Omicron: ఠారెత్తిస్తున్న ‘ఒమిక్రాన్’
దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచ దేశాల్లో వణుకు పుట్టిస్తోంది! కొవిడ్ కేసులు తగ్గుముఖం పట్టి, బతుకులు మళ్లీ గాడిన పడుతున్న తరుణంలో...
‘డెల్టా’ రకం కంటే ప్రమాదకరం!
టీకా తీసుకున్నవారికీ ముప్పు?
వణుకుతున్న ప్రపంచ దేశాలు
దక్షిణాఫ్రికా, బోట్స్వానాల్లో పెరుగుతున్న కేసులు
తాజాగా ఇజ్రాయెల్, బెల్జియంలోనూ వెలుగులోకి..
వివిధ దేశాల్లో ప్రయాణ ఆంక్షలు షురూ
డబ్ల్యూహెచ్వో అత్యవసర భేటీ
తీవ్రంగా వ్యాపిస్తుందని హెచ్చరిక
లండన్, జెనీవా, జెరూసలేం: దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచ దేశాల్లో వణుకు పుట్టిస్తోంది! కొవిడ్ కేసులు తగ్గుముఖం పట్టి, బతుకులు మళ్లీ గాడిన పడుతున్న తరుణంలో... ఇది మరో ఉద్ధృతికి దారితీయవచ్చన్న ఆందోళనలు రేకెత్తుతున్నాయి. కొద్దిరోజుల కిందట దక్షిణాఫ్రికాలో కనిపించిన ‘బి.1.1.529’ వేరియంట్ పొరుగుదేశం బోట్స్వానాతో పాటు హాంకాంగ్కూ వ్యాపించింది. తాజాగా ఇజ్రాయెల్, బెల్జియంలోనూ ఈ కేసులు నమోదయ్యాయి. కొవిడ్ టీకా రెండు డోసులు తీసుకున్నవారికీ ఈ వేరియంట్ సోకుతుండటంతో ప్రపంచ దేశాలు ఉలిక్కిపడ్డాయి! అధిక మ్యూటేషన్ల కారణంగా డెల్టా కంటే ఇది ప్రమాదకారి కావచ్చని..వేగంగా వ్యాపించి, తీవ్ర లక్షణాలకు దారితీయవచ్చని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొత్త వేరియంట్ ప్రభావంతో ప్రపంచ వ్యాప్తంగా వివిధ స్టాక్ మార్కెట్లు శుక్రవారం పతనమయ్యాయి. ఐరోపా, ఆసియాల్లోని ప్రధాన ఇండెక్స్లు కుదేలయ్యాయి. అమెరికాలో మార్కెట్ ప్రారంభం కావడానికి ముందే డౌ జోన్స్ ఫ్యూచర్స్ 800 పాయింట్లు కోల్పోయింది. ముడి చమురు ధరలు 7% తగ్గాయి. పలు ఎయిర్లైన్స్ షేర్లూ భారీగా దెబ్బతిన్నాయి.
కేసులు పెరగడానికి అదే కారణమా?
దక్షిణాఫ్రికాలో సగటున రోజూ 200 మంది కరోనా బారిన పడుతుండగా... నాలుగైదు రోజుల నుంచి కేసులు భారీగా పెరుగుతున్నాయి. కొత్త వేరియంటే ఇందుకు కారణమా? అన్నది మాత్రం ప్రభుత్వం చెప్పడం లేదు. తాజాగా మలావి నుంచి ఇజ్రాయెల్కు వచ్చిన ఓ వ్యక్తికి ‘బి.1.1.529’ సోకింది. మరో ఇద్దరు కూడా దీనిబారిన పడినట్టు అనుమానిస్తున్నారు. ఈ ముగ్గురూ పూర్తిస్థాయి వ్యాక్సిన్ తీసుకున్నవారే కావడంతో ప్రపంచ వ్యాప్తంగా వైద్య నిపుణులు విస్తుపోతున్నారు! తాజా పరిణామాల క్రమంలో- ఇజ్రాయెల్ ప్రధాని నఫ్తాలీ బెన్నెట్ అత్యవసరంగా కేబినెట్ సమావేశం ఏర్పాటుచేసి, కొత్త వేరియంట్పై సమీక్షించారు. తమ దేశం అత్యయిక పరిస్థితి ఆరంభంలో ఉన్నట్టు వ్యాఖ్యానించారు.
అక్కడి నుంచి రావద్దు...
దక్షిణాఫ్రికా సహా మొత్తం ఆరు దేశాల నుంచి వచ్చే విదేశీ ప్రయాణికులపై ఇజ్రాయెల్ ఆంక్షలు విధించింది. బ్రిటన్లో ఇప్పటివరకూ బి.1.1.529 వేరియంట్ నమోదు కాకపోయినా... దక్షిణాఫ్రికా, బోట్స్వానా, లెసాతో, ఎస్వాతిన్, జింబాబ్వే, నమీబియాల నుంచి రాకపోకలపై నిషేధం విధిస్తున్నట్టు ఆ దేశం శుక్రవారం ప్రకటించింది. జర్మనీ, ఇటలీ, సింగపూర్, జపాన్లు కూడా ఈ దిశగా చర్యలు చేపట్టాయి. దక్షిణాఫ్రికా తదితర దేశాల నుంచి వచ్చేవారిపై ప్రయాణ ఆంక్షలు విధించేందుకు యూరోపియన్ యూనియన్ సభ్య దేశాలు అంగీకారం తెలిపాయి.
భారత్లో ఆ కేసుల్లేవు: ఇన్సాకాగ్
దిల్లీ: కొత్త వేరియంట్కు సంబంధించి దేశంలో ఇప్పటివరకూ ఒక్క కేసు కూడా వెలుగుచూడలేదని ఇండియన్ సార్స్-కొవ్-2 జీనోమిక్స్ కన్సార్షియం (ఇన్సాకాగ్) వెల్లడించింది. ప్రజలంతా కొవిడ్ నిబంధనలను పాటించాలని సూచించింది. కొత్త వేరియంట్ను పర్యవేక్షిస్తున్నామని, ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించామని కేంద్ర ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి.
అత్యంత ఆందోళనకర రకం
కొత్త వేరియంట్కు తీవ్రంగా వ్యాపించే లక్షణాలు ఉన్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. దీన్ని ‘ఆందోళనకర వేరియంట్ (వేరియంట్ ఆఫ్ కన్సర్న్)’గా వర్గీకరించి, ‘ఒమిక్రాన్’ అని పేరు పెట్టింది. కొద్దిరోజుల కిందటే ‘వేరియంట్ అండర్ మానిటరింగ్’గా గుర్తించిన బి.1.1.529పై చర్చించేందుకు శుక్రవారం ఉన్నతాధికారులు, నిపుణులతో డబ్ల్యూహెచ్వో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసింది. దీనిపై విస్తృత స్థాయిలో చర్చించి నిర్ణయాన్ని వెల్లడించింది.
ఏంటీ కొత్త వేరియంట్?
దక్షిణాఫ్రికాలో బయటపడ్డ ఈ కరోనా వేరియంట్ను ‘బి.1.1.529’గా శాస్త్రవేత్తలు గుర్తించారు. దీని కారణంగా ఇప్పటివరకూ దక్షిణాఫ్రికాతో పాటు హాంకాంగ్, బోట్స్వానా, ఇజ్రాయెల్, బెల్జియంలోనూ కేసులు వెలుగు చూశాయి.
వ్యాప్తి తీవ్రత ఎలా ఉంది?
దక్షిణాఫ్రికాలోని గౌతెంగ్ ప్రావిన్సులో ఈ వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతున్నట్టు స్థానిక వైద్య నిపుణులు వెల్లడించారు. ఇక్కడ నమోదవుతున్న వాటిలో 90% కేసులకు ఈ వేరియంటే కారణమని చెబుతున్నారు. మరో ఎనిమిది ప్రావిన్సుల్లోనూ ఈ వేరియంట్ వ్యాపించి ఉండవచ్చని తెలుస్తోంది.
అంత భయమెందుకు?
బి.1.1.259 చాలా అసాధారణ వైరస్ ఉత్పరివర్తనాల కలయికగా శాస్త్రవేత్తలు గుర్తించారు. శరీర రోగనిరోధక శక్తిని ఇది ఏమార్చి, విస్తృతంగా వ్యాపించవచ్చని భావిస్తున్నారు. ఈ వేరియంట్కు గనుక వ్యాక్సిన్ల నుంచి తప్పించుకోగల, లేదంటే మునుపటి డెల్టా కంటే తీవ్రంగా వ్యాపించే సామర్థ్యం ఉంటే.. మరోసారి కొవిడ్ ఉద్ధృతి తప్పకపోవచ్చని హెచ్చరిస్తున్నారు.
ఎందుకు భిన్నం?
కరోనా వ్యాప్తి మొదలైనప్పటి నుంచి చూసిన వేరియంట్ల కంటే బి.1.1.529 అత్యంత ప్రమాదకరమైనదని సీనియర్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వైరస్ స్పైక్ ప్రొటీన్లో 32 ఉత్పరివర్తనాలు ఉన్నాయని, డెల్టా వేరియంట్తో పోలిస్తే ఇవి రెట్టింపు అని వారు విశ్లేషించారు.
ఆందోళనకర వైరస్ల కంటే బి.1.1.529 వేగంగా వ్యాపిస్తున్నట్టు లెక్క తేలింది. దక్షిణాఫ్రికాలో బీటా, డెల్టా వేరియంట్లు వెలుగుచూసిన తర్వాత పాతిక రోజుల్లోపు మొత్తం కేసుల్లో వీటి వాటా 20%లోపే. ఇదే కాలంలో బి.1.1.529 కారక కేసులు 90% నమోదవుతున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మనిషికి రూ.200.. యువతకు పెట్రోలు కూపన్లు
‘మేమంతా సిద్ధం’ అంటూ సీఎం జగన్, ఇతర నేతలు జనంలోకి వచ్చినా ప్రజలు మాత్రం సిద్ధంగా లేమన్న సంకేతమిచ్చారు. -
‘జగన్ ఏలుబడి..’ బలిపీఠంపై సాగుబడి!
వైకాపా ఐదేళ్ల పాలనలో రైతులకు మిగిలింది అప్పులు... కన్నీళ్లే. బాధితుల్లో 90% మంది చిన్న, సన్నకారు రైతులే. వరి సాగు తమవల్ల కాదంటూ గోదావరి, కృష్ణా డెల్టాలో విరామం ప్రకటించే దుస్థితి జగన్ జమానాలోనే దాపురించింది. -
ఏపీ సీఎస్, డీజీపీలపై.. ఈసీఐ నిర్ణయం కోసం చూస్తున్నాం
ఆంధ్రప్రదేశ్లోని సీనియర్ అధికారులపై అందిన ఫిర్యాదులపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) తీసుకునే నిర్ణయం కోసం వేచిచూస్తున్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా చెప్పారు. -
వైకాపాకు ప్రచారం చేసిన వెంకట్రామిరెడ్డిపై ఈసీ వేటు
వైకాపాతో అంటకాగుతూ.. ఆ పార్టీ కార్యకర్తలా వ్యవహరిస్తున్న రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఎట్టకేలకు వేటు పడింది. -
గులకరాయి కేసులో ఏ2 ఎవరు..?
సీఎం జగన్పై గులకరాయి విసిరిన కేసులో విజయవాడ పోలీసులు గురువారం అరెస్టు చూపించారు. అజిత్సింగ్నగర్ వడ్డెర కాలనీకి చెందిన సతీష్ అలియాస్ సత్తిని నిందితుడిగా తేల్చారు. -
సీఎం తెచ్చిన నరకయాతన
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో గురువారం సాయంత్రం సాగిన సీఎం జగన్ రోడ్డుషో కారణంగా ఆర్టీసీ కాంప్లెక్స్లో రెండున్నర గంటలపాటు బస్సులు నిలిపివేయడంతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు. -
తెలంగాణలో హరితం.. ఆంధ్రాలో క్షామం
తెలుగు రాష్ట్రాల ఉమ్మడి మధ్య తరహా సాగునీటి ప్రాజెక్టు అయిన పెదవాగుపై వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యం రైతులకు శాపంగా మారింది. -
అపరిచితుడొచ్చాడు.. ‘ఆస్కార్లు సిద్ధమా?’
సాగిస్తున్న ఎన్నికల ప్రచారంలో భాగంగా కనిపిస్తున్న చిత్రాలు. వీటన్నింటినీ చూస్తుంటే.. అంతా ప్లాన్ ప్రకారం జరుగుతున్నాయని పిల్లలకూ ఇట్టే అర్థమైపోతుంది. -
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
పెద్దపులిని చూస్తే అడవిలో జంతువులు హడలిపోతాయి. ఒక్క ఎలుగుబంటి తప్ప. భల్లూకానికి కోపం వస్తే పెద్దపులిని సైతం పరుగులు పెట్టిస్తుంది. -
ఆయనే ఓ విపత్తు!
జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్లో సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసమే సాగింది. -
నాడు అప్పుల ‘నగరి’.. నేడు సిరుల ఝరి!
చలనచిత్ర రంగంలోనే కాదు.. ఉమ్మడి చిత్తూరు జిల్లాతోపాటు రాష్ట్ర రాజకీయ ‘సినిమా’లోనూ ఆమెకో గుర్తింపు ఉంది. -
జగన్ వచ్చె.. జనం హడలే!
సీఎం జగన్ వస్తున్నారంటేనే ప్రజలు హడలెత్తే పరిస్థితి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్ర సాగే ప్రాంతాల్లో దారిపొడవునా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. -
మాచర్లలో కూలిన వసతిగృహం గోడ
పల్నాడు జిల్లా మాచర్ల రింగురోడ్డు ప్రాంతంలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలికల వసతిగృహం భవనంపై ఉన్న పిట్టగోడ్డ గురువారం మధ్యాహ్నం ఒక్కసారిగా కూలి కిందపడింది. -
కాకినాడకు..ఉత్తుత్తి హామీలేనా జగన్?
ముఖ్యమంత్రి హోదాలో హామీ ఇచ్చారంటే నెరవేరుతుందని భావించే ప్రజలను ఎంత సులువుగా మోసం చేయవచ్చో సీఎం జగన్ మాటలు చూస్తే అర్థం అవుతుంది. -
అన్నా.. సున్నా అంటే ఇంత భారమా?
‘సున్నా వడ్డీకే రుణాల విప్లవం’ తీసుకొస్తానని డ్వాక్రా మహిళల ఓట్లు దండుకున్న జగన్.. అధికారంలోకి వచ్చాక తన టక్కుటమార విద్యలన్నింటినీ ప్రదర్శించారు. -
సీజేను కలిసిన బార్ కౌన్సిల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్
ఏపీ న్యాయవాద మండలి (బార్ కౌన్సిల్) ఛైర్మన్, వైస్ ఛైర్మన్లుగా ఇటీవల ఏకగ్రీవంగా ఎన్నికైన నల్లారి ద్వారకానాథరెడ్డి, సిరిపురపు కృష్ణమోహన్ సీజే జస్టిస్ ధీరజ్సింగ్ ఠాకుర్ను హైకోర్టులో గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. -
వివేకా హత్యకేసుపై మాట్లాడొద్దు
మాజీ మంత్రి వివేకా హత్యకేసు అంశంపై వైఎస్ షర్మిల, వివేకా కుమార్తె సునీత, చంద్రబాబునాయుడు, లోకేశ్, పురందేశ్వరి, పవన్ కల్యాణ్, పులివెందుల తెదేపా అభ్యర్థి బీటెక్ రవి తరచూ మాట్లాడుతున్నారని, వారు ఈ వ్యాఖ్యలు చేయకుండా చూడాలని వైకాపా వైయస్ఆర్ జిల్లా అధ్యక్షుడు సురేష్బాబు కడప కోర్టులో పిటిషన్ వేశారు. -
పదోన్నతుల్లో రిజర్వేషన్లపై ఎన్నికల కోడ్లో ఐఏఎస్ల కమిటీ భేటీ
రాష్ట్ర సచివాలయంలో ఉద్యోగుల పదోన్నతుల వ్యవహారంలో మధ్యస్థాయి అధికారుల (ఎంఎల్ఓ) కమిటీ ఇచ్చిన నివేదికపై ఐఏఎస్ అధికారుల కమిటీ భేటీని ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘం వ్యతిరేకిస్తోంది. -
చిరుద్యోగులకూ వేతనాలు ఇవ్వలేరా?
రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతో చిరుద్యోగులకు సైతం వేతనాలు సకాలంలో అందడం లేదు. వైద్య ఆరోగ్య శాఖలో పనిచేసే ఆరోగ్యమిత్రలు, 108, 104 సిబ్బందికి ఏప్రిల్ మూడో వారం వచ్చినప్పటికీ మార్చి నెల వేతనాలు చెల్లించలేదు -
అచ్చెన్నాయుడిపై తొందరపాటు చర్యలొద్దు
స్కిల్ కేసులో తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడిపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని సీఐడీని ఆదేశిస్తూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు పొడిగించింది. -
20 లక్షల పేద కుటుంబాల ‘ఉపాధి’పై జగన్ వేటు
రాష్ట్రంలో గత అయిదేళ్లలో 20.05 లక్షల కుటుంబాలను జగన్ ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి దూరం చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
20 నుంచి పవన్ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం
-
మహిళకు శస్త్రచికిత్స చేసి.. తల్లీ బిడ్డను కాపాడిన దర్శి అభ్యర్థి
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
మనిషికి రూ.200.. యువతకు పెట్రోలు కూపన్లు
-
నడుం నొప్పి, కుంగుబాటు, తలనొప్పి.. అనారోగ్యానికి ప్రధాన కారణాలివే