యాసంగి సాగుపై కొత్త విధానం!
తెలంగాణలో ఉప్పుడు బియ్యం కొనేది లేదని కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో యాసంగి పంటల సాగుకు సంబంధించి విధానపరమైన నిర్ణయంపై చర్చించేందుకు రాష్ట్ర మంత్రిమండలి సోమవారం ముఖ్యమంత్రి
వానాకాలం ధాన్యం కొనుగోళ్లపై నిర్ణయం
ఉద్యోగ నియామకాలపై చర్చ
నేడు సీఎం అధ్యక్షతన మంత్రిమండలి భేటీ
ఈనాడు, హైదరాబాద్: తెలంగాణలో ఉప్పుడు బియ్యం కొనేది లేదని కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో యాసంగి పంటల సాగుకు సంబంధించి విధానపరమైన నిర్ణయంపై చర్చించేందుకు రాష్ట్ర మంత్రిమండలి సోమవారం ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్లో భేటీ కానుంది. వానాకాలంలో ధాన్యం కొనుగోళ్లు ముమ్మరం చేయడం, ఉద్యోగ నియామకాలపై స్పష్టత, కొత్త వేరియంట్ ఒమిక్రాన్ దృష్ట్యా కరోనాపై వైద్యఆరోగ్యశాఖ సన్నద్ధత తదితర అంశాలపై కూడా ఈ సమావేశంలో చర్చించనున్నారు. యాసంగి వడ్ల కొనుగోలుపై స్పష్టత ఇవ్వకుండా రైతులకు కేంద్రం అన్యాయం చేస్తోందని, ఎన్నిసార్లు సంప్రదించినా.. వారి నుంచి సరైన సమాధానం లేదని రాష్ట్రప్రభుత్వం అసంతృప్తితో ఉంది. దీనిపై అధికార పార్టీ తెరాస ఆధ్వర్యంలో చేపట్టిన మహాధర్నాలో సీఎం కేసీఆర్ స్వయంగా పాల్గొన్నారు. కొందరు మంత్రులు, అధికారులతో నాలుగురోజుల కిందటే దిల్లీ వెళ్లారు. అక్కడ రాష్ట్ర మంత్రులు.. కేంద్ర మంత్రులతో భేటీ అయినా స్పష్టమైన వైఖరి వెల్లడించలేదని అసంతృప్తితో ఉన్నారు. వీటిపై మంత్రిమండలి చర్చిస్తుంది.
ఉద్యోగ నియామకాలెలా!
రాష్ట్రంలో ఉద్యోగ నియామకాల కోసం ఇప్పటికే ఆర్థికశాఖ దస్త్రం రూపొందించింది. కొత్త జోనల్ విధానం అమలు తర్వాత 70 వేల నుంచి 80 వేల పోస్టులను భర్తీ చేస్తామని సీఎం ఇప్పటికే ప్రకటించారు. ఆ ప్రక్రియ ఎంతవరకూ వచ్చిందనే దానిపైనా మంత్రిమండలి చర్చించి, అధికారులకు దిశానిర్దేశం చేయనుంది. కరోనా పరిస్థితులపైనా చర్చించనుంది. పోడు భూముల సమస్య, మెట్రో రైలు విస్తరణ, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏ తదితర అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సౌత్జోన్ డీసీపీగా స్నేహామెహ్రా
హైదరాబాద్లోని దక్షిణ మండలం డీసీపీగా స్నేహామెహ్రాను నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆమె రాత్రి బాధ్యతలు స్వీకరించారు. -
ఖానాపూర్ అడవుల్లో చిరుత సంచారం
నిర్మల్ జిల్లా ఖానాపూర్ అటవీ రేంజి పరిధిలో నీటి వనరుల చెంత వన్యప్రాణులు కనిపించాయి. -
కాళేశ్వరంపై సత్వర విచారణ
ప్రజా ప్రయోజనాల దృష్ట్యా కాళేశ్వరం ప్రాజెక్టుపై వీలైనంత త్వరగా విచారణ పూర్తి చేయాల్సిన అవసరం ఉందని జ్యుడిషియల్ కమిషన్ ఛైర్మన్ జస్టిస్ పినాకీ చంద్ర ఘోష్ తెలిపారు. -
మండుతున్న ఎండలు.. భగ్గుమంటున్న అడవులు
రాష్ట్రవ్యాప్తంగా ఏప్రిల్ నెలలో గతంలో ఎన్నడూ లేనివిధంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పలు జిల్లాల్లో 45 డిగ్రీల సెల్సియస్ దాటుతోంది. -
సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా యువకుడి పొరపాటు
ఇటీవల వెలువడిన యూపీఎస్సీ సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా పూడూరు మండలానికి చెందిన యువకుడు తరుణ్ కుమార్ జాతీయ స్థాయిలో 231 ర్యాంకు సాధించి ఐఏఎస్కు అర్హత సాధించినట్లుగా ప్రచారం జరిగింది. -
భద్రాచలంలో 44 డిగ్రీలు
రాష్ట్రంలో ఎండల తీవ్రత గురువారం కొనసాగింది. అన్ని జిల్లాల్లో 40 డిగ్రీలకుపైనే ఉష్ణోగ్రతలు ఉన్నాయి. అత్యధికంగా భద్రాచలంలో 44 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. -
ఎవరి కోసం చేశారు ఇదంతా...?
రాష్ట్రంలో సంచలనం సృష్టించి ప్రస్తుతానికి స్తబ్దుగా ఉన్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఎన్నికల హడావుడి ముగిసిన తర్వాత మరోమారు ఊపందుకునే అవకాశం ఉంది. -
నాణ్యమైన విత్తనాలనే వాడాలి
పంటల సాగుకు రైతులు నాణ్యమైన విత్తనాలను ఉపయోగించాలని, నాసిరకం విత్తనాలను కొనుగోలు చేసి మోసపోవద్దని వ్యవసాయ శాస్త్రవేత్తలు, విశ్వవిద్యాలయ అధికారులు సూచించారు. -
ఆయిల్పామ్ రైతులను చైతన్యపరచాలి
వేసవికాలంలో ఎండ తీవ్రత, వర్షాభావ పరిస్థితులతో భూగర్భ జలాలు తగ్గునందున ఆయిల్పామ్ మొక్కల సంరక్షణపై రైతులు ఆందోళన చెందకుండా వారిని చైతన్యపరచాలని రాష్ట్ర ఉద్యాన సంచాలకుడు అశోక్రెడ్డి అధికారులను ఆదేశించారు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా