ఆదివాసీల ప్రగతికి అడ్డుగా సిబ్బంది కొరత
కొండాకోనల్లో నివసించే ఆదివాసీ గిరిజనుల అభ్యున్నతి కోసం సమున్నత లక్ష్యంతో ఏర్పాటు చేసిన సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ(ఐటీడీఏ)లు సిబ్బంది లేమితో సతమతమవుతున్నాయి. రాష్ట్రంలో
ఏళ్లుగా ఐటీడీఏల్లో భర్తీకాని ఖాళీలు
మంజూరైనవి 205 పోస్టులు.. పని చేస్తున్నది 71 మందే
ఈనాడు డిజిటల్, ఆసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ఉట్నూర్, న్యూస్టుడే: కొండాకోనల్లో నివసించే ఆదివాసీ గిరిజనుల అభ్యున్నతి కోసం సమున్నత లక్ష్యంతో ఏర్పాటు చేసిన సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ(ఐటీడీఏ)లు సిబ్బంది లేమితో సతమతమవుతున్నాయి. రాష్ట్రంలో ఉన్న ఏటూరునాగారం, ఉట్నూర్, భద్రాచలం, మన్ననూర్ ఐటీడీఏల్లో 66 శాతం ఉద్యోగుల కొరత కారణంగా సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో గిరిజనుల దరి చేరడం లేదు. వివిధ విభాగాల్లో ఉన్న ఉద్యోగ ఖాళీలు దశాబ్దాల నుంచి భర్తీకి నోచుకోవడం లేదు. నాలుగు ఐటీడీఏలకు కలిపి 205 పోస్టులు మంజూరు కాగా 71 మంది మాత్రమే పనిచేస్తున్నారు. 134 పోస్టులు ఖాళీగానే ఉన్నాయి.
గిరిజనుల్లోనే అత్యంత వెనుకబడిన వారికి పీవీటీజీలు అంటారు. వీరికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ప్రత్యేక నిధులు వస్తుండగా ఇందుకు సంబంధించి పథకాలు అమలు చేసి పర్యవేక్షించే అధికారే లేరు. ఏజెన్సీ ప్రాంతంలో మెరుగైన వైద్యసేవలు అందించేందుకు ప్రతి ఐటీడీఏ పరిధిలో ఏజెన్సీ అదనపు వైద్యాధికారి (అడిషనల్ డీఎంహెచ్ఓ) ఉండాలి. ప్రస్తుతం ఆ పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. నాలుగు ఐటీడీఏల పరిధిలో గిరిజన ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. వీటిని పర్యవేక్షించడానికి ఏజెన్సీ డీఈవో పోస్టులు ఉన్నా అధికారులు లేరు. చాలా ప్రాంతాల్లో ఈ బడులు మూసే ఉంటున్నాయి. గ్రామస్థుల ఫిర్యాదు మేరకు ఉట్నూర్ ఐటీడీఏ పీవో అంకిత్ ప్రత్యేక తనిఖీలు చేసి పాఠశాలలకు గైర్హాజరైన ఇద్దరు ఉపాధ్యాయులను నవంబర్ 29న సస్పెండ్ చేయడం ఈ పోస్టుల భర్తీ అవసరాన్ని తెలుపుతోంది. మన్ననూర్ ఐటీడీఏలో కేవలం ఒక జూనియర్ అసిస్టెంట్ మాత్రమే పనిచేస్తున్నారు.
‘గిరి’ రైతుకు కరవైన చేయూత..
ఐటీడీఏల పరిధిలో గిరిజన రైతులకు ఆధునిక సాగు పద్ధతులు, పండ్ల తోటల పెంపకంపై అవగాహన కల్పించడంతో పాటు శిక్షణ ఇచ్చేందుకు గిరి ఉద్యానవనాలను 1989లో స్థాపించారు. 20 నుంచి 30 ఎకరాల్లో ఇవి ఉన్నాయి. ఆసిఫాబాద్లో ఉద్యానవన కేంద్రం స్థాపించినప్పటికీ ఉద్యానవన అధికారి లేకపోవడంతో ఏడాదిగా అది తెరచుకోలేదు. ఉట్నూర్ ఐటీడీఏ పరిధిలో అయిదుగురు ఉద్యానవన అధికారులు ఉండాలి. ప్రస్తుతం ఒక్కరూ లేరు. నాలుగు ఐటీడీఏల్లోనూ వ్యవసాయ అధికారి పోస్టులు ఖాళీగా ఉండడంతో రైతులకు సలహాలు ఇచ్చేవారే కరవయ్యారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆరు జిల్లాల్లో 45 డిగ్రీల కంటే ఎక్కువే
రాష్ట్రం నిప్పుల గుండంలా మారింది. గురువారం రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం నుంచే ప్రారంభమైన వేడి మధ్యాహ్నానికి తీవ్రస్థాయికి చేరింది. -
ఈపీఎస్ ఆదాయం పెరుగుతున్నా.. కనీస పింఛను రూ.వెయ్యేనా?
ఉద్యోగుల పింఛను నిధి పథకం (ఈపీఎస్) ఆదాయం పెరుగుతున్నా.. లబ్ధిదారులు కనీస పింఛను పెంపునకు నోచుకోక ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు వృద్ధాప్య పింఛను కింద నెలకు రూ.2 వేలు ఇస్తుండగా.. ఈపీఎఫ్వో పింఛనుదారులు దాదాపు 75 శాతం మంది నెలకు రూ.వెయ్యితో జీవితాలను నెట్టుకువస్తుండడం పరిస్థితికి అద్దం పడుతోంది. -
ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్రాజ్ తెలిపారు. -
ఆ 106 ఎకరాలు రక్షిత అటవీభూమే
భూపాలపల్లి జిల్లా కేంద్రం సమీపంలోని కొంపెల్లి గ్రామ పరిధిలోని సర్వే నం.171/3 నుంచి 171/7ల్లో ఉన్న రూ.వందల కోట్ల విలువైన 106.34 ఎకరాలు అటవీభూమేనని, అది ప్రైవేటు వ్యక్తులది కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
రూ.800 కోట్ల బియ్యం ఏమయ్యాయి?
రైస్మిల్లులకు వెళ్లిన ధాన్యం కస్టమ్ మిల్లింగ్(సీఎంఆర్) తర్వాత తిరిగిరావడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. అనేక వాయిదాలు ఇచ్చినప్పటికీ పలు జిల్లాల్లో మిల్లర్లు బియ్యం ఇవ్వలేకపోతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
-
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
-
40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ నుంచి 2 కొత్త ఇయర్బడ్స్
-
కాలేజీ క్యాంపస్లో ఘోరం.. కార్పొరేటర్ కుమార్తె దారుణ హత్య
-
అమ్మ చనిపోయారు.. నేను పోటీ చేయలేను: ‘హిమాచల్’ డిప్యూటీ సీఎం కుమార్తె