కార్పొరేటర్లకు కప్పం!
కార్పొరేటర్ అంటే డివిజన్లో ప్రజలకు ఏ కష్టమొచ్చినా వెంటనే పరిష్కారమయ్యేలా చూడాలి. పారిశుద్ధ్య నిర్వహణ, తాగునీరు సక్రమంగా సరఫరా అవుతుందా
ఇళ్ల యజమానుల నుంచి భారీగా వసూలు
సొమ్ములు ఇవ్వకుంటే నిర్మాణం కష్టమే
ఓరుగల్లులో ఇదీ సంగతి
ఈనాడు- వరంగల్, కార్పొరేషన్- న్యూస్టుడే: కార్పొరేటర్ అంటే డివిజన్లో ప్రజలకు ఏ కష్టమొచ్చినా వెంటనే పరిష్కారమయ్యేలా చూడాలి. పారిశుద్ధ్య నిర్వహణ, తాగునీరు సక్రమంగా సరఫరా అవుతుందా లేదా చూడాలి. కానీ వరంగల్ మహానగరంలోని కొందరు కార్పొరేటర్ల తీరుతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. భవనాలు కట్టుకోవడమే పాపమన్నట్లు, యజమానుల నుంచి భారీగా వసూళ్లకు దిగుతున్నారు. బల్దియా నుంచి ఇంటి అనుమతులు తీసుకున్నా అనధికారికంగా తమకు కప్పం కట్టాల్సిందే అన్నట్లు వ్యవహరిస్తున్నారు. పలువురు పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు నిర్మాణాల వద్దకు వెళ్లి కొన్ని డీవియేషన్లను ఎత్తిచూపుతూ ఈ సమస్య పరిష్కారం కావాలంటే స్థానిక కార్పొరేటర్ వద్దకెళ్లి మాట్లాడుకోవాలని సూచిస్తున్నారు. చేసేదేం లేక యజమానులు కార్పొరేటర్కు రూ.వేలు, లక్షలు చెల్లించి ఇంటి పనులు చేసుకుంటున్నారు.
ఆమ్యామ్యా ఇవ్వాల్సిందే...
రాష్ట్ర రాజధాని హైదరాబాద్ తర్వాత రెండో అతిపెద్ద నగరమైన వరంగల్ విస్తీర్ణం 406 చదరపు కిలోమీటర్ల కాగా, 66 డివిజన్ల పరిధిలో 10 లక్షల జనాభాతో విస్తరించింది. ప్రతి నెలా భవన నిర్మాణాల అనుమతి కోసం 1000 నుంచి 1200 దరఖాస్తులు మహానగరపాలక సంస్థ పట్టణ ప్రణాళిక విభాగానికి వస్తాయి. భవనాల అనుమతుల నిమిత్తం గ్రేటర్కు రూ.కోట్లలో ఆదాయం వస్తోంది. మరోవైపు కొందరు పాలకులకు ఆమ్యామ్యాలు చెల్లించక తప్పడంలేదు. వరంగల్ బల్దియా కొత్త పాలకవర్గం మే నెలలో కొలువుతీరింది. కొన్నిచోట్ల మహిళా కార్పొరేటర్ల భర్తలు పెత్తనం చేస్తున్నారు. ఈ వసూళ్లపర్వంపై ఇటీవల ట్విటర్లో రాష్ట్ర పురపాలకశాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు వెళ్లింది. దీనిపై విచారణ చేయాలని పురపాలకశాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి అర్వింద్కుమార్ ఆదేశించారు.
మచ్చుకు కొన్ని...
* వరంగల్ ప్రాంతంలో ఓ వ్యాపారి జీ+2 భవనానికి అనుమతి పొందారు. అదనంగా మరో అంతస్తు వేస్తుంటే కార్పొరేటర్ భర్త రంగప్రవేశం చేశారు. రూ.3 లక్షలు డిమాండ్ చేసి.., చివరకు రూ.40 వేలు తీసుకున్నారు. మూడు నెలలు కాగానే మళ్లీ అదనంగా డబ్బులు కావాలని ఒత్తిడి చేయడం మొదలుపెట్టారు. టౌన్ప్లానింగ్ సిబ్బందిని పంపి నిర్మాణ పనులు నిలిపివేయిస్తున్నారు.
* నగరంలోని ఓ పాతఇంటిపై మరో అంతస్తు వేస్తుండగా అధికారి వెళ్లి పనులు అడ్డుకున్నారు. స్థానిక కార్పొరేటర్కు రూ.15 వేలు చెల్లించాకే నిర్మాణం ముందుకు సాగింది.
* స్థానికంగా విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగి 3 అంతస్తుల భవన నిర్మాణానికి అనుమతి పొందారు. కార్పొరేటర్ భర్త డబ్బులు డిమాండ్ చేస్తే ససేమిరా అన్నారు. పనులు జరగకుండా మిషన్ భగీరథ పైపులైను పేరుతో గుంతలు తీయించారు. చివరకు బాధ భరించలేక సదరు యజమాని రూ.లక్ష చెల్లించేందుకు ఒప్పుకోవాల్సి వచ్చింది.
* వరంగల్ ప్రాంతంలోని కొన్ని కాలనీలు చారిత్రక కట్టడాలున్న ప్రాంతంలోకి వస్తాయి. అక్కడ నిర్మాణాలు చేపట్టడం నిషేధం. కానీ కార్పొరేటర్లు అడిగినంత ఇస్తే నిర్మాణాలు చేసేసుకోవచ్చు. ఖిలావరంగల్ ప్రాంతంలో గతంలో రోడ్డును ఆక్రమించి ప్రహారీ కడితే అధికారులు కూల్చేశారు. కానీ ఒకరు తన పలుకుబడితో మళ్లీ కట్టారు. అధికారులెవ్వరూ అటువైపు వెళ్లకపోవడం గమనార్హం.
* హనుమకొండలోని ఓ కార్పొరేటర్ అండదండలతో నిబంధనలకు విరుద్ధంగా కొందరు అపార్టుమెంట్లే కడుతున్నారు. అయినా పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు అటువైపు వెళ్లకపోవడం గమనార్హం.
* హనుమకొండలో ఓ కార్పొరేటర్ పాత ఇల్లు కొనుగోలు చేసి.. దానికి ముందువైపున్న ఇంటిని అమ్మాలని సదరు యజమానిపై ఒత్తిడి చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా గోడ కడుతున్నారని బాధితుడు ఇప్పటికే గ్రేటర్ వరంగల్ ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మార్చిలోనే వడగాలులు!
దేశంలో మార్చి ఆఖరి వారంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే పరిస్థితులున్నాయి. వడగాలులకూ అవకాశాలున్నాయి. -
న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్లో భూపాలపల్లి ఫొటోగ్రాఫర్ చిత్రం ప్రదర్శన
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రానికి చెందిన ఫొటోగ్రాఫర్, డాక్టర్ అరుణ్కుమార్ నలిమెల అరుదైన ఘనత సాధించారు. -
మౌలిక వసతులతో రెట్టింపు పని
న్యాయమూర్తులు, న్యాయవాదులు తమ విధులను గౌరవప్రదంగా నిర్వహించడానికి న్యాయస్థానాల్లో మౌలిక వసతులు కీలకమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ డి.వై.చంద్రచూడ్ అన్నారు. -
వ్యాట్నూ తాగేశారు
మద్యం అమ్మకాల్లో కొన్నేళ్లుగా భారీ స్థాయిలో ‘పన్ను ఎగవేత’ కుంభకోణం జరిగిందని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. -
తాకట్టులోని ఫ్లాట్లకు రిజిస్ట్రేషన్లు..!
స్థిరాస్తి వెంచర్ల పేరిట వేల మంది కొనుగోలుదారులను రూ.వందల కోట్ల మేర మోసగించినట్లు అభియోగాలు ఎదుర్కొంటున్న సాహితీ ఇన్ఫ్రాటెక్ నిర్వాహకుల మరో నిర్వాకం వెలుగులోకి వచ్చింది. -
యాదాద్రిని సందర్శించిన భారత నౌకాదళాధిపతి
భారత నౌకాదళాధిపతి అడ్మిరల్ ఆర్.హరికుమార్ తన కుటుంబ సభ్యులతో బుధవారం యాదాద్రిని సందర్శించారు. -
మధుమేహంపై పరిశోధనలకు ఎండోక్రైన్ పాంక్రియాస్ సెంటర్
క్లోమ గ్రంథిలోని ఎండోక్రైన్ పనితీరుపై అధ్యయనం చేయడం.. తద్వారా డయాబెటిస్ చికిత్స పద్ధతులు, పరిష్కారాలను అర్థం చేసుకొని పరిశోధనలు చేసేందుకు ఆసియాలో తొలిసారిగా ఎండోక్రైన్ పాంక్రియాస్ పరిశోధన కేంద్రాన్ని హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ(ఏఐజీ)లో బుధవారం అందుబాటులోకి తెచ్చారు. -
శ్రీవారి సేవలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ దంపతులు బుధవారం తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. -
ఎన్హెచ్ఎం నిధులు రానట్లే!
జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్హెచ్ఎం) కింద కేంద్రం నుంచి రావాల్సిన రూ.348 కోట్ల నిధులపై రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ఆశలు వదులుకుంది. -
పశువుల మేతగా మారుతున్న ఆరుగాలం పంట
ఆరుగాలం శ్రమించి పంట పండించే రైతన్నకు కన్నీరే మిగులుతోంది. ఈ యాసంగి సీజన్లో భూగర్భ జలాలు అడుగంటి, సాగునీటి ప్రాజెక్టుల నుంచి కూడా నీరు అందక పంటలు పొట్టకు వచ్చిన దశలో ఎండిపోతున్నాయి. -
చి‘వరి’కి మిగిలింది చెలమ నీరు..
మండుతున్న ఎండలతో జిల్లాల్లో భూగర్భజలాలు రోజురోజుకు తగ్గిపోతున్నాయి. బోర్లు, బావులు, వాగుల్లో నీరు కరవైంది. -
శ్రీవారి సేవలో తెలంగాణ ఇన్ఛార్జి గవర్నర్
తెలంగాణ ఇన్ఛార్జి గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ బుధవారం శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో ఆలయం వద్దకు చేరుకున్న గవర్నర్కు తితిదే అధికారులు శ్రీవారి మూలమూర్తి దర్శనం చేయించారు. -
భారత్, ఫ్రాన్స్ మధ్య దృఢమైన దౌత్య సంబంధాలు
రాయదుర్గం టీ హబ్లో ఫ్రాన్స్ కాన్సులేట్ జనరల్ శాఖ(బ్యూరో డీ ఫ్రాన్స్) కార్యాలయాన్ని ఆ దేశ రాయబారి థియరీ మాథావు బుధవారం ప్రారంభించారు. -
చెంగిచర్ల పార్థీబస్తీలో బాధితులకు బండి పరామర్శ
హోలీ రోజు హైదరాబాద్ చెంగిచర్ల పార్థీబస్తీలో ఇరువర్గాల ఘర్షణలో గాయాలపాలైన వారిని పరామర్శించేందుకు బుధవారం వచ్చిన భాజపా జాతీయ ప్రధానకార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ను పోలీసులు అడ్డుకున్నారు. -
రాష్ట్రంలో తగ్గిన శతాధిక వృద్ధ ఓటర్లు
రాష్ట్రంలో శతాధిక వృద్ధ ఓటర్ల సంఖ్య తగ్గింది. ఏటా నిర్వహించే ఓటర్ల జాబితా సవరణ తరవాత ఈ ఏడాది ఫిబ్రవరి 8న ప్రకటించిన తుది ఓటర్ల జాబితాలో వీరి సంఖ్య 6,292కు చేరింది. -
రెండు రోజుల్లో జస్టిస్ ఘోష్కు ‘ఉత్తర్వుల’ ప్రతి
కాళేశ్వరం ఎత్తిపోతల పథకంపై న్యాయ విచారణకు కమిషన్ను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వుల కాపీని.. కమిషన్కు నేతృత్వం వహించనున్న సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ పినాకి చంద్రఘోష్కు నీటిపారుదల శాఖ అందించనుంది. -
ఫోన్ట్యాపింగ్ కేసులో నిందితుల కస్టడీ పిటిషన్పై తీర్పు రిజర్వ్
ఫోన్ ట్యాపింగ్ కేసులో అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న, సస్పెండైన డీఎస్పీ ప్రణీత్రావుల పోలీస్ కస్టడీ వ్యవహారంలో నాంపల్లి న్యాయస్థానం బుధవారం తీర్పును రిజర్వ్ చేసింది. -
టెట్ రాసేందుకు టీచర్లకు అనుమతి అవసరం లేదు
తెలంగాణలో టెట్-2024 రాసేందుకు ప్రభుత్వ ఉపాధ్యాయులు విద్యాశాఖ నుంచి అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన బుధవారం తెలిపారు. -
నెట్ స్కోర్తో పీహెచ్డీ ప్రవేశాలు
విశ్వవిద్యాలయాలు, ఉన్నత విద్యాసంస్థల్లో నెట్ స్కోరుతో పీహెచ్డీలో ప్రవేశాలు కల్పించాలని యూజీసీ సూచించింది. -
సంక్షిప్త వార్తలు (3)
ఆర్టీసీ కార్మికులకు 2013 వేతన సవరణకు సంబంధించిన బకాయిలు ఇవ్వడంలో విపరీత జాప్యం జరుగుతోందని ఇకనైనా వెంటనే చెల్లింపులు జరిగేలా చూడాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్కు ఐఎన్టీయూసీ అనుబంధ ఎస్డబ్ల్యూయూ విజ్ఞప్తి చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
పరిశ్రమలు తేవడం తెదేపా బ్రాండ్.. తరిమికొట్టడం జగన్ బ్రాండ్: చంద్రబాబు
-
ప్రెగ్నెన్సీపై స్పందించిన పరిణీతి చోప్రా.. ఏమన్నారంటే!
-
తొలిసారి చేతులు కలిపిన దిగ్గజాలు.. అదానీ కంపెనీలో రిలయన్స్కు వాటా
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..