అడవి మృగాల ఆహారమేంటి?
అమ్రాబాద్ పులుల అభయారణ్యంలో మృగాలు.. వాటి ఆహారపు అలవాట్లు, ఆరోగ్యం, వ్యాధులు ఇతర అంశాలను విశ్లేషించేందుకు తెలంగాణ అటవీశాఖ క్షేత్రస్థాయి ప్రయోగశాలను ప్రారంభించింది. ఈ ఏడాది
జంతువుల వేట అలవాట్ల విశ్లేషణకు ప్రత్యేక ల్యాబ్
మన్ననూరు చెక్పోస్టు వద్ద ఏర్పాటు
ఈటీవీ, మహబూబ్నగర్ , న్యూస్టుడే, అమ్రాబాద్
అమ్రాబాద్ పులుల అభయారణ్యంలో మృగాలు.. వాటి ఆహారపు అలవాట్లు, ఆరోగ్యం, వ్యాధులు ఇతర అంశాలను విశ్లేషించేందుకు తెలంగాణ అటవీశాఖ క్షేత్రస్థాయి ప్రయోగశాలను ప్రారంభించింది. ఈ ఏడాది జులైలో నాగర్కర్నూల్ జిల్లా మన్ననూరు చెక్పోస్టు వద్ద దీన్ని ఏర్పాటుచేశారు. అమ్రాబాద్ అభయారణ్యంలో కనిపించే అరుదైన జంతువులు, పక్షులు, కీటకాలు, సరీసృపాల శరీర నమూనాలనూ సేకరించి అవి పాడవకుండా ఇక్కడ భద్రపరుస్తున్నారు.
క్రూర మృగాలు వేటాడిన జంతువు వెంట్రుకలు, ఎముకలు, కొన్ని శరీర భాగాలు జీర్ణం కాకుండా మలం ద్వారా బయటకు వస్తాయి. ఆ నమూనాను విశ్లేషించడం ద్వారా ఆ మృగాల ఆహారపు అలవాట్లు, అవి ఎక్కువగా వేటాడుతున్న జంతువుల సమాచారం, వాటికున్న రోగాలు, ఏమి తినడం ద్వారా ఏ రోగాల బారిన పడ్డాయో అమ్రాబాద్ ప్రయోగశాలలో తెలుసుకుంటారు. అంతరించిపోతున్న అరుదైన జంతువు మూషిక జింకల సంతతిని అభయారణ్యంలో ప్రత్యేక పథకం ద్వారా అభివృద్ధి చేస్తున్నారు. వాటి కదలికలు ఎలా ఉన్నాయి? అవి ఏ జంతువులకైనా ఆహారంగా మారుతున్నాయా? అనే అంశాన్నీ గమనిస్తున్నారు. ఇప్పటివరకు 350కి పైగా నమూనాలను సేకరించినట్లు ల్యాబొరేటరీ ఇన్ఛార్జి, బయాలజిస్ట్ మహేందర్రెడ్డి తెలిపారు.
మల నమూనాలను మైక్రోస్కోప్ ద్వారా విశ్లేషిస్తున్న బయాలజిస్ట్ మహేందర్ రెడ్డి
కళేబరాలు భద్రం...
అమ్రాబాద్ అభయారణ్యంలోని జంతువులు, కీటకాలు, సరీసృపాలు, క్షీరదాలు, పక్షుల్ని కోర్ ఏరియాలో మాత్రమే చూడగలం. వాటి కళేబరాలను భద్రపరచడం ద్వారా ప్రయోగశాలలో అందరూ చూసేలా ఏర్పాట్లు చేశారు. ఇక్కడి అడవుల్లోనే కనిపించే రెండు తలల పాము, గోండ్రు కప్ప, తేళ్లు, సీతాకోక చిలుకల్ని సేకరించి వాటి శరీరం పాడవకుండా ఉంచుతున్నారు. రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన చుక్కల దుప్పి కళేబరానికి పరీక్ష నిర్వహిస్తుండగా దాని గర్భంలో మూడు నెలల పిండం బయటపడింది. దానిని అలాగే భద్రపరిచారు. శిక్షణ పొందేవారికి, క్షేత్రస్థాయి పర్యటన కోసం వచ్చే విద్యార్థులకు, పర్యాటకులకు ఈ నమూనాలను చూపించి నల్లమల అభయారణ్యంపై అవగాహన కల్పిస్తున్నారు. నమూనాల విశ్లేషణ ఫలితాలు భవిష్యత్తులో ఎన్నోరకాలుగా ఉపయోగపడతాయని అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఎప్డీవో రోహిత్ పేర్కొన్నారు.
ఫీల్డ్ ల్యాబ్లో భద్రపరిచిన జింక గర్భస్థ పిండం
ఇప్పటివరకు విశ్లేషణలో గుర్తించింది ఇవి..
పులులు ఎక్కువగా సాంబార్, అడవి పందులు, చుక్కల దుప్పులను ఆహారంగా తీసుకుంటున్నాయి. చిరుతలు సైతం చుక్కల దుప్పులు, కొండముచ్చులు, అడవి పందులను వేటాడుతున్నాయి. ఎలుగుబంట్లకు చెదలు ఇష్టమైన ఆహారం. ఇవికాకుండా పరికిపండ్లు, కత్తెర పండ్లు, గొట్టికాయల్లాంటివి ఎక్కువగా తింటున్నాయి.
మన్ననూర్ చెక్ పోస్ట్ వద్ద ఉన్న ఫీల్డ్ ల్యాబొరేటరీ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఫోన్ ట్యాపింగ్ అత్యంత ప్రమాదకరం
పౌరుల వ్యక్తిగత జీవితాల్లోకి చొరబడి వారిని నియంత్రించడానికి గత ప్రభుత్వ పాలకులు ఫోన్ ట్యాపింగ్ను వాడుకున్నారని, అది అత్యంత ప్రమాదకరం అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. -
సిద్దిపేట జిల్లాలో ఉద్యోగుల సస్పెన్షన్పై హైకోర్టు స్టే
భారాస నిర్వహించిన ఎన్నికల కార్యక్రమంలో పాల్గొన్నారన్న కారణంగా కొంత మంది ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ ఏప్రిల్ 8న సిద్దిపేట జిల్లా ఎన్నికల అధికారి అయిన కలెక్టర్ జారీ చేసిన ఆదేశాల అమలును నిలిపివేస్తూ హైకోర్టు శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. -
మేడిగడ్డ పూర్తవకుండానే పూర్తయినట్లు సర్టిఫికెట్
మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణం పూర్తి కాకుండానే, అయినట్లుగా సంబంధిత ఇంజినీర్లు గుత్తేదారుకు సర్టిఫికెట్ ఇచ్చినట్లు ప్రాజెక్టు చీఫ్ ఇంజినీర్ నీటిపారుదల శాఖకు నివేదించారు. -
గరుడ ప్రసాదం... పోటెత్తిన భక్తజనం
రంగారెడ్డి జిల్లాలోని చిలుకూరు బాలాజీ ఆలయంలో శుక్రవారం నిర్వహించిన బ్రహ్మోత్సవాలు... గరుడ ప్రసాద వితరణ భక్తులకు తీవ్ర అసౌకర్యం కలిగించింది. -
పగలు వడగాలులు.. సాయంత్రం వడగళ్లు
రాష్ట్రంలో శుక్రవారం పలు జిల్లాల్లో ఎండలు భగ్గుమనగా.. కొన్ని జిల్లాల్లో అకాల వర్షాలు బీభత్సం సృష్టించాయి. ముఖ్యంగా నల్గొండ, సూర్యాపేట జిల్లాలు సలసలా కాగాయి. -
‘కోటిపల్లి’ పనుల్లో అసాధారణ అంచనాలు
‘నీటిపారుదల ఇంజినీర్ ఇన్ చీఫ్ (ఈఎన్సీ-జనరల్) కార్యాలయం నుంచి ప్రభుత్వానికి అంచనాలు పంపేందుకు వెనుకాడాల్సిన ఇబ్బందికరమైన పరిస్థితిని హైదరాబాద్ సర్కిల్ ఇంజినీర్లు తీసుకొచ్చారు. -
వివేకా హత్యలో నాపై రెండు క్రిమినల్ కేసులు.. అఫిడవిట్లో పేర్కొన్న అవినాష్రెడ్డి
వైకాపా తరఫున కడప ఎంపీ అభ్యర్థిగా శుక్రవారం నామినేషన్ దాఖలు చేసిన వైఎస్ అవినాష్రెడ్డి తాను రెండు క్రిమినల్ కేసుల్లో నిందితుడిగా ఉన్నానని అఫిడవిట్లో పేర్కొన్నారు. -
14 లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటలు
రాష్ట్రంలో 2024 వానాకాలం సీజన్ కోసం 14 లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటలను సాగు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఉద్యానవన శాఖ ప్రతిపాదనలు రూపొందించింది. -
నీటి లోతుల్లో నిఘా కళ్లు!
తెలంగాణ విపత్తు స్పందన, అగ్నిమాపక సేవలశాఖ మరిన్ని సాంకేతిక హంగులను సమకూర్చుకుంటోంది. అధునాతన పరిజ్ఞానంతో కూడిన పరికరాలను సొంతం చేసుకునే దిశగా ఆ శాఖ అడుగులు వేస్తోంది. -
కృష్ణా పరీవాహకంలో చెరువుల కింద నీటి వినియోగం ఎంత?
చిన్ననీటి పారుదల రంగంలో కృష్ణా పరీవాహకంలో నీటి వినియోగం, పొదుపుపై నీటిపారుదల శాఖ లెక్కగడుతోంది. -
గురుకుల విద్యార్థి మృతి ఘటనపై కేంద్రం ఆగ్రహం
భువనగిరి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజనింగ్ సంఘటనపై కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని జాతీయ ఎస్సీ కమిషన్ను ఆదేశించింది. -
శ్రీలంకలోని వేద గిరిజన జనాభాకు భారతీయులతో దగ్గరి సంబంధాలు
శ్రీలంకకు చెందిన వేద గిరిజన జనాభాకు భారతీయులతో దగ్గరి సంబంధాలున్నాయి. దక్షిణ భారత్లోని కొన్ని గిరిజన సమూహాలతో జన్యుపరమైన అనుబంధం కలిగి ఉన్నట్లు సీసీఎంబీ పరిశోధనలో వెల్లడైంది. -
‘వాట్సప్ గురు’ మరో ఘనత!
తెలంగాణ అదనపు డీజీపీ (రైల్వేస్ అండ్ రోడ్ సేఫ్టీ) మహేశ్ మురళీధర్ భగవత్ మరో ఘనత సాధించారు. -
దార్శనిక నేత చంద్రబాబు
తెదేపా అధినేత చంద్రబాబు 45 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానాన్ని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు తొమ్మిదేళ్లు, నవ్యాంధ్రకు ఐదేళ్లు కలిసి 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఆయన పరిపాలన సాగిన తీరును కళ్లకు కడుతూ ‘మన చంద్రన్న- అభివృద్ధి, సంక్షేమ విజనరీ’ పేరుతో పార్టీ రాజకీయ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ టీడీ జనార్దన్ పుస్తకం రూపొందించారు. -
తిరుమల శేషాచలం పరిధిలో అగ్నికీలలు
శేషాచలం పరిధిలో తీవ్రమైన ఎండలు, వేడి గాలులతో ఎక్కడికక్కడ అగ్నికీలలు వ్యాపిస్తున్నాయి. శుక్రవారం ఉదయం తిరుమలకు సమీపంలో పెద్దఎత్తున అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. -
ఎన్ఎస్జీ డీజీగా నళిన్ ప్రభాత్
జాతీయ భద్రతా దళం (ఎన్ఎస్జీ) డైరెక్టర్ జనరల్గా నళిన్ ప్రభాత్ నియమితులయ్యారు. ఈయన ఏపీ క్యాడర్కు చెందిన 1992 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. -
భారీగా పెరిగిన శ్రీవారి డిపాజిట్లు
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆదాయం ఏటేటా పెరుగుతోంది. 2023-24లో తితిదే ఏకంగా రూ.1,161 కోట్లను వివిధ బ్యాంకుల్లో ఫిక్సిడ్ డిపాజిట్ చేసింది. -
సీబీఐ కేసులోనూ అప్రూవర్గా మారిన శరత్చంద్రారెడ్డి!
దిల్లీ మద్యం కుంభకోణంపై ఈడీ నమోదు చేసిన కేసులో ఇప్పటికే అప్రూవర్గా మారిన అరబిందో సంస్థ ప్రతినిధి శరత్చంద్రారెడ్డి తాజాగా సీబీఐ నమోదు చేసిన కేసులోనూ అప్రూవర్గా మారినట్లు తెలిసింది. -
రైతాంగ సమస్యలపై మే 15 నుంచి ఆందోళనలు
రాష్ట్రవ్యాప్తంగా అన్నదాతలు ఎదుర్కొంటున్న సమస్యలు, కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కర్షక వ్యతిరేక విధానాలపై ఆందోళనలు చేపట్టేందుకు సిద్ధం కావాలని అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం (ఏఐపీకేఎస్) రాష్ట్ర అధ్యక్షుడు రాయల చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. -
అనుమతుల్లేని క్లినిక్లపై దాడి.. రూ. 2.6 లక్షల విలువైన మందుల స్వాధీనం
రాష్ట్రంలో అనుమతి లేకుండా నిర్వహిస్తున్న క్లినిక్లపై దాడి చేసి నిబంధనలకు విరుద్ధంగా నిల్వ ఉంచిన ఔషధాలను స్వాధీనం చేసుకున్నట్లు ఔషధ నియంత్రణ మండలి (డీసీఏ) డైరెక్టర్ జనరల్ వి.బి.కమలాసన్రెడ్డి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. -
ఇదీ సంగతి!
తాజా వార్తలు (Latest News)
-
సైబర్ టవర్స్ వద్ద చంద్రబాబు జన్మదిన వేడుకలు
-
ఆ ప్రాజెక్ట్ వదులుకున్నా.. దీపిక నాకు థ్యాంక్స్ చెప్పాలి: కరీనాకపూర్
-
ధోనీ ఆటే స్ఫూర్తి.. లేటుగా బ్యాటింగ్కు రావడానికి కారణముంది: ఫ్లెమింగ్
-
నిరంతరం రాష్ట్రం గురించి ఆలోచించే నేత చంద్రబాబు : పవన్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
మారిన లోగో రంగు.. వివాదంలో దూరదర్శన్