CM KCR: డిమాండ్ ఉన్న పంటల్ని పండించాలి
రైతులు పంట మార్పిడిపై దృష్టిసారించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. వరికి ప్రత్యామ్నాయంగా మార్కెట్లో డిమాండ్ ఉన్న మినుములు, వేరుశనగ, పెసర, శనగ, పత్తి వంటి పంటలు పండించాలని సూచించారు.
రైతులకు ముఖ్యమంత్రి కేసీఆర్ సూచన
విత్తనాలు, ఎరువుల కొరత రానీయబోమని వెల్లడి
వనపర్తి జిల్లా రంగాపూర్ సమీప పొలంలో వేరుశనగ పంటను పరిశీలించి రైతుతో
మాట్లాడుతున్న సీఎం కేసీఆర్. పక్కన మంత్రులు నిరంజన్రెడ్డి, శ్రీనివాస్గౌడ్
ఈనాడు డిజిటల్, మహబూబ్నగర్: రైతులు పంట మార్పిడిపై దృష్టిసారించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. వరికి ప్రత్యామ్నాయంగా మార్కెట్లో డిమాండ్ ఉన్న మినుములు, వేరుశనగ, పెసర, శనగ, పత్తి వంటి పంటలు పండించాలని సూచించారు. విత్తనాలు, ఎరువుల సరఫరాలో ఇబ్బందులు తలెత్తనీయబోమని హామీ ఇచ్చారు. వరి వేసి రైతులు ఇబ్బందులు పడొద్దన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఆరుతడి పంటలపై దృష్టి సారించిందన్నారు. గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డి తండ్రి వెంకట్రామిరెడ్డి ఇటీవల మృతి చెందగా.. ఎమ్మెల్యేను, కుటుంబసభ్యులను పరామర్శించడానికి సీఎం గురువారం రోడ్డు మార్గంలో ఈ పట్టణానికి వచ్చారు. తిరుగు ప్రయాణంలో ఆకస్మికంగా వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం రంగాపూర్, కొత్తకోట మండలం విలియంకొండ వద్ద ఆగారు. రంగాపూర్ వద్ద జాతీయ రహదారికి దగ్గర్లో సాగుచేసిన మినుము, వేరుశెనగ పంట పొలాలను పరిశీలించారు. అక్కడ ఉన్న రైతు మహేశ్వర్రెడ్డితో మాట్లాడారు. ఏ పంట సాగు చేశారు? ధర ఎలా ఉందని అడిగి తెలుసుకున్నారు. ప్రత్యామ్నాయ పంటల్లో భాగంగా మినుము వేశానని, ఎకరాకు 8-12 క్వింటాళ్ల దిగుబడి వచ్చే అవకాశం ఉందని, ఈ పంటతో భూమి కూడా సారవంతమవుతుందని రైతు చెప్పారు. మద్దతు ధర రూ.6,300 ఉండగా.. బయట క్వింటా రూ.7 వేలు పలుకుతుందని తెలిపారు. అనంతరం వేరుశెనగ పంటను సీఎం పరిశీలించి రైతు రాములుతో మాట్లాడారు. క్వింటా ధర ఎంత ఉందని రైతును ప్రశ్నించగా.. మద్దతు ధర క్వింటాకు రూ.5,550 ఉండగా, మార్కెట్లో రూ.7 వేల వరకూ ఉందన్నారు. అనంతరం కొత్తకోట మండలం విలియంకొండ వద్ద ఆగి కల్లాల్లో ఆరబోసిన వరి ధాన్యాన్ని సీఎం పరిశీలించారు. పక్కనే సాగు చేసిన వేరుశెనగ పంటను పరిశీలించారు. మొక్కల్ని పెరికి వేరుశెనగ కాయలను పరిశీలించారు. పంట వివరాల్ని రైతు వెంకటయ్యని అడిగి తెలుసుకున్నారు. అనంతరం స్థానిక తండావాసులు కేసీఆర్తో ఫొటోలు దిగారు.
గద్వాలలో వెంకట్రామిరెడ్డి చిత్రపటం వద్ద నివాళి అర్పిస్తున్న సీఎం కేసీఆర్. పక్కన ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డి
అంతకుముందు గద్వాలలో ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డి తండ్రి వెంకట్రామిరెడ్డి చిత్రపటానికి సీఎం పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఎమ్మెల్యే తల్లి రేవతిదేవిని ఓదార్చారు. సీఎం వెంట మంత్రులు నిరంజన్రెడ్డి, శ్రీనివాస్గౌడ్, ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, ఆల వెంకటేశ్వర్రెడ్డి, చిట్టెం రామ్మోహన్రెడ్డి, అబ్రహాం, జైపాల్యాదవ్, రాజేందర్రెడ్డి, ఎమ్మెల్సీలు గోరటి వెంకన్న, కూచుకుళ్ల దామోదర్రెడ్డి ఉన్నారు.
కాన్వాయ్ను అడ్డుకొనేందుకు బీజేవైఎం ప్రయత్నం..
సీఎం హైదరాబాద్ నుంచి గద్వాల వెళుతున్న సమయంలో మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల వద్ద కాన్వాయ్ను అడ్డుకునేందుకు బీజేవైఎం కార్యకర్తలు ప్రయత్నించారు. పోలీసులు వారిని రోడ్డుపైకి రాకుండా అడ్డుకోగా.. ప్రభుత్వం వెంటనే ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలని కార్యకర్తలు నినాదాలు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారాస నేత ఇంట్లో గోడ గడియారాలు, మద్యం సీసాల పట్టివేత
మంచిర్యాల జిల్లా మందమర్రిలో భారాస పట్టణ సోషల్ మీడియా ఇన్ఛార్జి బెల్లం అశోక్ ఇంట్లో ఓటర్లకు పంపిణీ చేయడానికి నిల్వ చేసిన గోడ గడియారాలు, మద్యం సీసాలను గురువారం ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు పట్టుకున్నారు. -
ట్యాపింగ్ పాపంలో కీలక వికెట్
ఫోన్ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. హైదరాబాద్ టాస్క్ఫోర్స్ డీసీపీగా, ఉద్యోగ విరమణ అనంతరం అక్కడే ఓఎస్డీగా సుదీర్ఘకాలం పనిచేసిన రాధాకిషన్రావును పోలీసులు అరెస్ట్ చేశారు. -
రైతులు, రైతు కూలీలకు రిజర్వేషన్లు కల్పించాలి
‘ఇప్పుడున్న పరిస్థితుల్లో రైతులు, రైతు కూలీల వంటి వర్గాలకు న్యాయం జరగాలంటే వారికి న్యాయవ్యవస్థ సహా వివిధ శాఖల్లో ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలి. -
నీ పేరు బయటికి వస్తుందని సీబీఐ దర్యాప్తు వద్దన్నావా?
‘‘మాజీమంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ను ఎందుకు ఉపసంహరించుకున్నావు? నీ పేరు బయటికి వస్తుందని భయపడ్డావా?’’ అని సీఎం జగన్ను వివేకా కుమార్తె సునీతారెడ్డి నిలదీశారు. -
తిరుమల నడకదారిలో చిరుత కలకలం
అలిపిరి-తిరుమల నడకదారిలో మరోసారి చిరుత సంచారం కలకలం సృష్టించింది. ఈ నెల 25, 26వ తేదీల్లో తెల్లవారుజామున నడకదారికి 150 మీటర్ల దూరంలో చిరుత సంచరించిందని తితిదే అటవీ శాఖ డీఎఫ్వో శ్రీనివాసులు గురువారం వెల్లడించారు. -
హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ మౌసమీ భట్టాచార్య ప్రమాణం
తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ మౌసమీ భట్టాచార్య గురువారం ఉదయం ప్రమాణం చేశారు. మొదటి కోర్టు హాలులో జరిగిన ఈ కార్యక్రమంలో జస్టిస్ మౌసమీ భట్టాచార్యతో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే ప్రమాణం చేయించారు. -
పఫర్ ఫిష్
విశాఖలోని సాగర తీరంలో గురువారం మత్స్యకారుల వలకు విభిన్న తరహా సముద్ర జీవులు చిక్కాయి. -
కొంచెం ఓపిక పట్టండి.. అంతా మంచే జరుగుతుంది
‘సార్.. మాపై చాలా కేసులు పెట్టారు. దీంతో చాలామందికి పాస్పోర్టులు ఆగిపోయాయి. -
హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రవీందర్రెడ్డి
హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా సీనియర్ న్యాయవాది ఎ.రవీందర్రెడ్డి ఎన్నికయ్యారు. గురువారం జరిగిన కార్యవర్గ ఎన్నికల్లో అధ్యక్ష పదవికి రవీందర్రెడ్డి, ఎం.విజయ్కుమార్, చిక్కుడు ప్రభాకర్, ఎ.జగన్ పోటీ పడ్డారు. -
3 రోజుల్లో.. 30 జిల్లాల్లో ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం
రాష్ట్రవ్యాప్తంగా రబీ(యాసంగి) ధాన్యం కొనుగోళ్ల లక్ష్యాలు జిల్లాల వారీగా ఖరారయ్యాయి. అత్యధికంగా నిజామాబాద్ జిల్లాలో 6.24 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయనున్నారు. -
రూ.50 లక్షల వ్యయం.. 5 వేల ఎకరాల సాగు ఖాయం!
తక్కువ వ్యయంతో ఎక్కువ ఆయకట్టు సాగులోకి తేవాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఇలాంటి వాటిని గుర్తించి.. త్వరితగతిన పూర్తి చేయాలని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. -
తగ్గిపోతున్న యువ జనాభా!
దేశ అభివృద్ధిలో కీలకమైన యువ జనాభా దక్షిణాది రాష్ట్రాల్లో రానున్న రోజుల్లో భారీగా తగ్గనుందని తాజా అంతర్జాతీయ నివేదిక ఒకటి పేర్కొంది. -
వేడెక్కిన తెలంగాణ
సూర్యుడి భగభగలతో రాష్ట్రం వేడెక్కింది. అనేక జిల్లాల్లో ఎండవేడికి ప్రజలు అల్లాడుతున్నారు. ప్రధానంగా ఉత్తర తెలంగాణ ఉడుకుతోంది. వారం రోజులుగా 40 డిగ్రీల సెల్సియస్ వద్ద ఉన్న ఉష్ణోగ్రతలు గురువారం నాటికి మరింత పెరిగాయి. -
తెలుగు వర్సిటీ పురస్కారాల ప్రదానం
చిత్రలేఖనం, నృత్యం, సంగీతం, పాత్రికేయం, అవధానం, రచన తదితర ప్రక్రియల్లో విశేష కృషి చేసిన 12 మందికి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 2023 సంవత్సరానికిగాను ప్రతిభా పురస్కారాలు ప్రదానం చేసింది. -
విత్తన లైసెన్సింగ్ విధానంలో మార్పులు
తెలంగాణలో ప్రస్తుతమున్న విత్తన లైసెన్సింగ్ విధానంలో కొన్ని మార్పులు చేయాల్సిన అవసరం ఉందని, విత్తన సరఫరాలో పారదర్శకతకు ఆయా కంపెనీల ప్రతినిధుల సూచనలను పరిశీలిస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. -
రాజన్న క్షేత్రంలో వైభవంగా శివ కల్యాణం
దక్షిణ కాశీగా పేరొందిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని రాజరాజేశ్వరస్వామి ఆలయంలో గురువారం శివ కల్యాణం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. -
బాహు‘మీనం’
వనపర్తి జిల్లా కొత్తకోట మండలం అప్పరాలలో మత్స్యకారుడు పరమేశ్కు చిక్కిన భారీ చేప ఇది. గురువారం ఆయన పామాపురం సమీపంలోని ఊకచెట్టు వాగులో నిర్మించిన చెక్ డ్యామ్లో వేటకు వెళ్లగా.. 10 నుంచి 25 కిలోల బరువున్న చేపలు వలలో చిక్కాయి. -
టెట్పై ఉపాధ్యాయుల్లో గందరగోళం
ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)-2024పై ఉపాధ్యాయుల్లో సందేహాలు నెలకొన్నాయి. వాటిని నివృత్తి చేయాలని ఉపాధ్యాయ సంఘాల నేతలు విద్యాశాఖ ఉన్నతాధికారులను కలిసి విన్నవిస్తున్నారు. -
గురుకులాల్లో భర్తీకాని పోస్టులపై నిర్ణయం తీసుకోండి: హైకోర్టు
గురుకులాల్లో డిగ్రీ, జూనియర్ లెక్చరర్లు, పోస్టు గ్రాడ్యుయేట్, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు, బోధనేతర సిబ్బంది పోస్టులకు ఎంపికైన వారు బాధ్యతలు స్వీకరించకపోవడంతో ఏర్పడిన ఖాళీల్లో పిటిషనర్ల నియామకాన్ని పరిశీలించాలని ప్రభుత్వానికి హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. -
ఇంటర్ కళాశాలలకు మే 31 వరకు సెలవులు
రాష్ట్రంలోని జూనియర్ కళాశాలలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు ప్రకటించింది. ఈ నెల 31 నుంచి మే 31వ తేదీ వరకు సెలవులు ఉంటాయని గురువారం వెల్లడించింది. -
‘సాహితీ’ డబుల్ దందాపై పోలీసుల ఆరా
కార్తికేయ పనోరమ ప్రాజెక్టు పేరిట సాహితీ ఇన్ఫ్రా పాల్పడిన మోసాలపై హైదరాబాద్ సైబర్క్రైం పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
హెన్రిచ్ క్లాసెన్.. సన్రైజర్స్కు భలే దొరికాడు
-
రాజకీయం అంటే ప్రజలకు సేవ చేయడమని ఎన్టీఆర్ నిరూపించారు: చంద్రబాబు
-
సిప్ ప్రారంభిస్తారా ?ఇవి తెలుసుకోండి..
-
సీఎం రేవంత్రెడ్డితో ఎంపీ కె.కేశవరావు భేటీ
-
ఉత్తర్ప్రదేశ్లో హైఅలర్ట్.. గ్యాంగ్స్టర్ ముఖ్తార్ మృతిపై కుటుంబం అనుమానాలు!
-
కాంగ్రెస్కు మళ్లీ షాక్.. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు