టోకెన్లు ఇచ్చారు.. చెల్లింపులు చేయరా!
రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ విద్యార్థులకు ఉపకారవేతనాలు, బోధన రుసుముల చెల్లింపులు ఆలస్యమవుతున్నాయి. కోర్సు పూర్తయి రెండేళ్లు గడుస్తున్నా నిధులు విడుదల కావడం లేదు. దరఖాస్తులు పరిష్కరించి...
రెండేళ్లుగా బోధన రుసుముల విడుదలలో జాప్యం
2020-21 ఏడాదికి ఉపకార వేతనాలూ కరవు
అప్పులు చేసి ఫీజులు కడుతున్న విద్యార్థులు
ఈనాడు - హైదరాబాద్
రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ విద్యార్థులకు ఉపకారవేతనాలు, బోధన రుసుముల చెల్లింపులు ఆలస్యమవుతున్నాయి. కోర్సు పూర్తయి రెండేళ్లు గడుస్తున్నా నిధులు విడుదల కావడం లేదు. దరఖాస్తులు పరిష్కరించి, నిధులు విడుదలచేసి టోకెన్లు జారీచేసి నెలలు గడుస్తున్నా చెల్లింపులు మాత్రం జరగడం లేదు. రెండేళ్ల క్రితం బకాయిలు చెల్లించేందుకు ఈ ఏడాదిలో మూడు నెలల క్రితం జారీచేసిన టోకెన్లకు నేటికీ చెల్లింపులు పూర్తికాలేదు. దీంతో విద్యార్థులు అప్పులుచేసి రుసుములు కట్టి ధ్రువీకరణ పత్రాలు తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. రాష్ట్రంలో ఏటా 12.50 లక్షల మంది బోధన రుసుములు, ఉపకార వేతనాలకు దరఖాస్తు చేసుకుంటున్నారు. విద్యార్థులకు చెల్లించాల్సిన నిధుల మొత్తం రూ.2,200-2,350 కోట్ల వరకు ఉంటోంది. ప్రభుత్వం ఏటా.. గడిచిన విద్యాసంవత్సరానికి సంబంధించిన ఉపకారవేతనాలు, బోధన రుసుములను ప్రస్తుత విద్యాసంవత్సరంలో చెల్లిస్తూ వస్తోంది. ఈ లెక్కన 2019-20 ఏడాది తాలూకూ సొమ్ములు 2021 మార్చి 31లోపు, 2020-21 ఏడాదికి సంబంధించినవి 2022 మార్చి 31లోగా చెల్లించాల్సి ఉంది. కరోనా, ఇతర కారణాలతో చెల్లింపులు ఆలస్యమయ్యాయి. 2020-21 ఏడాదికి విద్యార్థుల పుస్తకాలు, బస్పాస్ ఖర్చుల కు ఇచ్చే ఉపకారవేతనాల సొమ్ములూ విడుదల కాలేదు.
బోధన రుసుములు, ఉపకార వేతనాల బకాయిలు చెల్లించేందుకు సంక్షేమశాఖలు కాగితాలపై నిధులు విడుదల చేస్తున్నాయనే ఆరోపణలున్నాయి. ఫలితంగా ఆ బిల్లులన్నీ ఖజానాల్లోనే నిలిచిపోతున్నాయి. ఉదాహరణకు 2019-20 ఏడాదికి సంబంధించిన బోధన రుసుముల బకాయిలు చెల్లించేందుకు 2020 సెప్టెబరులో టోకెన్లు జారీచేశారు. వాటి కాలపరిమితి 2021 మార్చి 31తో ముగిసినా నిధులు విడుదల కాలేదు. తాజాగా 2019-20 విద్యా సంవత్సర బకాయిల చెల్లింపు కోసం ఈ ఏడాది ఆగస్టు, సెప్టెంబరులో మరోసారి టోకెన్లు జారీచేసినా, ఇప్పటివరకు బ్యాంకు ఖాతాల్లో నగదు జమకాలేదు.
రెండేళ్లయినా నిధులు రాలేదు
- మహ్మద్ రియాజ్, సనత్నగర్, హైదరాబాద్
ఈసెట్ కౌన్సెలింగ్ ద్వారా 2015లో కుత్బుల్లాపూర్ బౌరంపేటలోని ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ రెండో ఏడాదిలో చేరా. 2018లో ఇంజినీరింగ్ పూర్తయింది. కోర్సు కొనసాగుతున్న సమయంలో ఉపకారవేతనం, బోధన రుసుముల కోసం దరఖాస్తు చేశా. సొమ్ములు రాలేదు. ధ్రువీకరణ పత్రాల కోసం కళాశాల యాజమాన్యాన్ని ఏడాది కాలంగా సంప్రదిస్తున్నా. బోధన రుసుములు రాలేదు...మొత్తం ఫీజు చెల్లిస్తేనే ఇస్తామంటున్నారు.
పిల్లల భవిష్యత్తు కాపాడాలి
-గౌరి సతీష్, అధ్యక్షుడు రాష్ట్ర ప్రైవేటు జూనియర్ కళాశాలల సంఘం
కళాశాల యాజమాన్యాలు కరోనాతో ఇప్పటికే కుంగిపోయాయి. కళాశాలల నిర్వహణ ఖర్చులు భరించలేక బోధన, బోధనేతర సిబ్బందికి వేతనాలు చెల్లించలేని పరిస్థితి ఉంది. ప్రభుత్వం బోధన రుసుములు విడుదలచేసి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలి. 2019-20 బకాయిలకు సంబంధించి మూడు నెలల క్రితం జారీచేసిన టోకెన్లకు వెంటనే చెల్లింపులు చేయాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పతి దేవుడికి గుడి కట్టింది!
కరోనా మహమ్మారి ఆమె జీవితంలో అంతులేని విషాదాన్ని నింపింది. కళ్లల్లో పెట్టుకుని చూసుకునే భర్తను తన నుంచి దూరం చేసింది. మూడేళ్ల క్రితం భర్త కొవిడ్తో మృతి చెందడంతో ఆమె ఒంటరిగా మారారు. -
కొత్తవారొచ్చారు
ఆంధ్రప్రదేశ్ నిఘా విభాగాధిపతిగా సీనియర్ ఐపీఎస్ అధికారి కుమార్ విశ్వజిత్ను, విజయవాడ నగర పోలీసు కమిషనర్గా పీహెచ్డీ రామకృష్ణను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. -
జేఈఈ మెయిన్స్లో తెలుగోళ్ల సత్తా
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. దేశవ్యాప్తంగా 56 మందికి 100 పర్సంటైల్ రాగా.. ఇందులో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందినవారే 22 మంది ఉన్నారు. జేఈఈ మెయిన్స్ తుది ఫలితాలను జాతీయ పరీక్షల విభాగం (ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసింది. -
కాళేశ్వరంపై కమిషన్ విచారణ షురూ
కాళేశ్వరం ఎత్తిపోతల్లోని బ్యారేజీలపై న్యాయ విచారణకు ఏర్పాటు చేసిన కమిషన్ కార్యాచరణ మొదలుపెట్టింది. బుధవారం కమిషన్ ఛైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ ఆయన సతీమణి దేబ్జానీ ఘోష్తో కలిసి హైదరాబాద్కు చేరుకున్నారు. -
ఫస్టియర్లో 60.01%.. సెకండియర్లో 64.19%
ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో 60.01 శాతం, రెండో సంవత్సరంలో 64.19 శాతం మంది విద్యార్థులు (ఒకేషనల్ కోర్సులతో కలిపి) ఉత్తీర్ణత సాధించారు. -
కవిత బెయిల్పై మే 6న తీర్పు
ఈడీ కేసులో బెయిల్ కోసం భారాస ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్పై తీర్పును ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు మే 6కి వాయిదా వేసింది. -
చదువుల ‘సిరి’.. రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని పట్టుదల
వారానికి రెండుసార్లు డయాలసిస్.. ఒంట్లో సత్తువ లేక కళాశాలకూ వెళ్లలేని పరిస్థితి.. అయినా మొక్కవోని పట్టుదలతో చదివిన పేదింటి బిడ్డ ప్రతిభ చాటింది. -
విజన్-2026కు డోర్నకల్ ఉపాధ్యాయుల శ్రీకారం
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు విజన్-2026 పేరిట ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. -
ఇంటర్ ఫలితాల్లో కవలల ప్రతిభ
సూర్యాపేట జిల్లా ఆత్మకూర్(ఎస్) మండల కేంద్రానికి చెందిన డేగల వీరభద్రయ్య, మంజుల దంపతుల కవల పిల్లలు డేగల రామ్, లక్ష్మణ్ ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో ప్రతిభ చూపారు. -
రాష్ట్రంలో వంతెనల పరిశీలన..!
రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న చిన్నా, పెద్ద వంతెనలను పరిశీలించేందుకు అధికారులు ఆయత్తం అవుతున్నారు. జిల్లాల వారీగా నిర్మాణ స్థితిగతులపై జాబితాలను రూపొందించే పనిలో ఉన్నారు. -
యాదాద్రి విద్యుత్కేంద్రానికి పర్యావరణ అనుమతి
యాదాద్రి థర్మల్ విద్యుత్కేంద్రానికి పర్యావరణ అనుమతి (ఈసీ) ఇవ్వడానికి కేంద్ర పర్యావరణ శాఖ ఆమోదం తెలిపింది. -
మెట్రో రైలు శబ్దకాలుష్యంపై వివరణివ్వండి
మెట్రో రైల్వే లైను వంపుల్లో రైలు వెళ్లినపుడు పరిమితికి మించి వస్తున్న శబ్దకాలుష్యంపై వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వానికి, మెట్రో రైల్వే ఎండీకి బుధవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
ఆర్జేసీ, మోడల్, కేజీబీవీ విద్యార్థుల ప్రతిభ
టీఎస్ఆర్జేసీ నేరెళ్ల గురుకుల విద్యార్థిని ఎంపీసీలో 991 మార్కులు, బైపీసీలో తాటిపల్లి విద్యార్థిని 990 మార్కులు సాధించినట్లు యాజమాన్యం తెలిపింది. -
ఫోన్ ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావుకు మధ్యంతర బెయిలు నిరాకరణ
ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టయిన టాస్క్ఫోర్స్ మాజీ ఓఎస్డీ రాధాకిషన్రావుకు ఎల్ఎల్ఎం పరీక్షలు రాసేందుకు వీలుగా మధ్యంతర బెయిలు ఇచ్చేందుకు నాంపల్లి కోర్టు నిరాకరించింది. -
పోలింగ్ రోజు వేతనంతో కూడిన సెలవు
లోక్సభ ఎన్నికల పోలింగ్ జరిగే రోజును వేతనంతో కూడిన సెలవుగా ప్రకటించారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్రాజ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
జస్టిస్ రామలింగేశ్వరరావుకు హైకోర్టు ఘన నివాళి
గుండెపోటుతో ఇటీవల మృతి చెందిన ఉమ్మడి హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎ.రామలింగేశ్వరరావుకు బుధవారం హైకోర్టు ఘన నివాళి అర్పించింది. -
శనగ విత్తనోత్పత్తి రైతుల ఆందోళన
‘పంట విక్రయించి నెల రోజులవుతోంది. డబ్బులు ఎప్పుడు ఇస్తారో.. క్వింటాకు ఎంత కట్టిస్తారో ఇప్పటికీ తెలియదు. -
విచారణ నుంచి తప్పుకొన్న జస్టిస్ శేషసాయి ధర్మాసనం
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసుపై మాట్లాడొద్దంటూ కడప జిల్లా కోర్టు(పీడీజే) ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ వివేకా కుమార్తె నర్రెడ్డి సునీత, పులివెందుల తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.రవీంద్రనాథ్రెడ్డి అలియాస్ బీటెక్ రవి దాఖలు చేసిన వ్యాజ్యాల విచారణ నుంచి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏవీ శేషసాయి నేతృత్వంలోని ధర్మాసనం తప్పుకొంది. -
ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఇంటర్ ప్రవేశాలు
రాష్ట్రంలోని ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో ప్రవేశాల పేరిట డొనేషన్లు, అధిక రుసుముల వసూళ్లు, ఇతరత్రా అక్రమాలను నిరోధించేందుకు వీలుగా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఆన్లైన్ ప్రవేశాల విధానాన్ని ప్రవేశపెట్టాలని యోచిస్తున్నామని విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. -
మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ
ష్ట్రంలో మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. షెడ్యూలును విద్యాశాఖ బుధవారం విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు (4)
రాష్ట్రంలో వచ్చే నెల 6వ తేదీన జరగనున్న తెలంగాణ రాష్ట్ర ఇంజినీరింగు కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (టీఎస్ఈసెట్)ను మే చివరి వారానికి వాయిదా వేయాలని పలువురు అభ్యర్థులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని కోరారు.
తాజా వార్తలు (Latest News)
-
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ
-
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్
-
అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్ కీలక ప్రతిపాదన!
-
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
హోటల్లో భారీ అగ్ని ప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం