జడ్జీలపై దాడులను అడ్డుకోవాలి
న్యాయాధికారులు, న్యాయ వ్యవస్థపై జరుగుతున్న దాడులను అడ్డుకోవాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ కోరారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఇక్కడి విజ్ఞాన్భవన్లో....
భౌతికంగా, సామాజిక మాధ్యమాల్లో కొనసాగుతున్న దారుణాలు
ఇవి ప్రేరేపితంలా కనిపిస్తున్నాయ్
రాజ్యాంగ దినోత్సవం కార్యక్రమంలో సీజేఐ జస్టిస్ ఎన్.వి.రమణ వ్యాఖ్య
న్యాయవ్యవస్థను భారతీయీకరణ చేయాలని పిలుపు
ఈనాడు, దిల్లీ: న్యాయాధికారులు, న్యాయ వ్యవస్థపై జరుగుతున్న దాడులను అడ్డుకోవాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ కోరారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఇక్కడి విజ్ఞాన్భవన్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్యఅతిథిగా పాల్గొన్న కార్యక్రమంలోను, అంతకుముందు సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ నిర్వహించిన సమావేశంలోనూ ఈ విషయాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. ‘‘న్యాయాధికారులపై భౌతికదాడులు పెరిగిపోతున్నాయి. మరోవైపు మీడియాలో, మరీ ముఖ్యంగా సామాజిక మాధ్యమాల్లో న్యాయవ్యవస్థపైనా దాడి జరుగుతోంది. ఇవన్నీ ఎవరి ప్రాయోజికత్వంలోనో జరుగుతున్నట్లు కనిపిస్తున్నాయి’’ అని అన్నారు. వీటిని చట్టాలను అమలుచేసే వ్యవస్థలు, కేంద్ర సంస్థలు, న్యాయవాదులు అడ్డుకోవాలి అని కోరారు. ఏది మంచో, ఏది కాదో చెప్పడానికి సిగ్గుపడొద్దు, భయపడొద్దు అని, న్యాయవాదులు కూడా విస్తృత కుటుంబంలో భాగస్వాములేనని, వారు కోర్టుకు సహకరించాలని కోరారు.
సామాన్యుడికి మరింత చేరువ
దేశ పరిస్థితులకు అనుగుణంగా న్యాయ వ్యవస్థలో సంస్కరణలు రావాలని జస్టిస్ రమణ ఆకాంక్షించారు. ‘‘న్యాయవ్యవస్థలో విస్తృతస్థాయిలో సంస్కరణలు తీసుకురావాలి. ఈ ఉద్దేశంతోనే నేను ‘భారతీయీకరణ’ అన్న పదాన్ని ప్రయోగిస్తున్నాను. ప్రస్తుతం మన దేశంలో కొనసాగుతున్న న్యాయవ్యవస్థ ఇప్పటికీ వలసపాలన గుణాన్నే కలిగి ఉంది. సామాజిక వాస్తవాలు, స్థానిక పరిస్థితులను అది పరిగణలోకి తీసుకోవడంలేదు. ప్రస్తుతం అనుసరిస్తున్న విధానాలు, వాదనలు, తీర్పుల్లో ఉపయోగించే భాష, అందులో ఇమిడి ఉన్న అధిక ఖర్చులు సామాన్యుడిని న్యాయవ్యవస్థకు దూరం చేస్తున్నాయి. అందువల్ల ధైర్యంగా కోర్టులను ఆశ్రయించే నమ్మకాన్ని ప్రజల్లో నెలకొల్పాల్సి ఉంది. కక్షిదారులు న్యాయప్రక్రియలో నేరుగా పాల్గొనప్పుడు మాత్రమే వ్యవస్థపై వారికి నమ్మకం ఏర్పడుతుంది. అనవసరమైన అడ్డంకులను తొలగించి మొత్తం న్యాయప్రక్రియను సరళీకృతం చేయాలి. స్థానిక భాషల వినియోగానికి అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలి’’ అని అభిప్రాయపడ్డారు.
వారి అధికారాల్లో జోక్యం లేదు
రాజ్యాంగం పెట్టుకున్న నమ్మకాన్ని ఒక వ్యవస్థగా న్యాయస్థానాలు నిలబెట్టాయని జస్టిస్ రమణ అన్నారు. ‘‘కార్యనిర్వాహక, శాసన వ్యవస్థలు రాజ్యాంగం నిర్దేశించిన మార్గానికి అతీతంగా మళ్లితే అది న్యాయవ్యవస్థకు అదనపు భారంగా పరిణమిస్తుంది. న్యాయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని కొన్ని అపరిష్కృత సమస్యల పరిష్కారం కోసం న్యాయస్థానాలు దృష్టిసారించాల్సిన విధిలేని పరిస్థితులు ఉత్పన్నమవుతుంటాయి. కొన్ని అంశాల్లో న్యాయస్థానాలు జోక్యం చేసుకోవడం వెనుక ఉద్దేశం కార్యనిర్వాహక వ్యవస్థను కదిలించడమే తప్ప దాని పరిధిలోకి జొరబడటంకాదు. రాజ్యాంగబద్ధంగా అవసరమైన ఇలాంటి జోక్యాన్ని అధికారాల ఆక్రమణగా అభివర్ణించడం పూర్తిగా అసంబద్ధం’’ అని అన్నారు. ప్రజలకు న్యాయం చేయడం కేవలం న్యాయ వ్యవస్థ పని మాత్రమే కాదని; చట్టసభలు, కార్యనిర్వాహక వ్యవస్థలకు కూడా బాధ్యత ఉందని అన్నారు. శాసన వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ, న్యాయ వ్యవస్థల మధ్య రాజ్యాంగపరమైన లక్ష్మణ రేఖ ఉందని, ఇది చాలా పవిత్రమైనదని అన్నారు. దీన్ని పరిగణనలోకి తీసుకొని కార్యనిర్వాహక వ్యవస్థను కాస్త ముందుకు తోయడానికే కోర్టులు జోక్యం చేసుకుంటున్నాయే తప్ప వాటి అధికారాలను లాక్కోవడానికి కాదని అన్నారు.
పెండింగ్ కేసులు ఆందోళనకరం
కోర్టుల్లో ఏళ్లతరబడి కేసులు పెండింగ్లో ఉండడంపై జస్టిస్ రమణ ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘కేవలం పోస్టు కార్డు ఆధారంగా పరిష్కారాలు చూపే న్యాయవ్యవస్థే మరోవైపు ఏళ్లతరబడి కొనసాగుతున్న కేసులకు సంక్లిష్టమైన కారణాలవల్ల పరిష్కారాలను చూపలేకపోతోంది. ఇలాంటి వాటికి పరిష్కారం ఎలా అన్నదే ఇప్పుడు ప్రశ్న. పెండింగ్ కేసులను తగ్గించడానికి సుప్రీంకోర్టులో సాంకేతికతను ఉపయోగించుకోవడం ప్రారంభించాం. కిందిస్థాయిలో ఇప్పుడున్న న్యాయాధికారుల ఖాళీలను భర్తీచేయాలి. మరిన్ని పోస్టులు సృష్టించాలి. పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, గవర్నమెంటు ప్లీడర్లు, స్టాండింగ్ కౌన్సిళ్ల ఖాళీలను వేగంగా భర్తీచేయాలి. మౌలిక వసతులు కల్పించాలి. కింది కోర్టుల్లో ఆధునిక సౌకర్యాలు కల్పించాలి’’ అని ప్రధానిని కోరారు. ఈ కార్యక్రమంలో సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్, న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజుజు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వినూత్న ‘సైకిల్’ ప్రచారం.. ఓటర్లను ఆకట్టుకునే యత్నం!
రాష్ట్రవ్యాప్తంగా గురువారం నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలవగా.. పార్టీల నాయకులు వివిధ రూపాల్లో ప్రచారం చేస్తూ ఓటర్లను ఆకట్టుకునేందుకు యత్నిస్తున్నారు. -
20 లక్షల పేద కుటుంబాల ‘ఉపాధి’పై జగన్ వేటు
రాష్ట్రంలో గత అయిదేళ్లలో 20.05 లక్షల కుటుంబాలను జగన్ ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి దూరం చేసింది. -
సీఎం తెచ్చిన నరకయాతన.. రెండున్నర గంటలపాటు కదలని బస్సులు
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో గురువారం సాయంత్రం సాగిన సీఎం జగన్ రోడ్డుషో కారణంగా ఆర్టీసీ కాంప్లెక్స్లో రెండున్నర గంటలపాటు బస్సులు నిలిపివేయడంతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు. -
మనిషికి రూ.200.. యువతకు పెట్రోలు కూపన్లు
‘మేమంతా సిద్ధం’ అంటూ సీఎం జగన్, ఇతర నేతలు జనంలోకి వచ్చినా ప్రజలు మాత్రం సిద్ధంగా లేమన్న సంకేతమిచ్చారు. -
‘జగన్ ఏలుబడి..’ బలిపీఠంపై సాగుబడి!
వైకాపా ఐదేళ్ల పాలనలో రైతులకు మిగిలింది అప్పులు... కన్నీళ్లే. బాధితుల్లో 90% మంది చిన్న, సన్నకారు రైతులే. వరి సాగు తమవల్ల కాదంటూ గోదావరి, కృష్ణా డెల్టాలో విరామం ప్రకటించే దుస్థితి జగన్ జమానాలోనే దాపురించింది. -
ఏపీ సీఎస్, డీజీపీలపై.. ఈసీఐ నిర్ణయం కోసం చూస్తున్నాం
ఆంధ్రప్రదేశ్లోని సీనియర్ అధికారులపై అందిన ఫిర్యాదులపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) తీసుకునే నిర్ణయం కోసం వేచిచూస్తున్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా చెప్పారు. -
వైకాపాకు ప్రచారం చేసిన వెంకట్రామిరెడ్డిపై ఈసీ వేటు
వైకాపాతో అంటకాగుతూ.. ఆ పార్టీ కార్యకర్తలా వ్యవహరిస్తున్న రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఎట్టకేలకు వేటు పడింది. -
గులకరాయి కేసులో ఏ2 ఎవరు..?
సీఎం జగన్పై గులకరాయి విసిరిన కేసులో విజయవాడ పోలీసులు గురువారం అరెస్టు చూపించారు. అజిత్సింగ్నగర్ వడ్డెర కాలనీకి చెందిన సతీష్ అలియాస్ సత్తిని నిందితుడిగా తేల్చారు. -
తెలంగాణలో హరితం.. ఆంధ్రాలో క్షామం
తెలుగు రాష్ట్రాల ఉమ్మడి మధ్య తరహా సాగునీటి ప్రాజెక్టు అయిన పెదవాగుపై వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యం రైతులకు శాపంగా మారింది. -
అపరిచితుడొచ్చాడు.. ‘ఆస్కార్లు సిద్ధమా?’
సాగిస్తున్న ఎన్నికల ప్రచారంలో భాగంగా కనిపిస్తున్న చిత్రాలు. వీటన్నింటినీ చూస్తుంటే.. అంతా ప్లాన్ ప్రకారం జరుగుతున్నాయని పిల్లలకూ ఇట్టే అర్థమైపోతుంది. -
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
పెద్దపులిని చూస్తే అడవిలో జంతువులు హడలిపోతాయి. ఒక్క ఎలుగుబంటి తప్ప. భల్లూకానికి కోపం వస్తే పెద్దపులిని సైతం పరుగులు పెట్టిస్తుంది. -
ఆయనే ఓ విపత్తు!
జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్లో సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసమే సాగింది. -
నాడు అప్పుల ‘నగరి’.. నేడు సిరుల ఝరి!
చలనచిత్ర రంగంలోనే కాదు.. ఉమ్మడి చిత్తూరు జిల్లాతోపాటు రాష్ట్ర రాజకీయ ‘సినిమా’లోనూ ఆమెకో గుర్తింపు ఉంది. -
జగన్ వచ్చె.. జనం హడలే!
సీఎం జగన్ వస్తున్నారంటేనే ప్రజలు హడలెత్తే పరిస్థితి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్ర సాగే ప్రాంతాల్లో దారిపొడవునా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. -
మాచర్లలో కూలిన వసతిగృహం గోడ
పల్నాడు జిల్లా మాచర్ల రింగురోడ్డు ప్రాంతంలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలికల వసతిగృహం భవనంపై ఉన్న పిట్టగోడ్డ గురువారం మధ్యాహ్నం ఒక్కసారిగా కూలి కిందపడింది. -
కాకినాడకు..ఉత్తుత్తి హామీలేనా జగన్?
ముఖ్యమంత్రి హోదాలో హామీ ఇచ్చారంటే నెరవేరుతుందని భావించే ప్రజలను ఎంత సులువుగా మోసం చేయవచ్చో సీఎం జగన్ మాటలు చూస్తే అర్థం అవుతుంది. -
అన్నా.. సున్నా అంటే ఇంత భారమా?
‘సున్నా వడ్డీకే రుణాల విప్లవం’ తీసుకొస్తానని డ్వాక్రా మహిళల ఓట్లు దండుకున్న జగన్.. అధికారంలోకి వచ్చాక తన టక్కుటమార విద్యలన్నింటినీ ప్రదర్శించారు. -
సీజేను కలిసిన బార్ కౌన్సిల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్
ఏపీ న్యాయవాద మండలి (బార్ కౌన్సిల్) ఛైర్మన్, వైస్ ఛైర్మన్లుగా ఇటీవల ఏకగ్రీవంగా ఎన్నికైన నల్లారి ద్వారకానాథరెడ్డి, సిరిపురపు కృష్ణమోహన్ సీజే జస్టిస్ ధీరజ్సింగ్ ఠాకుర్ను హైకోర్టులో గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. -
వివేకా హత్యకేసుపై మాట్లాడొద్దు
మాజీ మంత్రి వివేకా హత్యకేసు అంశంపై వైఎస్ షర్మిల, వివేకా కుమార్తె సునీత, చంద్రబాబునాయుడు, లోకేశ్, పురందేశ్వరి, పవన్ కల్యాణ్, పులివెందుల తెదేపా అభ్యర్థి బీటెక్ రవి తరచూ మాట్లాడుతున్నారని, వారు ఈ వ్యాఖ్యలు చేయకుండా చూడాలని వైకాపా వైయస్ఆర్ జిల్లా అధ్యక్షుడు సురేష్బాబు కడప కోర్టులో పిటిషన్ వేశారు. -
పదోన్నతుల్లో రిజర్వేషన్లపై ఎన్నికల కోడ్లో ఐఏఎస్ల కమిటీ భేటీ
రాష్ట్ర సచివాలయంలో ఉద్యోగుల పదోన్నతుల వ్యవహారంలో మధ్యస్థాయి అధికారుల (ఎంఎల్ఓ) కమిటీ ఇచ్చిన నివేదికపై ఐఏఎస్ అధికారుల కమిటీ భేటీని ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘం వ్యతిరేకిస్తోంది. -
చిరుద్యోగులకూ వేతనాలు ఇవ్వలేరా?
రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతో చిరుద్యోగులకు సైతం వేతనాలు సకాలంలో అందడం లేదు. వైద్య ఆరోగ్య శాఖలో పనిచేసే ఆరోగ్యమిత్రలు, 108, 104 సిబ్బందికి ఏప్రిల్ మూడో వారం వచ్చినప్పటికీ మార్చి నెల వేతనాలు చెల్లించలేదు
తాజా వార్తలు (Latest News)
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
20లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నాది: చంద్రబాబు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం
-
హైదరాబాద్ శివారులో వర్ష బీభత్సం.. శ్రీశైలం హైవేపై ట్రాఫిక్ జామ్
-
‘విక్రమార్కుడు’, ‘బజరంగీ భాయిజాన్’ సీక్వెల్స్ అప్డేట్.. ఎంతవరకు వచ్చాయంటే!