దేశంలో కొత్త అలజడి
కొవిడ్ కేసులు తగ్గుముఖం పట్టడంతో ఇప్పుడిప్పుడే కాస్త ఊపిరి పీల్చుకుంటున్న భారత్కు ‘కొత్త కరోనా’ భయం పట్టుకుంది! బ్రిటన్ నుంచి తాజాగా మన దేశానికి చేరుకున్న విమాన ప్రయాణికుల్లో కనీసం 25 మందికి కొవిడ్ పాజిటివ్గా తేలడం ఆందోళన కలిగిస్తోంది.
బ్రిటన్ నుంచి వచ్చిన వారిలో 25 మందికి కరోనా
జన్యు మార్పిడి చెందిన వైరస్ కావొచ్చని ఆందోళన
దిల్లీ: కొవిడ్ కేసులు తగ్గుముఖం పట్టడంతో ఇప్పుడిప్పుడే కాస్త ఊపిరి పీల్చుకుంటున్న భారత్కు ‘కొత్త కరోనా’ భయం పట్టుకుంది! బ్రిటన్ నుంచి తాజాగా మన దేశానికి చేరుకున్న విమాన ప్రయాణికుల్లో కనీసం 25 మందికి కొవిడ్ పాజిటివ్గా తేలడం ఆందోళన కలిగిస్తోంది. వారికి సోకింది జన్యు మార్పిడి చెందిన వైరస్సా.. లేదంటే పాతదేనా అనే సంగతి నిర్ధరించడానికి అయా రాష్ట్రాల నుంచి బాధితుల నమూనాలను పుణెలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ(ఎన్ఐవీ)కి పంపుతున్నారు. సెప్టెంబరు నుంచే కొత్త రకం వైరస్ బ్రిటన్లో ప్రబలుతున్నందున ఇప్పటికే అక్కడి నుంచి వచ్చినవారి ద్వారా మన దేశానికి కొత్త వైరస్ చేరి ఉండొచ్చని భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. లండన్ నుంచి సోమవారం రాత్రి దిల్లీకి ఎయిరిండియా విమానంలో వచ్చిన ప్రయాణికుల్లో ఆరుగురు కొవిడ్ బాధితులుగా తేలారు. వాస్తవానికి వారిలో ఐదుగురే దిల్లీలో పాజిటివ్గా నిర్ధారణ అయ్యారు. మరొకరు అక్కడి నుంచి చెన్నైకి చేరుకున్నాక పరీక్ష చేయించుకోగా కరోనా బారిన పడినట్లు స్పష్టమైంది. దేశ రాజధానిలో పాజిటివ్గా తేలినవారి నమూనాలను అధికారులు జాతీయ వ్యాధి నియంత్రణ కేంద్రానికి (ఎన్సీడీసీ) పంపించారు. లండన్ నుంచి కోల్కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఆదివారం రాత్రి చేరుకున్న విమానంలో ఇద్దరు కరోనా బాధితులు ఉన్నట్లు గుర్తించారు. పాజిటివ్గా తేలిన ఇద్దరికి సమీపంలో కూర్చున్న వారిని సంప్రదించేందుకు ప్రయత్నిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
అహ్మదాబాద్లో ఐదుగురికి..
లండన్ నుంచి మంగళవారం ఉదయం అహ్మదాబాద్కు చేరుకున్న ప్రయాణికుల్లో ఐదుగురు కొవిడ్ పాజిటివ్గా తేలారు. వారిలో ఒకరు బ్రిటన్వాసి కావడం గమనార్హం. బాధితులను ఆస్పత్రిలో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. మరోవైపు- బ్రిటన్ నుంచి మూడు విమానాల్లో 590 మంది ప్రయాణికులు మంగళవారం ముంబయికి చేరుకున్నారు. వారిలో 187 మంది ముంబయికి చెందినవారు కాగా.. 167 మంది మహారాష్ట్రలోని ఇతర ప్రాంతాలకు చెందినవారని, మిగిలినవారు ఇతర రాష్ట్రాలకు చెందినవారని అధికారులు తెలిపారు. ఏ ఒక్కరూ పాజిటివ్గా తేలలేదని చెప్పారు.
అమృత్సర్లో ప్రయాణికుల నిరసన
బ్రిటన్ నుంచి 250 మంది ప్రయాణికులు, 22 మంది సిబ్బందితో సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత అమృత్సర్కు చేరుకున్న ఎయిరిండియా విమానంలో 8 మంది కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యారు. వారిలో విమానయాన సిబ్బంది కూడా ఒకరు ఉన్నారు. ఆర్టీ-పీసీఆర్ పరీక్షల నిర్వహణలో తీవ్ర జాప్యం చేస్తున్నారంటూ అమృత్సర్ విమానాశ్రయంలో కొంతమంది ప్రయాణికులు నిరసన వ్యక్తంచేశారు. పరీక్షల కోసం లోపల ప్రయాణికులు వేచి ఉండగా.. వారి బంధువులు, మిత్రులు బయట ఆందోళనతో వేచి చూస్తున్న దృశ్యాలు దేశవ్యాప్తంగా పలు విమానాశ్రయాల వద్ద కనిపించాయి. బుధవారం నుంచి ఈ నెల 31 వరకు భారత్, బ్రిటన్ మధ్య విమాన సర్వీసులన్నింటినీ కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే. అయితే- మంగళవారం అర్ధరాత్రి వరకూ బ్రిటన్ నుంచి ప్రయాణికులు రానుండటంతో పాజిటివ్గా తేలే వారి సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నాయి.
చెన్నై బాధితుడి నమూనాలు ఎన్ఐవీకి
ఈనాడు డిజిటల్, చెన్నై: చెన్నై విమానాశ్రయంలో కొవిడ్ పాజిటివ్గా తేలిన వ్యక్తిని గిండిలోని కింగ్స్ ఆస్పత్రిలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఆయనకు సోకిన వైరస్ కొత్తదో పాతదో తేల్చేందుకుగాను రక్త నమూనాలను పుణెలోని ఎన్ఐవీకి పంపించినట్లు తమిళనాడు ఆరోగ్య శాఖ కార్యదర్శి రాధాకృష్ణన్ తెలిపారు. గత పది రోజుల్లో బ్రిటన్ నుంచి రాష్ట్రానికి 1,088 మంది వచ్చారని వెల్లడించారు. వారందర్నీ గుర్తించి 14 రోజులపాటు క్వారంటైన్లో ఉంచాల్సిందిగా ఆదేశించినట్లు చెప్పారు.
కర్ణాటకలో తల్లీకూతుళ్లకు..
బెంగళూరు (యశ్వంతపుర), న్యూస్టుడే: లండన్ నుంచి బెంగళూరుకు ఈ నెల 19న విమానంలో వచ్చిన 38 మంది ప్రయాణికులకు తాజాగా పరీక్షలు నిర్వహించగా ఇద్దరు పాజిటివ్గా తేలారు. వారిద్దరు తల్లీకూతుళ్లు. తల్లి వయసు 35 ఏళ్లు కాగా, పాప వయసు కేవలం ఆరేళ్లు. వారి రక్త నమూనాలను ఎన్ఐవీకి పంపించినట్లు అధికారులు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వలకు చిక్కిన 30 కిలోల చేప
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని రాజరాజేశ్వర జలాశయంలో నీటి నిల్వ తగ్గడంతో మత్స్యకారుడి వలకు గురువారం భారీ చేప చిక్కింది. -
నిప్పుల గుండంలా తెలంగాణ.. ఆరు జిల్లాల్లో 45 డిగ్రీల కంటే ఎక్కువే..
రాష్ట్రం నిప్పుల గుండంలా మారింది. గురువారం రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం నుంచే ప్రారంభమైన వేడి మధ్యాహ్నానికి తీవ్రస్థాయికి చేరింది. -
ఈపీఎస్ ఆదాయం పెరుగుతున్నా.. కనీస పింఛను రూ.వెయ్యేనా?
ఉద్యోగుల పింఛను నిధి పథకం (ఈపీఎస్) ఆదాయం పెరుగుతున్నా.. లబ్ధిదారులు కనీస పింఛను పెంపునకు నోచుకోక ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు వృద్ధాప్య పింఛను కింద నెలకు రూ.2 వేలు ఇస్తుండగా.. ఈపీఎఫ్వో పింఛనుదారులు దాదాపు 75 శాతం మంది నెలకు రూ.వెయ్యితో జీవితాలను నెట్టుకువస్తుండడం పరిస్థితికి అద్దం పడుతోంది. -
ఏపీ సీఎస్, డీజీపీలపై.. ఈసీఐ నిర్ణయం కోసం చూస్తున్నాం
ఆంధ్రప్రదేశ్లోని సీనియర్ అధికారులపై అందిన ఫిర్యాదులపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) తీసుకునే నిర్ణయం కోసం వేచిచూస్తున్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా చెప్పారు. -
వైకాపాకు ప్రచారం చేసిన వెంకట్రామిరెడ్డిపై ఈసీ వేటు
వైకాపాతో అంటకాగుతూ.. ఆ పార్టీ కార్యకర్తలా వ్యవహరిస్తున్న రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఎట్టకేలకు వేటు పడింది. -
గులకరాయి కేసులో ఏ2 ఎవరు..?
సీఎం జగన్పై గులకరాయి విసిరిన కేసులో విజయవాడ పోలీసులు గురువారం అరెస్టు చూపించారు. అజిత్సింగ్నగర్ వడ్డెర కాలనీకి చెందిన సతీష్ అలియాస్ సత్తిని నిందితుడిగా తేల్చారు. -
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
పెద్దపులిని చూస్తే అడవిలో జంతువులు హడలిపోతాయి. ఒక్క ఎలుగుబంటి తప్ప. భల్లూకానికి కోపం వస్తే పెద్దపులిని సైతం పరుగులు పెట్టిస్తుంది. -
ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్రాజ్ తెలిపారు. -
ఆ 106 ఎకరాలు రక్షిత అటవీభూమే
భూపాలపల్లి జిల్లా కేంద్రం సమీపంలోని కొంపెల్లి గ్రామ పరిధిలోని సర్వే నం.171/3 నుంచి 171/7ల్లో ఉన్న రూ.వందల కోట్ల విలువైన 106.34 ఎకరాలు అటవీభూమేనని, అది ప్రైవేటు వ్యక్తులది కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
రూ.800 కోట్ల బియ్యం ఏమయ్యాయి?
రైస్మిల్లులకు వెళ్లిన ధాన్యం కస్టమ్ మిల్లింగ్(సీఎంఆర్) తర్వాత తిరిగిరావడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. అనేక వాయిదాలు ఇచ్చినప్పటికీ పలు జిల్లాల్లో మిల్లర్లు బియ్యం ఇవ్వలేకపోతున్నారు. -
జర్మనీలో ఘనంగా హిందూ నూతన సంవత్సర వేడుకలు
హిందూ నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని జర్మనీలోని మైంజ్-విస్బాడెన్లో భారత్ వాసి జర్మనీ అసోసియేషన్ ఘనంగా వేడుకలు నిర్వహించింది. -
ఎయిమ్స్లో హీమోడయాలసిస్ యూనిట్ ఏర్పాటు
యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీనగర్ ఎయిమ్స్లో హీమోడయాలసిస్ యూనిట్ను డైరెక్టర్ వికాస్ భాటియా గురువారం ప్రారంభించారు. -
ఇథనాల్ కంపెనీల అనుమతులు రద్దు చేయాలి
పంట పొలాలకు తీవ్ర నష్టం కలిగిస్తూ పర్యావరణ విధ్వంసానికి కారణమవుతున్న 28 ఇథనాల్ కంపెనీల అనుమతులను వెంటనే రద్దు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రొఫెసర్ హరగోపాల్ డిమాండ్ చేశారు. -
జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ 30కి వాయిదా
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అక్రమాస్తుల వ్యవహారంలో సీబీఐ నమోదు చేసిన 11 కేసులతోపాటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నమోదు చేసిన 9 కేసుల విచారణను హైదరాబాద్ సీబీఐ కోర్టు ఈ నెల 30వ తేదీకి వాయిదా వేసింది. -
ఓటేద్దాం.. పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేసుకుందాం
దేశంలోని పర్యాటక ప్రాంతాల్లో వివిధ సౌకర్యాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం ‘దేఖో అప్నాదేశ్ పీపుల్ ఛాయిస్’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. -
మంచి పుస్తకం మనో వికాసం
తెలుగు బాల సాహిత్య ప్రచురణలో ‘మంచి పుస్తకం’ది ఒక ప్రత్యేక ఒరవడి. డిజిటల్ యుగంలోనూ ఆ సంస్థది చెరగని సంతకం. -
శ్రీవారి ఆలయంలో ఘనంగా శ్రీరామపట్టాభిషేకం
శ్రీవారి ఆలయంలో గురువారం రాత్రి శ్రీరామపట్టాభిషేకం ఘనంగా జరిగింది. సాయంత్రం 4నుంచి శ్రీ సీతారామలక్ష్మణ ఆంజనేయ స్వామివారి ఉత్సవమూర్తులకు విశేష సమర్పణ.. సహస్ర దీపాలంకారణ సేవ చేశారు. -
కనుమరుగవుతున్నా.. కనిపిస్తూనే ఉండాలని..!
డీజిల్ రైలు ఇంజిన్లు కనుమరుగవుతున్న నేపథ్యంలో.. ఎప్పటికీ అందరికీ గుర్తుండిపోయేలా కాజీపేట డీజిల్ లోకోషెడ్ కార్మికులు ఓ వారసత్వపు డీజిల్ రైలు ఇంజిన్ను రూపొందించారు. -
మావోయిస్టుల ఏరివేతలో సింగం
ఏ పోలీసుకైనా తన సర్వీసులో ఒకసారి రాష్ట్రపతి శౌర్య పురస్కారం అందుకోవడమే గొప్ప. అలాంటిది 17 ఏళ్ల తన సర్వీసులో ఆయన ఏకంగా ఆరుసార్లు ఆ పురస్కారాన్ని అందుకున్నారు. -
ముగిసిన సిరిపెల్లి ప్రస్థానం..
జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన మావోయిస్టు నేత సిరిపెల్లి శంకర్రావు అలియాస్ సుధాకర్ అలియాస్ మురళి, ఆయన భార్య దాశేశ్వర్ అలియాస్ సుమన అలియాస్ రంజితల విప్లవ ప్రస్థానం ముగిసింది. -
ఆసుపత్రికి మంత్రి కోమటిరెడ్డి 32 ఏసీల వితరణ
నల్గొండ జిల్లా ఆసుపత్రిలోని మాతాశిశు ఆరోగ్య కేంద్రం(ఎంసీహెచ్)లో 32 ఏసీలు ఏర్పాటు చేయించి మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఉదారత చాటుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
20లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నాది: చంద్రబాబు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం
-
హైదరాబాద్ శివారులో వర్ష బీభత్సం.. శ్రీశైలం హైవేపై ట్రాఫిక్ జామ్
-
‘విక్రమార్కుడు’, ‘బజరంగీ భాయిజాన్’ సీక్వెల్స్ అప్డేట్.. ఎంతవరకు వచ్చాయంటే!
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!