పథకాలతో జీవనశైలి మారాలి
ప్రజాసేవ కోసమే పదవులు తప్ప, అధికారం చలాయించడానికి కాదని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. తాను సేవ చేయాలని కోరుకుంటున్నానే తప్ప, అధికారాన్ని కాదని అన్నారు. ఆదివారం ‘మన్ కీ బాత్’
మన్ కీ బాత్లో ప్రధాని మోదీ
దిల్లీ: ప్రజాసేవ కోసమే పదవులు తప్ప, అధికారం చలాయించడానికి కాదని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. తాను సేవ చేయాలని కోరుకుంటున్నానే తప్ప, అధికారాన్ని కాదని అన్నారు. ఆదివారం ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో భాగంగా ఆయన ఆయుష్మాన్ భారత్ పథకం లబ్ధిదారులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఓ లబ్ధిదారుడు మోదీ అధికారంలో కొనసాగాలంటూ ఆకాంక్షించారు. దీనిపై స్పందిస్తూ ‘‘నేను ఈ రోజు కూడా అధికారంలో లేను. భవిష్యత్తులో కూడా ఉండాలని అనుకోవడం లేదు. సేవ చేయాలని మాత్రమే కోరుకుంటున్నా. ప్రధాని పదవి అధికారం కోసం కాదు. సేవ చేయడం కోసమే’’ అని చెప్పారు. ప్రభుత్వ పథకాల కారణంగా జీవన విధానం మారితే అది చాలా సంతోషం కలిగిస్తుందని అన్నారు. ఆయుష్మాన్ భారత్తో తమ జీవితాలు మారాయని లబ్ధిదారులు ప్రధానికి వివరించారు.
మూడు అంశాల్లో విజృంభిస్తున్న యువత
దేశంలోని యువత అందిస్తున్న సేవలను ప్రధాని మోదీ ప్రత్యేకంగా ప్రస్తావించారు. మూడు అంశాలు....‘నవీన ఆవిష్కరణలు’, ‘రిస్కు తీసుకోవడంపై అనురక్తి’, ‘చేయగలమన్న విశ్వాసం’ వారిలో కనిపిస్తున్నాయని చెప్పారు. ఈ మూడు కలిస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయని అన్నారు. ప్రస్తుతం అంతా అంకుర సంస్థలు (స్టార్ట్ అప్స్) గురించే మాట్లాడుతున్నారని, వీటికి భారత దేశం కేంద్ర స్థానంగా మారిందని తెలిపారు. ఏటా కొత్త అంకుర సంస్థలు వస్తున్నాయని, ఈ రంగం శీఘ్రంగా అభివృద్ధి చెందుతోందని చెప్పారు. చిన్న పట్టణాల్లోనూ వీటిని నెలకొల్పుతున్నారని అన్నారు. 70కుపైగా అంకుర సంస్థల విలువ ఒక బిలియన్ డాలర్ల (రూ.7వేల కోట్లు)కు దాటిందని చెప్పారు. ‘‘ఇది గొప్ప విషయం. కరోనా ఉన్నప్పటికీ దేశ యువత ఈ విజయాన్ని సాధించారు. అంకుర సంస్థల ద్వారా ప్రపంచ సమస్యలకు కూడా వారు పరిష్కారం చూపుతున్నారు’’ అని ప్రశంసించారు. అంకుర సంస్థలు విజయం సాధిస్తుండడంతో దేశ, విదేశాలకు చెందిన పెట్టుబడిదారులు ఆర్థికంగా మద్దతు ఇవ్వడానికి ముందుకు వస్తున్నారని చెప్పారు. బస్సుల కాలుష్యాన్ని 40 శాతం మేర తగ్గించడానికి అంకుర సంస్థలను నెలకొల్పిన మయూర్ పాటిల్ అనే యువకునితో ప్రధాని మాట్లాడారు. ప్రభుత్వం మంజూరు చేసిన రూ.90 లక్షల సాయంతో ఆయన ఆ సంస్థను ఏర్పాటు చేశాడు.
సాహసాలకు యుద్ధభూమే అవసరం లేదు
సాహసం చూపించడానికి యుద్ధభూమే అవసరం లేదని, అభివృధ్ధి కార్యక్రమాల్లోనూ వాటిని ప్రదర్శించవచ్చని ప్రధాని మోదీ అన్నారు. బుందేల్ఖండ్లోని జలౌన్ ప్రాంత వాసులు ఎంతో శ్రమించి నూన్ నదిని పునరుద్ధరించారని చెప్పారు. తక్కువ సమయంలో, అతి తక్కువ ఖర్చుతో ఒక నది ప్రవహించేలా చేశారని తెలిపారు. మేఘాలయలో స్థానికులే ఓ నది నీటిని ఎంతో పరిశుభ్రంగా ఉంచుతున్నారని గుర్తుచేశారు. కరోనా ముప్పు ఇంకా తొలగిపోలేదని ప్రధాని మోదీ దేశవాసులను హెచ్చరించారు. తగిన జాగ్రత్తలు తీసుకోవడం అందరి బాధ్యత అంటూ అప్రమత్తం చేశారు.
ఆడియో, సంగీతం ప్లాట్ఫారాల్లో అందుబాటు
మన్ కీ బాత్ కేవలం రేడియా, టీవీ, యూట్యూబ్, నమో యాప్ ద్వారా మాత్రమే కాకుండా ఇకపై ఆడియో, మ్యూజిక్ ప్లాట్ఫారాల్లోనూ అందుబాటులోకి రానుంది. హంగామా, గానా, అమెజాన్ మ్యూజిక్, జియోసావన్, స్పోటిఫై, వింక్ వంటి ప్లాట్ఫారాల ద్వారా కూడా ప్రసారం చేయనున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎడ్సెట్-2024 నోటిఫికేషన్ విడుదల
బీఎడ్ 2024-25లో ప్రవేశాల కోసం ఉన్నత విద్యామండలి తరఫున ఆంధ్ర విశ్వవిద్యాలయం (ఏయూ) శుక్రవారం ఎడ్సెట్ నోటిఫికేషన్ను విడుదల చేసింది. -
‘కౌలు రైతుకు’ జగన్ కాటు!
-
జనం కళ్లలో జగన్ దుమ్ము
సిద్ధం యాత్రలో భాగంగా శుక్రవారం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని ఏడీబీ రోడ్డు మీదుగా సాగుతున్న ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి కాన్వాయ్ ఇది.. మధ్యలో ఒక్కసారి ఆయన బస్సు దిగి చూస్తే రోడ్డు దుస్థితి తెలిసేవి. -
ఐదేళ్లలో భారీగా పెరిగిన బొత్స కుటుంబ ఆస్తి
విజయనగరం జిల్లా చీపురుపల్లి వైకాపా అభ్యర్థి (వైకాపా), మంత్రి బొత్స సత్యనారాయణ కుటుంబ ఆస్తి ఐదేళ్లలో సుమారు రెండున్నర రెట్లు పెరిగింది. -
రోజాకు రూ. 10.63 కోట్ల ఆస్తులు
వైకాపా అధికారంలోకి వచ్చాక నగరి ఎమ్మెల్యే, మంత్రి రోజా ఆర్థిక స్థితిగతులు మారిపోయాయి. 2019లో ఆమె చరాస్తులు రూ.2.74 కోట్లు. ఇప్పుడు రూ.4.58 కోట్లు. -
వివేకా హత్యలో నాపై రెండు క్రిమినల్ కేసులు
వైకాపా తరఫున కడప ఎంపీ అభ్యర్థిగా శుక్రవారం నామినేషన్ దాఖలు చేసిన వైఎస్ అవినాష్రెడ్డి తాను రెండు క్రిమినల్ కేసుల్లో నిందితుడిగా ఉన్నానని అఫిడవిట్లో పేర్కొన్నారు. -
రైతు సదస్సు పేరుతో వైకాపా భోజనాలు
పశ్చిమగోదావరి జిల్లా ఆచంటలో రైతు అవగాహన సదస్సు పేరుతో వైకాపా నాయకులు ఎన్నికల నియమావళిని అతిక్రమించారు. -
ఉద్యోగమే ‘సోర్స్..’ పథకాలు ‘అవుట్’
అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకుసమాన పనికి సమాన వేతనం ఇచ్చి వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా చూస్తామని 2019 ఎన్నికల మ్యానిఫెస్టోలో జగన్ పేర్కొన్నారు. -
గిగ్గోడు వినిపించలేదు
ప్రభుత్వ కొలువులు ఇవ్వరు.. పరిశ్రమల్ని తీసుకురారు.. నైపుణ్య శిక్షణ ఇస్తారా అంటే అదీ లేదు.. దాంతో బతుకు బండి నడవడానికి.. డెలివరీ బాయ్, బైక్ రైడర్ లాంటి పనులు చేస్తూ ‘గిగ్’ కార్మికులుగా మారుతున్నారు యువత. -
దార్శనిక నేత చంద్రబాబు
తెదేపా అధినేత చంద్రబాబు 45 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానాన్ని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు తొమ్మిదేళ్లు, నవ్యాంధ్రకు ఐదేళ్లు కలిసి 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఆయన పరిపాలన సాగిన తీరును కళ్లకు కడుతూ ‘మన చంద్రన్న- అభివృద్ధి, సంక్షేమ విజనరీ’ పేరుతో పార్టీ రాజకీయ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ టీడీ జనార్దన్ పుస్తకం రూపొందించారు. -
జగన్ మాట్లాడుతుంటే జనం వెళ్లిపోయారు
సీఎం జగన్ కాకినాడ గ్రామీణ మండలం అచ్చంపేట కూడలి సమీపంలో నిర్వహించిన మేమంతా సిద్ధం సభలో మొదట్లో కాకినాడ గ్రామీణ అభ్యర్థి కురసాల కన్నబాబు ప్రసంగించారు. -
సిద్ధం సభకు బస్సుల తరలింపు.. ప్రయాణికులకు నరకయాతన
కాకినాడ గ్రామీణంలోని అచ్చంపేట కూడలిలో శుక్రవారం సిద్ధం సభకు పెద్దసంఖ్యలో ఆర్టీసీ బస్సులను తరలించడంతో ప్రయాణికులు నానా అవస్థలు పడ్డారు. -
సామాజికవర్గం పేరుతో మహిళను దూషించిన వైకాపా నేత రాజమోహన్రెడ్డి
‘యానాదోళ్ల అమ్మాయి.. నెత్తిమీద రూపాయి పెడితే 5 పైసల విలువ చేయదు..’ అంటూ వైకాపా నేత, మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్రెడ్డి ఆత్మకూరు ఛైర్పర్సన్ గోపారం వెంకటరమణమ్మను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. -
అన్నదాతలను బలిచేసి.. అస్మదీయులకు ధారపోసి
అరచేతిలో స్వర్గం చూపించడంలో ముఖ్యమంత్రి జగన్ది అందెవేసిన చెయ్యి..! 2019 ఎన్నికలకు ముందు బోలెడు హామీలిచ్చిన ఆయన.. తర్వాత యథావిధిగా వాటిని విస్మరించారు. -
సంక్షేమ పథకాలు ఓట్లు పొందే మార్గాలు కాకూడదు
ప్రభుత్వాలు అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు ఓట్లు సంపాదించే మార్గాలు కాకూడదని యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ రాజనీతిశాస్త్ర విశ్రాంత ఆచార్యులు కొండవీటి చిన్నయసూరి పేర్కొన్నారు. -
తిరుమల శేషాచలం పరిధిలో అగ్నికీలలు
శేషాచలం పరిధిలో తీవ్రమైన ఎండలు, వేడి గాలులతో ఎక్కడికక్కడ అగ్నికీలలు వ్యాపిస్తున్నాయి. శుక్రవారం ఉదయం తిరుమలకు సమీపంలో పెద్దఎత్తున అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. -
ఎన్ఎస్జీ డీజీగా నళిన్ ప్రభాత్
జాతీయ భద్రతా దళం (ఎన్ఎస్జీ) డైరెక్టర్ జనరల్గా నళిన్ ప్రభాత్ నియమితులయ్యారు. ఈయన ఏపీ క్యాడర్కు చెందిన 1992 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. -
మూడు నెలల్లో రూ.300 కోట్ల విలువైన సొత్తు స్వాధీనం
గత మూడు నెలల్లో రాష్ట్రవ్యాప్తంగా సుమారు రూ.300 కోట్ల విలువైన నగదు, వస్తువులు, ఇతర ఉచితాలను స్వాధీనం చేసుకున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా తెలిపారు. -
రాష్ట్రంలో దయనీయ పరిస్థితుల్లో ఉద్యోగ, ఉపాధ్యాయులు
రాష్ట్రంలో అయిదేళ్లుగా ఉద్యోగ, ఉపాధ్యాయులను దయనీయమైన పరిస్థితుల్లోకి నెట్టివేశారని ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక పింఛనర్ల ఐక్యవేదిక ఛైర్మన్ సూర్యనారాయణ అన్నారు. -
కడప కోర్టు ఉత్తర్వులపై ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తా
వివేకా హత్య అంశంపై కడప జిల్లా కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని వివేకా కుమార్తె సునీత స్పష్టం చేశారు. -
భారీగా పెరిగిన శ్రీవారి డిపాజిట్లు
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆదాయం ఏటేటా పెరుగుతోంది. 2023-24లో తితిదే ఏకంగా రూ.1,161 కోట్లను వివిధ బ్యాంకుల్లో ఫిక్సిడ్ డిపాజిట్ చేసింది.