అలాంటి అవమానం మరెవరికీ జరగకూడదు

ఇతరుల వ్యక్తిత్వాన్ని కించపరిచేలా,  గౌరవానికి భంగం కలిగించేలా ఎవరూ వ్యవహరించకూడదని తెదేపా అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి పేర్కొన్నారు. ఏపీ శాసనసభలో తనకు జరిగిన ఈ అవమానం....

Updated : 27 Nov 2021 05:16 IST

నారా భువనేశ్వరి ఆవేదన

ఈనాడు, అమరావతి: ఇతరుల వ్యక్తిత్వాన్ని కించపరిచేలా, గౌరవానికి భంగం కలిగించేలా ఎవరూ వ్యవహరించకూడదని తెదేపా అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి పేర్కొన్నారు. ఏపీ శాసనసభలో తనకు జరిగిన ఈ అవమానం మరెవరికీ జరగకూడదని ఆకాంక్షించారు. అసెంబ్లీలో తనకు జరిగిన అవమానంపై నిరసన వ్యక్తం చేసిన వారందరికీ పేరు పేరునా ధన్యవాదాలు తెలిపారు. ఎన్టీఆర్‌ మెమోరియల్‌ ట్రస్ట్‌ మేనేజింగ్‌ ట్రస్టీ హోదాలో ఆమె శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ‘చిన్నతనం నుంచి అమ్మ, నాన్న మమ్మల్ని విలువలతో పెంచారు. నేటికీ వాటిని పాటిస్తున్నాం. శాసనసభలో నాపై చేసిన అనుచిత వ్యాఖ్యల పట్ల నిరసన వ్యక్తం చేసిన వారందరికీ ధన్యవాదాలు. నాకు జరిగిన అవమానాన్ని మీ తల్లికి, తోబుట్టువుకు, కూతురుకి జరిగినట్టుగా భావించి నాకు అండగా నిలవడం జీవితంలో మర్చిపోలేను’ అని భువనేశ్వరి పేర్కొన్నారు. విలువలతో కూడిన సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలనీ.. కష్టాల్లోనూ, ఆపదలోనూ ఉన్న వారికి అండగా నిలబడాలని ఆమె ఆకాంక్షించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని