కౌలు కలవరం
యాసంగిలో ధాన్యం కొనుగోళ్లపై నెలకొన్న గందరగోళంతో సాగుపై ప్రభావం పడుతోంది. వరి నాట్లు వేసే విషయంలో సొంత భూమి ఉన్న రైతులు ఆచితూచి అడుగులు వేస్తుంటే.. కౌలుదారులు వెనకడుగు వేస్తున్న పరిస్థితి. దీంతో తమ పొలాలు
వరి కొనుగోళ్లపై వివాదం ప్రభావం
గిట్టుబాటు కాదంటూ కౌలు రైతుల నిరాసక్తత
తక్కువకు ఇచ్చేందుకు ముందుకు వస్తున్న యజమానులు
ఈనాడు, నిజామాబాద్: యాసంగిలో ధాన్యం కొనుగోళ్లపై నెలకొన్న గందరగోళంతో సాగుపై ప్రభావం పడుతోంది. వరి నాట్లు వేసే విషయంలో సొంత భూమి ఉన్న రైతులు ఆచితూచి అడుగులు వేస్తుంటే.. కౌలుదారులు వెనకడుగు వేస్తున్న పరిస్థితి. దీంతో తమ పొలాలు పడావుగా మారే ప్రమాదం ఉందని గ్రహించిన యజమానులు ధరలు తగ్గించేందుకు అంగీకరిస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో దాదాపు ఇవే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
ఒప్పందాలు ఆలస్యం..
వరి, ప్రత్యామ్నాయ పంటల్లో.. ఏది సాగుచేయాలో తెలియక రైతులు అయోమయంలో పడ్డారు. మెట్ట ప్రాంతాల్లో ఆరుతడి పంటలు వేయాలని అధికారులు చెబుతున్నారని.. కానీ, విత్తన లభ్యతపై మాట్లాడట్లేదని వాపోతున్నారు. ఈ నేపథ్యంలో కౌలు ఒప్పందాల్లో ముందడుగు పడటం లేదు. పెట్టుబడి ఎకరాకు రూ.30 వేలకు చేరింది. ఈ పరిస్థితుల్లో యాసంగిలో వరి వేసి సర్కారు కొనకుంటే తాము దళారుల దోపిడీకి గురవడం ఖాయమని కౌలుదారులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
ఉమ్మడి జిల్లాల వారీగా ఇలా..
ఉమ్మడి జిల్లాల వారీగా యాసంగిలో వరి సాగుపై అధికారులు ఇప్పటికే అంచనాలు వేస్తున్నారు. నిజామాబాద్లో 5 లక్షల ఎకరాల్లో వరి వేస్తారని అంచనా. ఇందులోనూ కౌలు వ్యవసాయం 30 శాతంగా ఉంది. ఖమ్మంలోనూ 30 శాతం కౌలు కిందే ఉంటోంది. వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లాల్లో 20-25 శాతం కౌలు వ్యవసాయం కొనసాగుతోంది. తమకున్న కొంత పొలానికి తోడు మరో రైతు భూమిని కౌలు తీసుకొని సాగు చేస్తూ జీవిస్తున్న రైతులే ఎక్కువగా ఉన్నారు. ప్రస్తుతం ఉన్న సందిగ్ధంలో వీరు కౌలు చేసేందుకు సుముఖంగా లేనట్లు తెలుస్తోంది.
గ్రామ కమిటీల తీర్మానాలు
సమస్య ఉన్న ప్రాంతాల్లో కొన్నిచోట్ల గ్రామాభివృద్ధి కమిటీలు రంగంలోకి దిగి ఇరుపక్షాలను దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకుంటున్నాయి. యాసంగిలో సాధారణంగా ఎకరానికి 70 కేజీలవి 13-15 బస్తాల వడ్లు, లేదా రూ.13-15 వేల నగదు కౌలుగా ఇవ్వాల్సి ఉంటుంది. కానీ, ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా మెట్ట ప్రాంతాల్లో ఆరు బస్తాలు, మాగాణిలో అయితే 8 బస్తాలు ఇవ్వాలని పలుచోట్ల కమిటీలు నిర్ణయించాయి.
కౌలు వదులుకున్నా..
- మల్లయ్య, హసన్పర్తి, హనుమకొండ జిల్లా
నాలుగు ఎకరాలు కౌలు తీసుకున్నా. వానాకాలంలో పడ్డ ఇబ్బందులు చూశాక ఆందోళనగా ఉంది. ఇక్కడ వరి తప్ప ఇతర పంటలు పండవని అధికారులకూ తెలుసు. చేసేదేమీ లేక కౌలు వదులుకున్నా.
సొంతభూమికే పరిమితమయ్యాం..
- కార్తీక్, దేవరకాద్ర, మహబూబ్నగర్ జిల్లా
మాకు ఏడెకరాల పొలం ఉంది. పక్క రైతుకు చెందిన ఆరెకరాలు కొంతకాలంగా కౌలు చేస్తున్నాం. ఇప్పుడు వరి వద్దంటున్నారు. వేసినా అమ్ముకొనే పరిస్థితి ఉండదు కనుక సాగు తగ్గించుకోవాలని అనుకున్నాం. కౌలు నుంచి తప్పుకొన్నాం. సొంతభూమికే పరిమితమయ్యాం.
ఎకరాకు రూ. 8 వేలకు ఒప్పించా
-ప్రవీణ్కుమార్, రుద్రూర్, నిజామాబాద్ జిల్లా
నాకున్న అయిదెకరాలతోపాటు మరో పాతిక ఎకరాలు కౌలు చేస్తుంటాను. యాసంగిలో ఇది వరకు 13 సంచులు ఇచ్చేవాళ్లం. ఇప్పుడు ఎకరాకు రూ.8 వేల చొప్పున ఇస్తానని ఒప్పించా.
- న్యూస్టుడే, యైటింక్లయిన్కాలనీ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బోన్మ్యారో మార్పిడితో యువకుడికి పునర్జన్మ
ఓ రకమైన రక్త క్యాన్సర్తో బాధపడుతున్న యువకుడికి హైదరాబాద్లోని ప్రభుత్వ ఎంఎన్జే ఆసుపత్రి పునర్జన్మ ప్రసాదించింది. -
ఫిర్యాదు రాగానే లావాదేవీ నిలిపివేయాలి: ఆర్బీఐకి తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో సూచన
సైబర్ నేరాల దర్యాప్తులో దేశానికే మార్గదర్శకంగా ఉన్న తెలంగాణ పోలీసుశాఖ మరో ముందడుగు వేసింది. -
మా వాళ్లు ఏం చెబితే.. అది చేయ్.. అన్నీ నేను చూసుకుంటా..
మాజీ మంత్రి వివేకా హత్య కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరి మరికొన్ని సంచలన విషయాలు బయటపెట్టారు. -
జగన్ భక్త ఐపీఎస్లపై వేటు
అధికార వైకాపాతో అంటకాగుతూ... గత ఐదేళ్లుగా ఆ పార్టీ అరాచకాలకు అడుగడుగునా కొమ్ముకాస్తూ వచ్చిన ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారులపై ఎన్నికల సంఘం ఎట్టకేలకు బదిలీ వేటు వేసింది. -
ఆస్తులు వేల కోట్లు.. చూపింది వందల కోట్లు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పులివెందుల నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్న ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తన అఫిడవిట్లో ఆస్తుల విలువ తక్కువగా చూపించారు. -
ఏబీ వెంకటేశ్వరరావు పిటిషన్పై క్యాట్ విచారణ 29కి వాయిదా
ఆంధ్రప్రదేశ్కు చెందిన ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ వివాదంపై హైదరాబాద్లోని కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ (క్యాట్) విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది. -
తాగునీటికి.. మూసీ శుద్ధికి
ఒక్క ప్రాజెక్టుతో రెండు ప్రయోజనాలు నెరవేరబోతున్నాయి. గజ్వేల్ నియోజకవర్గంలోని కొండపోచమ్మ రిజర్వాయర్ నుంచి పైపులైను ద్వారా తాగునీటిని హైదరాబాద్కు తరలించడం ద్వారా రాజధాని పరిధిలో తాగునీటి అవసరాలను సంపూర్ణంగా తీర్చడంతోపాటు, మురికి కూపంగా మారిన మూసీని ప్రక్షాళన చేయబోతున్నారు. -
గరం.. గరం
రాష్ట్రంలో ఎక్కడో ఒకచోట రోజూ 45 గరిష్ఠ ఉష్ణోగ్రత డిగ్రీలకు తాకుతుండటం ఆందోళన కలిగిస్తోంది. మంగళవారం మిర్యాలగూడలో 45.1 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. -
కూలిన మానేరు వాగు వంతెన గడ్డర్లు
పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలను అనుసంధానిస్తూ మానేరు వాగుపై నిర్మాణంలో ఉన్న వంతెన గడ్డర్లు సోమవారం రాత్రి నేలకూలాయి. -
ఎక్సైజ్ అధికారుల బదిలీల్లో మినహాయింపులెందుకు?
ఎన్నికల సందర్భంగా నిర్వహించే బదిలీల్లో ఎక్సైజ్ అధికారులకు మినహాయింపు ఎందుకు ఇచ్చారో తెలపాలని హైకోర్టు మంగళవారం ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించింది. -
ఆశలు ఆవిరి.. మూగజీవాలకు వదిలి..
విత్తనోత్పత్తి వరి సాగు చేపట్టిన రైతులకు కన్నీళ్లే మిగిలాయి. పంట పొట్టదశలో నీటి తడులు అందక ఎదుగుదల లోపిస్తోంది. -
26న ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ రాక
ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ ఈ నెల 26న రాష్ట్రానికి రానున్నారు. పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు. ఇందుకు ఏర్పాట్లు చేయాలని సీఎస్ ఎ.శాంతికుమారి ఉన్నతాధికారులను ఆదేశించారు. -
రక్షణ చర్యలు లేకపోవడం వల్లే ఎస్బీ ఆర్గానిక్స్లో పేలుడు
సంగారెడ్డి జిల్లా హత్నూర మండలంలోని ఎస్బీ ఆర్గానిక్స్లో ఇటీవల జరిగిన ప్రమాదానికి సరైన భద్రతా చర్యలు లేకపోవడమే కారణమని ఐఐసీటీ (ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ) మాజీ చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ బాబురావు అభిప్రాయపడ్డారు. -
టీ-సాట్ ఆధ్వర్యంలో నేడు, రేపు ‘నీట్’ పాఠ్యాంశాల ప్రత్యక్ష ప్రసారం
మే 5న నిర్వహించే ‘నీట్’ పరీక్షపై టీ-సాట్ నెట్వర్క్ ఛానళ్లు ప్రత్యేక పాఠ్యాంశాలను ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నట్లు టీ-సాట్ సీఈవో బి.వేణుగోపాల్రెడ్డి మంగళవారం తెలిపారు. -
ఇదీ సంగతి!
ఆదాయంలోనే కాదు సార్.. కేసుల్లో కూడా ఏ సీఎం మీ దరిదాపుల్లోకి రాలేరు సార్! -
నేడు ఇంటర్ ఫలితాలు
ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షల ఫలితాలు బుధవారం విడుదల కానున్నాయి. -
రుణం ఎగవేత కేసులో రూ.55.73 కోట్ల ఆస్తుల జప్తు
వ్యాపారం కోసం రుణం తీసుకొని సొంత ఖాతాల్లోకి మళ్లించుకొని బ్యాంకుల్ని మోసం చేసిన కేసులో వీఎంసీ సిస్టమ్స్ లిమిటెడ్కు చెందిన రూ.55.73 కోట్ల స్థిర, చరాస్తులను హైదరాబాద్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
నేటి నుంచి కాళేశ్వరంపై న్యాయ విచారణ
కాళేశ్వరం ఎత్తిపోతల నిర్మాణంపై బుధవారం నుంచి జ్యుడిషియల్ విచారణ ప్రారంభం కానుంది. -
బాబ్లీ కేసు విచారణ మే 7కు వాయిదా
బాబ్లీ ప్రాజెక్టు ముట్టడి కేసు విచారణ వచ్చే నెల 7కు వాయిదా పడింది. -
పుట్టుకతోనే కాలేయ వ్యాధి.. మా బాబును ఆదుకోండి!
రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబం.. లేక లేక కలిగిన సంతానం.. పెళ్లైన తొమ్మిదేళ్లకు బాబు పుట్టాడు. కూలి పనులు చేసుకుని జీవనం సాగించే ఆ దంపతులకు బిడ్డ పుట్టాడన్న ఆనందం ఎంతోసేపు నిలవలేదు. -
యాదాద్రిలో వైభవంగా తెప్పోత్సవం
చైత్ర పౌర్ణమిని పురస్కరించుకొని యాదాద్రి దివ్యక్షేత్రంలో మంగళవారం తెప్పోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. శ్రీలక్ష్మీనరసింహులను ముస్తాబు చేసి మంగళ వాయిద్యాల నడుమ కొండపైన ఉన్న విష్ణు పుష్కరిణి వద్దకు ఊరేగింపుగా తీసుకెళ్లారు.
తాజా వార్తలు (Latest News)
-
యూట్యూబ్కు పోటీగా.. వీడియోల కోసం ‘ఎక్స్’ టీవీ యాప్!
-
విజయ్తో సినిమా కష్టమే..: వెట్రిమారన్
-
ఆ ఇద్దరికి నో ప్లేస్.. వన్డౌన్ బ్యాటర్గా అతడే: ఇర్ఫాన్ పఠాన్
-
సంపద పంచుతారంటూ మోదీ ఆరోపణలు.. రాహుల్ క్లారిటీ
-
ప్రమాదవశాత్తు పేలిన తుపాకీ.. సీఆర్పీఎఫ్ డీఎస్పీ మృతి
-
వారసత్వ ఆస్తుల్నీ వదలరట: పిట్రోడా వ్యాఖ్యలపై మోదీ విమర్శలు