పంచాయతీలకు పక్కాగా నిధులు
కాంగ్రెస్ పాలనలో పంచాయతీలకు తలసరి గ్రాంటు కింద నాలుగు రూపాయలు ఇస్తే తెలంగాణ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి రూ.650లకుపైగా ఇస్తోంది. ప్రస్తుతం దేశం గర్వపడేలా తెలంగాణలోని సర్పంచులు ఉన్నారు.
సమన్యాయం కోసమే జీవో 60
అది సొమ్ము మళ్లింపు కోసం కాదు
ప్రశ్నోత్తరాలలో సీఎం స్పష్టీకరణ
కాంగ్రెస్ జమానాలో సర్పంచుల బాధలు అనేకమని వ్యాఖ్య
ఇప్పుడు సంతోషంగా ఉన్నారని వెల్లడి
‘‘కాంగ్రెస్ పాలనలో పంచాయతీలకు తలసరి గ్రాంటు కింద నాలుగు రూపాయలు ఇస్తే తెలంగాణ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి రూ.650లకుపైగా ఇస్తోంది. ప్రస్తుతం దేశం గర్వపడేలా తెలంగాణలోని సర్పంచులు ఉన్నారు.’’
ఈనాడు, హైదరాబాద్: పంచాయతీలకు రావాల్సిన నిధులను రాష్ట్ర ఖజానాకు రప్పించి అక్కడి నుంచి ఠంచనుగా నెలవారీగా విడుదల చేస్తున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. సెప్టెంబరు నిధులను కూడా విడుదల చేశామన్నారు. 60వ నంబరు జీవోను ఇచ్చామని.. అది నిధుల మళ్లింపు కోసం కాదన్నారు. పంచాయతీలకు ఇవ్వాల్సిన సీనరేజ్ తదితర నిధులు ఇవ్వటం లేదని, నిధులను మళ్లిస్తున్నారని శుక్రవారం అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో కాంగ్రెస్ సభ్యులు లేవనెత్తారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు సమాధానం చెబుతూ అలాంటిదేమీ లేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ సభ్యులు పలు అంశాలను ప్రస్తావించటంతో ముఖ్యమంత్రి కేసీఆర్ జోక్యం చేసుకుని మాట్లాడారు. ‘‘క్వారీలు, గ్రానైట్తోపాటు వివిధ రూపాల్లో పంచాయతీలకు నిధులు వస్తాయి. అవి అన్ని పంచాయతీలకూ రావు. పట్టణాలకు దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్లు ఎక్కువగా ఉండటంతో వాటికి ఆదాయం వస్తుంది. ఎక్కువ తక్కువలు ఉన్నాయి కాబట్టి అన్ని పంచాయతీల్లో అభివృద్ధిని ఆవిష్కరించేందుకు మాత్రమే ఈ నిర్ణయం తీసుకున్నాం. ఇంతకుమునుపు వరకు పంచాయతీలు మురికి కూపాలుగా ఉన్నాయి. ప్రస్తుతం అవి అభివృద్ధితో ముందుకు సాగుతున్నాయి. అసెంబ్లీలో సుదీర్ఘంగా చర్చించి చేసిన చట్టానికి లోబడే ఉత్తర్వులు జారీ చేశాం. నిధుల మళ్లింపు అన్నది సత్యదూరం. అవాస్తవం.
అది వారి అవగాహనా రాహిత్యం
కేంద్రం నిధులు ఇవ్వటం అన్నది రాష్ట్రాలకు రాజ్యాంగం కల్పించిన హక్కు. 15వ ఆర్థిక సంఘం చేసిన సిఫార్సుల మేరకు రాష్ట్రాలకు రావాల్సిందే. కేంద్ర దయాదాక్షిణ్యం కాదు. కొందరు సభ్యులు అవగాహనారాహిత్యంతో మాట్లాడుతున్నారు. ప్రభుత్వం ఎందుకు గొంతు నొక్కుతుంది? ప్రజలు అన్ని విషయాలను గమనిస్తున్నారు. మీ(కాంగ్రెస్) జమానాలో సర్పంచులు బాధపడిన మాట వాస్తవం. మీ హయాంలో చెల్లించాల్సిన కరెంటు బిల్లులు ఇంకా రూ.రెండు వేల కోట్లు పెండింగులో ఉన్నాయి. ప్రధాన మంత్రి, కేంద్ర మంత్రులు సైతం రాష్ట్ర విధానాలను ప్రశంసిస్తున్నారు. కరోనా సమయంలో మంత్రులు, ఎమ్మెల్యేల జీతాలు ఆపైనా పంచాయతీలకు నిధులు విడుదల చేయాలని అధికారులకు స్పష్టం చేశాను. గ్రామాల్లో ప్రజలు మరణిస్తే అంత్యక్రియలు చేసేందుకు మీ ప్రభుత్వ హయాంలో స్థలం కూడా చూపించలేకపోయారు. మా ప్రభుత్వం ప్రతి గ్రామంలో వైకుంఠధామాన్ని ఏర్పాటు చేసింది. రండి.. రేపే వెళదాం. అన్ని పార్టీల వారితో సభా కమిటీని వేద్దాం. ప్రతిపక్ష పార్టీల సభ్యులు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లోనే చూద్దాం. సర్పంచులు ఆగమయ్యారని చెబుతున్నారు. ఎక్కడో చెప్పండి. అవగాహన లేకుండా మాట్లాడితే ఎలా’’ అని కేసీఆర్ ప్రశ్నించారు. ప్రస్తుతం పల్లె, పట్టణ ప్రగతిపై సభలో సుదీర్ఘంగా చర్చించేందుకు అనుమతి ఇవ్వాలని స్పీకర్ను సీఎం కోరారు.
అది చట్టంలో లేదు
‘‘ఏకగ్రీవంగా ఎన్నికైన పంచాయతీలకు ప్రోత్సాహక నిధులు ఇస్తామని మా పార్టీ ఎక్కడా చెప్పలేదు. అసలు అది నూతన పంచాయతీరాజ్ చట్టంలో లేదు. గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని యూపీఏ ప్రభుత్వమే తెచ్చింది. కానీ పంచాయతీల్లో సర్పంచులను కాదని కాంగ్రెస్ నాడు సమాంతర వ్యవస్థను ఏర్పాటు చేసింది. మా ప్రభుత్వం దాన్ని పూర్తిగా తీసేసింది. సర్పంచులకు సర్వ స్వేచ్ఛ ఇచ్చింది’’ అని ముఖ్యమంత్రి వివరించారు.
ఎందుకంత ఉలికిపాటు?
‘బిల్లులు రాక సర్పంచులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని గ్రానైట్, క్వారీలు, రిజిస్ట్రేషన్ల ద్వారా వచ్చే ఆదాయంలో పంచాయతీలకు రావాల్సిన వాటాను ఇవ్వకపోవటంతో పంచాయతీల్లో అభివృద్ధి కుంటుపడుతోంది’ అని కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క మాట్లాడారు. సభ్యుల నుంచి అభ్యంతరం వ్యక్తమైతే ప్రభుత్వానికి ఎందుకంత ఉలికిపాటు అని ప్రశ్నించారు.పంచాయతీల నిధులను మళ్లించటం ద్వారా ప్రభుత్వం ఆ నిధులపై పెత్తనం చెలాయిస్తోందని శ్రీధర్ బాబు మాట్లాడారు.
ఏకగ్రీవ పంచాయతీలకు నిధులేవి?: భట్టి విక్రమార్క
‘ఏకగ్రీవ పంచాయతీలకు నిధులు ఇస్తామని ప్రకటించారు. ఇంత వరకు ఇచ్చిన దాఖలాలు లేవు. రూ.193 కోట్లు ఇవ్వాల్సి ఉంది. సిబ్బంది కొరత కూడా ఉంది. నిధుల మళ్లింపు సరికాదు. ఉపాధి హామీ కింద కేంద్రం ఇస్తున్న నిధులను కూడా రాష్ట్రం పంచాయతీలకు ఇవ్వటం లేదు. సీతక్క వినియోగించిన భాష బాగోలేదని స్పీకర్ అన్నారు. పార్లమెంటరీ భాషనే ఆమె వినియోగించారు. స్పీకర్ అలా అనటం బాధించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రెండు రాష్ట్రాలు.. రెండు ఓట్లు!
సాధారణంగా ఓటరు ఒక్కసారే ఓటు వేయాల్సి ఉంటుంది. ఎన్నికల కమిషన్(ఈసీ) కూడా అదే చెబుతుంది. -
సమస్య ఓ చోట.. సమర్పించేది మరోచోట.. పాస్పోర్టు దరఖాస్తుదారుల్లో గందరగోళం
ధ్రువపత్రాల సమర్పణలో పొరపాట్లతో తిరస్కరణకు గురైన పాస్పోర్టు దరఖాస్తుదారుల్లో గందరగోళం నెలకొంటోంది. పాస్పోర్టు సేవాకేంద్రాల్లో సమర్పించాల్సిన ధ్రువపత్రాలను రీజనల్ సేవా కేంద్రంలో సమర్పిస్తుండడమే దీనికి కారణం -
50 ఏళ్ల తరువాత.. నవమి రోజున సీతారాముల కల్యాణం
దేశంలోని ప్రధాన రామాలయాల్లో ఏటా శ్రీరాముడి జన్మ నక్షత్రమైన పునర్వసు (శ్రీరామ నవమి) శుభ ఘడియల్లో సీతారాముల కల్యాణం నిర్వహిస్తారు. -
సీతమ్మను మనువాడె భద్రాద్రి రామయ్య
భద్రాచలంలో శ్రీ సీతారామచంద్రస్వామి వార్షిక కల్యాణోత్సవం అశేష భక్తజనుల జయజయధ్వానాల నడుమ ఆద్యంతం వైభవోపేతంగా సాగింది. -
చెలమల నీళ్లే గొంతు తడుపుతున్నాయ్
రాష్ట్రంలోని ఏజెన్సీ గ్రామాలు, ఆవాసాల్లో తాగునీటి కటకట నెలకొంది. తాగునీటి సరఫరా ప్రాజెక్టుల నిర్మాణం, నిర్వహణలో లోపాలు, ప్రణాళిక లేమితో గిరిజనులకు రక్షిత జలం అందక.. కాలువలు, చెలమల్లోని నీళ్లే దిక్కయ్యాయి. -
సొమ్ము వెనక్కి వచ్చేది ఎప్పుడో?
ఏదన్నా కారణంతో ధరణి సేవలను రద్దు చేసుకున్న వారు అప్పటికే ప్రభుత్వానికి చెల్లించిన రుసుం తిరిగి పొందడానికి అష్ట కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తోంది. -
బంగారం బిస్కెట్లుగా ఆలయాల ఆభరణాలు
రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాలకు భక్తులు సమర్పించిన బంగారం, వెండి ఆభరణాల్లో దేవతామూర్తుల అలం -
కార్టూనిస్ట్ శ్రీధర్ ఆధ్వర్యంలో 21న పెయింటింగ్ వర్క్షాప్
ఔత్సాహిక చిత్రకారుల కోసం వేసవి సెలవుల్లో ఒక ప్రత్యేక వర్క్షాప్ నిర్వహిస్తున్నట్టు శ్రీధర్ ఆర్ట్ ఇన్స్టిట్యూట్ నిర్వాహకులు, ప్రముఖ కార్టూనిస్ట్ శ్రీధర్ తెలిపారు. -
అమరావతిపై ఇంత కక్షా!
అమరావతిపై వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యానికి, కక్ష సాధింపునకు పరాకాష్ఠ ఇది. రాజధానికి శంకుస్థాపన జరిగిన ప్రాంతంలో అమరావతి నమూనాలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. -
గురుకుల విద్యార్థి ప్రశాంత్ మరణానికి బాధ్యులపై తగిన చర్యలు
భువనగిరి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థి ప్రశాంత్ మరణం బాధాకరమని ఆ శాఖ కార్యదర్శి సీతాలక్ష్మి బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. -
పదేళ్ల తర్వాత రాష్ట్ర ప్రభుత్వ వైద్యుల సంఘం ఎన్నికలు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వైద్యుల సంఘం (టీజీడీఏ)ఎన్నికలకు హైకోర్టు అనుమతించిన నేపథ్యంలో ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు ఆ సంఘం కోర్ కమిటీ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొంది. -
విద్యుదుత్పత్తి చేసి.. బయట అమ్ముకోవచ్చు!
దేశంలో విద్యుత్ డిమాండ్ పెరగడంతో గ్యాస్ ఆధారిత విద్యుదుత్పత్తి కేంద్రాలకు కేంద్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. -
శ్రీవారి ఆలయంలో వైభవంగా శ్రీరామనవమి ఆస్థానం
శ్రీవారి ఆలయంలో శ్రీరామనవమి ఆస్థానాన్ని పురస్కరించుకుని శ్రీసీతారామలక్ష్మణ సమేత హనుమంతులవారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనాన్ని బుధవారం వైభవంగా నిర్వహించారు. -
సాగర్లో అత్యవసర మోటార్ల ట్రయల్ రన్ ప్రారంభం
హైదరాబాద్ జంట నగరాలు, నల్గొండ జిల్లా తాగునీటి అవసరాలు తీర్చేందుకు నాగార్జునసాగర్ జలాశయంలో హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బీ (జలమండలి) ఆధ్వర్యాన ఏర్పాటు చేస్తున్న అత్యవసర మోటార్ల ప్రయోగాత్మక పరిశీలన (ట్రయల్ రన్) బుధవారం ప్రారంభమైంది. -
నదుల అనుసంధానంపై దిల్లీలో టాస్క్ఫోర్స్ సమావేశం రేపు
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన నదుల అనుసంధాన ప్రాజెక్టులో భాగంగా గోదావరి-కావేరి లింక్పై శుక్రవారం నదుల అనుసంధాన టాస్క్ఫోర్స్ కమిటీ చర్చించనుంది. -
సమస్య గుర్తించక ముందే మరమ్మతులెలా నిర్ణయిస్తారు..?
మేడిగడ్డ బ్యారేజీ మరమ్మతు పనులను గుత్తేదారులకు అప్పగించేందుకు నీటిపారుదలశాఖ నిర్ణయించినట్లు జరుగుతున్న ప్రచారంపై ప్రభుత్వ పెద్దలు ఆగ్రహంతో ఉన్నట్లు తెలిసింది. -
సివిల్స్ విజేతలకు కేటీఆర్ శుభాకాంక్షలు
సివిల్స్లో విజయం సాధించిన తెలుగు రాష్ట్రాల అభ్యర్థులంతా పూర్తి శక్తి సామర్థ్యాలను వినియోగించి.. దేశ భవిష్యత్ నిర్మాణంలో ప్రధానపాత్ర పోషిస్తారని ఆశిస్తున్నట్లు భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ ఆకాంక్షించారు. -
సివిల్స్లో సత్తా చాటిన తెలుగువారికి చంద్రబాబు అభినందనలు
సివిల్స్కు తెలుగు రాష్ట్రాల నుంచి ఎంపికైన అభ్యర్థులకు తెదేపా అధినేత చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. -
ప్రైవేటు బడుల ఫీ‘జులుం’!
రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేటు, కార్పొరేటు పాఠశాలల్లో రుసుములు ఆకాశాన్నంటుతున్నాయి. ప్లేస్కూల్, ఎల్కేజీ, యూకేజీ, మొదటి తరగతి నుంచి పదో తరగతి వరకు.. డొనేషన్లు, అభివృద్ధి ఛార్జీలు, రుసుములతో పాటు పుస్తకాలు, దుస్తులు, బూట్లు, బెల్టుల పేరిట తల్లిదండ్రుల జేబులకు భారీగా చిల్లులు పెడుతున్నాయి. -
రోజుకు రూ.కోటి ఆదాయం పెరగాలి!
ప్రయాణికుల నుంచి మరింత ఆదాయం రాబట్టుకునేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) సిద్ధమవుతోంది. ఇందుకోసం డీలక్స్, సూపర్లగ్జరీ, ఏసీ బస్సుల సేవలపై దృష్టిపెట్టబోతోంది. -
ద.మ రైల్వేకు రూ.20,339 కోట్ల రికార్డు ఆదాయం
దక్షిణ మధ్య రైల్వే రికార్డు స్థాయిలో ఆదాయాన్ని గడించింది. తొలిసారి రూ.20 వేల కోట్ల మైలురాయిని దాటింది.
తాజా వార్తలు (Latest News)
-
జాబిల్లిపై చైనా ముందే కాలుమోపితే.. అక్రమణలే: నాసా అధిపతి వ్యాఖ్యలు
-
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు.. తొలిరోజు నామినేషన్ వేసిన కీలక నేతలు
-
భారత క్రికెట్లో నీ భాగస్వామ్యం ఏంటి?: హర్షా భోగ్లేపై మాజీ క్రికెటర్ ఆగ్రహం
-
జగన్పై రాయి దాడి కేసు.. ఆ ఆరుగురి వివరాలు తెలపాలంటూ కోర్టులో పిటిషన్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
ప్రపంచంలో బెస్ట్ ఎయిర్పోర్టులివే.. భారత విమానాశ్రయాలు ఏ స్థానంలో..?