ఝార్ఖండ్కు తెలంగాణ నిఘా వర్గాలు
మావోయిస్టు పార్టీ కీలక అగ్రనేత ప్రశాంత్ బోస్ అలియాస్ కిషన్దా అరెస్ట్ నేపథ్యంలో పార్టీ తాజా స్థితిగతులపై ఆరా తీసేందుకు తెలంగాణ నిఘా వర్గాలు ఝార్ఖండ్లో పర్యటించాయి. 75 ఏళ్ల వయసులో అనారోగ్య
మావోయిస్టు పార్టీ తాజా పరిస్థితులపై ఆరా
కీలక నేత ప్రశాంత్ బోస్ అరెస్ట్ నేపథ్యంలో పర్యటన
ఈనాడు, హైదరాబాద్: మావోయిస్టు పార్టీ కీలక అగ్రనేత ప్రశాంత్ బోస్ అలియాస్ కిషన్దా అరెస్ట్ నేపథ్యంలో పార్టీ తాజా స్థితిగతులపై ఆరా తీసేందుకు తెలంగాణ నిఘా వర్గాలు ఝార్ఖండ్లో పర్యటించాయి. 75 ఏళ్ల వయసులో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న కిషన్దా ఝార్ఖండ్ గిరిఢ్ అడవుల్లోని ప్రశాంత్హిల్స్ నుంచి చికిత్స నిమిత్తం బయటికి వచ్చిన క్రమంలో ఇటీవల అక్కడి పోలీసులకు చిక్కిన సంగతి తెలిసిందే. దక్షిణాది, ఉత్తరాది, ఈశాన్య రాష్ట్రాల్లోని మావోయిస్టు పార్టీ నేతలకు అతనే వారధిగా ఉన్నాడు. 2004లో దక్షిణ భారతంలో బలంగా ఉన్న సీపీఐ-పీపుల్స్వార్, ఉత్తరాదిన బలంగా ఉన్న భారత మావోయిస్టు కమ్యూనిస్ట్ సెంటర్(ఎంసీసీఐ) కలిసి సీపీఐ మావోయిస్టు పార్టీగా అవతరించాయి. ఆ సమయంలో ఎంసీసీఐకి ప్రశాంత్ బోస్ సారథ్యం వహించాడు. అప్పట్లో మావోయిస్టు పార్టీకి పీపుల్స్వార్ అగ్రనేత గణపతి కార్యదర్శిగా ఎన్నికయ్యాడు. ప్రశాంత్బోస్ రెండో స్థానంలో ఉంటూ పొలిట్బ్యూరో, కేంద్ర మిలిటరీ కమిషన్(సీఎంసీ) సభ్యుడిగా కొనసాగాడు. బిహార్, ఝార్ఖండ్తోపాటు ఈశాన్య రాష్ట్రాల్లో పార్టీ కార్యకలాపాల్ని పర్యవేక్షించాడు. మణిపుర్, నాగాలాండ్, అస్సాం లాంటి ఈశాన్య రాష్ట్రాల్లోని వేర్పాటువాద నక్సల్స్ పార్టీలతో అనుసంధాన ప్రక్రియలో నిమగ్నమయ్యాడు. నేపాల్ మావోయిస్టు పార్టీతోనూ సంబంధాలు నెరపడంలో కీలకంగా వ్యవహరించాడు. ఒకట్రెండు సార్లు పొలిట్బ్యూరో సభ్యుడు మల్లోజుల కోటేశ్వరరావు అలియాస్ కిషన్జీ (2010లో పశ్చిమబెంగాల్లో ఎన్కౌంటర్లో మృతిచెందారు)తో కలిసి నేపాల్కు సైతం వెళ్లివచ్చాడు. పార్టీలో ప్రాధాన్యం కలిగిన అతడి వద్ద కీలక సమాచారం ఉంటుందనే అంచనాతో తెలంగాణ నిఘావర్గాలు సహా దేశంలోని పలు రాష్ట్రాలకు చెందిన పోలీసులు ఝార్ఖండ్కు ఇటీవల వెళ్లారు.
2017లో గణపతితో ఆఖరి భేటీ!
కొంతకాలంగా ఝార్ఖండ్ గిరిఢ్ అడవుల్లో ఉన్న ప్రశాంత్ బోస్ అనారోగ్యంతో బాధపడుతున్నట్లు అప్పటికే దర్యాప్తు బృందాల వద్ద సమాచారమున్నా అతడు పక్షవాతంతో బాధపడుతున్నట్లు అరెస్ట్ తర్వాత వెల్లడైంది. అతడు చివరిసారిగా 2017లో అబూఝ్మాడ్కు వెళ్లి గణపతిని కలిసినట్లు తాజాగా గుర్తించారు. పార్టీలోని కీలక నేతలు ఆ సమయంలో భేటీ అయినట్లు సమాచారం సేకరించారు. అనారోగ్యంతో ఉన్న ప్రశాంత్ బోస్ను కొంతకాలంగా కీలక కార్యకలాపాలకు దూరంగా ఉంచినట్లు గుర్తించారు. ఉత్తరాది, ఈశాన్య రాష్ట్రాల్లో పార్టీ కార్యకలాపాల్ని పాత ఎంసీసీఐకే చెందిన మరో అగ్రనేత ద్వారా నిర్వహిస్తున్నట్లు తేలిందని తెలంగాణ నిఘావర్గానికి చెందిన ఓ ఉన్నతాధికారి తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పతి దేవుడికి గుడి కట్టింది!
కరోనా మహమ్మారి ఆమె జీవితంలో అంతులేని విషాదాన్ని నింపింది. కళ్లల్లో పెట్టుకుని చూసుకునే భర్తను తన నుంచి దూరం చేసింది. మూడేళ్ల క్రితం భర్త కొవిడ్తో మృతి చెందడంతో ఆమె ఒంటరిగా మారారు. -
కొత్తవారొచ్చారు
ఆంధ్రప్రదేశ్ నిఘా విభాగాధిపతిగా సీనియర్ ఐపీఎస్ అధికారి కుమార్ విశ్వజిత్ను, విజయవాడ నగర పోలీసు కమిషనర్గా పీహెచ్డీ రామకృష్ణను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. -
జేఈఈ మెయిన్స్లో తెలుగోళ్ల సత్తా
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. దేశవ్యాప్తంగా 56 మందికి 100 పర్సంటైల్ రాగా.. ఇందులో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందినవారే 22 మంది ఉన్నారు. జేఈఈ మెయిన్స్ తుది ఫలితాలను జాతీయ పరీక్షల విభాగం (ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసింది. -
కాళేశ్వరంపై కమిషన్ విచారణ షురూ
కాళేశ్వరం ఎత్తిపోతల్లోని బ్యారేజీలపై న్యాయ విచారణకు ఏర్పాటు చేసిన కమిషన్ కార్యాచరణ మొదలుపెట్టింది. బుధవారం కమిషన్ ఛైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ ఆయన సతీమణి దేబ్జానీ ఘోష్తో కలిసి హైదరాబాద్కు చేరుకున్నారు. -
ఫస్టియర్లో 60.01%.. సెకండియర్లో 64.19%
ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో 60.01 శాతం, రెండో సంవత్సరంలో 64.19 శాతం మంది విద్యార్థులు (ఒకేషనల్ కోర్సులతో కలిపి) ఉత్తీర్ణత సాధించారు. -
కవిత బెయిల్పై మే 6న తీర్పు
ఈడీ కేసులో బెయిల్ కోసం భారాస ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్పై తీర్పును ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు మే 6కి వాయిదా వేసింది. -
చదువుల ‘సిరి’.. రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని పట్టుదల
వారానికి రెండుసార్లు డయాలసిస్.. ఒంట్లో సత్తువ లేక కళాశాలకూ వెళ్లలేని పరిస్థితి.. అయినా మొక్కవోని పట్టుదలతో చదివిన పేదింటి బిడ్డ ప్రతిభ చాటింది. -
విజన్-2026కు డోర్నకల్ ఉపాధ్యాయుల శ్రీకారం
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు విజన్-2026 పేరిట ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. -
ఇంటర్ ఫలితాల్లో కవలల ప్రతిభ
సూర్యాపేట జిల్లా ఆత్మకూర్(ఎస్) మండల కేంద్రానికి చెందిన డేగల వీరభద్రయ్య, మంజుల దంపతుల కవల పిల్లలు డేగల రామ్, లక్ష్మణ్ ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో ప్రతిభ చూపారు. -
రాష్ట్రంలో వంతెనల పరిశీలన..!
రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న చిన్నా, పెద్ద వంతెనలను పరిశీలించేందుకు అధికారులు ఆయత్తం అవుతున్నారు. జిల్లాల వారీగా నిర్మాణ స్థితిగతులపై జాబితాలను రూపొందించే పనిలో ఉన్నారు. -
యాదాద్రి విద్యుత్కేంద్రానికి పర్యావరణ అనుమతి
యాదాద్రి థర్మల్ విద్యుత్కేంద్రానికి పర్యావరణ అనుమతి (ఈసీ) ఇవ్వడానికి కేంద్ర పర్యావరణ శాఖ ఆమోదం తెలిపింది. -
మెట్రో రైలు శబ్దకాలుష్యంపై వివరణివ్వండి
మెట్రో రైల్వే లైను వంపుల్లో రైలు వెళ్లినపుడు పరిమితికి మించి వస్తున్న శబ్దకాలుష్యంపై వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వానికి, మెట్రో రైల్వే ఎండీకి బుధవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
ఆర్జేసీ, మోడల్, కేజీబీవీ విద్యార్థుల ప్రతిభ
టీఎస్ఆర్జేసీ నేరెళ్ల గురుకుల విద్యార్థిని ఎంపీసీలో 991 మార్కులు, బైపీసీలో తాటిపల్లి విద్యార్థిని 990 మార్కులు సాధించినట్లు యాజమాన్యం తెలిపింది. -
ఫోన్ ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావుకు మధ్యంతర బెయిలు నిరాకరణ
ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టయిన టాస్క్ఫోర్స్ మాజీ ఓఎస్డీ రాధాకిషన్రావుకు ఎల్ఎల్ఎం పరీక్షలు రాసేందుకు వీలుగా మధ్యంతర బెయిలు ఇచ్చేందుకు నాంపల్లి కోర్టు నిరాకరించింది. -
పోలింగ్ రోజు వేతనంతో కూడిన సెలవు
లోక్సభ ఎన్నికల పోలింగ్ జరిగే రోజును వేతనంతో కూడిన సెలవుగా ప్రకటించారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్రాజ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
జస్టిస్ రామలింగేశ్వరరావుకు హైకోర్టు ఘన నివాళి
గుండెపోటుతో ఇటీవల మృతి చెందిన ఉమ్మడి హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎ.రామలింగేశ్వరరావుకు బుధవారం హైకోర్టు ఘన నివాళి అర్పించింది. -
శనగ విత్తనోత్పత్తి రైతుల ఆందోళన
‘పంట విక్రయించి నెల రోజులవుతోంది. డబ్బులు ఎప్పుడు ఇస్తారో.. క్వింటాకు ఎంత కట్టిస్తారో ఇప్పటికీ తెలియదు. -
విచారణ నుంచి తప్పుకొన్న జస్టిస్ శేషసాయి ధర్మాసనం
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసుపై మాట్లాడొద్దంటూ కడప జిల్లా కోర్టు(పీడీజే) ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ వివేకా కుమార్తె నర్రెడ్డి సునీత, పులివెందుల తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.రవీంద్రనాథ్రెడ్డి అలియాస్ బీటెక్ రవి దాఖలు చేసిన వ్యాజ్యాల విచారణ నుంచి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏవీ శేషసాయి నేతృత్వంలోని ధర్మాసనం తప్పుకొంది. -
ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఇంటర్ ప్రవేశాలు
రాష్ట్రంలోని ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో ప్రవేశాల పేరిట డొనేషన్లు, అధిక రుసుముల వసూళ్లు, ఇతరత్రా అక్రమాలను నిరోధించేందుకు వీలుగా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఆన్లైన్ ప్రవేశాల విధానాన్ని ప్రవేశపెట్టాలని యోచిస్తున్నామని విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. -
మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ
ష్ట్రంలో మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. షెడ్యూలును విద్యాశాఖ బుధవారం విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు (4)
రాష్ట్రంలో వచ్చే నెల 6వ తేదీన జరగనున్న తెలంగాణ రాష్ట్ర ఇంజినీరింగు కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (టీఎస్ఈసెట్)ను మే చివరి వారానికి వాయిదా వేయాలని పలువురు అభ్యర్థులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని కోరారు.
తాజా వార్తలు (Latest News)
-
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ
-
నా వ్యాఖ్యలను అపార్థం చేసుకోవడంతోనే సమస్య: అంబటి రాయుడు
-
‘రాంచీలో ఉన్నా.. రూ.600 కావాలి’.. ధోనీ పేరుతో మెసేజ్ వైరల్
-
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ
-
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్
-
అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్ కీలక ప్రతిపాదన!