన అతిసారం
గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం మంచాల గ్రామంలో అతిసారం ప్రబలింది. ఇక్కడ సుమారు 100 మందికి పైగా గురువారం రాత్రి నుంచి వాంతులు, విరేచనాలతో బాధపడుతున్నారు. -
వివేకా హత్యలో నాపై రెండు క్రిమినల్ కేసులు.. అఫిడవిట్లో పేర్కొన్న అవినాష్రెడ్డి
వైకాపా తరఫున కడప ఎంపీ అభ్యర్థిగా శుక్రవారం నామినేషన్ దాఖలు చేసిన వైఎస్ అవినాష్రెడ్డి తాను రెండు క్రిమినల్ కేసుల్లో నిందితుడిగా ఉన్నానని అఫిడవిట్లో పేర్కొన్నారు. -
ఎడ్సెట్-2024 నోటిఫికేషన్ విడుదల
బీఎడ్ 2024-25లో ప్రవేశాల కోసం ఉన్నత విద్యామండలి తరఫున ఆంధ్ర విశ్వవిద్యాలయం (ఏయూ) శుక్రవారం ఎడ్సెట్ నోటిఫికేషన్ను విడుదల చేసింది. -
‘కౌలు రైతుకు’ జగన్ కాటు!
‘‘దేశంలో ఎక్కడా లేనట్లుగా కౌలు రైతులకు మేం తోడుగా ఉంటున్నాం. గ్రామ సచివాలయంలోనే సాగుదారు హక్కు కార్డులు అందిస్తున్నాం. వారికి ఇక రైతు భరోసాతోపాటు అన్ని పథకాలు అందుతాయి’’ అంటూ 2023 సెప్టెంబరులో రైతు భరోసా విడుదల సందర్భంగా సీఎం జగన్ గొప్పలు చెప్పారు. -
జనం కళ్లలో జగన్ దుమ్ము
సిద్ధం యాత్రలో భాగంగా శుక్రవారం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని ఏడీబీ రోడ్డు మీదుగా సాగుతున్న ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి కాన్వాయ్ ఇది.. మధ్యలో ఒక్కసారి ఆయన బస్సు దిగి చూస్తే రోడ్డు దుస్థితి తెలిసేవి. -
ఐదేళ్లలో భారీగా పెరిగిన బొత్స కుటుంబ ఆస్తి
విజయనగరం జిల్లా చీపురుపల్లి వైకాపా అభ్యర్థి (వైకాపా), మంత్రి బొత్స సత్యనారాయణ కుటుంబ ఆస్తి ఐదేళ్లలో సుమారు రెండున్నర రెట్లు పెరిగింది. -
రోజాకు రూ. 10.63 కోట్ల ఆస్తులు
వైకాపా అధికారంలోకి వచ్చాక నగరి ఎమ్మెల్యే, మంత్రి రోజా ఆర్థిక స్థితిగతులు మారిపోయాయి. 2019లో ఆమె చరాస్తులు రూ.2.74 కోట్లు. ఇప్పుడు రూ.4.58 కోట్లు. -
రైతు సదస్సు పేరుతో వైకాపా భోజనాలు
పశ్చిమగోదావరి జిల్లా ఆచంటలో రైతు అవగాహన సదస్సు పేరుతో వైకాపా నాయకులు ఎన్నికల నియమావళిని అతిక్రమించారు. -
ఉద్యోగమే ‘సోర్స్..’ పథకాలు ‘అవుట్’
అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకుసమాన పనికి సమాన వేతనం ఇచ్చి వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా చూస్తామని 2019 ఎన్నికల మ్యానిఫెస్టోలో జగన్ పేర్కొన్నారు. -
గిగ్గోడు వినిపించలేదు
ప్రభుత్వ కొలువులు ఇవ్వరు.. పరిశ్రమల్ని తీసుకురారు.. నైపుణ్య శిక్షణ ఇస్తారా అంటే అదీ లేదు.. దాంతో బతుకు బండి నడవడానికి.. డెలివరీ బాయ్, బైక్ రైడర్ లాంటి పనులు చేస్తూ ‘గిగ్’ కార్మికులుగా మారుతున్నారు యువత. -
దార్శనిక నేత చంద్రబాబు
తెదేపా అధినేత చంద్రబాబు 45 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానాన్ని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు తొమ్మిదేళ్లు, నవ్యాంధ్రకు ఐదేళ్లు కలిసి 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఆయన పరిపాలన సాగిన తీరును కళ్లకు కడుతూ ‘మన చంద్రన్న- అభివృద్ధి, సంక్షేమ విజనరీ’ పేరుతో పార్టీ రాజకీయ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ టీడీ జనార్దన్ పుస్తకం రూపొందించారు. -
జగన్ మాట్లాడుతుంటే జనం వెళ్లిపోయారు
సీఎం జగన్ కాకినాడ గ్రామీణ మండలం అచ్చంపేట కూడలి సమీపంలో నిర్వహించిన మేమంతా సిద్ధం సభలో మొదట్లో కాకినాడ గ్రామీణ అభ్యర్థి కురసాల కన్నబాబు ప్రసంగించారు. -
సిద్ధం సభకు బస్సుల తరలింపు.. ప్రయాణికులకు నరకయాతన
కాకినాడ గ్రామీణంలోని అచ్చంపేట కూడలిలో శుక్రవారం సిద్ధం సభకు పెద్దసంఖ్యలో ఆర్టీసీ బస్సులను తరలించడంతో ప్రయాణికులు నానా అవస్థలు పడ్డారు. -
సామాజికవర్గం పేరుతో మహిళను దూషించిన వైకాపా నేత రాజమోహన్రెడ్డి
‘యానాదోళ్ల అమ్మాయి.. నెత్తిమీద రూపాయి పెడితే 5 పైసల విలువ చేయదు..’ అంటూ వైకాపా నేత, మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్రెడ్డి ఆత్మకూరు ఛైర్పర్సన్ గోపారం వెంకటరమణమ్మను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. -
అన్నదాతలను బలిచేసి.. అస్మదీయులకు ధారపోసి
అరచేతిలో స్వర్గం చూపించడంలో ముఖ్యమంత్రి జగన్ది అందెవేసిన చెయ్యి..! 2019 ఎన్నికలకు ముందు బోలెడు హామీలిచ్చిన ఆయన.. తర్వాత యథావిధిగా వాటిని విస్మరించారు. -
సంక్షేమ పథకాలు ఓట్లు పొందే మార్గాలు కాకూడదు
ప్రభుత్వాలు అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు ఓట్లు సంపాదించే మార్గాలు కాకూడదని యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ రాజనీతిశాస్త్ర విశ్రాంత ఆచార్యులు కొండవీటి చిన్నయసూరి పేర్కొన్నారు. -
తిరుమల శేషాచలం పరిధిలో అగ్నికీలలు
శేషాచలం పరిధిలో తీవ్రమైన ఎండలు, వేడి గాలులతో ఎక్కడికక్కడ అగ్నికీలలు వ్యాపిస్తున్నాయి. శుక్రవారం ఉదయం తిరుమలకు సమీపంలో పెద్దఎత్తున అగ్నికీలలు ఎగిసిపడ్డాయి.
తాజా వార్తలు (Latest News)
-
రివ్యూ: మై డియర్ దొంగ.. అభినవ్ గోమఠం నటించిన సినిమా ఎలా ఉందంటే?
-
ధోనీ ఎంట్రీ ఎఫెక్ట్.. వామ్మో వినికిడి కోల్పోమా..? : లఖ్నవూ స్టార్ వైఫ్
-
‘అవి డ్రోన్లు కాదు.. మాకు ఆటబొమ్మలే’.. ఇజ్రాయెల్ను హేళన చేసిన ఇరాన్
-
మా పేర్లు చెప్పాలని వారిని చిత్రహింసలు పెడుతున్నారు: బొండా ఉమా
-
యాక్టర్ జగన్.. ఎన్నికల లబ్ధికి ఉత్తుత్తి శిబిరాలు
-
కేరళలో ఒక్క ఓటరు కోసం.. అడవిలో 18 కి.మీ. ప్రయాణం