ధరణిలో ప్రతి సమస్యకూ పరిష్కారం!
భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం కనుగొనేందుకు ధరణి సమస్యలపై ఏర్పాటు చేసిన మంత్రి వర్గ ఉప సంఘం ప్రాథమిక జాబితాను రూపొందించింది. ఇప్పటికే రెండుసార్లు సమావేశమైన సంఘం దృష్టికి కీలక సమస్యలు
46 అంశాలతో జాబితా ఖరారు
మాడ్యూళ్ల ఏర్పాటు తప్పనిసరి
కసరత్తు చేస్తున్న మంత్రి వర్గ ఉపసంఘం
ఈనాడు - హైదరాబాద్
భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం కనుగొనేందుకు ధరణి సమస్యలపై ఏర్పాటు చేసిన మంత్రి వర్గ ఉప సంఘం ప్రాథమిక జాబితాను రూపొందించింది. ఇప్పటికే రెండుసార్లు సమావేశమైన సంఘం దృష్టికి కీలక సమస్యలు వచ్చాయి. వాటిలో 46 సమస్యలకు ధరణి పోర్టల్లో సరైన మాడ్యూళ్లు లేవని గుర్తించారు. భూ యజమానులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పూర్తిగా తొలగించాలంటే పోర్టల్లో మరిన్ని ఆప్షన్లు ఏర్పాటు చేయాలనే ఆలోచనకు వచ్చారు. ప్రస్తుతం ధరణిలో 31 సేవలు, 10 సమాచార మాడ్యూళ్లు అందుబాటులో ఉన్నాయి. భూసమస్యలపై విజ్ఞప్తులకు కూడా ఒక మాడ్యూల్్ ఉన్నా. అది దరఖాస్తులను స్వీకరించడానికే పరిమితమవుతోంది. ఈ సమస్యపైనా దృష్టిసారించిన ఉపసంఘం.. రైతులెవ్వరూ ఇబ్బందులు పడకుండా సాంకేతికంగా మార్పులు చేయాలని అభిప్రాయపడినట్లు తెలిసింది. ఇకపై ప్రతి సమస్యకు పరిష్కారం దొరికేలా పోర్టల్లో ఏర్పాట్లు ఉండేలా యంత్రాంగం చర్యలు తీసుకోవాలని, ఇందుకు కసరత్తు చేయాలని పేర్కొన్నట్లు సమాచారం. మంత్రి వర్గ ఉపసంఘం ప్రభుత్వానికి నివేదిక అందించిన తరువాత ధరణిలో మార్పులు చేర్పులు చేపట్టనున్నారు.
సమస్యల్లో కొన్ని
* ధరణి రిజిస్ట్రేషన్లకు సంబంధించి 8 రకాల సమస్యలు ఉన్నాయి. రెవెన్యూ రికార్డులకు సంబంధించినవి కూడా 8 ఉన్నాయి. మొత్తం 46 సమస్యలకు తప్పనిసరిగా ధరణిలో మాడ్యూళ్లు ఏర్పాటు చేయాలి. దీనికి అనుగుణంగా ఏం చర్యలు చేపట్టాలో ఉపసంఘం సూచనలను సిద్ధం చేసింది.
* మూల సర్వే నంబరు కన్నా తగ్గి లేదా ఎక్కువగా నమోదైన విస్తీర్ణం.. ఎసైన్డ్ భూమి పట్టాగా నమోదు కావడం, పట్టా భూమి ఎసైన్డ్గా నమోదు కావడం. భూమి సేకరించిన తీరు. కొన్నిచోట్ల పట్టాదారుల పేర్ల స్థానంలో ఇతరుల పేరు నమోదు. తప్పిపోయిన సర్వే నంబర్లు, కొన్ని విస్తీర్ణాలు ఖాతా నంబరు 99999లో నమోదైనవి.
* ఇనాం భూములకు ఓఆర్సీ పత్రాలు జారీ చేసి హక్కులు కల్పించడం. కొత్త పట్టాదారులకు ఖాతాల ఏర్పాటు. తప్పిపోయిన సర్వే నంబరు తిరిగి నమోదు.
* నిషేధిత జాబితాలో నమోదైన భూముల తొలగింపు.
* ఎన్కంబర్స్మెంట్ సర్టిఫికెట్(ఈసీ) పరిశీలనకు అవకాశం. ధరణి ద్వారా ఈసీ, మార్కెట్ విలువ నిర్ధారణ ధ్రువపత్రాలు పొందేందుకు ఏర్పాటు.
* మూల సర్వే నంబరు ఆధారంగా భూయజమాని ఎవరనేది పరిశీలించుకునే అవకాశం.
* సిటిజన్ లాగిన్లో తప్పుగా నమోదైన భూ విస్తీర్ణాన్ని సరిచేసుకోవడం.
* ధరణి రిజిస్టర్ డాక్యుమెంట్ పొందడం.
* ప్రాపర్టీ నిర్వహణకు పవర్ ఆఫ్ అటార్నీ, లీజు బదిలీ, లీజు రద్దు, విక్రయ ధ్రువీకరణ పత్రం, కన్వేయన్స్ డీడ్, ఎక్స్ఛేంజి డీడ్
* ఒక సర్వే నంబరులోని సగం భూమికి వారసత్వ బదిలీ అవకాశం.
* ఆర్డీవోలు ప్రొసీడింగ్ చేసిన నాలా భూముల మార్పిడి.
* రెండు ఖాతాలు నమోదు కాగా రద్దు చేసి ఒక్క ఖాతాగా మార్చాలి.
* పెండింగ్ మ్యుటేషన్లకు పెట్టుకున్న దరఖాస్తులు గడువు తీరిపోయాయి. తిరిగి అవకాశం.
* ఆధార్ అనుసంధాన సమస్యలు.
* వ్యవసాయ భూమి నాలా కింద నమోదు కావడం, నాలా మార్పిడి అయిన భూమి వ్యవసాయ భూమిగా చూపుతుండటం.
* కొన్ని సర్వే నంబర్లు పోర్టల్లో కనిపించకుండా పోవడం. కోర్టు తీర్పు లేదా డిక్రీ ప్రకారం సర్వే నంబరులోని సగం భూమికి హక్కులు మార్చడం.
* ఖాతాలు తప్పిపోయినవి, లేదా నమోదు కానివి.
* నిషేధిత జాబితాలో ప్రభుత్వ భూమి నమోదు.
* ఒక సర్వే నంబరులో కొంత భూమిని విక్రయించిన తరువాత ధరణిలో ఆ భూమి స్కెచ్ ఉండటం లేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సమస్య ఓ చోట.. సమర్పించేది మరోచోట
ధ్రువపత్రాల సమర్పణలో పొరపాట్లతో తిరస్కరణకు గురైన పాస్పోర్టు దరఖాస్తుదారుల్లో గందరగోళం నెలకొంటోంది. పాస్పోర్టు సేవాకేంద్రాల్లో సమర్పించాల్సిన ధ్రువపత్రాలను రీజనల్ సేవా కేంద్రంలో సమర్పిస్తుండడమే దీనికి కారణం -
రెండు రాష్ట్రాలు.. రెండు ఓట్లు!
సాధారణంగా ఓటరు ఒక్కసారే ఓటు వేయాల్సి ఉంటుంది. ఎన్నికల కమిషన్(ఈసీ) కూడా అదే చెబుతుంది. -
50 ఏళ్ల తరువాత.. నవమి రోజున సీతారాముల కల్యాణం
దేశంలోని ప్రధాన రామాలయాల్లో ఏటా శ్రీరాముడి జన్మ నక్షత్రమైన పునర్వసు (శ్రీరామ నవమి) శుభ ఘడియల్లో సీతారాముల కల్యాణం నిర్వహిస్తారు. -
సీతమ్మను మనువాడె భద్రాద్రి రామయ్య
భద్రాచలంలో శ్రీ సీతారామచంద్రస్వామి వార్షిక కల్యాణోత్సవం అశేష భక్తజనుల జయజయధ్వానాల నడుమ ఆద్యంతం వైభవోపేతంగా సాగింది. -
చెలమల నీళ్లే గొంతు తడుపుతున్నాయ్
రాష్ట్రంలోని ఏజెన్సీ గ్రామాలు, ఆవాసాల్లో తాగునీటి కటకట నెలకొంది. తాగునీటి సరఫరా ప్రాజెక్టుల నిర్మాణం, నిర్వహణలో లోపాలు, ప్రణాళిక లేమితో గిరిజనులకు రక్షిత జలం అందక.. కాలువలు, చెలమల్లోని నీళ్లే దిక్కయ్యాయి. -
సొమ్ము వెనక్కి వచ్చేది ఎప్పుడో?
ఏదన్నా కారణంతో ధరణి సేవలను రద్దు చేసుకున్న వారు అప్పటికే ప్రభుత్వానికి చెల్లించిన రుసుం తిరిగి పొందడానికి అష్ట కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తోంది. -
బంగారం బిస్కెట్లుగా ఆలయాల ఆభరణాలు
రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాలకు భక్తులు సమర్పించిన బంగారం, వెండి ఆభరణాల్లో దేవతామూర్తుల అలం -
కార్టూనిస్ట్ శ్రీధర్ ఆధ్వర్యంలో 21న పెయింటింగ్ వర్క్షాప్
ఔత్సాహిక చిత్రకారుల కోసం వేసవి సెలవుల్లో ఒక ప్రత్యేక వర్క్షాప్ నిర్వహిస్తున్నట్టు శ్రీధర్ ఆర్ట్ ఇన్స్టిట్యూట్ నిర్వాహకులు, ప్రముఖ కార్టూనిస్ట్ శ్రీధర్ తెలిపారు. -
అమరావతిపై ఇంత కక్షా!
అమరావతిపై వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యానికి, కక్ష సాధింపునకు పరాకాష్ఠ ఇది. రాజధానికి శంకుస్థాపన జరిగిన ప్రాంతంలో అమరావతి నమూనాలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. -
గురుకుల విద్యార్థి ప్రశాంత్ మరణానికి బాధ్యులపై తగిన చర్యలు
భువనగిరి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థి ప్రశాంత్ మరణం బాధాకరమని ఆ శాఖ కార్యదర్శి సీతాలక్ష్మి బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. -
పదేళ్ల తర్వాత రాష్ట్ర ప్రభుత్వ వైద్యుల సంఘం ఎన్నికలు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వైద్యుల సంఘం (టీజీడీఏ)ఎన్నికలకు హైకోర్టు అనుమతించిన నేపథ్యంలో ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు ఆ సంఘం కోర్ కమిటీ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొంది. -
విద్యుదుత్పత్తి చేసి.. బయట అమ్ముకోవచ్చు!
దేశంలో విద్యుత్ డిమాండ్ పెరగడంతో గ్యాస్ ఆధారిత విద్యుదుత్పత్తి కేంద్రాలకు కేంద్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. -
శ్రీవారి ఆలయంలో వైభవంగా శ్రీరామనవమి ఆస్థానం
శ్రీవారి ఆలయంలో శ్రీరామనవమి ఆస్థానాన్ని పురస్కరించుకుని శ్రీసీతారామలక్ష్మణ సమేత హనుమంతులవారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనాన్ని బుధవారం వైభవంగా నిర్వహించారు. -
సాగర్లో అత్యవసర మోటార్ల ట్రయల్ రన్ ప్రారంభం
హైదరాబాద్ జంట నగరాలు, నల్గొండ జిల్లా తాగునీటి అవసరాలు తీర్చేందుకు నాగార్జునసాగర్ జలాశయంలో హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బీ (జలమండలి) ఆధ్వర్యాన ఏర్పాటు చేస్తున్న అత్యవసర మోటార్ల ప్రయోగాత్మక పరిశీలన (ట్రయల్ రన్) బుధవారం ప్రారంభమైంది. -
నదుల అనుసంధానంపై దిల్లీలో టాస్క్ఫోర్స్ సమావేశం రేపు
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన నదుల అనుసంధాన ప్రాజెక్టులో భాగంగా గోదావరి-కావేరి లింక్పై శుక్రవారం నదుల అనుసంధాన టాస్క్ఫోర్స్ కమిటీ చర్చించనుంది. -
సమస్య గుర్తించక ముందే మరమ్మతులెలా నిర్ణయిస్తారు..?
మేడిగడ్డ బ్యారేజీ మరమ్మతు పనులను గుత్తేదారులకు అప్పగించేందుకు నీటిపారుదలశాఖ నిర్ణయించినట్లు జరుగుతున్న ప్రచారంపై ప్రభుత్వ పెద్దలు ఆగ్రహంతో ఉన్నట్లు తెలిసింది. -
సివిల్స్ విజేతలకు కేటీఆర్ శుభాకాంక్షలు
సివిల్స్లో విజయం సాధించిన తెలుగు రాష్ట్రాల అభ్యర్థులంతా పూర్తి శక్తి సామర్థ్యాలను వినియోగించి.. దేశ భవిష్యత్ నిర్మాణంలో ప్రధానపాత్ర పోషిస్తారని ఆశిస్తున్నట్లు భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ ఆకాంక్షించారు. -
సివిల్స్లో సత్తా చాటిన తెలుగువారికి చంద్రబాబు అభినందనలు
సివిల్స్కు తెలుగు రాష్ట్రాల నుంచి ఎంపికైన అభ్యర్థులకు తెదేపా అధినేత చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. -
ప్రైవేటు బడుల ఫీ‘జులుం’!
రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేటు, కార్పొరేటు పాఠశాలల్లో రుసుములు ఆకాశాన్నంటుతున్నాయి. ప్లేస్కూల్, ఎల్కేజీ, యూకేజీ, మొదటి తరగతి నుంచి పదో తరగతి వరకు.. డొనేషన్లు, అభివృద్ధి ఛార్జీలు, రుసుములతో పాటు పుస్తకాలు, దుస్తులు, బూట్లు, బెల్టుల పేరిట తల్లిదండ్రుల జేబులకు భారీగా చిల్లులు పెడుతున్నాయి. -
రోజుకు రూ.కోటి ఆదాయం పెరగాలి!
ప్రయాణికుల నుంచి మరింత ఆదాయం రాబట్టుకునేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) సిద్ధమవుతోంది. ఇందుకోసం డీలక్స్, సూపర్లగ్జరీ, ఏసీ బస్సుల సేవలపై దృష్టిపెట్టబోతోంది. -
ద.మ రైల్వేకు రూ.20,339 కోట్ల రికార్డు ఆదాయం
దక్షిణ మధ్య రైల్వే రికార్డు స్థాయిలో ఆదాయాన్ని గడించింది. తొలిసారి రూ.20 వేల కోట్ల మైలురాయిని దాటింది.