ధాన్యం కొనుగోళ్లపై కేసీఆర్తో చర్చకు సై
ధాన్యం కొనుగోళ్లపై ముఖ్యమంత్రి కేసీఆర్ విసిరిన సవాల్ను స్వీకరిస్తున్నానని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి కిషన్రెడ్డి తెలిపారు. హైదరాబాద్లోని అమరవీరుల స్తూపం వద్ద సీనియర్ పాత్రికేయుల సమక్షంలో ముఖ్యమంత్రి కోరినట్లు చర్చలకు సిద్ధమేనన్నారు. నాగరిక భాషలో మాట్లాడతాననే
కేంద్రమంత్రి కిషన్రెడ్డి
ఈనాడు, దిల్లీ : ధాన్యం కొనుగోళ్లపై ముఖ్యమంత్రి కేసీఆర్ విసిరిన సవాల్ను స్వీకరిస్తున్నానని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి కిషన్రెడ్డి తెలిపారు. హైదరాబాద్లోని అమరవీరుల స్తూపం వద్ద సీనియర్ పాత్రికేయుల సమక్షంలో ముఖ్యమంత్రి కోరినట్లు చర్చలకు సిద్ధమేనన్నారు. నాగరిక భాషలో మాట్లాడతాననే షరతుకు కేసీఆర్ అంగీకరిస్తే తను చర్చకు వస్తానని స్పష్టం చేశారు. అసభ్య పదజాల వినియోగంలో కేసీఆర్తో గెలవలేనందున ఆ విషయంలో ముందే ఓటమి ఒప్పుకొంటున్నానన్నారు. దిల్లీలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రెండు నెలలుగా కల్లాల్లో, రోడ్లపై ధాన్యం కుప్పలతో బాధపడుతున్న రైతులకు ధైర్యం ఇచ్చే ప్రయత్నం చేశానని ఆయన తెలిపారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్తో మాట్లాడాకే చివరి బస్తా వరకు కొంటామని చెప్పానన్నారు.యాసంగి పంట అంశం తర్వాత.. ముందు వానాకాలం పంట కొనుగోలు చేయాలని సూచించారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక తర్వాత ముఖ్యమంత్రి అభద్రతా భావంతో ఉన్నందునే గంటన్నర పాటు తిట్లపురాణం కొనసాగించారని ఎద్దేవా చేశారు. సీఎం పదవిని ఎడమ కాలి చెప్పుతో పోల్చిన వ్యక్తి అంతకన్నా గొప్పగా ఎలా మాట్లాడుతారన్నారు. తాను కేంద్రమంత్రి అయినందుకు కేసీఆర్ బాధ పడితే తానేం చేయలేనన్నారు. ఆంధ్రప్రదేశ్లో విత్తనాలు మార్చుకున్నారని, అలానే విత్తనాలు మార్చుకుంటే యాసంగి పంట వేయొచ్చన్నారు.
కేసీఆర్ కనీసం అపాయింట్మెంట్ ఇవ్వలేదు..
‘‘నేను కేంద్ర మంత్రి కావడం కేసీఆర్కు ఇష్టం ఉందో లేదో నాకు తెలియదు. ఒక రైతు బిడ్డ, సాధారణ కార్యకర్త, పార్టీ ఫిరాయించని వ్యక్తి ఎలా క్యాబినెట్ మంత్రి అవుతారని కేసీఆర్ భావిస్తున్నారో తెలియదు. కేంద్రమంత్రి అయిన తర్వాత అపాయింట్మెంట్ అడిగితే కేసీఆర్ ఇవ్వలేదు. ఫోన్లు చేసినా స్పందించలేదు. కలుస్తానన్నా పట్టించుకోలేదు. కేంద్రమంత్రిగా దిల్లీలో ఉన్న తెలంగాణ బిడ్డ సహకారం తీసుకుందామని రాష్ట్ర ప్రభుత్వం ఏ రోజూ అనుకోలేదు. ఉన్నతాధికారులూ నన్ను కలవలేదు. ఎంతో చిన్నచూపు చూశారు. అయినా రాష్ట్రాభివృద్ధికి కేంద్ర నుంచి రావాల్సిన వాటి కోసం పాటుపడుతున్నా. 40 ఏళ్లుగా నమ్మిన సిద్ధాంతాల కోసం పని చేస్తున్నా. తెలంగాణ కోసం పోరాడి జాతీయ నాయకత్వాన్ని ఒప్పించా. ఎన్నో ఉద్యమాలు చేసి పైకి వచ్చా. కేంద్రమంత్రి పదవి శాశ్వతం కాదు. నమ్ముకున్న పార్టీ జెండా, తెలంగాణ ప్రజలే నాకు ముఖ్యం. కేసీఆర్ పుట్టిన గడ్డపైనే పుట్టిన నేను ఆయన తిట్లకు భయపడే వ్యక్తిని కాదు. ఆయన వ్యాఖ్యలపై నాకేం బాధ లేదు. ఎవరు ఏమిటో ప్రజలు నిర్ణయిస్తారు. ఇలాంటి భాషతో తెలంగాణ ప్రజలకు, రాష్ట్రానికి చెడ్డ పేరు వస్తుంది. మీపై అసభ్య పదజాలం వాడినందుకు పాత్రికేయులను జైళ్లలో పెట్టిన మీరు అదే భాషతో విమర్శించవచ్చా? ప్రపంచ దేశాల ముందు భారత్ను కించపర్చేలా కేసీఆర్ వ్యవహరిస్తున్నారు’’ అని కేంద్రమంత్రి కిషన్రెడ్డి విమర్శించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారాస నేత ఇంట్లో గోడ గడియారాలు, మద్యం సీసాల పట్టివేత
మంచిర్యాల జిల్లా మందమర్రిలో భారాస పట్టణ సోషల్ మీడియా ఇన్ఛార్జి బెల్లం అశోక్ ఇంట్లో ఓటర్లకు పంపిణీ చేయడానికి నిల్వ చేసిన గోడ గడియారాలు, మద్యం సీసాలను గురువారం ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు పట్టుకున్నారు. -
ట్యాపింగ్ పాపంలో కీలక వికెట్
ఫోన్ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. హైదరాబాద్ టాస్క్ఫోర్స్ డీసీపీగా, ఉద్యోగ విరమణ అనంతరం అక్కడే ఓఎస్డీగా సుదీర్ఘకాలం పనిచేసిన రాధాకిషన్రావును పోలీసులు అరెస్ట్ చేశారు. -
రైతులు, రైతు కూలీలకు రిజర్వేషన్లు కల్పించాలి
‘ఇప్పుడున్న పరిస్థితుల్లో రైతులు, రైతు కూలీల వంటి వర్గాలకు న్యాయం జరగాలంటే వారికి న్యాయవ్యవస్థ సహా వివిధ శాఖల్లో ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలి. -
నీ పేరు బయటికి వస్తుందని సీబీఐ దర్యాప్తు వద్దన్నావా?
‘‘మాజీమంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ను ఎందుకు ఉపసంహరించుకున్నావు? నీ పేరు బయటికి వస్తుందని భయపడ్డావా?’’ అని సీఎం జగన్ను వివేకా కుమార్తె సునీతారెడ్డి నిలదీశారు. -
తిరుమల నడకదారిలో చిరుత కలకలం
అలిపిరి-తిరుమల నడకదారిలో మరోసారి చిరుత సంచారం కలకలం సృష్టించింది. ఈ నెల 25, 26వ తేదీల్లో తెల్లవారుజామున నడకదారికి 150 మీటర్ల దూరంలో చిరుత సంచరించిందని తితిదే అటవీ శాఖ డీఎఫ్వో శ్రీనివాసులు గురువారం వెల్లడించారు. -
హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ మౌసమీ భట్టాచార్య ప్రమాణం
తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ మౌసమీ భట్టాచార్య గురువారం ఉదయం ప్రమాణం చేశారు. మొదటి కోర్టు హాలులో జరిగిన ఈ కార్యక్రమంలో జస్టిస్ మౌసమీ భట్టాచార్యతో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే ప్రమాణం చేయించారు. -
పఫర్ ఫిష్
విశాఖలోని సాగర తీరంలో గురువారం మత్స్యకారుల వలకు విభిన్న తరహా సముద్ర జీవులు చిక్కాయి. -
కొంచెం ఓపిక పట్టండి.. అంతా మంచే జరుగుతుంది
‘సార్.. మాపై చాలా కేసులు పెట్టారు. దీంతో చాలామందికి పాస్పోర్టులు ఆగిపోయాయి. -
హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రవీందర్రెడ్డి
హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా సీనియర్ న్యాయవాది ఎ.రవీందర్రెడ్డి ఎన్నికయ్యారు. గురువారం జరిగిన కార్యవర్గ ఎన్నికల్లో అధ్యక్ష పదవికి రవీందర్రెడ్డి, ఎం.విజయ్కుమార్, చిక్కుడు ప్రభాకర్, ఎ.జగన్ పోటీ పడ్డారు. -
3 రోజుల్లో.. 30 జిల్లాల్లో ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం
రాష్ట్రవ్యాప్తంగా రబీ(యాసంగి) ధాన్యం కొనుగోళ్ల లక్ష్యాలు జిల్లాల వారీగా ఖరారయ్యాయి. అత్యధికంగా నిజామాబాద్ జిల్లాలో 6.24 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయనున్నారు. -
రూ.50 లక్షల వ్యయం.. 5 వేల ఎకరాల సాగు ఖాయం!
తక్కువ వ్యయంతో ఎక్కువ ఆయకట్టు సాగులోకి తేవాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఇలాంటి వాటిని గుర్తించి.. త్వరితగతిన పూర్తి చేయాలని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. -
తగ్గిపోతున్న యువ జనాభా!
దేశ అభివృద్ధిలో కీలకమైన యువ జనాభా దక్షిణాది రాష్ట్రాల్లో రానున్న రోజుల్లో భారీగా తగ్గనుందని తాజా అంతర్జాతీయ నివేదిక ఒకటి పేర్కొంది. -
వేడెక్కిన తెలంగాణ
సూర్యుడి భగభగలతో రాష్ట్రం వేడెక్కింది. అనేక జిల్లాల్లో ఎండవేడికి ప్రజలు అల్లాడుతున్నారు. ప్రధానంగా ఉత్తర తెలంగాణ ఉడుకుతోంది. వారం రోజులుగా 40 డిగ్రీల సెల్సియస్ వద్ద ఉన్న ఉష్ణోగ్రతలు గురువారం నాటికి మరింత పెరిగాయి. -
తెలుగు వర్సిటీ పురస్కారాల ప్రదానం
చిత్రలేఖనం, నృత్యం, సంగీతం, పాత్రికేయం, అవధానం, రచన తదితర ప్రక్రియల్లో విశేష కృషి చేసిన 12 మందికి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 2023 సంవత్సరానికిగాను ప్రతిభా పురస్కారాలు ప్రదానం చేసింది. -
విత్తన లైసెన్సింగ్ విధానంలో మార్పులు
తెలంగాణలో ప్రస్తుతమున్న విత్తన లైసెన్సింగ్ విధానంలో కొన్ని మార్పులు చేయాల్సిన అవసరం ఉందని, విత్తన సరఫరాలో పారదర్శకతకు ఆయా కంపెనీల ప్రతినిధుల సూచనలను పరిశీలిస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. -
రాజన్న క్షేత్రంలో వైభవంగా శివ కల్యాణం
దక్షిణ కాశీగా పేరొందిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని రాజరాజేశ్వరస్వామి ఆలయంలో గురువారం శివ కల్యాణం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. -
బాహు‘మీనం’
వనపర్తి జిల్లా కొత్తకోట మండలం అప్పరాలలో మత్స్యకారుడు పరమేశ్కు చిక్కిన భారీ చేప ఇది. గురువారం ఆయన పామాపురం సమీపంలోని ఊకచెట్టు వాగులో నిర్మించిన చెక్ డ్యామ్లో వేటకు వెళ్లగా.. 10 నుంచి 25 కిలోల బరువున్న చేపలు వలలో చిక్కాయి. -
టెట్పై ఉపాధ్యాయుల్లో గందరగోళం
ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)-2024పై ఉపాధ్యాయుల్లో సందేహాలు నెలకొన్నాయి. వాటిని నివృత్తి చేయాలని ఉపాధ్యాయ సంఘాల నేతలు విద్యాశాఖ ఉన్నతాధికారులను కలిసి విన్నవిస్తున్నారు. -
గురుకులాల్లో భర్తీకాని పోస్టులపై నిర్ణయం తీసుకోండి: హైకోర్టు
గురుకులాల్లో డిగ్రీ, జూనియర్ లెక్చరర్లు, పోస్టు గ్రాడ్యుయేట్, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు, బోధనేతర సిబ్బంది పోస్టులకు ఎంపికైన వారు బాధ్యతలు స్వీకరించకపోవడంతో ఏర్పడిన ఖాళీల్లో పిటిషనర్ల నియామకాన్ని పరిశీలించాలని ప్రభుత్వానికి హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. -
ఇంటర్ కళాశాలలకు మే 31 వరకు సెలవులు
రాష్ట్రంలోని జూనియర్ కళాశాలలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు ప్రకటించింది. ఈ నెల 31 నుంచి మే 31వ తేదీ వరకు సెలవులు ఉంటాయని గురువారం వెల్లడించింది. -
‘సాహితీ’ డబుల్ దందాపై పోలీసుల ఆరా
కార్తికేయ పనోరమ ప్రాజెక్టు పేరిట సాహితీ ఇన్ఫ్రా పాల్పడిన మోసాలపై హైదరాబాద్ సైబర్క్రైం పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
కేజ్రీవాల్ కోసం మెసేజ్లు పంపండి.. వాట్సప్ నంబరు షేర్ చేసిన సతీమణి
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
అప్పుడు ధోనీ నన్ను ఎత్తుకోవడం ఎంతో ఆనందం కలిగించింది..: రవీంద్ర జడేజా
-
కేసీఆర్ చేసిన మొదటి తప్పు అదే: మంత్రి కోమటిరెడ్డి
-
దెబ్బతీయాలనుకునేవారికి ప్రజలే జవాబు చెప్తారు: కేటీఆర్
-
మాకు కొత్త కెప్టెన్ ఉన్నాడు..: యాంకర్ ప్రశ్నకు ధోనీ సమాధానం