యాసంగిలో వరి సాగు నియంత్రణపై మిల్లర్ల ఆందోళన
యాసంగిలో వరి వేయొద్దని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయడంతో దీర్ఘకాలంలో ఈ ప్రభావం తమపై ఏమేరకు ఉంటుందోనని రాష్ట్ర వ్యాప్తంగా మిల్లర్లు ఆందోళన చెందుతున్నారు.
దీర్ఘకాలంలో ప్రభావం ఉంటుందంటున్న నిపుణులు
ఈనాడు, నల్గొండ: యాసంగిలో వరి వేయొద్దని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయడంతో దీర్ఘకాలంలో ఈ ప్రభావం తమపై ఏమేరకు ఉంటుందోనని రాష్ట్ర వ్యాప్తంగా మిల్లర్లు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 2627 రైస్మిల్లులు ఉన్నాయి. వీటిలో 991 పారాబాయిల్డ్వి కాగా 1636 రా రైస్ ఉత్పత్తిచేసేవి. రాష్ట్రం మొత్తం పారాబాయిల్డ్ మిల్లుల్లో సగానికి పైగా ఉమ్మడి నల్గొండ, కరీంనగర్ జిల్లాల్లోనే ఉన్నాయి. రా రైస్ మిల్లుల్లో ఎక్కువ శాతం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఉన్నాయి. ఉమ్మడి నల్గొండ జిల్లాలోనే 400 వరకు మిల్లులుండగా 250 అత్యాధునిక సాంకేతికత పరిజ్ఞానంతో పనిచేస్తున్నాయి. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల్లో కొన్న ధాన్యాన్ని మిల్లుల్లో కస్టమ్ మిల్లింగ్ చేయించి బియ్యాన్ని ఎఫ్సీఐకి అందజేస్తోంది. తాజాగా కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో రా రైస్ను ఉత్పత్తి చేయడం తమకు ఆర్థికంగా భారమని మిల్లర్లు అభిప్రాయపడుతున్నారు. మిల్లుల్లో ఇప్పుడున్న సాంకేతికతను మార్చడానికి భారీగా ఖర్చవుతుందంటున్నారు. ఈ పరిశ్రమపై ఆధారపడి రాష్ట్ర వ్యాప్తంగా 20 వేల మంది ఉపాధి పొందుతున్నారు. మూతపడితే వారి జీవితాలు దుర్భరమయ్యే పరిస్థితి పొంచి ఉంది.
ఎగుమతులకు స్పష్టమైన విధానం అవసరం
అరబ్ దేశాలతో పాటు బంగ్లాదేశ్, మలేసియా, నేపాల్, శ్రీలంకలలో ఇప్పటికీ ఉప్పుడు బియ్యానికి గిరాకీ ఉంది. మన దేశంలోనూ కర్ణాటక, తమిళనాడు, ఒడిశాలోనూ గిరాకీ ఉన్నా మూడు నాలుగేళ్ల నుంచి అక్కడా వరి సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. ఇక్కడి నుంచి ఎగుమతులు పడిపోయాయి. విదేశాలకు ఎగుమతులకు సంబంధించి ప్రభుత్వపరంగా స్పష్టమైన విధానం ఉంటే కొంతలో కొంత ధాన్యం సమస్య గట్టెక్కించవచ్చని మిల్లర్లు అభిప్రాయపడుతున్నారు. బహిరంగ మార్కెట్లో బియ్యం విక్రయాల్లోనూ నిబంధనలు మారిస్తే వినియోగదారులు, మిల్లర్లకు లాభసాటిగా ఉంటుందని అంటున్నారు.ప్రస్తుతం దొడ్డురకాలకు ప్రభుత్వం గరిష్ఠ మద్దతు ధర క్వింటాకు రూ.1960 చెల్లిస్తోంది. కొనుగోలు కేంద్రాలను మూసేస్తే రైతుల నుంచి తాము అంత ధరకు ధాన్యాన్ని కొనుగోలు చేస్తే గిట్టుబాటు కాదని మిల్లర్లు చెబుతున్నారు. క్వింటాకు రూ.1500 వరకు కొంటేనే తమకు ఎంతో కొంత మిగులుతుందంటున్నారు. రెండేళ్ల నుంచి రాష్ట్రంలో వరి సాగు దృష్ట్యా మిల్లుల్లో సాంకేతికత, సామర్థ్యాలను మెరుగుపర్చుకోవాలని ప్రభుత్వం గతంలోనే మిల్లర్లకు సూచించింది. దీని కోసం నల్గొండ జిల్లాలోనే సుమారు రూ.150 కోట్ల వరకు ఖర్చు చేశారు. ఇప్పుడు ప్రభుత్వం వరి సాగు చేయద్దనడంతో పెట్టిన ఖర్చు వృథా అవుతుందని మిల్లర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
గోదాములన్నీ ఫుల్
ప్రస్తుతం గత రబీ సీజన్లో వచ్చిన ధాన్యంతోనే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గోదాములన్నీ నిండిపోయాయి. ఇప్పుడు వానాకాలం పంట కొనుగోళ్లు సగం మేర పూర్తయ్యాయి. ఎఫ్సీఐ మిల్లింగ్ చేసిన బియ్యాన్ని తీసుకోవడంలో తాత్సారం చేస్తోందని మిల్లర్లు ఆరోపిస్తున్నారు. నల్గొండ జిల్లాలో ఇప్పటికీ గత యాసంగి సీజన్కు సంబంధించి ఇంకా 3.5లక్షల టన్నుల బియ్యం గోదాముల్లోనే మూలుగుతోంది. వీటిని త్వరితగతిన ఖాళీ చేస్తే వానాకాలం ధాన్యం మిల్లింగ్ చేసి ఆ బియ్యాన్ని గోదాముల్లో నింపుతారు. తగినన్ని ర్యాక్స్ (రైళ్లు) రాకపోవడంతోనే బియ్యం ఎఫ్సీఐకి పంపడంలో జాప్యమవుతోందని అధికారులు వెల్లడిస్తున్నారు.
దీర్ఘకాలంలో ఇబ్బందులే..
వరి సాగు నియంత్రణతో ఇప్పటికప్పుడు సమస్య లేకపోయినా ఈ పరిశ్రమ కింద పనిచేస్తున్న వారు దీర్ఘకాలంలో ఇబ్బందులు పడే పరిస్థితులు వస్తాయి.
- కర్నాటి రమేష్, రాష్ట్ర రైస్మిల్లర్ల సంఘం ఉపాధ్యక్షుడు, మిర్యాలగూడ
ప్రభుత్వం ఓ విధానం తేవాలి
ఇప్పుడున్న బాయిల్డ్ రైస్ ఉత్పత్తి సాంకేతికతను మార్చి రా రైస్ను ఉత్పత్తి చేయాలంటే ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. మన రాష్ట్రంలో ఎక్కువగా బాయిల్డ్ మిల్లులే ఉన్నాయి. ప్రభుత్వ మద్దతు ధరకు కాకుండా అటు రైతులు, ఇటు మిల్లర్లు నష్టపోకుండా ఓ విధానం తీసుకొస్తే రైతులు పండించిన పంటను కొనడానికి మిల్లర్లు సిద్ధంగా ఉంటారు.
- చిట్టప్రోలు యాదగిరి, రైస్మిల్లర్ల సంఘం అధ్యక్షుడు, నల్గొండ జిల్లా
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రైతాంగ సమస్యలపై మే 15 నుంచి ఆందోళనలు
రాష్ట్రవ్యాప్తంగా అన్నదాతలు ఎదుర్కొంటున్న సమస్యలు, కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కర్షక వ్యతిరేక విధానాలపై ఆందోళనలు చేపట్టేందుకు సిద్ధం కావాలని అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం (ఏఐపీకేఎస్) రాష్ట్ర అధ్యక్షుడు రాయల చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. -
అనుమతుల్లేని క్లినిక్లపై దాడి
-
పాలిటెక్నిక్ లెక్చరర్స్ జీఆర్ఎల్ వెల్లడి
ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో లెక్చరర్ పోస్టులకు నిర్వహించిన రాతపరీక్షలో ప్రతిభ ఆధారంగా జనరల్ ర్యాంకు జాబితాను (జీఆర్ఎల్) టీఎస్పీఎస్సీ ప్రకటించింది. -
డీఎంఈ పరిధిలోని.. 16,024 మంది సిబ్బంది సేవల పొడిగింపు
వైద్య విద్య డైరెక్టర్(డీఎంఈ) పరిధిలోని వైద్య కళాశాలలు, బోధనాసుపత్రుల్లో కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్, గౌరవవేతనంతో విధులు నిర్వహిస్తున్న 16,024 మంది సిబ్బంది సేవలను మరో ఏడాది పాటు పొడిగిస్తూ రాష్ట్ర ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. -
సాగర్ టెయిల్పాండ్ నుంచి 4 టీఎంసీలు తరలించిన ఏపీ: తెలంగాణ ఫిర్యాదు
నాగార్జునసాగర్ ప్రాజెక్టు దిగువన విద్యుత్ ఉత్పత్తికోసం నిర్మించిన టెయిల్పాండ్ నుంచి నాలుగు టీఎంసీల నీటిని ఏపీ తరలించుకుపోయిందని కృష్ణా బోర్డుకు తెలంగాణ ఫిర్యాదు చేసింది. -
ఇచ్చంపల్లి నుంచే కావేరికి.. గోదావరి జలాలు
తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో గోదావరి నదిపై ఇచ్చంపల్లి బ్యారేజీ నిర్మాణం చేపట్టి, అక్కణ్నుంచి కావేరి పరీవాహకానికి నీటిని తరలించాలని దాదాపు నిర్ణయానికొచ్చారు. -
మహారాష్ట్ర ఎన్నికల్లో ఓటేసిన సరిహద్దు గ్రామాల ఓటర్లు!
కుమురం భీం జిల్లా కెరమెరి మండలంలో తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దు మధ్య 12 వివాదాస్పద గ్రామాలున్నాయి. -
కారులో తరలిస్తున్న రూ.1.50 కోట్ల స్వాధీనం
వికారాబాద్ జిల్లా నవాబ్పేట మండలంలో ఎన్నికల నియమావళికి విరుద్ధంగా కారులో తరలిస్తున్న రూ.1.50 కోట్ల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
రికార్డు స్థాయిలో వేసవి రైళ్లు
వేసవి కాలంలో పెరిగే రాకపోకలకు అనుగుణంగా ఈసారి రికార్డు స్థాయిలో ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది. -
బతుకమ్మ చీరల బకాయిలు రూ.50 కోట్లు విడుదల
బతుకమ్మ చీరల తయారీకి సంబంధించి నేత కార్మికులకు చెల్లించాల్సిన బకాయిల్లో రూ.50 కోట్లను వెంటనే విడుదల చేయాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి శుక్రవారం అధికారులను ఆదేశించారు. -
నటుడు రఘుబాబు అరెస్టు.. బెయిలు
నార్కట్పల్లి- అద్దంకి రహదారిపై ఈ నెల 17న నల్గొండ పట్టణ సమీపంలో సినీ నటుడు ఎర్ర రఘుబాబు కారు ఢీకొని భారాస నాయకుడు జనార్ధన్రావు మృతి చెందిన విషయం తెలిసిందే. -
ఒకటో తరగతికి కనీస వయసు ఆరేళ్లపై వివరణ ఇవ్వండి
ఒకటో తరగతికి కనీస వయసు ఆరేళ్లు ఉండాలంటూ జారీ చేసిన ఉత్తర్వులపై వివరణ ఇవ్వాలంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు శుక్రవారం హైకోర్టు నోటీసులు జారీ చేసింది. -
గురుకులంలో అల్పాహారం వికటించి 25 మందికి అస్వస్థత
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలలో అల్పాహారం వికటించి 25 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. -
శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ సీఎస్
తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎ.శాంతికుమారి దంపతులు శుక్రవారం తెల్లవారుజామున శ్రీవారి అభిషేక సేవలో పాల్గొన్నారు. -
‘వాట్సప్ గురు’ మరో ఘనత!
తెలంగాణ అదనపు డీజీపీ (రైల్వేస్ అండ్ రోడ్ సేఫ్టీ) మహేశ్ మురళీధర్ భగవత్ మరో ఘనత సాధించారు. -
జూబ్లీహిల్స్ రోడ్డు ప్రమాదం కేసులో మరో ఎస్సై సస్పెన్షన్
పోలీసు శాఖలో సస్పెన్షన్ల పరంపర కొనసాగుతోంది. రెండు రోజుల క్రితం ఆరుగురు పోలీస్ అధికారులను, సిబ్బందిని మల్టీజోన్-1 ఐజీ సస్పెండ్ చేయగా.. తాజాగా మరో ఎస్సైపై వేటు పడింది. -
దేశంలో మరో 114 కృషి విజ్ఞాన కేంద్రాలు
వ్యవసాయరంగ అభివృద్ధితోపాటు రైతులకు విస్తృతమైన సేవలందించేందుకు దేశంలో మరో 114 కృషి విజ్ఞాన కేంద్రాల(కేవీకే)ను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి(ఐకార్) డైరెక్టర్ జనరల్ హిమాన్ష్ పాఠక్ తెలిపారు. -
ఫోన్ ట్యాపింగ్ అత్యంత ప్రమాదకరం
పౌరుల వ్యక్తిగత జీవితాల్లోకి చొరబడి వారిని నియంత్రించడానికి గత ప్రభుత్వ పాలకులు ఫోన్ ట్యాపింగ్ను వాడుకున్నారని, అది అత్యంత ప్రమాదకరం అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. -
సిద్దిపేట జిల్లాలో ఉద్యోగుల సస్పెన్షన్పై హైకోర్టు స్టే
భారాస నిర్వహించిన ఎన్నికల కార్యక్రమంలో పాల్గొన్నారన్న కారణంగా కొంత మంది ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ ఏప్రిల్ 8న సిద్దిపేట జిల్లా ఎన్నికల అధికారి అయిన కలెక్టర్ జారీ చేసిన ఆదేశాల అమలును నిలిపివేస్తూ హైకోర్టు శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. -
మేడిగడ్డ పూర్తవకుండానే పూర్తయినట్లు సర్టిఫికెట్
మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణం పూర్తి కాకుండానే, అయినట్లుగా సంబంధిత ఇంజినీర్లు గుత్తేదారుకు సర్టిఫికెట్ ఇచ్చినట్లు ప్రాజెక్టు చీఫ్ ఇంజినీర్ నీటిపారుదల శాఖకు నివేదించారు. -
గరుడ ప్రసాదం... పోటెత్తిన భక్తజనం
రంగారెడ్డి జిల్లాలోని చిలుకూరు బాలాజీ ఆలయంలో శుక్రవారం నిర్వహించిన బ్రహ్మోత్సవాలు... గరుడ ప్రసాద వితరణ భక్తులకు తీవ్ర అసౌకర్యం కలిగించింది.
తాజా వార్తలు (Latest News)
-
జగన్ ఎదుటే జనసేనానికి జేజేలు.. విద్యార్థుల నినాదాలతో అవాక్కయిన సీఎం
-
‘ఉండి’ అభ్యర్థిగా 22న నామినేషన్: రఘురామ
-
తెదేపా కార్యాలయం వద్ద టాస్క్ఫోర్స్ కదలికలు
-
ఒలింపిక్స్లో పతకం తెస్తే బీఎండబ్ల్యూ కారు
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!