ఆరు స్థానాలకు ఎన్నికలు
రాష్ట్రంలో శాసనమండలికి స్థానిక సంస్థల కోటాలో జరుగుతున్న 12 స్థానాల ఎన్నికల్లో ఆరుగురు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మరో ఆరు స్థానాల్లో ఎన్నికలు జరగనున్నాయి. శుక్రవారం నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది.
ఆదిలాబాద్, మెదక్, నల్గొండ, ఖమ్మంతో పాటు కరీంనగర్లో రెండింటికి
స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆరు ఏకగ్రీవం
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో శాసనమండలికి స్థానిక సంస్థల కోటాలో జరుగుతున్న 12 స్థానాల ఎన్నికల్లో ఆరుగురు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మరో ఆరు స్థానాల్లో ఎన్నికలు జరగనున్నాయి. శుక్రవారం నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. ఈ సందర్భంగా ఎన్నికల సంఘం రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి డాక్టర్ శశాంక్ గోయల్ విలేకరులతో మాట్లాడారు. ‘తొమ్మిది ఉమ్మడి జిల్లాల పరిధిలో 12 స్థానాలకు ఎన్నికల ప్రక్రియ చేపట్టాం. రంగారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాల్లో రెండేసి స్థానాలు, వరంగల్, నిజామాబాద్ జిల్లాల్లో ఒక్కో స్థానానికి సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
కరీంనగర్లో రెండు, ఆదిలాబాద్, ఖమ్మం, నల్గొండ, మెదక్ జిల్లాల్లో ఒక్కో స్థానానికి వచ్చే నెల పదో తేదీన పోలింగ్ జరుగుతుంది. ఈ ఆరు స్థానాలకు 26 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ ఉంటుంది. మొత్తం 5,326 మంది ఓటర్లుండగా వారి కోసం 37 పోలింగు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాం. ఓట్ల లెక్కింపు 14న చేపడతాం. బ్యాలెట్ పత్రం ద్వారా పోలింగ్ జరుగుతుంది. ఓటర్లు ప్రాధాన్య క్రమంలో పోటీలో ఉన్న అభ్యర్థులకు ఓటు వేయాలి. ఏకగ్రీవమైన స్థానాలకు సంబంధించిన జిల్లాల్లో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఎత్తివేశాం. హోటళ్లు, రిసార్టుల్లో ఓటర్లతో క్యాంపులు నిర్వహించటం నిబంధనలకు విరుద్ధం. ఈసీ రూపొందించిన కరోనా నిబంధనల మేరకు ఎన్నికల ప్రక్రియను నిర్వహిస్తాం’ అని డాక్టర్ శశాంక్ గోయల్ తెలిపారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిన అనంతరం నిజామాబాద్లో కల్వకుంట్ల కవిత, వరంగల్లో పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, రంగారెడ్డిలో శంభీపూర్రాజు, పట్నం మహేందర్రెడ్డి, మహబూబ్నగర్లో కూచికుళ్ల దామోదర్రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డిలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కేంద్ర ఎన్నికల సంఘం వారి ఫలితాలను ప్రకటించడంతో ఆయా జిల్లాల్లోని ఎన్నికల రిటర్నింగ్ అధికారులు విజేతలకు ధ్రువీకరణ పత్రాలను అందజేశారు.
ఇక్కడ పోటీ అనివార్యం..
రెండు స్థానాలున్న కరీంనగర్లో 14 మంది నామినేషన్లను ఉపసంహరించుకోగా మరో 10 మంది బరిలో మిగిలారు. తెరాస అభ్యర్థులు భానుప్రసాద్రావు, ఎల్.రమణతో పాటు పార్టీకి రాజీనామా చేసిన రవీందర్ సింగ్, మరో ఏడుగురు పోటీలో ఉన్నారు. ఖమ్మంలో ఒక స్థానానికి తెరాస, కాంగ్రెస్ అభ్యర్థులు తాతా మధు, రాయల నాగేశ్వరరావులతో పాటు స్వతంత్ర అభ్యర్థులు శ్రీనివాసరావు, సుధారాణి పోటీలో ఉన్నారు. మెదక్ జిల్లాలో తెరాస అభ్యర్థి యాదవరెడ్డి, కాంగ్రెస్ నుంచి నిర్మల, స్వతంత్ర అభ్యర్థి మల్లారెడ్డి పోటీలో నిలిచారు. నల్గొండలో తెరాస అభ్యర్థి ఎంసీ కోటిరెడ్డితో పాటు మరో ఆరుగురు స్వతంత్రులు బరిలో ఉన్నారు.
ఆదిలాబాద్లో ఉద్రిక్తత
ఆదిలాబాద్లో నామినేషన్ల ఉపసంహరణ నాటకీయ పరిణామాల మధ్య తీవ్ర ఉత్కంఠకు, ఉద్రిక్తతకు దారి తీసింది. 22 మంది అభ్యర్థులు ఉపసంహరించుకోవడంతో తెరాస నుంచి దండె విఠల్, స్వతంత్ర అభ్యర్థిగా పెందూరు పుష్పరాణి పోటీలో ఉన్నారు. అంతకుముందు తుడుందెబ్బ ఆధ్వర్యంలో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచిన పెందూర్ పుష్పరాణి తరఫున సాయంత్రం 3 గంటలకు ఓ వ్యక్తి వచ్చి నామినేషన్ ఉపసంహరించుకుంటున్నట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి సిక్తాపట్నాయక్కు తెలిపారు. కాగా పుష్పరాణిని ప్రతిపాదించిన పది మందిలో ఆయన పేరు లేకపోవడంతో అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏజెంట్గా వచ్చినట్లు ఆయన వివరించడంతో అభ్యర్థి పుష్పరాణితో మాట్లాడించాలని సూచించారు. సాయంత్రం 4 దాటినా ఎలాంటి సమాచారం రాలేదు. ఎన్నికల అధికారి నిర్ణయం కోసం మంత్రి ఇంద్రకరణ్రెడ్డి, జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు సహా అభ్యర్థి దండే విఠల్ కలెక్టరేట్ ఆవరణలోనే ఎదురుచూడాల్సి వచ్చింది. ఇదే సమయంలో భాజపాకు చెందిన కొంతమంది కలెక్టరేట్కు చేరుకొని నినాదాలు చేయడంతో తెరాస శ్రేణులు ప్రతినినాదాలు చేయడం, అనంతరం పుష్పరాణి సహా తుడుందెబ్బ శ్రేణులు వచ్చి బైఠాయించడంతో అక్కడ తోపులాట చోటుచేసుకుంది.
తెరాస శిబిరాలు
ఆరు స్థానాలకు ప్రాతినిధ్యం ఉన్న అయిదు ఉమ్మడి జిల్లాల్లో ఎన్నికలు జరగనుండడంతో ఆయా జిల్లాల్లో మెజారిటీ ఓట్లు ఉన్న తెరాస తమ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను ముందుజాగ్రత్తగా శిబిరాలకు తరలించినట్లు తెలిసింది. పోలింగ్ రోజైన డిసెంబరు పదో తేదీన వారు నేరుగా పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటారని సమాచారం.
ఏపీలో 11 మంది ఎమ్మెల్సీలు ఏకగ్రీవం
ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్లోని ఎనిమిది జిల్లాల పరిధిలోని 11 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నియోజకవర్గాల్లో వైకాపా అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 11 మంది వైకాపా అభ్యర్థులు ఎన్నికైనట్లు ఆయా జిల్లాల ఎన్నికల రిటర్నింగ్ అధికారులు ప్రకటించారు. చిత్తూరు-కృష్ణ రాఘవ జయేంద్ర భరత్, అనంతపురం-ఎల్లారెడ్డిగారి శివరామిరెడ్డి, ప్రకాశం-తూమాటి మాధవరావు, గుంటూరు(2 స్థానాలు)- డాక్టర్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, మురుగుడు హనుమంతరావు, కృష్ణా(2స్థానాలు)- తలశిల రఘురాం, మొండితోక అరుణ్కుమార్, తూర్పుగోదావరి-అనంత సత్య ఉదయ భాస్కర్, విశాఖపట్నం(2స్థానాలు)- వరుదు కళ్యాణి, చెన్నుబోయిన శ్రీనివాస్, విజయనగరం-ఇందుకూరి రఘురాజు ఎమ్మెల్సీలుగా ఎన్నికయ్యారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారాస నేత ఇంట్లో గోడ గడియారాలు, మద్యం సీసాల పట్టివేత
మంచిర్యాల జిల్లా మందమర్రిలో భారాస పట్టణ సోషల్ మీడియా ఇన్ఛార్జి బెల్లం అశోక్ ఇంట్లో ఓటర్లకు పంపిణీ చేయడానికి నిల్వ చేసిన గోడ గడియారాలు, మద్యం సీసాలను గురువారం ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు పట్టుకున్నారు. -
ట్యాపింగ్ పాపంలో కీలక వికెట్
ఫోన్ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. హైదరాబాద్ టాస్క్ఫోర్స్ డీసీపీగా, ఉద్యోగ విరమణ అనంతరం అక్కడే ఓఎస్డీగా సుదీర్ఘకాలం పనిచేసిన రాధాకిషన్రావును పోలీసులు అరెస్ట్ చేశారు. -
రైతులు, రైతు కూలీలకు రిజర్వేషన్లు కల్పించాలి
‘ఇప్పుడున్న పరిస్థితుల్లో రైతులు, రైతు కూలీల వంటి వర్గాలకు న్యాయం జరగాలంటే వారికి న్యాయవ్యవస్థ సహా వివిధ శాఖల్లో ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలి. -
నీ పేరు బయటికి వస్తుందని సీబీఐ దర్యాప్తు వద్దన్నావా?
‘‘మాజీమంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ను ఎందుకు ఉపసంహరించుకున్నావు? నీ పేరు బయటికి వస్తుందని భయపడ్డావా?’’ అని సీఎం జగన్ను వివేకా కుమార్తె సునీతారెడ్డి నిలదీశారు. -
తిరుమల నడకదారిలో చిరుత కలకలం
అలిపిరి-తిరుమల నడకదారిలో మరోసారి చిరుత సంచారం కలకలం సృష్టించింది. ఈ నెల 25, 26వ తేదీల్లో తెల్లవారుజామున నడకదారికి 150 మీటర్ల దూరంలో చిరుత సంచరించిందని తితిదే అటవీ శాఖ డీఎఫ్వో శ్రీనివాసులు గురువారం వెల్లడించారు. -
హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ మౌసమీ భట్టాచార్య ప్రమాణం
తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ మౌసమీ భట్టాచార్య గురువారం ఉదయం ప్రమాణం చేశారు. మొదటి కోర్టు హాలులో జరిగిన ఈ కార్యక్రమంలో జస్టిస్ మౌసమీ భట్టాచార్యతో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే ప్రమాణం చేయించారు. -
పఫర్ ఫిష్
విశాఖలోని సాగర తీరంలో గురువారం మత్స్యకారుల వలకు విభిన్న తరహా సముద్ర జీవులు చిక్కాయి. -
కొంచెం ఓపిక పట్టండి.. అంతా మంచే జరుగుతుంది
‘సార్.. మాపై చాలా కేసులు పెట్టారు. దీంతో చాలామందికి పాస్పోర్టులు ఆగిపోయాయి. -
హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రవీందర్రెడ్డి
హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా సీనియర్ న్యాయవాది ఎ.రవీందర్రెడ్డి ఎన్నికయ్యారు. గురువారం జరిగిన కార్యవర్గ ఎన్నికల్లో అధ్యక్ష పదవికి రవీందర్రెడ్డి, ఎం.విజయ్కుమార్, చిక్కుడు ప్రభాకర్, ఎ.జగన్ పోటీ పడ్డారు. -
3 రోజుల్లో.. 30 జిల్లాల్లో ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం
రాష్ట్రవ్యాప్తంగా రబీ(యాసంగి) ధాన్యం కొనుగోళ్ల లక్ష్యాలు జిల్లాల వారీగా ఖరారయ్యాయి. అత్యధికంగా నిజామాబాద్ జిల్లాలో 6.24 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయనున్నారు. -
రూ.50 లక్షల వ్యయం.. 5 వేల ఎకరాల సాగు ఖాయం!
తక్కువ వ్యయంతో ఎక్కువ ఆయకట్టు సాగులోకి తేవాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఇలాంటి వాటిని గుర్తించి.. త్వరితగతిన పూర్తి చేయాలని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. -
తగ్గిపోతున్న యువ జనాభా!
దేశ అభివృద్ధిలో కీలకమైన యువ జనాభా దక్షిణాది రాష్ట్రాల్లో రానున్న రోజుల్లో భారీగా తగ్గనుందని తాజా అంతర్జాతీయ నివేదిక ఒకటి పేర్కొంది. -
వేడెక్కిన తెలంగాణ
సూర్యుడి భగభగలతో రాష్ట్రం వేడెక్కింది. అనేక జిల్లాల్లో ఎండవేడికి ప్రజలు అల్లాడుతున్నారు. ప్రధానంగా ఉత్తర తెలంగాణ ఉడుకుతోంది. వారం రోజులుగా 40 డిగ్రీల సెల్సియస్ వద్ద ఉన్న ఉష్ణోగ్రతలు గురువారం నాటికి మరింత పెరిగాయి. -
తెలుగు వర్సిటీ పురస్కారాల ప్రదానం
చిత్రలేఖనం, నృత్యం, సంగీతం, పాత్రికేయం, అవధానం, రచన తదితర ప్రక్రియల్లో విశేష కృషి చేసిన 12 మందికి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 2023 సంవత్సరానికిగాను ప్రతిభా పురస్కారాలు ప్రదానం చేసింది. -
విత్తన లైసెన్సింగ్ విధానంలో మార్పులు
తెలంగాణలో ప్రస్తుతమున్న విత్తన లైసెన్సింగ్ విధానంలో కొన్ని మార్పులు చేయాల్సిన అవసరం ఉందని, విత్తన సరఫరాలో పారదర్శకతకు ఆయా కంపెనీల ప్రతినిధుల సూచనలను పరిశీలిస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. -
రాజన్న క్షేత్రంలో వైభవంగా శివ కల్యాణం
దక్షిణ కాశీగా పేరొందిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని రాజరాజేశ్వరస్వామి ఆలయంలో గురువారం శివ కల్యాణం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. -
బాహు‘మీనం’
వనపర్తి జిల్లా కొత్తకోట మండలం అప్పరాలలో మత్స్యకారుడు పరమేశ్కు చిక్కిన భారీ చేప ఇది. గురువారం ఆయన పామాపురం సమీపంలోని ఊకచెట్టు వాగులో నిర్మించిన చెక్ డ్యామ్లో వేటకు వెళ్లగా.. 10 నుంచి 25 కిలోల బరువున్న చేపలు వలలో చిక్కాయి. -
టెట్పై ఉపాధ్యాయుల్లో గందరగోళం
ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)-2024పై ఉపాధ్యాయుల్లో సందేహాలు నెలకొన్నాయి. వాటిని నివృత్తి చేయాలని ఉపాధ్యాయ సంఘాల నేతలు విద్యాశాఖ ఉన్నతాధికారులను కలిసి విన్నవిస్తున్నారు. -
గురుకులాల్లో భర్తీకాని పోస్టులపై నిర్ణయం తీసుకోండి: హైకోర్టు
గురుకులాల్లో డిగ్రీ, జూనియర్ లెక్చరర్లు, పోస్టు గ్రాడ్యుయేట్, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు, బోధనేతర సిబ్బంది పోస్టులకు ఎంపికైన వారు బాధ్యతలు స్వీకరించకపోవడంతో ఏర్పడిన ఖాళీల్లో పిటిషనర్ల నియామకాన్ని పరిశీలించాలని ప్రభుత్వానికి హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. -
ఇంటర్ కళాశాలలకు మే 31 వరకు సెలవులు
రాష్ట్రంలోని జూనియర్ కళాశాలలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు ప్రకటించింది. ఈ నెల 31 నుంచి మే 31వ తేదీ వరకు సెలవులు ఉంటాయని గురువారం వెల్లడించింది. -
‘సాహితీ’ డబుల్ దందాపై పోలీసుల ఆరా
కార్తికేయ పనోరమ ప్రాజెక్టు పేరిట సాహితీ ఇన్ఫ్రా పాల్పడిన మోసాలపై హైదరాబాద్ సైబర్క్రైం పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
కాలమే అన్నింటికీ సమాధానం చెబుతుంది: కేటీఆర్
-
ఉపాధ్యాయ బదిలీల్లో రూ.వందల కోట్ల కుంభకోణం: నాదెండ్ల మనోహర్
-
ఏప్రిల్ 1 నుంచి ఇ-బీమా.. ఇంతకీ ఏమిటిది? ఎవరికి ప్రయోజనం?
-
కేజ్రీవాల్కు సమయం లేదు.. అందుకే ఈ ప్రయత్నాలు! : పూరి
-
టెలికాం శాఖ పేరుతో కాల్స్ వస్తున్నాయా..? అయితే జాగ్రత్త..!
-
రైలు ప్రయాణికుడి సెల్ఫీతో డెత్ మిస్టరీని ఛేదించిన పోలీసులు