మరింత సులువుగా విద్యార్థి వీసాలు
వచ్చే విద్యా సంవత్సరం నుంచి విదేశీ విద్యార్థులందరినీ ప్రత్యక్ష బోధనకు అనుమతించేందుకు యూకేలోని వర్సిటీలు సిద్ధమవుతున్నట్లు బ్రిటిష్ కౌన్సిల్ దక్షిణ భారత సంచాలకురాలు జనక పుష్పనాథన్...
చదువు పూర్తయ్యాక రెండేళ్లు బ్రిటన్లో పనిచేసే వెసులుబాటు
పరిశోధక విద్యార్థులకు మూడేళ్లు..
‘ఈనాడు’తో బ్రిటిష్ కౌన్సిల్ దక్షిణభారత సంచాలకురాలు జనక పుష్పనాథన్
జనక పుష్పనాథన్
వచ్చే విద్యా సంవత్సరం నుంచి విదేశీ విద్యార్థులందరినీ ప్రత్యక్ష బోధనకు అనుమతించేందుకు యూకేలోని వర్సిటీలు సిద్ధమవుతున్నట్లు బ్రిటిష్ కౌన్సిల్ దక్షిణ భారత సంచాలకురాలు జనక పుష్పనాథన్ పేర్కొన్నారు. కరోనా తర్వాత బ్రిటన్కు వెళ్లే భారతీయ విద్యార్థుల సంఖ్య భారీగా పెరిగిందని ఆమె తెలిపారు. వీసా నిబంధనల సడలింపుతో గత రెండేళ్లలో 197 శాతం మంది విద్యార్థులు అధికంగా బ్రిటన్కు వచ్చారన్నారు. 2019లో 30,496, 2020లో 45,677 మందికి వీసాలు ఇవ్వగా.. ఈ ఏడాది ఆ సంఖ్య 90,669 మందికి చేరిందన్నారు. వచ్చే నెల 4న బ్రిటిష్ కౌన్సిల్ ఆధ్వర్యంలో యూకేలో విద్యావకాశాలపై ఆన్లైన్ మేళా జరగనున్న క్రమంలో ‘ఈనాడు’తో జనక ప్రత్యేకంగా మాట్లాడారు. ముఖ్యాంశాలు..
* కరోనా తర్వాత యూకే ప్రభుత్వం, విశ్వవిద్యాలయాలు విద్యార్థుల ఆరోగ్య భద్రతకు పెద్దపీట వేస్తున్నాయి. వర్సిటీల్లో కొవిడ్ కేసులు పెరగకుండా ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తున్నాయి. నేషనల్ హెల్త్ సర్వీస్ ఆధ్వర్యంలో విదేశీ విద్యార్థులకు పరీక్షలు, చికిత్స ఉచితంగా చేస్తున్నాయి. ప్రస్తుతం యూకే వర్సిటీలన్నీ ప్రత్యక్ష బోధన చేపట్టాయి. వచ్చే విద్యాసంవత్సరం నుంచి అన్ని స్థాయుల విదేశీ విద్యార్థులనూ ప్రత్యక్ష బోధనకు అనుమతించనున్నాయి.
* కరోనా ముందున్న పరిస్థితులతో పోలిస్తే ప్రస్తుతం వర్సిటీలు హైబ్రిడ్ బోధనకు ప్రాధాన్యమిస్తున్నాయి. కొన్నిచోట్ల ప్రత్యక్ష, ఆన్లైన్ తరగతులు రెండూ నడుస్తున్నాయి. గత జులై నుంచి యూకే ప్రభుత్వం ‘గ్రాడ్యుయేట్ రూట్’ పేరిట కొత్త కార్యక్రమం తీసుకొచ్చింది. ఫలితంగా విదేశీ విద్యార్థులు గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక అదనంగా మరో రెండేళ్ల పాటు అక్కడ ఉద్యోగం చేసే వీలుంటుంది. పీహెచ్డీకి వచ్చినవారికైతే మూడేళ్ల వరకు అనుమతి లభిస్తుంది.
* బ్రిటన్ను ఎంచుకునే విద్యార్థుల సంఖ్య పెరుగుతుందనడానికి సంబంధిత వీసాల సంఖ్యే నిదర్శనం. గ్రాడ్యుయేట్ రూట్ వంటి కార్యక్రమాలు తెచ్చాక ఇక్కడి కోర్సుల పట్ల విద్యార్థులకు ఆసక్తి పెరిగింది. అత్యధికంగా బ్రిటన్కు వచ్చే విదేశీ విద్యార్థుల్లో భారత్ది రెండో స్థానం.. యూకే అధికారిక గణాంకాల ప్రకారం 56,093 మంది భారతీయ విద్యార్థులకు 2020 ఏప్రిల్ నుంచి 2021 మార్చి మధ్య వీసాలు ఇచ్చారు.
భారతీయ విద్యార్థులు యూజీ, పీజీ స్థాయుల్లో బిజినెస్, ఇంజినీరింగ్ కోర్సులు చేసేందుకు ఎక్కువగా బ్రిటన్కు వస్తున్నారు. హ్యుమానిటీస్, సోషల్ సైన్స్, అర్కిటెక్చర్ బిల్డింగ్ అండ్ ప్లానింగ్, న్యాయ కోర్సులతో పాటు స్టెమ్ కోర్సుల పట్లా ఆసక్తి చూపుతున్నారు.
2018-19 ఏడాదికి 4.67 మిలియన్ పౌండ్ల విలువైన 480 స్కాలర్షిప్లు భారతీయ విద్యార్థులకు అందాయి. ఏడాది వ్యవధిగల స్టెమ్ కోర్సులు చేసేందుకు వచ్చే బాలికల్లో గత మూడేళ్లలో 175 మందికి పూర్తి ఉపకార వేతనాలు దక్కాయి. గ్రేట్ స్కాలర్షిప్ కింద 60 మందికి కనిష్ఠంగా పదివేల పౌండ్ల చొప్పున లభిస్తోంది. వివరాలకు www.britishcouncil.org లో చూడవచ్చు.
తాజా గణాంకాల ప్రకారం భారత్ నుంచి దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల్లో 96శాతం మందికి వీసాలు లభిస్తున్నాయి. దరఖాస్తు విధానం చాలా సులువుగా మారింది. ప్రాధాన్య, అధిక ప్రాధాన్య విభాగాల కింద గడువులోగా విద్యార్థులకు వీసాలు అందుతున్నాయి.
-ఈనాడు, హైదరాబాద్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అల్బనీలో ఉగాది వేడుకలు.. ఆర్పీ పట్నాయక్, అలీ, కౌశల్ సందడి
న్యూయార్క్ రాజధాని అల్బనీ పరిధిలో నివసిస్తున్న తెలుగు ప్రజల కోసం ఏర్పాటైన అల్బనీ తెలుగు అసోసియేషన్ (ATA) ఆధ్వర్యంలో ఉగాది ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. -
వెస్ట్ లండన్ బాలాజీ ఆలయంలో ఘనంగా రాములోరి కల్యాణోత్సవం
లండన్లోని శ్రీ వేంకటేశ్వర (బాలాజీ) స్వామి టెంపుల్ అండ్ కల్చరల్ సెంటర్(SVBTCC)లో సీతారాముల కల్యాణోత్సవం ఘనంగా జరిగింది. -
కాలిఫోర్నియాలో ఘనంగా చంద్రబాబు జన్మదిన వేడుకలు
తెదేపా అధినేత చంద్రబాబు జన్మదిన వేడుకలు కాలిఫోర్నియాలో ఘనంగా జరిగాయి. ట్రై వ్యాలీ ఎన్నారై తెదేపా ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించారు. -
66,000 మంది భారతీయులకు అమెరికా పౌరసత్వం
American Citizenship: అమెరికాలో నేచురలైజేషన్ కింద పెద్ద ఎత్తున అక్కడి పౌరులుగా మారారు. 2022లో దాదాపు 66 వేల మందికి ఆ హోదా లభించింది. మెక్సికన్లు అత్యధిక మంది సహజీకృత పౌరసత్వం పొందారు. తర్వాత స్థానంలో భారత్ నిలిచింది. -
‘తాకా’ ఆధ్వర్యంలో ఘనంగా శ్రీరామ నవమి వేడుకలు
‘తెలుగు అలయన్స్ ఆఫ్ కెనడా’ (తాకా) ఆధ్వర్యంలో టొరంటోలోని శ్రీశృంగేరి విద్యాపీఠం దేవస్థానం ఆడిటోరియంలో శ్రీరామ నవమి వేడుకలను శనివారం (ఏప్రిల్ 20న) ఘనంగా నిర్వహించారు. -
బర్మింగ్హామ్లో కన్నుల పండువగా శ్రీరామనవమి వేడుకలు
ఇంగ్లాండ్లోని బర్మింగ్హామ్ నగరం శ్రీరామనవమి వేళ భద్రాద్రి వాతావరణాన్ని తలపించింది. అక్కడి తెలుగువారు ఈ వేడుకల్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. -
కాన్సాస్లో ఆట పాటలతో సందడిగా ఉగాది వేడుకలు
అమెరికాలోని కాన్సాస్ నగరంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. -
ట్రెక్కింగ్ చేస్తూ జారిపడి.. స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి
స్కాట్లాండ్లోని ఓ పర్యటక ప్రాంతంలో ట్రెక్కింగ్కు వెళ్లిన ఇద్దరు తెలుగు విద్యార్థులు నీటిలోపడి మృతిచెందారు. -
అమెరికాలో వైభవంగా ‘మాటా’ తొలి కన్వెన్షన్
అమెరికాలో ‘మన అమెరికన్ తెలుగు అసోసియేషన్’ (MATA) తొలి కన్వెన్షన్ వేడుకలు అట్టహాసంగా ముగిశాయి . -
వైభవంగా ‘టాగో’ ఉగాది వేడుకలు
ఫ్లోరిడాలోని తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ ఓర్లాండో (టాగో) ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు వైభవంగా జరిగాయి. -
‘తాకా’ ఆధ్వర్యంలో ఘనంగా ‘క్రోధి’ ఉగాది వేడుకలు
‘తెలుగు అలయన్స్ ఆఫ్ కెనడా’ (తాకా) ఆధ్వర్యంలో టొరంటోలోని పెవిలియన్ ఆడిటోరియంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. -
టొరంటోలో వైభవంగా ‘టీసీఏ’ ఉగాది వేడుకలు
తెలంగాణ కెనడా సంఘం (TCA) ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు వైభవంగా జరిగాయి. -
11 దేశాల కవులతో అంతర్జాతీయ వేదికపై ఉగాది కవి సమ్మేళనం
వంశీ అంతర్జాతీయ సాహితీ పీఠం, శ్రీ సాంస్కృతిక కళాసారథి- సింగపూర్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం ‘ఉగాది కవి సమ్మేళనం’ ఘనంగా జరిగింది. -
‘షికాగో తెలుగు అసోసియేషన్’ ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది, శ్రీరామనవమి వేడుకలు
అమెరికా ఇల్లినాయిస్లోని షికాగోలో ‘చికాగో తెలుగు అసోసియేషన్’ ఆధ్వర్యంలో ఉగాది, శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. -
ఘనంగా ‘సింగపూర్ తెలుగు సమాజం’ ఉగాది వేడుకలు
సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో క్రోధి నామ సంవత్సర ఉగాది వేడుకలు వైభవంగా నిర్వహించారు. -
‘‘ఏపీ హితం కోసం ఎన్డీయేకే మా మద్దతు’’
దుబాయిలో వందలమంది తెలుగు వారు కలసి ఉగాది వేడుకలను ఉత్సాహంగా నిర్వహించారు. -
అంతరిక్షంలోకి వెళ్లనున్న తొలి తెలుగువాడు.. గోపీచంద్ తోటకూర
Gopichand Thotakura: అంతరిక్షంలోకి వెళ్లే తొలి తెలుగు వ్యక్తిగా గోపీచంద్ తోటకూర రికార్డు సృష్టించనున్నారు. విజయవాడలో జన్మించిన ఆయనను బ్లూ ఆరిజిన్ సంస్థ ఎన్ఎస్-25 మిషన్లో టూరిస్ట్గా రోదసీలోకి తీసుకెళ్లనుంది. -
యూకే కుటుంబ వీసా కఠినతరం.. వేతన పరిమితి 55% పెంపు
UK Family Visa: యూకే కుటుంబ వీసా నిబంధనలను కఠినతరం చేశారు. దీని కోసం వార్షిక వేతన పరిమితిని ఏకంగా 55శాతం పెంచారు. -
అమెరికాలో అదృశ్యమైన హైదరాబాద్ విద్యార్థి అనుమానాస్పద మృతి
మరో భారత విద్యార్థి అమెరికాలో మృతిచెందాడు. హైదరాబాద్కు చెందిన అబ్దుల్ చనిపోయినట్లు దౌత్యకార్యాలయం ప్రకటించింది. ఈ ఏడాది 11 మంది భారత విద్యార్థులు అమెరికాలో చనిపోయారు. -
ఈ ఎన్నికలు ఏపీకి ఎంతో కీలకం.. మీ సహకారం కావాలి.. ఎన్నారైలతో నారా లోకేష్
-
భద్రాచలం తరహాలో అమెరికాలో రామాలయం
భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానం తరహాలో అమెరికాలోని అట్లాంటా సమీపంలోని కమింగ్ వద్ద రామాలయ నిర్మాణం చేపట్టినట్లు అక్కడ ముఖ్య అర్చకుడిగా వ్యవహరిస్తున్న పద్మనాభాచార్యులు వెల్లడించారు.
తాజా వార్తలు (Latest News)
-
‘యానిమల్’ టూ ‘రామాయణ’.. రణబీర్ ట్రాన్స్ఫర్మేషన్ షేర్ చేసిన ట్రైనర్
-
రూ.29కే జియోసినిమా ప్రీమియం.. యాడ్ ఫ్రీ కంటెంట్, 4K వీడియో క్వాలిటీ
-
హైదరాబాద్, బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
-
రూ.8500కే మూడు రోజుల శిర్డీ టూర్.. ఐఆర్సీటీసీ ప్యాకేజీ వివరాలు ఇవీ..
-
కెమెరామెన్కు సారీ చెప్పిన పంత్.. ఎందుకో తెలుసా?
-
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ