Cyber Crime: సర్వర్లో చొరబడి.. దోపిడీకి తెగబడి..
హైదరాబాద్లోని ఏపీ మహేశ్ కో-ఆపరేటివ్ బ్యాంకుపై సైబర్ నేరగాళ్లు పంజా విసిరారు. బంజారాహిల్స్లోని బ్యాంక్ ప్రధాన కార్యాలయంలోని సర్వర్లోకి చొరబడి గంటల వ్యవధిలో రూ.12.90 కోట్ల నగదును కొట్టేశారు.
ఏపీ మహేశ్ కో ఆపరేటివ్ బ్యాంకుపై సైబర్ పంజా
గంటల వ్యవధిలో రూ.12.90 కోట్లు స్వాహా
వేగంగా స్పందించిన పోలీసులు
బదిలీ కాకుండా రూ.2.50 కోట్ల నిలిపివేత
ఈనాడు, హైదరాబాద్: హైదరాబాద్లోని ఏపీ మహేశ్ కో-ఆపరేటివ్ బ్యాంకుపై సైబర్ నేరగాళ్లు పంజా విసిరారు. బంజారాహిల్స్లోని బ్యాంక్ ప్రధాన కార్యాలయంలోని సర్వర్లోకి చొరబడి గంటల వ్యవధిలో రూ.12.90 కోట్ల నగదును కొట్టేశారు. ముగ్గురి ఖాతాల్లోకి ఆ నగదును బదిలీచేసి.. అక్కడి నుంచి దిల్లీ, బిహార్, ఈశాన్య రాష్ట్రాల్లోని వేర్వేరు జాతీయ, కార్పొరేట్ బ్యాంకుల్లోని 128 ఖాతాలకు జమ చేశారు.
నగదు నిల్వలు తగ్గినట్లు గుర్తించిన మహేశ్ బ్యాంకు ప్రతినిధులు ఆదివారం రాత్రి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు వేగంగా స్పందించి ఫిర్యాదు నమోదు చేసి కార్పొరేటు, జాతీయ బ్యాంకుల ఐటీ విభాగాలను అప్రమత్తం చేశారు. రూ.2.50కోట్ల నగదును విత్డ్రా చేసుకోకుండా స్తంభింపజేశారు. నేరశైలిని బట్టి నైజీరియన్లే ఈ పని చేసుంటారని అధికారులు తెలిపారు. శనివారం రాత్రి నుంచి ఆదివారం సాయంత్రం వరకూ 16గంటల్లో నేరస్థులు ఇదంతా చేశారని ప్రాథమిక సమాచారం సేకరించారు.
ఫిర్యాదు వచ్చిన వెంటనే స్పందించి..
నగదు నిల్వలు తగ్గినట్లు ఏపీ మహేశ్ బ్యాంక్ ప్రతినిధులు ఆదివారం రాత్రి పోలీస్ ఉన్నతాధికారులకు సమాచారమివ్వగా రాత్రి 11 గంటలకు ఎస్సై మదన్ ఠాణాకు చేరుకున్నారు. బ్యాంకు వివరాలన్నీ సేకరించి రాత్రి వేళల్లోనూ పనిచేస్తున్న వేర్వేరు ఐటీ విభాగాలకు సమాచారం పంపి నగదు నిల్వలను స్తంభింపజేయాలని కోరారు. రూ.12.90 కోట్లు వెళ్లిన బ్యాంక్ ఖాతాల వివరాలను సేకరించి హైదరాబాద్ నుంచి అక్కడికి వెళ్లిన బ్యాంక్ ఖాతాల ఐపీ చిరునామాల ఆధారంగా ఆయా బ్యాంకుల ఉన్నతాధికారులకు సమాచారమిచ్చి నగదు బదిలీ ఆపాలంటూ కోరారు. రూ.2.50కోట్లు విత్డ్రా కాకుండా ఆపారు.
పక్కా ప్రణాళికతో..
బ్యాంక్లో నగదు కొల్లగొట్టింది ఒక్కడేనని సైబర్ క్రైమ్ పోలీసులు భావిస్తున్నారు. నేరస్థుడు బ్యాంక్ సర్వర్లోకి ప్రవేశించి హ్యాక్ చేయడం ద్వారా రూ.12.90 కోట్లు స్వాహా చేసేంతవరకూ పక్కా ప్రణాళికతో వ్యవహరించాడని తెలుసుకున్నారు. నాలుగో శనివారం, ఆదివారం బ్యాంక్కు సెలవు కావడంతో అధికారులు పెద్దగా పట్టించుకోరన్న అంచనాతో శనివారాన్ని ఎంచుకున్నాడని గుర్తించారు. బ్యాంకు ఆర్థిక లావాదేవీలు, పొదుపు, కరెంట్ ఖాతాల వివరాలు, నగదు బదిలీకి అవసరమైన సాంకేతికతను సమకూర్చుకున్నాడని తేల్చారు.
గరిష్ఠ పరిమితిని రూ.50 కోట్లకు మార్చేసి..
బ్యాంక్ ప్రధాన సర్వర్లో కొన్ని అంశాలను సైబర్ నేరస్థుడు తెలుసుకున్నాడు. డబ్బు కొట్టేసేందుకు వ్యవస్థలను ఇష్టారాజ్యంగా మార్చుకున్నాడు.
* మహేశ్ బ్యాంక్ ఖాతాదారుల్లో ముగ్గురిని సైబర్ నేరస్థుడు ఎంచుకున్నాడు. వీరిలో ఒకరు మహిళ. ఆమెది సేవింగ్స్ ఖాతా కాగా మరో ఇద్దరికి కరెంట్ ఖాతాలున్నాయి. ముందుగా ఈ ముగ్గురి ఖాతాల్లోకి ప్రధాన సర్వర్లోంచి రూ.12.90 కోట్ల బదిలీకినెట్ బ్యాంకింగ్ గరిష్ఠ పరిమితిని రూ.50 కోట్ల వరకు మార్చేశాడు.
* ముగ్గురి ఖాతాల్లోకి నగదు జమకాగానే సంక్షిప్త సందేశాల వ్యవస్థలోకీ చొరబడి వారినంబర్లను మార్చేశాడు.
* అనుకున్న మొత్తాన్ని మూడు ఖాతాల్లోకి జమ చేసుకున్నాక. నెట్ బ్యాంకింగ్ ద్వారా రోజుకు జరిపే లావాదేవీల సంఖ్యను మార్చేశాడు. అనంతరం మూడు ఖాతాల్లోంచి దిల్లీ, ఝార్ఖండ్, బిహార్, అస్సాం, మణిపూర్, నాగాలాండ్ రాష్ట్రాల్లోని వేర్వేరు బ్యాంకుల్లోని ఖాతాలకు రూ.12.90 కోట్ల నగదును జమ చేశాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిజం చెబితే.. గురువులకు నోటీసులు!
‘ఎప్పుడూ సత్యమే పలకాలని’ పిల్లలకు చెప్పే ఉపాధ్యాయులు.. తాము నిజం చెబితే షోకాజ్ నోటీసులు అందుకోవలసి వస్తోంది. వైకాపాతో అంటకాగుతున్న పాఠశాల విద్యాశాఖలోని ఓ ఉన్నతాధికారి బరితెగించి వ్యవహరిస్తున్నారు. -
కొత్తవారొచ్చారు
ఆంధ్రప్రదేశ్ నిఘా విభాగాధిపతిగా సీనియర్ ఐపీఎస్ అధికారి కుమార్ విశ్వజిత్ను, విజయవాడ నగర పోలీసు కమిషనర్గా పీహెచ్డీ రామకృష్ణను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. -
ప్రజా రక్షకులు కారు.. వైకాపా సేవకులు!
ఖాకీలంటే... ప్రజారక్షణకు రాఖీలు... కానీ జగన్ హయాంలో కొందరు... వైకాపా పోకిరీలుగా మారి... అధికార పార్టీకి చాకిరీ చేశారు. స్వతంత్రంగా నిష్పాక్షికంగా వ్యవహరిస్తూ- ప్రజల ప్రాణాలు, ఆస్తిపాస్తులు, వారి హక్కులు, గౌరవమర్యాదలను కాపాడటం పోలీసుల విధ్యుక్త ధర్మం. -
యథా రాజ... తథా విద్య!
విద్య లేని వాడు వింత పశువు... మరి విద్యా వ్యవస్థను సర్వనాశనం చేసేవారిని ఏమనాలి? పాఠశాల విద్యార్థులను బైజూస్,బకలారియేట్ విధానాలతో కలవరపెట్టి.. స్కూళ్లలో ఉపాధ్యాయుల ఉనికే లేకుండా చేసి... ఎయిడెడ్ పాఠశాలలను బెదిరించి...మూయించి... ఇంటర్ విద్యార్థులకిచ్చే ఉచిత పుస్తకాల పంపిణీ రద్దు చేసి.. ఇంటర్న్షిప్ పేరుతో డిగ్రీ విద్యార్థులతో రొయ్యలు ఒలిపించి.. పీజీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ రద్దు చేసి.. విశ్వవిద్యాలయాలను రాజకీయ కార్యకలాపాలకు బలిచేసి... చదువుకోవాలనుకునే వారిని పక్కరాష్ట్రాలకు వలస పంపించింది అక్షరాలా... జగన్ సర్కారే! -
‘కోడ్’ కొండెక్కుతోంది?
ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26న ‘ఎచీవర్స్ డే’ పేరుతో భారీ సమావేశం నిర్వహిస్తుండటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
ఐఏఎస్ అధికారి గుల్జార్పై నిప్పులు చెరిగిన హైకోర్టు
ఓ వ్యక్తికి కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇచ్చే విషయంలో హైకోర్టు ఆదేశాలకు భిన్నంగా ఉత్తర్వులిచ్చిన ఐఏఎస్ అధికారి, ఆర్థికశాఖ పూర్వ ముఖ్య కార్యదర్శి ఎన్.గుల్జార్పై హైకోర్టు నిప్పులు చెరిగింది. -
తెలుగు మాధ్యమంలో ఉత్తీర్ణత ఉద్దేశపూర్వకంగానే తగ్గిస్తున్నారా?
రాష్ట్ర ప్రభుత్వం 2019 నుంచి తెలుగు మాధ్యమాన్ని పూర్తిగా రద్దు చేయాలని కంకణం కట్టుకుందని సామాజిక కార్యకర్త డాక్టర్ గుంటుపల్లి శ్రీనివాస్ ఆందోళన వ్యక్తం చేశారు. -
భారీ యంత్రాలతో ఇసుక తోడేద్దాం..
రాష్ట్రంలో ‘ముఖ్య’ నేత సోదరుడి కనుసన్నల్లో సాగుతున్న ఇసుక దోపిడీని మరింత భారీ స్థాయిలో చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. -
స్వగ్రామాల్లో జీవనం సాగించేలా పిటిషనర్లకు రక్షణ కల్పించండి
రాజకీయ కక్షతో తమను గ్రామాల నుంచి తరిమేసిన వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన అనుచరుల నుంచి రక్షణ కల్పించేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యాలపై హైకోర్టు స్పందించింది. -
అవినీతి ‘ప్రసాద’ం.. దందాల ‘రాజ’సం!
ఇసుకలో కోట్లాది రూపాయల సారం.. ఇళ్ల పట్టాల్లోనూ నిబంధనల పేరిట బేరం.. కాగితాలకు దొరకని వ్యాపారం.. బినామీలు, అనుచరులతోనే వ్యవహారం.. వంతెన మార్గాన్నే మార్చి భూముల పందేరం.. కొవిడ్ విరాళాల్లో స్వాహాకారం.. మొత్తంగా.. ఆ గోదారి తీరం.. అక్కడి ప్రజాప్రతినిధికి వేయాలి అవినీతి హారం.. వెరసి పేదలు, సామాన్యుల హాహాకారం.. -
పేరుకే పెంపు.. ఊకదంపు
పేదలే నా ప్రాణం... వారి ఆయురారోగ్యాలే నా ధ్యేయం... ఆరోగ్యశ్రీ వారి కోసమేనంటూ... జగన్ తన ప్రసంగాల్లో ఊదరగొడుతున్నారు... వాస్తవంగా చూస్తే పథకానికే అనారోగ్యమొచ్చింది... ప్రచారం చేసుకుంటున్నంత గొప్పతనమేమీ లేదు! ప్రభుత్వ ఉద్యోగులను పట్టించుకోవడమే లేదు!! -
హీరో ఎవరు? విలన్ ఎవరు?
‘మనమంతా సినిమాకు పోతాం. ఆ సినిమాలో హీరో ఎందుకు నచ్చుతాడో, విలన్ ఎందుకు నచ్చడో అందరూ ఆలోచించాలి. -
ఓటమి ‘కాసు‘క్కూర్చుంది!
ఈ అయిదేళ్లలో గురజాల పట్టణంలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏమీ లేదు. ఈ రోడ్లు కూడా గత ప్రభుత్వంలో వేసినవే. అందువల్లే ఈసారి ఇక్కడ మార్పు కావాలనుకుంటున్నాం. -
నిఘా విభాగాధిపతి పోస్టుకు సంజయ్ పేరు ఎలా ప్రతిపాదిస్తారు?
నిఘా విభాగాధిపతి పోస్టు కోసం ముగ్గురు అధికారుల పేర్లతో పంపిన ప్యానల్ జాబితాలో సీఐడీ విభాగాధిపతి ఎన్.సంజయ్ పేరును.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.ఎస్.జవహర్రెడ్డి చేర్చడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
పండుటాకులపై పగ.. ఇది జగన్ మార్కు దగా.. అ‘విశ్రాంత’ ఆవేదన
బాధ్యతల బరువును మోసి... జీవితమంతా ఎన్నో శ్రమలకోర్చి... ఇక హాయిగా ఉందామనుకున్న విశ్రాంత ఉద్యోగుల బతుకుల్లో జగన్ రేపిన కల్లోలం అంతా ఇంతా కాదు... ఐఆర్, డీఆర్లకు గండికొట్టి... క్వాంటం పెన్షన్లలో కొర్రీ పెట్టి... వచ్చే ఆ నాలుగు రూపాయలనూ సమయానికి రాకుండా చేసి...వారిని రోడ్డున పడేశారు. చివరకు వారూ ధర్నాలు చేసే పరిస్థితి తెచ్చారు. -
ఫాం-12 సమర్పించినా రశీదు ఇవ్వడం లేదు
ఎన్నికల విధుల్లో భాగస్వాములయ్యే ఉద్యోగుల పోస్టల్ బ్యాలట్లపై ఉద్యోగులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పోస్టల్ బ్యాలట్ ఫాం-12 సమర్పించినా కొన్ని చోట్ల రశీదులు ఇవ్వడం లేదు. -
నేడు 54 మండలాల్లో తీవ్ర వడగాలులు
రాష్ట్రంలో ఎండ తీవ్రత క్రమంగా పెరుగుతోంది. బుధవారం 69 మండలాల్లో తీవ్ర వడగాలులు, 105 మండలాల్లో వడగాలులు వీచాయి. -
గిరిజన మహిళలను దూషిస్తే కేసు నమోదు చేయరా?
‘‘యానాదోళ్ల అమ్మాయి తెదేపాలో చేరారు. ఆమె నెత్తిన రూపాయి పెడితే ఐదు పైసలు విలువ చేయరు. గతంలో వాలంటీరుగా ఉంటే.. గౌతమ్బాబు ఆత్మకూరు ఛైర్పర్సన్గా చేశారు. -
చెల్లెమ్మలకు ఏం సమాధానం చెబుతారు జగన్?
‘మీ ఆడబిడ్డలం కొంగు చాచి అడుగుతున్నాం. న్యాయం చేయండి. ఒకవైపు రాజశేఖరరెడ్డి బిడ్డ ఎన్నికల్లో నిలబడింది.. మరోవైపు రాజశేఖరరెడ్డి తమ్ముడు వివేకా హత్య కేసులో నిందితుడు బరిలో ఉన్నారు. -
జగన్.. మరీ ఇంత బరితెగింపా?
నా ఎస్సీలు.. అంటూ నిత్యం మైకు ముందు దళితులపై ప్రేమ ఒలకబోస్తున్నట్లు నటించే జగన్ నిజస్వరూపం ఏమిటో మరోసారి బయటపడింది. -
మహాత్ముడు మన్నించినా.. ప్రజలు క్షమించరు!
ఎన్టీఆర్ జిల్లా నందిగామలో వైకాపా అభ్యర్థి మొండితోక జగన్మోహనరావు నామినేషన్ ర్యాలీ సందర్భంగా బుధవారం ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు హంగామా సృష్టించారు.