బ్రిజేష్ ట్రైబ్యునల్ తీర్పును నోటిఫై చెయ్యొద్దు
బ్రిజేష్కుమార్ ట్రైబ్యునల్ తీర్పును నోటిఫై చేయాలన్న కర్ణాటక వాదనను తెలంగాణ వ్యతిరేకించింది. 2013లో ట్రైబ్యునల్ తీర్పు వస్తే ఇప్పటివరకు కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వలేదని, సుప్రీంకోర్టు ఇచ్చే తుది
ప్రాజెక్టులు కట్టలేకపోతున్నామన్న కర్ణాటక వాదన అవాస్తవం
దాని అభ్యర్థనను తిరస్కరించండి
సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన తెలంగాణ
కర్ణాటక మధ్యంతర పిటిషన్పై నేడు విచారణ
ఈనాడు హైదరాబాద్: బ్రిజేష్కుమార్ ట్రైబ్యునల్ తీర్పును నోటిఫై చేయాలన్న కర్ణాటక వాదనను తెలంగాణ వ్యతిరేకించింది. 2013లో ట్రైబ్యునల్ తీర్పు వస్తే ఇప్పటివరకు కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వలేదని, సుప్రీంకోర్టు ఇచ్చే తుది తీర్పునకు లోబడి అమలుచేసేలా నిర్ణయం తీసుకోవాలని కోరుతూ కర్ణాటక ఈ నెల తొలివారంలో సర్వోన్నత న్యాయస్థానంలో మధ్యంతర పిటిషన్ వేసింది. దీనిపై కోర్టు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్రల అభిప్రాయాలను కోరింది. ఈ నేపథ్యంలో కర్ణాటక అభ్యర్థనను వ్యతిరేకిస్తూ కొద్దిరోజుల క్రితం ఆంధ్రప్రదేశ్.. తాజాగా తెలంగాణ, మహారాష్ట్రలు అఫిడవిట్లు దాఖలు చేశాయి. కర్ణాటక వినతికి తెలంగాణ వ్యతిరేకత తెలపగా, మహారాష్ట్ర అనుకూలంగా స్పందించింది.
బ్రిజేష్కుమార్ ట్రైబ్యునల్ 2010లో అంతర్రాష్ట్ర జలవివాద చట్టంలోని సెక్షన్ 5(2) ప్రకారం మొదటి తీర్పు ఇచ్చింది. దీనికి వ్యతిరేకంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సుప్రీంకోర్టుకు వెళ్లి స్టే కోరగా, అభ్యంతరాలను ట్రైబ్యునల్కే చెప్పుకొనే వీలున్నందున దానిని వినియోగించుకోవాలంది. తర్వాత అవసరమైతే తమను ఆశ్రయించవచ్చంది. తదుపరి వాదనల అనంతరం 2013 నవంబరులో తుది తీర్పు ఇవ్వగా, దానిని వ్యతిరేకిస్తూ మళ్లీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్(ఎస్.ఎల్.పి.) వేసింది. పునర్విభజన తర్వాత తెలంగాణ ఇందులో భాగస్వామి అయ్యింది. అప్పటి నుంచి ఈ ఎస్.ఎల్.పి.లు విచారణలో ఉండగా, తుది తీర్పునకు లోబడి కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చేలా ఆదేశించాలని కర్ణాటక మధ్యంతర పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై సోమవారం సుప్రీంకోర్టు విచారణ జరపనుంది.
మా అవసరాలను పట్టించుకోలేదు: తెలంగాణ
కృష్ణా జలవివాద ట్రైబ్యునల్-1, 2 తెలంగాణ అవసరాలను పట్టించుకోలేదని, న్యాయపరంగా దక్కాల్సిన వాటాను రాబట్టడంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విఫలమైందని తెలంగాణ పేర్కొంది. బచావత్ ట్రైబ్యునల్ 75 శాతం నీటి లభ్యత ఆధారంగా మహారాష్ట్ర, కర్ణాటకలకు చేసిన కేటాయింపులపై సమస్య లేదంది.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య వాదనలు జరుగుతున్నాయని తెలిపింది. కృష్ణా ట్రైబ్యునల్-2 ఇచ్చిన రెండు తీర్పులను వ్యతిరేకిస్తామని పేర్కొంది. 75 శాతం నీటి లభ్యత ప్రకారం కేటాయింపులు జరపడం వల్లే ఎగువన ప్రవాహాన్ని ఆపుతున్నారంది. ఆక్కడ ప్రాజెక్టులు నిండి, వినియోగం కూడా జరిగాకే దిగువకు వదులుతున్నారని తెలిపింది. కృష్ణా, తుంగభద్ర రెండు నదుల్లోనూ ఈ పరిస్థితి ఉందని పేర్కొంది. ఫలితంగా నీటి లభ్యత తక్కువగా ఉన్న సంవత్సరాల్లో తెలంగాణకు దైన్యస్థితి తప్పటం లేదని వివరించింది. మొదటి ట్రైబ్యునల్ 2130 టీఎంసీల నీటి లభ్యత తర్వాత క్యారీఓవర్ స్టోరేజికి అవకాశం కల్పించగా, ట్రైబ్యునల్-2 ఇందులో మార్పులు చేసిందని తెలంగాణ తెలిపింది. కర్ణాటక ఆలమట్టిలో 130 టీఎంసీల వినియోగానికి ట్రైబ్యునల్-2 తీర్పునకు ముందే ఏర్పాటు చేసుకొందని, గేటుపైన ప్లేటు పెట్టడమే మిగిలిందని, సింగటలూరు, అప్పర్తుంగ సహా అన్నిచోట్లా ఇదే పరిస్థితని పేర్కొంది. బ్రిజేష్ ట్రైబ్యునల్ తీర్పును నోటిఫై చేయకపోవడంతో నీటి కేటాయింపుల ఆధారంగా ప్రాజెక్టులు కట్టుకోలేకపోతున్నామని కర్ణాటక పేర్కొనడం సత్యదూరమంది. వారి వాదన సరైంది కానందున పిటిషన్ను తిరస్కరించాలని కోరింది.
వినియోగానికి అనుమతించాలి: కర్ణాటక
ఆంధ్రప్రదేశ్, తెలంగాణల అభ్యంతరాలపై తన సమాధానాలను కర్ణాటక తాజాగా సుప్రీంకోర్టుకు సమర్పించింది. తమకు న్యాయంగా దక్కాల్సిన వాటాను అడ్డుకోవడానికి ఆంధ్రప్రదేశ్ నిరంతరం ప్రయత్నిస్తోందని పేర్కొంది. అప్పర్ కృష్ణాలో 2022 జూన్ నుంచి 75 టీఎంసీల నీటిని వినియోగించుకోవడానికి అనుమతించాలని కోరింది. తుది తీర్పునకు లోబడి అది అమలై గెజిట్లో ప్రచురించేలా కేంద్రాన్ని ఆదేశించాలని అభ్యర్థించింది. ఎనిమిదేళ్లుగా కృష్ణా ట్రైబ్యునల్-2 తీర్పును అమలుచేయకపోవడం వల్ల కేటాయించిన నీటిని వినియోగించుకోలేకపోతున్నామని మహారాష్ట్ర పేర్కొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బోన్మ్యారో మార్పిడితో యువకుడికి పునర్జన్మ
ఓ రకమైన రక్త క్యాన్సర్తో బాధపడుతున్న యువకుడికి హైదరాబాద్లోని ప్రభుత్వ ఎంఎన్జే ఆసుపత్రి పునర్జన్మ ప్రసాదించింది. -
ఫిర్యాదు రాగానే లావాదేవీ నిలిపివేయాలి: ఆర్బీఐకి తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో సూచన
సైబర్ నేరాల దర్యాప్తులో దేశానికే మార్గదర్శకంగా ఉన్న తెలంగాణ పోలీసుశాఖ మరో ముందడుగు వేసింది. -
మా వాళ్లు ఏం చెబితే.. అది చేయ్.. అన్నీ నేను చూసుకుంటా..
మాజీ మంత్రి వివేకా హత్య కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరి మరికొన్ని సంచలన విషయాలు బయటపెట్టారు. -
జగన్ భక్త ఐపీఎస్లపై వేటు
అధికార వైకాపాతో అంటకాగుతూ... గత ఐదేళ్లుగా ఆ పార్టీ అరాచకాలకు అడుగడుగునా కొమ్ముకాస్తూ వచ్చిన ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారులపై ఎన్నికల సంఘం ఎట్టకేలకు బదిలీ వేటు వేసింది. -
ఆస్తులు వేల కోట్లు.. చూపింది వందల కోట్లు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పులివెందుల నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్న ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తన అఫిడవిట్లో ఆస్తుల విలువ తక్కువగా చూపించారు. -
ఏబీ వెంకటేశ్వరరావు పిటిషన్పై క్యాట్ విచారణ 29కి వాయిదా
ఆంధ్రప్రదేశ్కు చెందిన ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ వివాదంపై హైదరాబాద్లోని కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ (క్యాట్) విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది. -
తాగునీటికి.. మూసీ శుద్ధికి
ఒక్క ప్రాజెక్టుతో రెండు ప్రయోజనాలు నెరవేరబోతున్నాయి. గజ్వేల్ నియోజకవర్గంలోని కొండపోచమ్మ రిజర్వాయర్ నుంచి పైపులైను ద్వారా తాగునీటిని హైదరాబాద్కు తరలించడం ద్వారా రాజధాని పరిధిలో తాగునీటి అవసరాలను సంపూర్ణంగా తీర్చడంతోపాటు, మురికి కూపంగా మారిన మూసీని ప్రక్షాళన చేయబోతున్నారు. -
గరం.. గరం
రాష్ట్రంలో ఎక్కడో ఒకచోట రోజూ 45 గరిష్ఠ ఉష్ణోగ్రత డిగ్రీలకు తాకుతుండటం ఆందోళన కలిగిస్తోంది. మంగళవారం మిర్యాలగూడలో 45.1 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. -
కూలిన మానేరు వాగు వంతెన గడ్డర్లు
పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలను అనుసంధానిస్తూ మానేరు వాగుపై నిర్మాణంలో ఉన్న వంతెన గడ్డర్లు సోమవారం రాత్రి నేలకూలాయి. -
ఎక్సైజ్ అధికారుల బదిలీల్లో మినహాయింపులెందుకు?
ఎన్నికల సందర్భంగా నిర్వహించే బదిలీల్లో ఎక్సైజ్ అధికారులకు మినహాయింపు ఎందుకు ఇచ్చారో తెలపాలని హైకోర్టు మంగళవారం ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించింది. -
ఆశలు ఆవిరి.. మూగజీవాలకు వదిలి..
విత్తనోత్పత్తి వరి సాగు చేపట్టిన రైతులకు కన్నీళ్లే మిగిలాయి. పంట పొట్టదశలో నీటి తడులు అందక ఎదుగుదల లోపిస్తోంది. -
26న ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ రాక
ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ ఈ నెల 26న రాష్ట్రానికి రానున్నారు. పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు. ఇందుకు ఏర్పాట్లు చేయాలని సీఎస్ ఎ.శాంతికుమారి ఉన్నతాధికారులను ఆదేశించారు. -
రక్షణ చర్యలు లేకపోవడం వల్లే ఎస్బీ ఆర్గానిక్స్లో పేలుడు
సంగారెడ్డి జిల్లా హత్నూర మండలంలోని ఎస్బీ ఆర్గానిక్స్లో ఇటీవల జరిగిన ప్రమాదానికి సరైన భద్రతా చర్యలు లేకపోవడమే కారణమని ఐఐసీటీ (ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ) మాజీ చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ బాబురావు అభిప్రాయపడ్డారు. -
టీ-సాట్ ఆధ్వర్యంలో నేడు, రేపు ‘నీట్’ పాఠ్యాంశాల ప్రత్యక్ష ప్రసారం
మే 5న నిర్వహించే ‘నీట్’ పరీక్షపై టీ-సాట్ నెట్వర్క్ ఛానళ్లు ప్రత్యేక పాఠ్యాంశాలను ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నట్లు టీ-సాట్ సీఈవో బి.వేణుగోపాల్రెడ్డి మంగళవారం తెలిపారు. -
ఇదీ సంగతి!
ఆదాయంలోనే కాదు సార్.. కేసుల్లో కూడా ఏ సీఎం మీ దరిదాపుల్లోకి రాలేరు సార్! -
నేడు ఇంటర్ ఫలితాలు
ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షల ఫలితాలు బుధవారం విడుదల కానున్నాయి. -
రుణం ఎగవేత కేసులో రూ.55.73 కోట్ల ఆస్తుల జప్తు
వ్యాపారం కోసం రుణం తీసుకొని సొంత ఖాతాల్లోకి మళ్లించుకొని బ్యాంకుల్ని మోసం చేసిన కేసులో వీఎంసీ సిస్టమ్స్ లిమిటెడ్కు చెందిన రూ.55.73 కోట్ల స్థిర, చరాస్తులను హైదరాబాద్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
నేటి నుంచి కాళేశ్వరంపై న్యాయ విచారణ
కాళేశ్వరం ఎత్తిపోతల నిర్మాణంపై బుధవారం నుంచి జ్యుడిషియల్ విచారణ ప్రారంభం కానుంది. -
బాబ్లీ కేసు విచారణ మే 7కు వాయిదా
బాబ్లీ ప్రాజెక్టు ముట్టడి కేసు విచారణ వచ్చే నెల 7కు వాయిదా పడింది. -
పుట్టుకతోనే కాలేయ వ్యాధి.. మా బాబును ఆదుకోండి!
రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబం.. లేక లేక కలిగిన సంతానం.. పెళ్లైన తొమ్మిదేళ్లకు బాబు పుట్టాడు. కూలి పనులు చేసుకుని జీవనం సాగించే ఆ దంపతులకు బిడ్డ పుట్టాడన్న ఆనందం ఎంతోసేపు నిలవలేదు. -
యాదాద్రిలో వైభవంగా తెప్పోత్సవం
చైత్ర పౌర్ణమిని పురస్కరించుకొని యాదాద్రి దివ్యక్షేత్రంలో మంగళవారం తెప్పోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. శ్రీలక్ష్మీనరసింహులను ముస్తాబు చేసి మంగళ వాయిద్యాల నడుమ కొండపైన ఉన్న విష్ణు పుష్కరిణి వద్దకు ఊరేగింపుగా తీసుకెళ్లారు.
తాజా వార్తలు (Latest News)
-
మనసుకీ వ్యాయామం ముఖ్యమే.. వేదాంత అధిపతి హెల్త్ టిప్స్
-
14 ఓవర్ల వరకూ మాదే పైచేయి.. ఆ ఒక్క కారణంతోనే మా ఓటమి: రుతురాజ్
-
సుప్రీం సీరియస్.. మరోసారి పతంజలి బహిరంగ క్షమాపణలు
-
వేడుకగా ‘ఆదికేశవ’ నటి వివాహం.. ఫొటో వైరల్
-
యువతరం.. వైవిధ్యమే తొలి విజయం: స్టార్ నటులు మెచ్చిన యంగ్ హీరోలెవరంటే?
-
బతిమాలినా..భయపెట్టినా.. ఉండేదేలే..!