Azadi Ka Amrit Mahotsav: హిందుస్థాన్, పాకిస్థాన్, ప్రిన్సిస్థాన్!
భారత్ను విడిచి పెట్టడానికి అతికష్టం మీద అయిష్టంగా అంగీకరించిన బ్రిటన్... చివరి నిమిషం దాకా ఎన్ని కొర్రీలు పెట్టాలో అన్ని పెట్టింది. వాటిలో ఒకటి... ప్రిన్సిస్థాన్ ఏర్పాటు!
భారత్ను విడిచి పెట్టడానికి అతికష్టం మీద అయిష్టంగా అంగీకరించిన బ్రిటన్... చివరి నిమిషం దాకా ఎన్ని కొర్రీలు పెట్టాలో అన్ని పెట్టింది. వాటిలో ఒకటి... ప్రిన్సిస్థాన్ ఏర్పాటు! భారత స్వాతంత్య్రానికి మొదట్నుంచీ మోకాలడ్డిన అప్పటి బ్రిటిష్ ప్రధాని విన్స్టన్ చర్చిల్... చివర్లో ప్రిన్సిస్థాన్ అంటూ కొత్త దేశాన్ని తెరపైకి తెచ్చాడు. విభజన తర్వాత కూడా ‘అక్కడ మనదైన ప్రాంతం’ ఉండాలంటూ మెలికపెట్టాడు.
భారత్లో బ్రిటిష్ పాలనలో భాగంగానే అనేక ప్రాంతాలు సంస్థానాధీశుల చేతుల్లో ఉండేవి. వారు ఆంగ్లేయులకు కప్పం కడుతూ... తమతమ ప్రాంతాలపై పెత్తనం చెలాయించేవారు. ఇలా భారత్ వ్యాప్తంగా చిన్నాపెద్దా అన్నీ కలిపి దాదాపు 565 సంస్థానాలు కొనసాగాయి. ‘విభజించు పాలించు’ సిద్ధాంతంలో భాగంగా... ఆంగ్లేయులు వీరందరినీ తమ పావులుగా వాడుకునేవారు. ప్రపంచయుద్ధాల సందర్భంగా సంస్థానాధీశుల్లో కొంతమందిని ఇంపీరియల్ వార్ కౌన్సిల్లో సభ్యులుగా చేర్చుకుంది బ్రిటిష్ ప్రభుత్వం. రౌండ్ టేబుల్ సమావేశాల్లోనూ వీరికి ప్రాతినిధ్యం కల్పించింది. యుద్ధాల్లో బ్రిటన్ తరఫున పోరాడటానికి సైనికులను పంపించేవారు ఈ సంస్థానాధీశులు. జాతీయోద్యమం తీవ్రమైన నేపథ్యంలో... భారత్ విషయంలో తమను సంప్రదించకుండా ఏ నిర్ణయం తీసుకోవద్దని వీరంతా బ్రిటిష్ ప్రభుత్వానికి స్పష్టం చేశారు. తెల్లవారికీ కావల్సింది అదే!
మాంటెగో ఛెమ్స్ఫోర్డ్ సంస్కరణల అనంతరం ...సంస్థానాధీశుల సంఘంగా... ఛాంబర్ ఆఫ్ ప్రిన్సెస్ ఏర్పాటైంది. వీరికి కొత్త దిల్లీలో లెజిస్లేటివ్ (ప్రస్తుత పార్లమెంటు) భవనంలో ఓ ప్రత్యేక సమావేశ మందిరాన్ని ఇచ్చారు. ఏటా ఒకసారి సమావేశమై తమ సంస్థానాలకు సంబంధించిన విషయాలను, బ్రిటిష్ ప్రభుత్వానికి చేయాల్సిన విజ్ఞప్తులను చర్చించేవారు. సుమారు 565 సంస్థానాధీశులకుగాను 120 మంది మాత్రమే ఇందులో సభ్యులుగా చేరారు. కీలకమైన హైదరాబాద్, బరోడా, ట్రావెన్కోర్లాంటివి దీనికి దూరంగా ఉన్నాయి. నేరుగా బ్రిటిష్ ప్రభుత్వంతో తమకున్న సంబంధాల నేపథ్యంలో... వారు ఈ ఛాంబర్కు అంతగా ప్రాధాన్యం ఇచ్చేవారు కాదు. మొత్తానికలా... సంస్థానాధీశులకు ప్రత్యేక గౌరవం ఇస్తూ తమ చెప్పుచేతల్లో ఉంచుకుంది బ్రిటిష్ సర్కారు. భారత్కు స్వయంప్రతిపత్తి ఇచ్చినా, స్వాతంత్య్రం ప్రకటించినా ... ఎలాంటి నిర్ణయం తీసుకున్నా సంస్థానాల హక్కులకు భంగం కలగకుండా చూస్తామని హామీ ఇస్తూ వచ్చింది.
రెండో ప్రపంచ యుద్ధానంతరం... తప్పనిసరి పరిస్థితుల్లో భారత్కు స్వాతంత్య్రం ఇవ్వాల్సిన తరుణం రాగానే బ్రిటన్... ముఖ్యంగా చర్చిల్ కొత్త పావులు కదిపాడు. దేశాన్ని విడిచిపెట్టినా... ఇక్కడింకా తమకు భాగస్వామ్యం ఉండాలని ఎత్తుగడ వేశాడు. అప్పటి భారత వైస్రాయ్ లార్డ్ వేవెల్్ ద్వారా దీన్ని సాధించేందుకు ప్రయత్నించారు. ‘భారత్లో కొంత భాగాన్ని మనకోసం ఉంచు’ అంటూ వేవెల్కు చర్చిల్ సందేశం పంపించాడు. స్వాతంత్య్రానంతరం భారత్, పాకిస్థాన్లతో పాటు కొన్ని సంస్థానాలతో కూడిన ప్రిన్సిస్థాన్ను ఏర్పాటు చేద్దామని చర్చిల్ ప్రతిపాదించాడు. రెండు దేశాల్లోనూ చేరటానికి ఇష్టంలేని సంస్థానాధీశుల సాయంతో దీన్ని సాకారం చేయాలనుకున్నాడు. వేవెల్ ఆ మేరకు ప్రయత్నాలు మొదలెట్టాడు కూడా. హైదరాబాద్, భోపాల్, జోధ్పూర్, ట్రావెన్కోర్లాంటి కొంతమంది సంస్థానాధీశుల్లో ఆశలు చిగురించాయి.
కానీ దైవం మరోలా తలచింది. బ్రిటన్లో జరిగిన ఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీ పరాజయంపాలైంది. చర్చిల్ గద్దె దిగి... లేబర్పార్టీ అభ్యర్థి అట్లీ ప్రధానిగా అధికారం చేపట్టారు. భారత స్వాతంత్య్రానికి అనుకూలంగా ఉన్న అట్లీ... వెంటనే ఆ దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేశారు. వైస్రాస్గా ఉన్న చర్చిల్ మనిషి వేవెల్ స్థానంలో తన నమ్మకస్థుడైన లార్డ్ మౌంట్బాటెన్ను పంపించారు. దీంతో చర్చిల్ ఎత్తుగడలు బలహీనమయ్యాయి. సర్దార్ వల్లభ్భాయ్ పటేల్ బృందం చకచకా... సంస్థానాధీశులతో సంప్రదింపులు మొదలెట్టడంతో ప్రిన్సిస్థాన్ ప్రతిపాదన అటకెక్కక తప్పలేదు. అంతా సర్దుకున్నాక చర్చిల్ తన మాజీ విదేశాంగ మంత్రి ఆంథోనీ ఎడెన్ ద్వారా పటేల్కు ఓ సందేశం పంపించాడు. ‘‘కొత్త దేశం... కొత్త బాధ్యతలు తీసుకున్న తీరు... ముఖ్యంగా సంస్థానాలు, రాష్ట్రాలతో సంబంధాల విషయంలో సర్దుకున్న తీరు అభినందనీయం. మీ ప్రతిభాపాటవాలు భారత్కే పరిమితం కావొద్దు. ప్రపంచం మొత్తానికి తెలియాల్సిన అవసరం ఉంది’’ అన్నది ఆ సందేశ సారాంశం!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కాన్సాస్లో ఆట పాటలతో సందడిగా ఉగాది వేడుకలు
అమెరికాలోని కాన్సాస్ నగరంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. -
ట్రెక్కింగ్ చేస్తూ జారిపడి.. స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి
స్కాట్లాండ్లోని ఓ పర్యటక ప్రాంతంలో ట్రెక్కింగ్కు వెళ్లిన ఇద్దరు తెలుగు విద్యార్థులు నీటిలోపడి మృతిచెందారు. -
అమెరికాలో వైభవంగా ‘మాటా’ తొలి కన్వెన్షన్
అమెరికాలో ‘మన అమెరికన్ తెలుగు అసోసియేషన్’ (MATA) తొలి కన్వెన్షన్ వేడుకలు అట్టహాసంగా ముగిశాయి . -
వైభవంగా ‘టాగో’ ఉగాది వేడుకలు
ఫ్లోరిడాలోని తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ ఓర్లాండో (టాగో) ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు వైభవంగా జరిగాయి. -
‘తాకా’ ఆధ్వర్యంలో ఘనంగా ‘క్రోధి’ ఉగాది వేడుకలు
‘తెలుగు అలయన్స్ ఆఫ్ కెనడా’ (తాకా) ఆధ్వర్యంలో టొరంటోలోని పెవిలియన్ ఆడిటోరియంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. -
టొరంటోలో వైభవంగా ‘టీసీఏ’ ఉగాది వేడుకలు
తెలంగాణ కెనడా సంఘం (TCA) ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు వైభవంగా జరిగాయి. -
11 దేశాల కవులతో అంతర్జాతీయ వేదికపై ఉగాది కవి సమ్మేళనం
వంశీ అంతర్జాతీయ సాహితీ పీఠం, శ్రీ సాంస్కృతిక కళాసారథి- సింగపూర్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం ‘ఉగాది కవి సమ్మేళనం’ ఘనంగా జరిగింది. -
‘షికాగో తెలుగు అసోసియేషన్’ ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది, శ్రీరామనవమి వేడుకలు
అమెరికా ఇల్లినాయిస్లోని షికాగోలో ‘చికాగో తెలుగు అసోసియేషన్’ ఆధ్వర్యంలో ఉగాది, శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. -
ఘనంగా ‘సింగపూర్ తెలుగు సమాజం’ ఉగాది వేడుకలు
సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో క్రోధి నామ సంవత్సర ఉగాది వేడుకలు వైభవంగా నిర్వహించారు. -
‘‘ఏపీ హితం కోసం ఎన్డీయేకే మా మద్దతు’’
దుబాయిలో వందలమంది తెలుగు వారు కలసి ఉగాది వేడుకలను ఉత్సాహంగా నిర్వహించారు. -
అంతరిక్షంలోకి వెళ్లనున్న తొలి తెలుగువాడు.. గోపీచంద్ తోటకూర
Gopichand Thotakura: అంతరిక్షంలోకి వెళ్లే తొలి తెలుగు వ్యక్తిగా గోపీచంద్ తోటకూర రికార్డు సృష్టించనున్నారు. విజయవాడలో జన్మించిన ఆయనను బ్లూ ఆరిజిన్ సంస్థ ఎన్ఎస్-25 మిషన్లో టూరిస్ట్గా రోదసీలోకి తీసుకెళ్లనుంది. -
యూకే కుటుంబ వీసా కఠినతరం.. వేతన పరిమితి 55% పెంపు
UK Family Visa: యూకే కుటుంబ వీసా నిబంధనలను కఠినతరం చేశారు. దీని కోసం వార్షిక వేతన పరిమితిని ఏకంగా 55శాతం పెంచారు. -
అమెరికాలో అదృశ్యమైన హైదరాబాద్ విద్యార్థి అనుమానాస్పద మృతి
మరో భారత విద్యార్థి అమెరికాలో మృతిచెందాడు. హైదరాబాద్కు చెందిన అబ్దుల్ చనిపోయినట్లు దౌత్యకార్యాలయం ప్రకటించింది. ఈ ఏడాది 11 మంది భారత విద్యార్థులు అమెరికాలో చనిపోయారు. -
ఈ ఎన్నికలు ఏపీకి ఎంతో కీలకం.. మీ సహకారం కావాలి.. ఎన్నారైలతో నారా లోకేష్
-
భద్రాచలం తరహాలో అమెరికాలో రామాలయం
భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానం తరహాలో అమెరికాలోని అట్లాంటా సమీపంలోని కమింగ్ వద్ద రామాలయ నిర్మాణం చేపట్టినట్లు అక్కడ ముఖ్య అర్చకుడిగా వ్యవహరిస్తున్న పద్మనాభాచార్యులు వెల్లడించారు. -
సింగపుర్లో శ్రీ మారియంబికా ఆలయంలో ఘనంగా చండీహోమం
సింగపుర్లోని వాసవీ క్లబ్ మెర్లయన్ ఆధ్వర్యంలో ఆర్యవైశ్యులు అత్యంత పురాతన, విశిష్టమైన శ్రీ మారియంబికా ఆలయంలో చండీహోమం నిర్వహించారు. -
కూటమి గెలిస్తేనే ఏపీకి భవిష్యత్తు.. ఖతార్లో తెదేపా ఆవిర్భావ వేడుకల్లో నేతలు
తెదేపా ఆవిర్భావ వేడుకలు ఖతార్లో ఘనంగా నిర్వహించారు. ఖతార్ తెలుగుదేశం పార్టీ నేతల ఆధ్వర్యంలో ఈ వేడుకలు వైభవంగా నిర్వహించారు. -
ప్రాచీన భారతీయ సాహిత్యం- ఆధునిక విజ్ఞాన వికాసంపై తానా ప్రపంచ సాహిత్యవేదిక సదస్సు
తానా సాహిత్య విభాగం ‘తానా ప్రపంచ సాహిత్యవేదిక’ ఆధ్వర్యంలో ‘ప్రాచీన భారతీయ సాహిత్యం- ఆధునిక విశ్వ విజ్ఞానశాస్త్ర వికాసానికి మూలం’ అనే అంశంపై సదస్సు విజ్ఞానదాయకంగా జరిగింది. -
ఘనంగా క్వాలిటీ ఇంజినీరింగ్ ఫౌండేషన్ (QEF) వెబ్సైట్ ఆవిష్కరణ
ఎలాంటి లాభాపేక్ష లేకుండా స్వచ్ఛమైన సమాజమే లక్ష్యంగా ఆవిర్భవించిన క్వాలిటీ ఇంజినీరింగ్ ఫౌండేషన్ తన వెబ్సైట్ను www.qef.org ఆవిష్కరించింది. నాణ్యమైన సాంకేతిక ప్రయాణంలో దీన్నొక మైలురాయిగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన పలువురు వక్తలు పేర్కొన్నారు. -
ఏపీని ఆదుకునే ఎన్నారైలపై ఇంత అక్కసా?: జయరాం కోమటి
రాష్ట్రానికి మేలు చేసేలా కృషిచేస్తున్న ఎన్నారైలపై వైకాపా నాయకులు బెదిరింపులకు పాల్పడటం అత్యంత దారుణమని ప్రముఖ ప్రవాసాంధ్రుడు, ఎన్నారై తెదేపా అమెరికా సమన్వయకర్త జయరాం కోమటి అన్నారు. -
ఎన్ఆర్ఐ తెదేపా, జనసేన ఆధ్వర్యంలో తెదేపా ఆవిర్భావ వేడుకలు
ఎన్ఆర్ఐ తెదేపా కువైట్, జనసేన కువైట్ సంయుక్త ఆధ్వర్యంలో తెదేపా 42వ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం
-
హైదరాబాద్ శివారులో వర్ష బీభత్సం.. శ్రీశైలం హైవేపై ట్రాఫిక్ జామ్
-
‘విక్రమార్కుడు’, ‘బజరంగీ భాయిజాన్’ సీక్వెల్స్ అప్డేట్.. ఎంతవరకు వచ్చాయంటే!
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై షర్మిలకు ఈసీ నోటీసులు