సస్పెన్షన్పై ససేమిరా
మునుపటి సమావేశాల్లో ప్రవర్తించిన తీరుకు గానూ 12 మంది విపక్ష ఎంపీలపై సస్పెన్షన్ వేటు వేయడాన్ని నిరసిస్తూ వివిధ పార్టీల సభ్యులు బుధవారం రాజ్యసభను స్తంభింపజేశారు. సస్పెన్షన్ను ఎత్తివేయాలంటూ వారు నినాదాలిచ్చి, సభాపతి
వేటును తప్పుపట్టిన పార్టీలు
సబబే: వెంకయ్యనాయుడు
స్తంభించిన రాజ్యసభ
రాజ్యసభ నిర్వహణలో అధ్యక్షుడు ఎం.వెంకయ్యనాయుడు
దిల్లీ: మునుపటి సమావేశాల్లో ప్రవర్తించిన తీరుకు గానూ 12 మంది విపక్ష ఎంపీలపై సస్పెన్షన్ వేటు వేయడాన్ని నిరసిస్తూ వివిధ పార్టీల సభ్యులు బుధవారం రాజ్యసభను స్తంభింపజేశారు. సస్పెన్షన్ను ఎత్తివేయాలంటూ వారు నినాదాలిచ్చి, సభాపతి స్థానం వద్ద నిరసన వ్యక్తంచేశారు. పవిత్రమైన సభను, పార్లమెంటరీ వ్యవస్థను అవమానపరిచి, ఎలాంటి పశ్చాత్తాపం వ్యక్తం చేయని సభ్యుల సస్పెన్షన్ను ఎత్తివేసే ప్రశ్నే లేదని ఛైర్మన్ ఎం.వెంకయ్యనాయుడు తేల్చిచెప్పారు. జలాశయాల భద్రత బిల్లును ప్రవేశపెట్టడానికి జల్శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ ప్రయత్నించినా సభ్యులు ఆయన ప్రసంగానికి అడుగడుగునా అడ్డుపడ్డారు. తర్వాత సభాపతి స్థానంలో ఉన్న భువనేశ్వర్ కాలితా పలుమార్లు విజ్ఞప్తి చేసినా తమతమ స్థానాల్లోకి వెళ్లడానికి విపక్ష సభ్యులు నిరాకరించారు. ఒకసారి వాయిదా పడి సభ తిరిగి మొదలయ్యాక డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ మాట్లాడుతూ.. సభ్యులంతా ప్రశాంతంగా ఉంటే విపక్ష నేత మల్లికార్జున ఖర్గేను మాట్లాడేందుకు అనుమతిస్తానని హామీ ఇచ్చారు. మంత్రి షెకావత్ని అడ్డుకోవడం ప్రజలకు సానుకూల సంకేతాలను పంపడం లేదని, ఇది మంచిది కాదని చెప్పారు. బిల్లుపై కాకుండా సభ్యుల సస్పెన్షన్పై ఖర్గేను మాట్లాడనివ్వాలని విపక్షాలు పట్టుపట్టాయి. ప్రశ్నోత్తరాల సమయాన్ని ముందుకు సాగనివ్వకుండా నిరసనలు కొనసాగించాయి. విపక్షాలు తమ పట్టు సడలించకపోవడంతో సభ గురువారానికి వాయిదా పడింది. అటు లోక్సభలో తెరాస సభ్యుల నిరసనలతో కార్యకలాపాలు నిలిచిపోయాయి. రైతుల అంశాలపై వారంతా ప్రశ్నోత్తరాల సమయంలో గళమెత్తారు. వారి నిరసనల మధ్యే అరగంటసేపు ప్రశ్నోత్తరాల సమయాన్ని కొనసాగించి, ఆ తర్వాత వాయిదా వేశారు. ఎంపీలపై సస్పెన్షన్ను ఎత్తివేయాలని కోరుతూ విపక్ష సభ్యులు పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద ప్రదర్శన నిర్వహించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు కూడా దీనిలో పాల్గొన్నారు. సస్పెన్షన్కు గురైనవారు ప్రస్తుత సమావేశాలు ముగిసేవరకు అదేచోట ప్రతిరోజూ నిరసనలు కొనసాగించనున్నారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు వారు, ఉదయం 10 నుంచి 11 వరకు ఇతర విపక్ష ఎంపీలు నిరసనలు చేపట్టనున్నారు.
నిరసన కొనసాగిస్తున్న విపక్ష నేతలతో ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు రాహుల్గాంధీ
రైతుల మరణాలపై సమాచారం లేదు
సాయం చేయలేం: తోమర్
సాగు చట్టాలపై ఆందోళనల్లో మరణించిన రైతుల గురించి ప్రభుత్వం దగ్గర సమాచారం లేదని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ పార్లమెంటుకు తెలిపారు. అలాంటప్పుడు సాయం అనే దానికి తావు లేదని స్పష్టంచేశారు. దీనిపై విపక్షాలు భగ్గుమన్నాయి. రైతు మరణాలు, నిరసనల వల్ల ప్రభావితమైన రైతు కుటుంబాలకు ఆర్థిక సాయం, కేసుల ఉపసంహరణపై విపక్షాలు ప్రశ్నించాయి. దీనిపై తోమర్ రాతపూర్వక సమాధానం ఇచ్చారు. మల్లికార్జున ఖర్గే స్పందిస్తూ ఇది రైతులకు అవమానకరమన్నారు. నిరసనల్లో 700 మంది రైతులు చనిపోయారని, సమాచారం లేదని కేంద్రం అలా ఎలా చెబుతుందని మండిపడ్డారు.
సాగు చట్టాల రద్దుకు రాష్ట్రపతి ఆమోదం
దిల్లీ: వివాదాస్పదమైన మూడు సాగు చట్టాలను రద్దు చేస్తూ పార్లమెంటు ఆమోదించిన బిల్లుపై రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ బుధవారం సంతకం చేశారు అనంతరం కేంద్ర ప్రభుత్వం దీనిని నోటిఫై చేసింది. పార్లమెంటు శీతాకాల సమావేశాలు మొదలైన మొదటిరోజే ఉభయ సభలు ఈ రద్దు బిల్లును ఆమోదించిన విషయం తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఫోన్ ట్యాపింగ్ అత్యంత ప్రమాదకరం
పౌరుల వ్యక్తిగత జీవితాల్లోకి చొరబడి వారిని నియంత్రించడానికి గత ప్రభుత్వ పాలకులు ఫోన్ ట్యాపింగ్ను వాడుకున్నారని, అది అత్యంత ప్రమాదకరం అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. -
సిద్దిపేట జిల్లాలో ఉద్యోగుల సస్పెన్షన్పై హైకోర్టు స్టే
భారాస నిర్వహించిన ఎన్నికల కార్యక్రమంలో పాల్గొన్నారన్న కారణంగా కొంత మంది ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ ఏప్రిల్ 8న సిద్దిపేట జిల్లా ఎన్నికల అధికారి అయిన కలెక్టర్ జారీ చేసిన ఆదేశాల అమలును నిలిపివేస్తూ హైకోర్టు శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. -
మేడిగడ్డ పూర్తవకుండానే పూర్తయినట్లు సర్టిఫికెట్
మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణం పూర్తి కాకుండానే, అయినట్లుగా సంబంధిత ఇంజినీర్లు గుత్తేదారుకు సర్టిఫికెట్ ఇచ్చినట్లు ప్రాజెక్టు చీఫ్ ఇంజినీర్ నీటిపారుదల శాఖకు నివేదించారు. -
గరుడ ప్రసాదం... పోటెత్తిన భక్తజనం
రంగారెడ్డి జిల్లాలోని చిలుకూరు బాలాజీ ఆలయంలో శుక్రవారం నిర్వహించిన బ్రహ్మోత్సవాలు... గరుడ ప్రసాద వితరణ భక్తులకు తీవ్ర అసౌకర్యం కలిగించింది. -
పగలు వడగాలులు.. సాయంత్రం వడగళ్లు
రాష్ట్రంలో శుక్రవారం పలు జిల్లాల్లో ఎండలు భగ్గుమనగా.. కొన్ని జిల్లాల్లో అకాల వర్షాలు బీభత్సం సృష్టించాయి. ముఖ్యంగా నల్గొండ, సూర్యాపేట జిల్లాలు సలసలా కాగాయి. -
‘కోటిపల్లి’ పనుల్లో అసాధారణ అంచనాలు
‘నీటిపారుదల ఇంజినీర్ ఇన్ చీఫ్ (ఈఎన్సీ-జనరల్) కార్యాలయం నుంచి ప్రభుత్వానికి అంచనాలు పంపేందుకు వెనుకాడాల్సిన ఇబ్బందికరమైన పరిస్థితిని హైదరాబాద్ సర్కిల్ ఇంజినీర్లు తీసుకొచ్చారు. -
వివేకా హత్యలో నాపై రెండు క్రిమినల్ కేసులు.. అఫిడవిట్లో పేర్కొన్న అవినాష్రెడ్డి
వైకాపా తరఫున కడప ఎంపీ అభ్యర్థిగా శుక్రవారం నామినేషన్ దాఖలు చేసిన వైఎస్ అవినాష్రెడ్డి తాను రెండు క్రిమినల్ కేసుల్లో నిందితుడిగా ఉన్నానని అఫిడవిట్లో పేర్కొన్నారు. -
14 లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటలు
రాష్ట్రంలో 2024 వానాకాలం సీజన్ కోసం 14 లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటలను సాగు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఉద్యానవన శాఖ ప్రతిపాదనలు రూపొందించింది. -
నీటి లోతుల్లో నిఘా కళ్లు!
తెలంగాణ విపత్తు స్పందన, అగ్నిమాపక సేవలశాఖ మరిన్ని సాంకేతిక హంగులను సమకూర్చుకుంటోంది. అధునాతన పరిజ్ఞానంతో కూడిన పరికరాలను సొంతం చేసుకునే దిశగా ఆ శాఖ అడుగులు వేస్తోంది. -
కృష్ణా పరీవాహకంలో చెరువుల కింద నీటి వినియోగం ఎంత?
చిన్ననీటి పారుదల రంగంలో కృష్ణా పరీవాహకంలో నీటి వినియోగం, పొదుపుపై నీటిపారుదల శాఖ లెక్కగడుతోంది. -
గురుకుల విద్యార్థి మృతి ఘటనపై కేంద్రం ఆగ్రహం
భువనగిరి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజనింగ్ సంఘటనపై కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని జాతీయ ఎస్సీ కమిషన్ను ఆదేశించింది. -
శ్రీలంకలోని వేద గిరిజన జనాభాకు భారతీయులతో దగ్గరి సంబంధాలు
శ్రీలంకకు చెందిన వేద గిరిజన జనాభాకు భారతీయులతో దగ్గరి సంబంధాలున్నాయి. దక్షిణ భారత్లోని కొన్ని గిరిజన సమూహాలతో జన్యుపరమైన అనుబంధం కలిగి ఉన్నట్లు సీసీఎంబీ పరిశోధనలో వెల్లడైంది. -
‘వాట్సప్ గురు’ మరో ఘనత!
తెలంగాణ అదనపు డీజీపీ (రైల్వేస్ అండ్ రోడ్ సేఫ్టీ) మహేశ్ మురళీధర్ భగవత్ మరో ఘనత సాధించారు. -
దార్శనిక నేత చంద్రబాబు
తెదేపా అధినేత చంద్రబాబు 45 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానాన్ని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు తొమ్మిదేళ్లు, నవ్యాంధ్రకు ఐదేళ్లు కలిసి 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఆయన పరిపాలన సాగిన తీరును కళ్లకు కడుతూ ‘మన చంద్రన్న- అభివృద్ధి, సంక్షేమ విజనరీ’ పేరుతో పార్టీ రాజకీయ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ టీడీ జనార్దన్ పుస్తకం రూపొందించారు. -
తిరుమల శేషాచలం పరిధిలో అగ్నికీలలు
శేషాచలం పరిధిలో తీవ్రమైన ఎండలు, వేడి గాలులతో ఎక్కడికక్కడ అగ్నికీలలు వ్యాపిస్తున్నాయి. శుక్రవారం ఉదయం తిరుమలకు సమీపంలో పెద్దఎత్తున అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. -
ఎన్ఎస్జీ డీజీగా నళిన్ ప్రభాత్
జాతీయ భద్రతా దళం (ఎన్ఎస్జీ) డైరెక్టర్ జనరల్గా నళిన్ ప్రభాత్ నియమితులయ్యారు. ఈయన ఏపీ క్యాడర్కు చెందిన 1992 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. -
భారీగా పెరిగిన శ్రీవారి డిపాజిట్లు
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆదాయం ఏటేటా పెరుగుతోంది. 2023-24లో తితిదే ఏకంగా రూ.1,161 కోట్లను వివిధ బ్యాంకుల్లో ఫిక్సిడ్ డిపాజిట్ చేసింది. -
సీబీఐ కేసులోనూ అప్రూవర్గా మారిన శరత్చంద్రారెడ్డి!
దిల్లీ మద్యం కుంభకోణంపై ఈడీ నమోదు చేసిన కేసులో ఇప్పటికే అప్రూవర్గా మారిన అరబిందో సంస్థ ప్రతినిధి శరత్చంద్రారెడ్డి తాజాగా సీబీఐ నమోదు చేసిన కేసులోనూ అప్రూవర్గా మారినట్లు తెలిసింది. -
రైతాంగ సమస్యలపై మే 15 నుంచి ఆందోళనలు
రాష్ట్రవ్యాప్తంగా అన్నదాతలు ఎదుర్కొంటున్న సమస్యలు, కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కర్షక వ్యతిరేక విధానాలపై ఆందోళనలు చేపట్టేందుకు సిద్ధం కావాలని అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం (ఏఐపీకేఎస్) రాష్ట్ర అధ్యక్షుడు రాయల చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. -
అనుమతుల్లేని క్లినిక్లపై దాడి.. రూ. 2.6 లక్షల విలువైన మందుల స్వాధీనం
రాష్ట్రంలో అనుమతి లేకుండా నిర్వహిస్తున్న క్లినిక్లపై దాడి చేసి నిబంధనలకు విరుద్ధంగా నిల్వ ఉంచిన ఔషధాలను స్వాధీనం చేసుకున్నట్లు ఔషధ నియంత్రణ మండలి (డీసీఏ) డైరెక్టర్ జనరల్ వి.బి.కమలాసన్రెడ్డి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. -
ఇదీ సంగతి!
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
వినీతాసింగ్ మృతిపై వదంతులు ..ఆమె ఏమన్నారంటే!
-
హామీలపై నిలదీస్తే అసహనమెందుకు?: హరీశ్రావు
-
బంగారం పేరుతో రూ.6.12 కోట్ల మోసం.. సాఫ్ట్వేర్ ఇంజినీర్ అరెస్టు
-
social look: వర్ష చీరకట్టు.. ప్రియాంక క్యూటు.. రష్మి హాటు..
-
నేను ఓటు వేశా.. మీరూ వేయండి..! ఎన్నికల వేళ విశాల్ ఇంకా ఏమన్నారంటే?